15, ఆగస్టు 2014, శుక్రవారం

కంటికి చిక్కిన 'సిత్రాలు'


స్వాతంత్ర దినవేడుకల్ని అన్ని టీవీ ఛానళ్ళు పోటాపోటీగా ప్రసారం చేసాయి. ఈ సందర్భంలో కానవచ్చిన, వినవచ్చిన కొన్ని విశేషాలు.
సికిందరాబాదు పెరేడ్ మైదానంలో అమర సైనికుల స్మారక స్తూపం వద్ద  నివాళి అర్పించిన అనంతరం స్మారక ఫలకం చేరువలో కూర్చుని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్,  సైనికాధికారులు అందించిన పుస్తకంలో సంతకం చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన ముందున్న స్మారక ఫలకంపై   'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు' అని ఇంగ్లీషులో రాసిన అక్షరాలు కనిపించాయి. ఆ ఫలకం వేసినప్పుడు సీఎం చంద్రబాబు కావడంవల్ల ఆయన పేరు వేశారు. కానీ ఇప్పుడది  విచిత్రంగా గోచరించింది.



స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలచిన గోల్కొండ కోట చారిత్రిక ప్రాధాన్యం గురించి టీవీ వ్యాఖ్యాతల వర్ణవను మించి  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన ప్రసంగంలో  అభివర్ణించారు. ఒకనాటి తెలంగాణ కవులను పేరుపేరునా స్మరించడం  నిజంగా అభినందనీయం. తెలుగు భాషపై ఆయనకు వున్న పట్టు ఎలాటిదో మరోసారి తెలిసివచ్చేలా ఆయన ప్రసంగం సాగింది.   

కామెంట్‌లు లేవు: