31, డిసెంబర్ 2009, గురువారం

అనాయాస మరణం - దేవుడిచ్చే వరం - భండారు శ్రీనివాసరావు

                              అనాయాస మరణం - దేవుడిచ్చే వరం  





కీర్తిశేషులు శ్రీ భండారు పర్వతాలరావు గారు 




న్నడయినా చూసారా 
ఆయన మొహంలో చిరునవ్వు చెరగడం 
ఎప్పుడయినా గమనించారా 
అన్ని బాధలు, అందరి వ్యధలు
గుండెల్లో దాచుకోవడం 
భాద్యతలన్నీ మోసీ మోసీ 
ఆ చిన్ని గుండె అలసిపోయింది
అంతులేని దూరాలకు  
అన్నయ్యని తీసుకుపోయింది
అనాయాస మరణం 
దేవుడిచ్చే అభయం  
నిజమయిన భక్తుడు కనుకే 
అన్నయ్యకు దక్కిందా వరం

                             

( మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు పుట్టపర్తిలో 2006 ఆగస్టు 21 నాడు  ఆకస్మికంగా మరణించినప్పుడు  రాసిన అశ్రుగీతిక  - భండారు శ్రీనివాసరావు)    



30, డిసెంబర్ 2009, బుధవారం

నడిచి వచ్చిన దారి - 2009

నడిచి వచ్చిన దారి - 2009                               భండారు శ్రీనివాసరావు 


మరో ఏడాది కాలగర్భంలో

ఆంద్రప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఈ ఏడాది ఆదీ అంతమూ ఒకే మాదిరిగావున్నాయి. సంవత్సరం మొదట్లో ఎన్నికల ప్రచార హోరు. అధికార అందలాన్ని అందుకోవాలన్న అభిలాషతో అన్ని పార్టీలు 'లక్ష్మణ రేఖ' ను అధిగమించే ప్రవర్తించాయి. ఈ పార్టీ, ఆ పార్టీ అనిలేకుండా అందరూ ప్రచార పర్వంలో ఎగ్గుసిగ్గులు వదిలేసి ప్రచార స్తాయిని అధమ స్తాయికి చేర్చడంలో 'తిలా పాపం తలా పిడికెడు' పంచుకున్నారు. నింగికెగురుదామనుకున్న వాళ్ళు 'ఉట్టి' దగ్గరే చతికిల పడ్డారు. సినీ గ్లామరు సినిమా హాళ్ళకే పరిమితమని తెలుగు వోటర్ తేల్చి చెప్పాడు. మహాకూటమిగా భుజాలు కలిపిన పార్టీలు వోటర్ తీర్పుతో జావకారి పోయాయి. చేసిన పనులే గెలిపిస్తాయని భ్రమల్లో బతికిన అధికార పక్షం 'పాసు మార్కుల' తో గట్టెక్కాల్సిన దుస్తితిలో పడిపోయింది.మహాకూటమి చెల్లాచెదురయింది. అట్టహాసంగా బరిలోకి దిగిన చిరంజీవి 'ప్రజారాజ్యమ్' పట్టాభిషేకానికి పది ఆమడల దూరంలో ఆగిపోయింది. అవసరార్ధం తెలంగాణా పల్లవి ఎత్తుకున్న 'టీడీపీ'కి ఆశాభంగమే ఎదురయింది. కేసీయార్ 'తెరాస' రెంటికీ చెడ్డ రేవడయింది. కమ్యూనిష్టులకు వ్రతం చెడింది కాని ఫలితం దక్కక పోగా - 'తోక పార్టీలు' అనే ముద్ర స్తిరపడిపోయింది. అత్యధిక కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రికార్డు సాధించిన వైఎస్సార్- ఎన్నికల్లో పార్టీని విజయపధంలో నడిపించి రెండో టెరం కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నాయకుడిగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. ఎక్కువకాలం ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు ఖాతాలో వున్న రికార్డు ను అధిగమించే అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ - హెలికాఫ్టర్ దుర్ఘటన రూపంలో మృత్యు దేవత ఆయనకు ఆ ఛాన్స్ ని దూరం చేసింది. వైఎస్సార్ ఆకస్మిక మరణంతో రాష్ట్ర రాజకీయ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర విభజన అంశం మళ్ళీ తెరపయికి వచ్చింది. ఆశలు అడుగంటిన కేసీయార్ తన అంబుల పొది నుంచి తీసిన ఆఖరి అస్త్రం 'ఆమరణ దీక్ష' అద్భుతంగా పనిచేసి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒక మెట్టు కిందకి దించేలా చేసింది. పరిష్కార దిశగా వేసిన తొలి అడుగు జారి - ఆంద్ర ప్రాంతంలో మరో ఆందోళనకు బీజం వేసింది. ఆందోళనలు- ప్రతి ఆందోళనలతో ఆంద్ర ప్రదేశ్ అట్టుడికి పోతున్నట్టు ఏ టీవీ చానల్ని అడిగినా చెబుతుంది. ఏడాది మొదటిలో కానవచ్చిన ఆందోళనకర దృశ్యాలే మళ్ళీ సాలు చివర్లో రిపీట్ అవుతున్నాయి. ఈ ఏడాది యిలా ముగిసిపోతోంది. ఎవరికోసం ఆగని కాలం మరో ఏడాదిని మన ముందుకు తెస్తోంది. ఆశావహ దృక్పధంతో ఆహ్వానిద్దాం. ( 31-12-2009)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.







bhandaru Srinivas Rao (I.I.S.)
Cell: 98491 30595 Res: 040 2373 1056.
Please click on below URL to visit my Blog:
http://bhandarusrinivasarao.blogspot.com

29, డిసెంబర్ 2009, మంగళవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


నూతన సంవత్సర శుభాకాంక్షలు
'వొత్తిలా వెలగండి
కత్తిలా మెరవండి
కొత్త ఏడాదిలో
ఎత్తుగా ఎదగండి

         'అత్తరువు గంధమై
          చిత్తరువు చందమై
          కొత్త ఏడాది మిము
          హత్తుకోవాలి'


మీ హృదయాంగణం లోను
మీ గృహ ప్రాంగణం లోను
'నూతన సంవత్సర శుభ పరిమళాలు
వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ -


- నిర్మలాదేవి
భండారు శ్రీనివాసరావు

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు

వార్త - వ్యాఖ్య

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు

ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.


 ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి- ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది - మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి - ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.

ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే - విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.



అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి - విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా నవు్వతూ ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.



`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో - ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.



ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.




శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు. ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల - అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన - అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.

ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా.



నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగలసెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?





భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!



భండారు శ్రీనివాసరావు



302, మధుబన్‌



ఎల్లారెడ్డి గూడా



హైదరాబాద్‌ - 500073



సెల్‌ 98491 30595



మెయిల్‌ bhandarusr@yahoo.co.in



29 - 09 -08































--------------------------------------------------------------------------------

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ? --భండారు శ్రీనివాసరావు

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ?

మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌  బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన  వాళ్ళు  కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు  మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు.  మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు.  రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు  కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌  రాళ్ళు  రోడ్లపై  వెలిసాయి.  ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు  నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు.  ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు  వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు  నమ్ముతారా?? కళ్లతో చూసిందే  నమ్ముతాం  అని వాళ్లంటే మీరేం చేస్తారు?



16 -7-2008







..........................................

అభివృద్ధి - ఆరోపణలు - భండారు శ్రీనివాసరావు

అభివృద్ధి - ఆరోపణలు - భండారు శ్రీనివాసరావు

` ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఏ రాయినడిగినా, రప్పనడిగినా నా పేరే చెబుతుంది ' అనేవారు కీర్తి శేషులు, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు.

జలగం
 తన జిల్లాకు తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పేటప్పుడు ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ` జిల్లాలో జనం తినే ప్రతి బియ్యపు గింజ మీదా నా పేరే రాసుంటుంది' అని కూడా అంటుండే వారు - సాగర్‌ ఎడమ కాలువని ఖమ్మం జిల్లా మీదుగా మళ్ళించిన ఘనత తనదేనని చెప్పే సందర్భాల్లో.

ప్రాజెక్టులను, పథకాలను మంజూరు చేసే అధికారం కలిగిన వాళ్ళు - తమ తమ ప్రాంతాలకు పెద్దపీట వెయ్యడం అన్నది విడ్డూరమేమీ కాదు. కేంద్రప్రభుత్వంలో ` అధికార చక్రం తిప్పే తమిళనాడు అధికారులూ ' మంత్రులూ, తమ రాష్ట్రానికి మేలు చేసే విషయంలో కులమతాలు, పార్టీ విభేదాలనూ పక్కన పెడతారనే సంగతి అందరికీ తెలిసిందే.రాష్ట్రానికి ముఖ్యమంత్రో, దేశానికి ప్రధానమంత్రో అయినంత మాత్రాన, సొంతూరు గురించి, సొంతమనుషుల గురించీ పట్టించుకోకూడదనడం ఏం ధర్మం?

చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గం కుప్పం అభివృద్ధి విషయంలో ప్రత్యే శ్రద్ధ కనబరిచి ఎంతో కృషి చేశారు. చిత్తూరు జిల్లాలో వెనకబడ్డ ప్రాంతం అయిన కుప్పంలో ఇజ్రాయెల్‌ తరహా ప్రాజెక్టుని అమలు చేసి, అక్కడి రైతాంగాన్ని అభివృద్ధిపధంలో నడిపించారు. అలాగే, రాష్ట్రానికి ముఖ్యమంత్రులయిన వారందరూ తాము అధికారంలో ఉన్నప్పుడు తమ తమ ప్రాంతాలకు తగిన రీతిలో అభివృద్ధి ఫలాలను అందించే విషయంలో ఇతోధికంగా శ్రమించినవారే.

వైఎస్ఆర్
ఇప్పుడు కడప జిల్లాలో, పులివెందుల ప్రాంతానికీ రాజశేఖరరెడ్డి చేస్తున్నదదే!
దేశానికి రాజయినా, తల్లికి కొడుకే అన్నట్టు - ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంతి అయినా తాము ముందు జవాబుదారీగా ఉండాల్సింది తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గ ప్రజలకే! అందుకోసమే రాజు తలచుకుంటే రోడ్లకు కొదవా అనే రీతిలో పులివెందులలో నాలుగులేన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ఆఘమేఘాలమీద అనుమతులిచ్చారంటూ చేస్తున్న విమర్శలు అర్ధరహితం అని చెప్పాల్సివస్తోంది. అయితే రాష్ర్టంలో ఉప ఎన్నికలు రగిలిస్తున్న వేడిలో అగ్నికి మరింత ఆజ్యం పోయడానికి ఇలాంటి విమర్శలు వెలువడడం కూడా సహజమే. వేసవి సెగలతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారుతున్న సమయంలో వచ్చిపడ్డ ఈ ఎన్నికలు అన్ని పార్టీలకీ అగ్ని పరీక్షగా తయారయ్యాయి. భగభగమండే ఎండల్లో ఎన్నికల ప్రచారం తలకు మించిన భారం అయినా నాయకులకూ, వారి అనుచరగణానికీ తిప్పలు తప్పడం లేదు.
పెళ్ళానికి జీతం, నడిచేవాడికి దూరం చెప్పకూడదన్న పద్ధతిలో వాతావరణ శాఖ వారు కూడా ఏ రోజుకారోజు అ వేసవి తాపం మరో రెండు రోజులే అని నెట్టుకొస్తున్నారు. నిండు వేసవిని పండు వెన్నెలగా భావిస్తూ సాగిస్తున్న ఈ ఎన్నికల ప్రచారాల తీరు తెన్నులు గమనిస్తుంటే నా చిన్ననాటి స్నేహితుడు జ్ఞాపకం వస్తున్నాడు. అతడు ఏడాది పొడుగునా, సినిమాలు, షికార్లంటూ జల్సాగా తిరిగేవాడు. పరీక్షలు దగ్గరపడే సరికల్లా పుస్తకాలు ముందేసుకుని టీలు తాగి - నైటౌట్లు చేసి ప్రశ్నలూ, జవాబులు భట్టీయం వేసి ఫస్టుమార్కులతో పాసయ్యేవాడు. అక్కడ్నించి షరా మామూలే! పరీక్షలు వచ్చేవరకూ మళ్ళీ పుస్తకాల మొఖం చూసేవాడు కాదు.

note : all images in this blog are copy righted to respective owners

27, డిసెంబర్ 2009, ఆదివారం

చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు

వార్త - వ్యాఖ్య


చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు

- భండారు శ్రీనివాసరావు

యాభయ్ ఏళ్ళక్రితానికి - ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి? అని అడిగితే - ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట - బీడీ సిగరెట్లు తాగేవారు - ఇప్పుడది లేదని - ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు.


అప్పటికీ - ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామని బెదిరించారా అంటే అదీ లేదు. అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. పొగరాయుళ్ళను పట్టుకుని కౌన్సిలింగ్లూ గట్రా నిర్వహించారా అంటే అదీ లేదు. ప్రేక్షకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు సిగరెట్ల జోలికి పోకుండా సినిమాలు ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అది చూసి నేర్చుకోవడం. డేరా టూరింగ్ టాకీసులూ,రేకుల సినిమా హాళ్ళ కాలం ముగిసి ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాదని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు. ఈ సూత్రాన్నే ట్రాఫిక్ అధికారులు గమనించి అమలు చేస్తే సమస్యలకు సగం పరిష్కారం లభిస్తుంది. లేని పక్షంలో - ఒక దినపత్రిక పేర్కొన్నట్టు -" సమస్యమీదే - పరిష్కారం మీదే మేం నిమిత్త మాత్రులం - ఇదీ ట్రాఫిక్ పోలీసుల వరుస" అనే విమర్శల తాకిడిని తట్టుకోక తప్పదు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ని చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. కాకపోతే , అందుకోసం తీసుకుంటున్న చర్యలేమిటన్నదే జవాబు లేని-  రాని ప్రశ్న.  

 ట్రాఫిక్ అంశాలపై ఏర్పాటు చేసిన సదస్సులు - సమావేశాల్లో పౌరులు ఏదయినా చెప్పబోతే `సమస్యలు చెప్పమంటే, సలహాలు చెబుతున్నారని' కొందరు అధికారులు విరుచుకు పడిన తీరు గమనిస్తే వారి అసహన వైఖరి తేటతెల్లమవుతుంది. అవగాహన కల్పించే తీరు సరిగా లేదేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదని వారు గ్రహించాలి. అన్నింటికంటే ముందు చేయాల్సింది - ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని - కొంతకాలం పాటయినా - ట్రాఫిక్ని చక్కదిద్దడానికి మరల్చాలి. ఎక్కడ - ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని - ఆయా కూడళ్ళలో - అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేయాలి.



రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. ప్రకటనలకు మినహా - వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు, ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. ఇలాటి  ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక  రద్దీ కూడళ్ల వద్ద రోడ్డుదాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం కంటే రోడ్డు దాటడమే కష్టంగా భావిస్తుంటారు.ఇలాటి సంగతి పట్టించుకునే నాధుడు కనబడడు.  బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో అయితే, రోడ్డుదాటడానికి  పుష్ బటన్ వ్యవస్తలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా దీపం వెలుగుతుంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

 లేదా విద్యుత్ తో కూడా పని లేకుండా - జండాలను ఉపయోగించే ఒక విధానం అమల్లోవుంది. అదేమిటంటే- రోడ్డుకు ఇరువైపులా బాస్కేట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డుదాటాలనుకునేవారు ఆ జండాను తీసుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డుదాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కేట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు.
అలాగే,       
ప్రైవేటు విద్యా సంస్థల వద్ద నిర్మించిన వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్దభారం కాబోదు.

థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడం వీలుపడుతుంది.

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా   పార్కింగ్ కి  అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.
ప్రయివేటు బస్సులని ఎలాగూ  అదుపు చేయలేరు కనుక - రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్తలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను  ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్తలకే ఇవ్వాలి. ఇలాచేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.      

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే బిజీ సమయాల్లో చెకింగ్లు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని ` వీ ఐ పీ ' ల పర్యటనల వేళల్లో మార్పు చేయాలి.

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు  పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి.


భండారు శ్రీనివాసరావు

302, మధుబన్

ఎల్లారెడ్డి గూడా

హైదరాబాద్ - 500073

సెల్ 98491 30595

మెయిల్ bhandarusr@yahoo.co.in

26, డిసెంబర్ 2009, శనివారం

గుబులు పుట్టిస్తున్న ఉప ఎన్నికలు - భండారు శ్రీనివాసరావు

ఏమి సేతురా లింగా !

ముని  మంత్రంబు నొసంగ నేల? 
నొసగె బో -
మున్ముందు మార్తాండు రమ్మని నేకోరగానేల?
కోరితిని బో -
అతండు రానేల?
వచ్చెను బో -
కన్నియనంచు నెంచక నను చేపట్టగా నేల?
పట్టెను బో -
పట్టి నొసంగ నేల?
అడుగంటెన్‌ కదా! కుంతి సౌభాగ్యముల్‌!


                                           
కరుణశ్రీ పద్య రూపంలో పలికించిన ` కుంతీ విలాపం' మాదిరిగా ఉంది నేడు రాష్ట్రంలో ఉప ఎన్నికల నేపధ్యంలో వివిధ పార్టీల పరిస్థితి.
గెలిచి తీరతాం! అన్న ధీమా కాస్తా
గెలవకపోతామా! అన్న ఆశగా మారి
గెలుస్తామా! అన్న సంశయ రూపం ధరిస్తే -
మిగిలేది కుంతీ విలాపమే!

కోరిన వరాలిచ్చు కొండంత దేవుళ్ళలాంటి వాళ్ళు  కాదు ఓటర్లు.  వాళ్ళ నాడి కనిపెట్టడం రాజకీయ పార్టీలను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. వాళ్ళ మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగని గాలి వాటం కాదు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టడంలో వారికి వారే సాటి. ఈ పాటి వాస్తవం ఎరగబట్టే పార్టీ నేతల్లో ఇంత గుబులు.

ఆవిరయ్యే హామీలు 

రాష్ట్రం అగ్ని గుండంగా మారి, వేసవితాపం, భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగిపోతున్న సమయంలో ఉప ఎన్నికల వేడితోడయి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధాన పార్టీలు ఎడాపెడా కురిపిస్తున్న హామీల వర్షాలు కూడా వారితాపాన్ని తీర్చలేకపోతున్నాయి. ఉపశమనాన్ని కలిగించలేకపోతున్నాయి.

ఇక పార్టీలు, పార్టీల నేతలు, ఉపనేతలు, కార్యకర్తల పరిస్థితి మరీ ఘోరం. మండు వేసవిలో వచ్చిపడ్డ ఈ ఉప ఎన్నికలు నిజంగా వారి పాలిట అగ్ని పరీక్షగా తయారయ్యాయి. కరెంటు కోతలు, ఉక్కపోతల నడుమ పరీక్షలు రాసే విద్యార్ధుల మాదిరిగా ఉంది వారి పరిస్థితి.
పైకి ఎంత ధీమాగా ఉన్నా -  బింకంగా కనబడ్డా -
` ఎందుకొచ్చిన ఎన్నికలు రా' అన్న బాధ వారి మనసులను ఏదో మూల తొలుస్తూనే వుండాలి!
ఇది ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న  ఎంత స్వాభావికమైనదో -
అలా జరిగి వుంటే - ఇలా జరిగేది కాదేమో అన్న భావన కూడా అంత స్వాభావికమైనదే?
`` ఆ నాడు సర్కారు ఎక్‌‌సప్రెస్‌ లేటుగా వచ్చి - మీరు పెళ్ళి చూపులకు ఆలస్యంగా వచ్చివుంటే - మా నాన్న ఎంచక్కా నాకు ఆ భీమవరం సంబంధమే ఖాయం చేసివుండేవాడు' అన్నదట ఓ ఇల్లాలు శోభనం రోజున కట్టుకున్న మొగుడితో.
అలాగే - భవనం వెంట్రామ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, తన స్నేహితుడు ఎన్‌. టీ. రామారావుని రాజభవన్‌కు ఆహ్వానించకపోయి ఉంటే - వెంట్రామ్‌ సలహా మేరకు రామారావుకు కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చివుంటే - అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదే కాదన్నాడొక రాజకీయ విశ్లేషకుడు.
మరో విశ్లేషకుడు మరో అడుగుముందుకువేసి - డిప్యూటీ స్పీకర్‌కు బదులుగా - చంద్రశేఖరరావుకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే తెలంగాణా రాష్ట్ర సమితి ఉండేదే కాదు. ఈ ఉప ఎన్నికలు వచ్చేవే కావు పొమ్మన్నాడు.
అందుకే మన జనం వేదాంతాన్ని నమ్ముకున్నది
కానున్నది కాకమానదు. కానిది కానే కాదు.


భండారు శ్రీనివాసరావు
జయీ భవ! దిగ్విజయీభవ

గత మూడు దశాబ్దాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల చరిత్రను వై ఎస్సా ర్‌ తిరగరాస్తున్నారు. నాలుగేళ్ళ పదవీకాలాన్ని విజయవంతంగా ఈ నెలలో పూర్తి చేసుకుని అయిదో ఏట అడుగుపెడుతున్నారు. ఏ విధంగా చూసినా - రాజశేఖరరెడ్డిది ఒక రికార్డే. 48 నెలల్లో ఎన్ని పథకాలు? ఎన్ని ప్రణాళికలు? ఎన్ని ప్రాజెక్టులు?
అధికార యంత్రాంగాన్ని ఊపిరి సలపనివ్వకుండా అమలు చేస్తున్న పథకాల తీరుతెన్నులు గమనించిన వారికి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల్లో రాజశేఖరరెడ్డి విశిష్టత బోధపడుతుంది. ఎన్నికల హామీలను అమలు పరచడమే కాకుండా - ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గమనిస్తూ - కొత్త ఆలోచనలకు రూపం కల్పిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్న తీరు హర్షనీయం! అభినందనీయం!
అందుకే అంటున్నారు జనం
రాజశేఖరా ! నీపై మోజుతీరలేదురా !!

( జూన్ - 2008 )

జనహితమే సర్వజన సమ్మతం - భండారు శ్రీనివాసరావు

జనహితమే సర్వజన సమ్మతం  - భండారు  శ్రీనివాసరావు

ఎక్కడి వీవిస్ లక్ష్మణ్! ఎక్కడి గిల్‌క్రిస్ట్! ఎక్కడి సెహ్వాగ్! ఎక్కడి జయసూర్య! ఎక్కడి హర్భజన్! ఎక్కడి హేడెన్! హద్దుల్ని కాదనుకుని - సరిహద్దుల్ని దాటుకుని క్రీడా స్పూర్తితో క్రికెట్ చరిత్రని తిరగరాస్తున్న ఐ పీ ఎల్ పోటిల్లో పాల్గొంటున్న దిగ్గజాలని చూస్తుంటే ఏమనిపిస్తుంది? విశ్వమంతా ఒకటై - ఒకే వేదికగా మారుతున్న తరుణంలో 'మన రాజకీయం ' ఏ దిశగా సాగుతోంది? ఏ దరి చేరబోతుంది?

రాష్ట్ర విభజనని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటే ఏ రాజకీయ శక్తీ దాన్ని ఆడ్డుకోలేదు. ఈ ఆకాంక్ష జనానిదయితే మన్నించాల్సిందే. రాజకీయమైనదయితే ఆలోచించాల్సిందే'. ఇటీవలికాలంలో - దాదాపు అన్ని పార్టీలు - ఏదో ఒక రూపంలో - ఏదో ఒక స్థాయిలో తెలంగాణా సెంటిమేంట్‌ని కొద్దో గొప్పో పులుముకోవాలిని ప్రయత్నిస్తూ ఉన్నాయి.

ఈ పార్టీల్లోని కొందరు పెద్దలకి ఇది తక్షణ రాజకీయ అవసరంగా మారింది. అదే ఇందులోని విషాదం. అయితే, సమైక్యవాదం నుంచి అంగుళమైనా ఎడం జరగని ఎడమ పార్టిల్లో సీపియంని ప్రధమంగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఈ కోవలోకే వస్తారు. అభివృద్ధి నినాదం ప్రాతిపదికపైనే ఉప ఎన్నికల సమరాంగణంలోకి అడుగు పెట్టాలన్నది ఆయన అభిమతం. సమైక్య రాష్ట్ర సిద్ధాంతాన్ని బలపరిచే పార్టీల్లో పెద్ద పీట వేయాల్సిన మరో పార్టి టీడీపి.

ప్రత్యేక రాష్ట్రమే పరమావధిగా పుట్టుకోచ్చిన తెలంగాణా రాస్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరావు - వ్యూహాత్మకంగానో లేదా గత్యంతరం లేకనో తెచ్చిపెట్టిన ఉప ఎన్నికల ఉసురు అన్ని పార్టిలనూ చుట్టుముడుతోంది. తెలంగాణా పట్ల అనేక రాజకీయ పక్షాల్లో నెలకొని ఉన్న అసందిగ్ధ పరిస్థితికి - ఈ ఉప ఎన్నికల ఫలితాలే స్వస్తి వాచకం పలకగలవన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

దేశం స్వాతంత్ర్యం పొందిన దరిమిలా - అనేక కొత్త రాష్ట్రాలు పురుడు పోసుకున్నాయి. పొరుగున ఉన్న అనాటి మద్రాసు(తమిళనాడు) రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం - తరువాత కొద్ది కాలానికే - భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత ప్రాతిపదిక పై - తెలంగాణా ప్రాంతాన్ని కలుపుకుని - ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించింది. ఒకే భాష మాట్లాడే వారికి కూడా, విడివిడిగా రాస్ట్రాలు వున్నప్పుడు - ఆంధ్ర ప్రదేశ్ ని కూడా ప్రజాభిష్టం మేరకు విభజించడంలో తప్పేమి లేదు. అయితే తప్పల్లా - ప్రజల ఆకాంక్షని అంచనా వేయడంలో చేస్తున్న తప్పులే. రాష్ట్ర విభజన అన్నది ఎవరో కొందరి రాజకీయావసరాల కోసం కాకుండా మెజారిటీ ప్రజల అబీష్టం మేరకు జరగాలి. జరగనున్న ఉప ఎన్నికల ఫలితాలు ఈ దిశగా కొంతమేరకు ఉపకరించే అవకాశం ఉంది.

ఏ వేర్పాటు ఉద్యమానికయినా, వెనుకబడినతనమే ప్రాతిపదిక. దీని ఆధారంగా పెచ్చరిల్లే భావోద్వేగాలే విభజన ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి. ఈ విధంగా ప్రజ్వరిల్లే శక్తిని అడ్డుకోవడం అతికష్టం అని గతంలో తెలంగాణా ప్రజా సమితి నిరూపించింది కూడా. అయితే, అప్పటికి అంటే 1969 నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదంటే నమ్మడం కష్టం. తెలంగాణాలో ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మచ్చుకాని తెలంగాణాలో అసలు అభివృద్ధి జరగలేదని వాదించడం కేవలం రాజకీయమే అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1969 నాటికి వూహకు సయితం అందని ఉదార ఆర్ధిక విధానాలు ఈనాడు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రపంచీకరణ సిద్దాంతం నేల నాలుగు చెరగులా బలంగా వేళ్ళూనుకుంటున్న నేపధ్యంలో - అసలు దేశాలు మధ్యనే హద్దులు చెరిగిపోతున్నాయి.

పొట్ట గడవక కొందరూ - డాలర్లు వేటలో మరికొందరూ - ఉపాథి కోసం ఇంకొందరూ ఉన్నవూరు వదిలిపెట్టి వెళ్ళడం అన్నది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడంలేదు. అవకాశాలు వెతుక్కుంటూ అన్ని ప్రాంతాలవారు అన్ని చోట్లకీ వలస వెడుతున్నారు.
ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని ఆ దేశంలో ఉంటున్న తెలుగువారే భరోసాగా చెబుతున్నారంటే ఇక భౌగోళిక రేఖలకి, దేశాల సరిహద్దులకీ - అర్థమేముంటుంది? పోతే - ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏపాటి మిగులుతాయో అర్ధం చేసుకోలేని విషయమేమి కాదు.
ఆ మాటకి వస్తే - దేశాలయినా, రాష్ట్రాలైనా, ప్రజలైనా విడిపోవడం - కలిసిపోవడం పెద్ద విషయమేమి కాదు. విభజన కుడ్యాన్ని కూలగొట్టుకుని - రెండు జర్మనీలు కలిసిపోయాయి. అమెరికాని సయితం శాసించగలిగిన స్థాయికి ఎదిగిన సోవియెట్ యూనియన్ - అంగ, వంగ, కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమయింది.

కాబట్టి - చరిత్ర నుంచి నేర్చుకున్నవారు - చరిత్ర హీనులు కాలేరు. మనసులూ - మనుషులూ కలుషితం కావడం ఏ సమాజానికి క్షేమకరం కాదు. విడీపోయినా చేతులు కలిసే వుండాలి. మనసులు మసి బారకుండా ఉండాలి .
సర్వేజనాః సుఖినోభవంతు!
(మే - 2008 )

తెలంగాణా గురి మళ్ళీ తప్పుతోందా ? - భండారు శ్రీనివాసరావు

తెలంగాణా గురి మళ్ళీ తప్పుతోందా ? 

ద్రోణాచార్యుడు కురు, పాండు కుమారులకు విలు విద్య పోటీ పెట్టాడు. చెట్టుపై పిట్టబొమ్మను పెట్టి పిట్ట కంటిని గురిపెట్టి కొట్టమన్నాడు. ముందుగా ధుర్యోధనాదులను పిలిచి బాణం ఎక్కుపెట్టి ఏం కనపడుతున్నదో చెప్పమన్నాడు.`చెట్టు చెట్టు కొమ్మలు కొమ్మలనడుమ పిట్టబొమ్మ కనపడుతున్నాయని' వారు సమాధానం చెప్పారు.

ద్రోణుడు అర్జునుని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. `పిట్ట కన్ను మాత్రమే కనపడుతోందని' కిరీటి జవాబిచ్చాడు. లక్ష్యం పట్ల గురి ఎలా ఉండాలో తెలియ చెప్పడానికి ఈ కథ చెప్పేవాళ్ళు. అంటే లక్ష్య సాధనకు ఏకాగ్రత కావాలి. సాధించాల్సింది తప్ప మరో దానిపై మనసు మరల్చరాదు, అన్నది ఈ కథలోని నీతి. కానీ `తెలంగాణా రాష్ట్ర సాధన అనే ఉద్యమం ఏ మలుపు తిరుగుతోంది? `తెలంగాణా నా ప్రాణం తెలంగాణా రాష్ట్ర సాధనే నా ధ్యేయం' అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడైన చంద్రశేఖరరావు నోట `మహా కూటమితో కాంగ్రెస్‌ ఓటమి' అనే మాట ఎలా వచ్చింది? అంటే తెలంగాణా సాధన అన్న ప్రధాన లక్ష్యాన్ని కాంగ్రెస్‌ ఓటమి అనే ఉమ్మడి ధ్యేయం వెనక్కు నెట్టి వేసిందని అనుకోవాలా? కూటమిలోని మిగిలిన పార్టీలకు కాంగ్రెస్‌ ఓటమి ప్రధాన ధ్యేయం కావడానికి తప్పుపట్టాల్సింది ఏమీలేదు. కానీ తెలంగాణా అన్న ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణా రాష్ట్ర సమితి చేస్తున్నదేమిటి.

మహా కూటమిలోని మిగిలిన పార్టీల విషయం వేరు తెరాస పరిస్థితి వేరు. మహాకూటమో, మెగా కూటమో ఏదో ఒక కూటమి అవసరం వారి వారి రాజకీయ అవసరాల కోణం నుంచి చూస్తే ఒక తక్షణావసరం కావచ్చు కానీ, తెరాస దాని తీరు మార్చుకోకపోయినా, ప్రాధాన్యతల క్రమం మార్చుకోవడాన్ని తెలంగాణా అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో అన్నది భవిష్యత్‌ తేలుస్తుంది.

సామ , దాన, భేద, దండోపాయాలతోనైనా సరే కార్యాన్ని సాధించాలనే సూత్రం తెలంగాణా సాధన లక్ష్యసాధనకు అన్వయింపచేయాలని చూడడం తగని పని. తెలంగాణా ప్రాంతంలోని అధిక సంఖ్యాకులకు ప్రత్యేకరాష్ట్రం పట్ల మక్కువ లేదన్న సంకేతాలను పంపే ప్రమాదం ఈ కూటములవల్ల కలిగే అవకాశం ఉంది. బహుశా, తెరాస నేతకు కూడా ఈ అంశం బోధపడే, `మహా కూటమితో కాంగ్రెస్‌ ఓటమి' అనేనినాదంతో అంతరంగాన్ని అవిష్కరించి ఉంటారు.

ఈ రోజున నిజానికి తెలంగాణా ఊసెత్తని పార్టీ అంటూ రాష్ట్రంలో కలికానికి కూడా కానరాదు. కానీ నాలుక తెలంగాణా అంటున్నా మనసులో మర్మం మరోటి ఉందన్న అనుమానం అందరికీ ఉంది. వేరే ఉద్దేశ్యాలను మనసులో ఉంచుకుని తెలంగాణా నామజపం చేసేవాళ్ల వల్లే తెలంగాణాకు ఎక్కువ ముప్పు పొంచి ఉంది. తెలంగాణా మేధావులు కూడా ఈ విషయంలో పెదవి విప్పకపోవడం విషాదకరం.

తెలంగాణా వాదులకూ, తెలంగాణా పేరుతో పబ్బం గడుపుకోవాలని చూసే తెలంగాణా రాజకీయ వాదులకూ నడుమ ఎంతో అంతరం ఉంది. 1969 నుంచి జరుగుతున్నది ఇదే. మహా కూటమి ఏర్పాటుతో ఇది పునరావృతం అయ్యే అవకాశాలు పెరిగాయి. అన్ని జండాలు కలుపుకుని రాజశేఖరరెడ్డిని గద్దె దింపాలన్న ఒకే ఒక ఎజెండాతో ముందుకు సాగే ఈ కూటమి కలలు ఫలించి కాంగ్రెస్‌ ఓటమి పాలయినా తెలంగాణా వస్తుందన్న గ్యారంటీ లేదు. కాంగ్రెస్‌ పరాజయం వల్ల మహా కూటమిలోని ఇతర పార్టీలకు లబ్ది చేకూరవచ్చునేమో కానీ, తెలంగాణా రాష్ర్ట సమితికి అదనంగా ఒకటో అరో సీట్లు పెరగడం మినహా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్య దిశగా వొరిగేదేమీ ఉండదు. కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక పాలనపై మడమ తిప్పని పోరాటం చేయాలని తామంతా కలసి ప్రతిజ్ఞ చేశామని చంద్రశేఖర రావు చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రత్యేక రాష్ట్ర లక్ష్యానికి ఎడం జరుగుతున్నట్లు ఎవరికైనా అనిపిస్తే అందుకు ఆయన అభ్యంతరం పెట్టకూడదు. మరోసారి మోసపోవడమే తెలంగాణాను నిజంగా కోరుకునే వారికి మిగిలిందా అని అనిపిస్తే కూడా తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎవరు శ్రేయోభిలాషులు అన్నది తెలంగాణా వారే అర్ధంచేసుకుని ఆదరించాల్సి ఉంది. మరోసారి తప్పటడుగు పడితే కాలు కూడదీసుకోవడానికి కూడా వీలుండదు. ( ఫిబ్రవరి - 2009 )

మరో ఉచితం - వార్త - వ్యాఖ్య

మరో ఉచితం
వార్త - వ్యాఖ్య (భండారు శ్రీనివాసరావు )

ముగింపు ఇంతకంటే గొప్పగా, హుందాగా వుంటుందని " శాశనసభ సమావేశాల తీరు తెన్నులపట్ల అవగాహన వున్నవారు ఎవ్వరూ అనుకోరు. ఏమయితేనేం " 12 వ శాశనసభ ఆఖరి సమావేశాలు " "గతకాలము మేలు" అన్న చందంలోనే ముగిశాయి. సభ జరిగింది కొద్ది రోజులే అయినా, ఏనాడూ ఎజెండా ప్రకారం కార్యక్రమాలు సాగిన దాఖాలా లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో చర్చలు పక్కదారి పట్టడం మినహా పక్కాగా సాగిన సందర్భంలేదు. సభా సమయాన్ని "సొంతానికి" వాడుకోవడంలో ఈ పార్టీ " ఆ పార్టీ అన్న తేడా లేకుండా, అన్ని పార్టీలు పోటి పడ్డాయి. వాటి దృష్టిలో "దుర్వినియోగం" అన్న ప్రసక్తే లేదు. ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని " ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేయాల్సినవన్నీ చేసి చూపించాయి. రాజకీయ లబ్ధి కోణం నుంచే ప్రసంగాలు సాగాయి. చర్చలు జరిగాయి. విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోపణలు హోరెత్తాయి. సంభాషణలు శృతిమించాయి. అసలు ఎజెండా పక్కకు తొలిగింది. రాజకీయ ఎజెండా లెక్కకు మిగిలింది.
చట్టసభల వ్యవహారం "యూపీ" నుంచి "ఏపీ" దాకా ఇదే తంతు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని మనమే నయమని మనకు మనమే కితాబు ఇచ్చుకోవాలో లేక " ఒక అయ్యదేవర, ఒక పుచ్చలపల్లి, ఒక నాగిరెడ్డి, ఒక సందీవరెడ్డి వంటి ఉద్ధండుల కాలం తలచుకుని బావురుమనాలో " అర్ధంకాని పరిస్థితి.

ఈ పరిస్థితి మరింత దిగజారి "దుస్థితి " గా మారకుండా వుండాలంటే ఏం చెయ్యాలన్నది ప్రధాన ప్రశ్న. శాసనసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని నిలుపుచేస్తే " అడ్డగోలు ప్రవర్తనకు అడ్డుకట్ట పడుతుందన్నది ఒక సూచన. ఇందులోని మంచి చెడులపై విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్ గా వున్న కాలంలో ఈ ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి లభించింది. ఆనాడు వున్న టెలివిజన్ ఛానళ్ల సంఖ్య పరిమితం కావడం వల్ల " ఫలితాలనూ, దుష్ఫలితాలనూ వెనువెంటనే బేరీజు వేయడం జరగలేదు. పైపెచ్చు తొలిరోజుల్లో " ఈ ప్రయోగం సప్ఫలితాలను ఇచ్చిన విషయం కూడా మరచిపోకూడదు. ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు సభలో లేవనెత్తడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల మన్నననూ, విశ్వాసాన్నీ పెంపొందింపచేసుకోవడానికి ఈ ప్రసారాలు ఉపయోగపడ్డాయి.

కానీ క్రమేణా ఈ ప్రత్యక్ష ప్రసారాల తీరుతెన్నులు మారిపోయాయి. సభ సజావుగా జరుగుతున్నప్పుడు, ప్రజా సమస్యలపై చర్చ ప్రశాంతంగా సాగుతున్నప్పుడు " అనేక ఛానళ్లు ప్రసారాలను నిలిపివేసి. రొటీన్ కార్యక్రమాలను చూపిస్తూ వుండడంతో సంచలనం ఒక్కటే ఛానళ్లను ఆకర్షించే మార్గంగా ఎంచుకోవాల్సిన దుస్థితి దాపురించింది. పేపర్లు చింపడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో ప్రారంభమై " స్పీకర్ పోడియంని ముట్టడించడం, మైకులు విరవడం వరకూ ఈ సంచలనాత్మక ధోరణి పెచ్చరిల్లింది. సస్పెన్షన్‌కు గురైన వారిని మార్షల్స్ మోసుకుపోవడం అన్నది ఈ ప్రత్యక్ష ప్రసారాలతోనే మొదలయిందని శాసనసభ వ్యవహారాలను కవర్‌చేసే ఏ సీనియర్ జర్నలిస్టుని అడిగినా చెబుతారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా " తాము ఎన్నుకున్న ప్రతినిధుల ప్రవర్తనని అంచనా వేసుకునే అవకాశం ఓటర్లకి లభిస్తుందన్న వాదన సబబైనదే. కానీ ప్రజాస్వామ్యాన్నే ఈసడించుకునే స్థితికి ప్రజలు చేరుకోవడం కూడా అభిలషణీయం కాదు. ప్రత్యక్ష ప్రసారాల వల్ల నిజానికి జరుగుతున్నదిదే! సంచలనాలకు పెద్దపీట వేసే విధానాన్ని ఛానళ్లు కొంతమేరకయినా సడలించుకోగలిగితే " ఇక పేచీ ఏమీ లేదు.

కానీ, అంతమాత్రంతో సమస్య పరిష్కారం అవుతుందనుకోలేము. ఎందుకంటే సభలో మాట్లాడినదానికి, మాట్లాడనిదానికి మరికొంత జోడించి చెప్పడానికి సభా ప్రాంగణంలోనే ప్రత్యక్ష ప్రసారాలను నిలుపు చేయడంలో లేదు. ఏది, ఎంతమేరకు ప్రసారం చేయాలనే మీడియా విధానంలో వుంది. అంటే స్వీయ నియంత్రణ ద్వారా పరిస్థితిని మెరుగుపరచడానికి వీలుంది. కానీ, సర్వం వ్యాపారమయమయిపోయి " విలువలకన్నా రేటింగులకు ప్రాధాన్యం ఇచ్చే పోటీ యుగంలో ఈ స్వీయ నియంత్రణ మంత్రం వల్ల ఏ పాటి ప్రయోజనం సిద్ధిస్తుందో అంత అర్థం చేసుకోలేని విషయమేమీ కాదు.
భరించగలిగినంతవరకూ భరిస్తూ- ఉచిత వినోదమని సరిపెట్టుకుంటూ ఆనందించడమే ఇక జనాలకు మిగిలింది.

వార్తా - వ్యాఖ్య - ఓటరు ఓడిపోకూడదు

వార్త  - వ్యాఖ్య - ఓటరు ఓడిపోకూడదు
- భండారు శ్రీనివాసరావు

రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన అధ్యాయం ముగిసింది. గౌరవనీయులైన ఓటర్లు పవిత్రమైన ఓటు హక్కుని వినియోగించుకుని తమ నిర్ణయాన్ని ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేసి తప్పుకున్నారు. గర చాలా రోజులుగా రాష్ట్రం మొత్తాన్ని తమ ప్రచార భేరీతో అట్టుడికించిన రాజకీయ పార్టీల అగ్రనాయకులు వేసవి విడిదుల్లో అలుపుతీర్చుకునే పనిలో పడ్డారు. ద్వితీయ శ్రేణి నాయకులు పోలింగ్ బూత్ ల వారీగా పోలయిన ఓట్ల లెక్కలు తీస్తూ - గెలుపోటములను బేరీజు వేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అయిన జమాఖర్చులను అభ్యర్ధులు ఆరా తీస్తుంటే వారి అనుచరగణం బాకీ పడ్ద పద్దుల్ని బేబాకీ చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఎన్నికల పుణ్యమా అని, కార్యక్రమాలకు కొరతలేకుండా ప్రసారాలు సాగించిన ఇరవైనాలుగుగంటలు టీవీ ఛానళ్లు - ఫలితాల గురించి అంచనాలు, అంచనాల గురించిన విశ్లేషణలు గుప్పించేందుకు ఏగూటి చిలకలతో ఆ గూటి పాటలు పాడించే పనిలో తలమునకలుగా వున్నాయి.

రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రచారపర్వంలో పత్రికల తీరుతెన్నులపై ’సత్యాగ్రహాన్ని’ వ్యక్తం చేశారు. ఆయన విమర్శలకు ప్రాతిపదిక లేకపోలేదు. ప్రజాస్వామ్యానికి పత్రికలు పట్టుకొమ్మలు అని గొప్పలు చెప్పుకునే పత్రికా యాజమాన్యాలు - ఆయన పలుకుల్లోని తీవ్రతను అర్ధం చేసుకుని వక్రమార్గం పట్టిన విధానాలను సరిదిద్దుకోవాలి. లేకపోతే - ’పత్రికలన్నీ’ (ప్రతులన్నీ) అమ్ముడుపోయాయి అని ఘనంగా చెప్పుకునే స్థితి నుంచి, పత్రికలే అమ్ముడు పోయాయి అనే దారుణమైన అపప్రధను మూటగట్టుకోవాల్సి వస్తుంది.

’రోజులు దుర్భరంగా గడపడం - ఈ పూట ఎలా గడుస్తుందని మధనపడడం’ ఈ దేశంలో సామాన్యుడనేవాడికి పుట్టుకతో సిద్ధించే స్థితి. వచ్చేనెల 16వ తేదీ వరకూ ఆయా రాజకీయ పక్షాలన్నింటికీ ఈ మానసిక స్థ్తితి అయాచితంగా లభిస్తోంది. గెలుపుమీద నిబ్బరం ప్రదర్సించడం. విజయంపై ఎనలేని ధీమాను వ్యక్తం చేయడంలాంటివి జనం కోసం చేస్తూ వున్నా - అంతరాంతరాల్లో ఎక్కడో కనబడని భీతి, నిజంగా గెలుస్తామా? అన్న అనుమానం, ఓడిపోతామేమోనన్న ఆందోళన అన్ని పార్టీలనూ పట్టి పీడిస్తూ వుండడం అన్నది ఈ ఎన్నికల్లోని కొత్తకోణం.

ఏదీ ఏమైనా 2009 ఎన్నికలు కొత్త నేపథ్యంలో జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇందులో మీడియా పాత్ర అభినందనీయం! ఓటరు గుర్తింపు కార్డుల జారీలో ఎన్నో అవకతవకలు జరిగాయన్న అరోపణలు వున్నప్పటికీ - ఈ కార్డు సంపాదించుకోవడానికి జనం స్వచ్చందంగా పోటీ పడ్దారు. ఈ ప్రక్రియను సులభరతం చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు అమోఘంగా పనిచేశాయి కొత్తగా ఓటరు కార్డు పోందిన యువతీయువకులు పాస్ పోర్ట్ దొరికినంతగా సంబరపడిపోయి మొట్టమొడటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడంలో వున్న ఆనందాన్ని ఆస్వాదించారు. సహజంగా రాజకీయాలంటే ఏహ్యత కలిగి వుండే వయస్సులో వున్న ఈ కొత్త ఓటర్లు ఎవరి పుట్టి ముంచుతారో అన్న సరికొత్త భయం పార్టీలకు పట్టుకుంది. పోలింగ్ ముగియగానే ఎదుటి పక్షం అక్రమాలకు తలపడిందని ఆరోపిస్తూ రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఇందుకు భిన్నంగా, ఎన్నికల సంఘం తనంతటతాను గానే విచారణ జరిపి రీపోలింగ్ జరపడం విశేషం. ప్రచారంలో హోరెత్తిన అవేశకావేశాలను పరిగణలోకి తీసుకుంటే పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి.మద్యం, ధనం విచ్చలవిడిగా పంపకం జరిగాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఈసారి దానికి అడ్డుకట్ట వేయడం జరిగిందన్న సంకేతాలను పంపడంలో యంత్రాంగం సఫలమైంది. సక్రమంగా ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమీషన్ ఘోరంగా విఫలమైంది. ఏ పర్టీ కూడా విమర్సించకపోవడం కూడా ఈ సారి కొత్త సంగతి. రాజకీయపార్టీల గెలుపోటములు తేలడానికి ఇంకా మూడు వారాలకు పైగా వ్యవధి వున్నప్పటికీ - విధుల నిర్వహణలో - ఎన్నికల కమీషనర్ ఐ వి సుబ్బారావు. డీ జీ పీ మహంతి ఇప్పటికే విజయాలను మూటకట్టుకున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో తొలి విజేతలు వీరిద్దరే!

ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టం చేసే దిశగా సాగించే కృషిలో ఎన్నికల నిర్వహణ ప్రధానపాత్ర పోషిస్తోంది.అనుభవాల ఆధారంగా దాన్ని మరింత మెరుగు పరుచుకునే విధంగా కొత్త పాఠాలు నేర్చుకోవాలి.

ఆటోమేటిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశ పెట్టి. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియలను సులభతరం, వేగవంతం చేసిన విధంగానే అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని ఎన్నికల నిర్వహణ కోసం సమర్గవంతంగా ఉపయోగించుకునే అంశాన్ని లోతుగా పరిశీలించాలి. ఎన్నికలు జరిగే కాలానికి మాత్రమే ఎన్నికల కమీషన్ పాత్రను పరిమితం చేయకుండా పూర్తికాలం పనిచేసేలా తగిన సాధన, సంపత్తులు కలిగిన విశేషాధికార స్వరంత్ర శాశ్వత వ్యవస్థగా దానికి ప్రతిపత్తి కల్పించాలి.

ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి, సంకీర్ణ ప్రభుత్వాలనేవి రాజకీయాల్లో సాధారణ అంశంగా మారి, ఏ ప్రభుత్వం కూడా పూర్తికాలం మనుగడ సాగించడం అనేది ప్రశ్నార్థకంగా తయారై - దేశంలో ఏదో ఒక రాష్టంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే వీలున్న ప్రస్తుత పరిస్థితుల్లో - ఎన్నికల నిర్వహణకు శాశ్వత యంత్రాంగాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత పెరిగింది. ఎన్నికల తరుణంలో ప్రభుత్వంతో ప్రమేయంలేని సొంత యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అనే విలువైన వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ మాత్రం ఖర్చు భరించలేనిదేమీ కాదు.

ఓటర్ల కొనసాగాలి. కొత్త్త ఓటర్ల నమేదుకు తీసుకునే శ్రద్ధను - మరణించిన లేదా వేరే ప్రాంతాలకు మకాం మార్చిన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించే పనిలోనూ కనబర్చాలి. ఓటర్ల కులాల వివరాలను నియోజక వర్గాల వారీగా బహిరంగపరిచే పద్దతులను నిషేధించాలి.

శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలింగ్ ముగియటంతోనే తీరిపోదు. రోగికి శస్త్ర చికిత్స జయప్రదం కావడం అన్నది- ఆపరేషన్ తరువాత తీసుకునే శ్రద్ధపై ఆధారపడి ఉన్నట్టే - పోలింగ్ ముగిసిన తరువాత కూడా పోలీసులు పరిస్థితులను కనిపెట్టి చూడాలి. ఏమరుపాటు పనికిరాదు. పోలింగ్ అనంతరం జరిగిన తాడిపత్రి సంఘటనలు ఈ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

ఎన్నికలంటే ’కలవారు’మాత్రమే ఆడుకునే ఆట కాకుండా-ఎన్నికలంటే కులాలవారీగా కొట్లాడుకునే పోట్లాట కాకుండా ఎన్నికలంటే డబ్బూ దస్కం, మనీ మధ్యంతో కూడుకున్న వ్యవహారం కాకుండా-

చూడగలిగే చేయగల్లిగే సంస్కరణలు కావాలి!
ఆ సంస్కరణలను అమల్లోకి తేగలిగే రోజులు రావాలి!
ఆ మంచి రోజుల కోసం ఎదురుచూడాలి!
ఎన్నికల్లో పార్టీలు ఓడిపోవచ్చు.
కానీ ఓటరు ఓడిపోకూడదు.

(ఏప్రిల్ - 2009)

వార్త - వ్యాఖ్య - గెలుపే లక్ష్యం - పవరే ముఖ్యం

వార్త - వ్యాఖ్య - గెలుపే లక్ష్యం - పవరే ముఖ్యం
-భండారు శ్రీనివాసరావు

ఇప్పుడు రాష్త్రంలో అన్ని రాజకీయ పక్షాలది ఒక్కటే మాట. అదే ’మార్పు’.కాకపోతే ఆ మార్పు అనేది తమకు అనుకూలంగా ఉండాలన్నదే వాటి కోరిక. మార్పు కోసమే పెట్టిన పార్టీ చిరంజీవిది.’ప్రేమేలక్ష్యం - సేవే మార్గం’ అనే టాగ్ లైన్ తో ప్రజారాజ్యం పార్టీపెట్టి, నా రూటే సెపరేటన్నవాడు కాస్తా, షరా మామూలు రాజకీయాల్లోకి సరాసరి దిగిపోయి, కామాలు లేని హామీలు గుప్పిస్తూ ’నన్ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మీదేనంటూ’ ఆ భారాన్ని జనం మీదకే నెట్టేసి కొత్తరకం ’మార్పు’ ను కోరుకునే పనికి శ్రీకారం చుట్టారు.కాగా పార్టీ మారి, వేరే పార్టీ పెట్టేసి, నెలలు నిండకముందే దాన్ని మరో పార్టీలో కలిపేసిన ’మార్పు’దేవేందర్ గౌడ్ ది. ’తల్లీ బైలెల్లినాదో’ అంటూ తల్లి తెలంగాణా పార్టీ స్థాపించి - కధానాయకి పాత్రకంటే సెకండ్ హీరోయిన్ వేషం నయమనుకుని టీ ఆర్ ఎస్ లో కలిసిపోయిన ’మార్పు’ విజయశాంతిది. ’జై తెలంగాణా’ అంటూ తెలంగాణా ఆత్మగౌరవ నినాదానికి ఊపిరి ఊది, వేర్పాటు ఉద్యమానికి పురుడు పోసిన తెలంగాణా రాష్ట్ర్రసమితి ప్రధాన ధ్యేయాన్ని కాసేపు జమ్మిచెట్టు ఎక్కించి - మహాకూటమిలో చేరిపోయిన పెను’మార్పు’ కె.చంద్రశేఖర రావుది.తోక పార్టీలుగా అందరిచేతా ముద్దుగా పిలిపించుకుంటూ ’మార్పే ధ్యేయం - మార్పే లక్ష్యం - మావో దైవం’ అంటూ,మార్పుకు ట్రేడ్ మార్క్ తమదేనంటూ ఎర్రరంగుని అన్ని రంగుల్లో కలిపేసిన ’మార్పు’ లెఫ్ట్ పార్టీలది.’అయిదేళ్ల అధికారంలో చేసింది చాలా వుంది. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది, కాబట్టి మమ్మల్ని మార్చకుండా మరో అయిదేళ్లు అవకాశం ఇస్తే ఇంకా మంచి మార్పు తెచ్చి ’చేతిలో’ పెదతామన్నది వై ఎస్సార్ మార్క్ ’మార్పు’.
ఇక చంద్రబాబు నాయుడి సంగతి.
’నేను నవ్వాను - లోకం మారింది, నేను మారాను - లోకం నవ్వింది’ అనే తరహాలో - సగటు తెలుగు సినిమా సెకండాఫ్ లో హీరో మాదిరి ’మార్పు’ఆయనది.

పోతే అసలు సిసలు’మార్పు’ కోసం లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ పడుతున్న పాట్లు, కంటున్న కలలు లోక విదితమే. ఎన్నికల్లో ప్రతీదానికి రేటు కట్టి ఓటు కొనుక్కోవడం తప్పున్నర తప్పు అన్నది ఆయన థియరీ.

’ఆయన సొమ్మేంపోయింది. గెలిచినా, ఓడినా పోయేదేమీ లేదు. రాజకీయాలు కుదిరేపని కాదనుకున్నడు, పొలిటికల్ పార్టీ బోర్డు తిప్పేసి మళ్లీ’జనహితం మనమతం, మనమతమే జనహితం’ అంటూ సుద్దులు చెబుతూ బుల్లి తెరపై వొదిగిపోగలరు. మా సంగతి అలా కాదే! గెలిచి తీరాల్సిన పరిస్థితి. సుమతీ శతకాలూ, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో ఓట్లు పెట్టవు అన్నది రాజకీయుల వాదన. అందుకే - ఓటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు ఉండవు. ఓటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనకడుగు వేసే పార్టీ అంటూ వుండనే వుండదు.

అందుకే నరం లేని నాలుక, మండు వేసవిలో వారి చేత హామీల వర్షం కురిపిస్తోంది. కలర్ టీవీలు, నెలసరి భత్యాలు, భూసంతర్పణలు, పసుపు కుంకుమలు, ఉచిత వైద్యాలు, ఫ్రీ చదువులు, కరెంటు మీది - బిల్లు మాది హామీలు - ఒకటా, రెండా సెర్చిచేసి, రీసెర్చిచేసి కనుక్కున్న సంక్షేమ పథకాలతో పార్టీల మేనిఫెస్టోలు - ఓటర్లకు అరచేతిలో ’నరకం’ చూపెడుతున్నాయి. ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్లు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీలేదు. ఎదుటివాడిని తిననిచ్చిందీ లేదు. ముసాయిదా మేనిఫెస్టోల్లోనే ఇన్నిన్ని హామీలుంటే - ఇక అసలు మేనిఫేస్టోల్లో హామీలు ఏమేరకు వుంటాయన్నది భేతాళ ప్రశ్నే! ఈ విషయంలో ఆర్థికమంత్రి రోశయ్యగారికి కలిగిన ధర్మసందేహం ఆలోచించతగిందే!

’సర్కారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ గోడుగోడున గోలపెడతారు. ప్రతి పక్షాలు మేనిఫెస్టోల పేరుతో అర్ధం, పర్ధంలేని హామీలు గుప్పిస్తుంటే కోడ్ ఉల్లంఘన కిందికి రాదా’!అన్నది ఆయన లేవనెత్తిన పాయింట్. ఇది పాయింటే కాదంటోంది రాష్ట్ర్ ఎన్నికల కమీషన్. పాపం దాని కష్టాలు దానివి. పని ఎక్కువ, పనిచేసేవారు తక్కువ. పరిశీలన కొచ్చిన ఫిర్యాదుల సంగతి చూడాలంటే ఏండ్లు పూండ్లు పడుతుంది. ఈ లోగా ఎన్నికలు పూర్తయిపోతాయి. మరో ఎన్నికలు వస్తాయి. కానీ ప్రజాస్వామ్య చక్రం తిరుగుతూనే వుంటుంది.

(ఏప్రిల్ - 2009 )





--------------------------------------------------------------------------------

వార్తా-వ్యాఖ్య - ‘ఓటరు ఓడిపోలేదు’

  ఓటరు ఓడిపోలేదు
- భండారు శ్రీనివాస రావు

ఎన్ని ప్రలోభాలు చూపినా..
ఎన్నెన్ని రకాలుగానో ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగినా - దాదాపు రెండు మాసాలకు పైగా వ్యాఖ్యలలాంటి వార్తలతో, సమాచారం పేరుతొ ప్రచారం చేస్తూ మీడియా హోరెత్తించినా-
ఓటరు ఓడిపోలేదు!

పైపెచ్చు విశ్వసనీయతకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఎంతోమంది వుండవచ్చు కానీ వాస్తవంగా గెలిచింది సాధారణ ఓటరు మాత్రమే! కానీ, ఓడిపోయిన వారి జాబితా చాంతాడంత వుంది.

ఇందులో మంత్రులుగా అధికారం చలాయించిన వాళ్లు - ప్రతి పక్షంలో వుండి అయిన దానికీ, కాని దానికీ ప్రభుత్వాన్ని చేటలతో చెరిగిన వాళ్లు ఎంతో మంది వున్నారు.

అయితే, నిజానికి ఓడిపోయింది వీళ్లు కాదు. ఉనికి కోసమో, ఉనికిని నిలబెట్టుకోవడం కోసమో, ఉనికిని చాటుకోవడం కోసమో పాత్రికేయ విలువలకు నిలువు పాతర వేసిన మీడియా ఓడిపోయింది.

రాజకీయ పక్షాలు పరస్పరం విమర్శించుకోవడం వాటి తప్పుకాదు. ఎన్నికల పోరాట క్రమంలో హద్దులు దాటి వుండవచ్చు. మాటల్లో , చేతల్లో సభ్యత, సంస్కారంపాలు తగ్గి వెగటు పుట్టేలా వాటి ప్రవర్తన వుండి వుండవచ్చు.

కానీ - వాటిని ఎత్తి చూపి, సరిదిద్దడానికి దోహదం చేసే సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన పవిత్ర బాధ్యతను విస్మరించి, రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తూ, తమ మనసులోని మాటల్ని మేధావుల విశ్లేషణలుగా ప్రచురించి, ప్రసారం చేసిన మీడియా ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది!
ఓడిపోయిన రాజకీయపక్షాలు వాటి మనుగడ కోసం ఎలాగూ ఆత్మ విమర్శ చేసుకుంటాయి.
ఆ పాట్లు వాటికి ఎలాగూ తప్పవు.
కానీ, మీడియా మాట ఏమిటి?
( మే - 2009 )

మాట్లాడడం అంటే మాటలు కాదు.

మాట్లాడడం అంటే మాటలు కాదు
-భండారు శ్రీనివాసరావు


నిజానికి అరవై నాలుగు కళల్లో ఇది ఒకటి.ఇది నిజమో కాదో తెలియకపోయినా ఇలాంటి స్టేట్మెంట్లని అలవోకగా, ఘంటాపధంగా ఇవ్వగల కళలో ఆరితేరినవరే గట్టి వక్తలుగా పేరు తెచ్చుకోగలుగుతారు. పెళ్ళిళ్ళల్లో -పబ్బాల్లో నలుగుర్ని చేరదీసి- అంతకు ముందు అందరూ చదివేసిన పేపర్లలోని వార్తలూ, విశేషాలూ అన్నీ తనకే ముందు తెలిసినట్టుగా రంగులద్ది చెప్పడం ఇంకో కళ. దీన్నే సంభాషణా చాతుర్యం అని కూడా అందురు. ఐతే, ఈ కళ ద్వారా ఆకట్టుకోగల శ్రోతల సంఖ్య పరిమితం. రాగల పేరూ, ప్రఖ్యాతలు కూడా ఆ పాళ్ళలోనే వుంటాయి. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచగల స్ఠాయికి ఎదగగలిగితే అభిమానుల సంగతి అటుంచి ఎదో కొంత గిట్టుబాటుగా కూడా వుంటుంది. సభా నిర్వాహకులు సయితం తమ తమ విభవాన్నిబట్టి చదివించుకుంటూ వుంటారు. సాధారణంగా అవార్డులూ-సత్కారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రకం వక్తలకు కొంత గిరాకీ వుంటుంది. పొగడడం మినహా మరో అంశానికి ప్రాధాన్యం వుండదు కాబట్టి మాట్లాడడం కూడా అంత శ్రమ అనిపించదు. అవార్దులు తీసుకునేవారూ, ప్రేక్షకులూ ప్రతిసారి మారిపోతుంటారు కావున ప్రసంగాల్లో పునరుక్తి దోషాలు ఎన్ని దొర్లినా ఎలాంటి ఇబ్బంది ఇసుమంత కూడా వుండదు. అతిశయోక్తులు దట్టించి ఎలా పొగడాలో తెలుసుకోవడానికి ప్రత్యేక శిక్షణా తరగతుల అవసరమే లేదు. ప్రోగ్రాం కంపీర్ అనో, వ్యాఖ్యాత అనో ఎదో ఒక పేరుతో మైకు ముందు నిలబడే శాల్తీ- సభకు వచ్చిన అతిధుల్నీ, అభ్యాగతుల్నీ(శ్రోతల్నీ) అదే పనిగా ఎలా పొగుడుతున్నారో కొద్దిగా గమనిస్తే చాలు సరిపోతుంది.
ఈ మధ్య ఒక సభకు వెళ్ళాను. బయట బాగా ఎండగా వుండడం వల్ల, సభా మందిరం ఏసీ హాలు కావడం వల్లా లోపల జనం నిండుగానే వున్నారు. భజంత్రీల్లో ఎవరో రాకపోవడంతో నన్ను మాట్లాడమన్నారు. ససేమిరా అన్నాను. ఒక్కసారి స్టేజి ఎక్కి మాట్లాడడం మొదలు పెడితే ఆ మత్తులో పడిపోతానేమోనని భయం. పైగా మొగమాటాలకు పోయి అనేక సభలకి హాజరైన అనుభవం వుంది. వేదికమీద వున్న, సారీ- వేదికను అలంకరించిన- ఇంకో సారి సారీ- (రంగురంగుల పూలతో, కాగితాలతో వేదికను అలంకరించినవారని అర్థం కాదు) పదిమందో, పదహారు మందో- ఒక్కొక్కరుగా లేచి తమ ప్రసంగం ప్రారంభించినప్పుడల్లా - వేదిక మీద వున్న మిగిలినవారిని పేరు పేరునా స్మరించడం-పనిలో పనిగా పొగుడుకోవడం గమనిస్తే చిర్రెత్తుకొస్తుంది. ఈ పరస్పర కుచమర్ధనాలకే సగం సమయం గడిచిపోతుంది. దండలు, పుష్పగుచ్చాలు, శాలువలు అందించేవారి పేర్లూ, అందుకుంటున్నవారి పేర్లూ - ఎలా సహస్రనామార్చన కొనసాగుతుంది.

ఈ కార్యక్రమంలో వీలైనంతమందికి వీలు కల్పించడంవల్ల సభ హాజరుకి మినిమం గ్యారంటీ వుంటుంది. ఈలోగా ప్రధమ తాంబూలం, లేదా ప్రధాన సత్కారం అందుకోవడానికి అన్నిరకాలుగా అన్నీ సమర్పించుకున్న శాల్తీ వేదిక మీదనే విలవిలలాడిపోతుంటాడు. కవర్ చేయడానికి వచ్చిన స్థానిక విలేకరులు తన సన్మాన కార్యక్రమాన్ని కవర్ చేయకుండానే మరో "గిఫ్టుబాటు" కార్యక్రమానికి వెళ్ళిపోతారేమోనని విలేకరుల గ్యాలరీ వైపు పిచ్చి చూపులు చూస్తూ దొంగ దండాలు పెడుతుంటాడు. ఎద్దు పుండు కాకికి రుచి అన్న సామెత మాదిరిగా నిర్వాహకులకు మాత్రం ఇదేమీ పట్టదు. అతిధులు, విశిష్ట అతిధులు, పరమ విశిష్ట అతిధులతో పాటు అతిధి ఆఫ్ ది డే - అతిధి ఆఫ్ ది ఇయర్తోటే వారికి గడిచిపోతుంటుంది. తెచ్చిన శాలువాలు, కప్పాల్సిన భుజాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తుంటారు. వక్తలు కూడా ఎవరికి వారు తమ ప్రసంగం పూర్తి కాగానే ఒకరి వెంట మరొకరు - కారణం చెప్పో చెప్పకుండానో వేదిక మీద నుంచి నిష్క్రమిస్తుంటారు. రైలుకో, బస్సుకో పోదామని బయలుదేరి మధ్యలో దొరికిన టైములో కాలక్షేపం కొసం శ్రోతల అవతారాలెత్తినవాళ్ళు కూడా ఆవులించుకుంటూ లేచి నిలబడి చేతి వాచీలవైపు, నిర్గమన ద్వారాల వైపు చూస్తుంటారు. ఇవన్నీ చూస్తూ నిర్వాహకులు - ఆనాటి "వ్యయ ప్రదాత"ను పిలిచి, తమకు జరిగిన ఈ అపూర్వ సన్మానానికి ముక్తసరిగా మూడు ముక్కల్లో ఉచిత రీతిన ధన్యవాదాలు తెలపాల్సిందిగా మనవి చేసుకుంటారు.

ఇదొక్కటే మొత్తం కాంట్రాక్టులో ఉచితంగా దొరికిన అవకాశంగా పరిగణించిన సదరు శాల్తీ - అలవాటులేని ప్రసంగాన్ని అధాటుగా ప్రారంభించి మధ్యలో దారితప్పి -అవాకులు, చవాకులతో శ్రోతల సహనాన్ని పరీక్షించే సమయంలో- సభా నిర్వహణ విధి విధానాలను "స్కాచి" వడబోసిన నిర్వాహకులు సత్కార కార్యక్రమాన్ని హడావిడిగా ముగించి సభకి మంగళం పాడతారు. కరిగిన సొమ్ముకూ, జరిగిన సన్మానానికీ బేరీజు వేసుకుంటూ బేజారైన గుండెతో సత్కార గ్రహీత ఇంటిదారి పడతాడు. నిర్వాహకులు విందు చేసుకుంటూ మరో "బఖరా" వేటలో పడతారు. (ఆగష్టు- 2008)

పత్రికలు - రాజకీయాలు (వార్త - వ్యాఖ్య) - భండారు శ్రీనివాసరావు

పత్రికలు - రాజకీయాలు (వార్త - వ్యాఖ్య)
- భండారు శ్రీనివాసరావు


హెలి కాఫ్టర్ దుర్ఘటనలో రాజశేఖర్ రెడ్డిగారు మరణించి రెండు వారాలు గడచి పోయాయి. మొదటి రెండు మూడు రోజులు- తెలుగునాట ’మీడియా’ నిర్వహించిన పాత్ర అభినందనీయం. ఇప్పుడు మీడియా అనే పదాన్ని పత్రికలకు, టెలివిజన్ ఛానెళ్ళకు అన్వయించి విస్తృతార్ధంలో వాడుతున్నారు. ఈ రెండు మాథ్యమాలు - దుర్ఘటన్ గురించిన సవివరమైన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజెప్పటానికి శక్తివంచన లేకుండా పాటుపడ్డాయి. దుర్గమారణ్యంలో వాగులు, వంకలు కాలి నడకన దాటుకుంటూ వెళ్ళి - సమాచార సేకరణలో తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. స్థానిక ఛానెళ్ళు చిత్రీకరించిన దృశ్యాలనే అనేక జాతీయ, అంతర్జాతీయ ఛానెళ్ళు ఉపయోగించుకున్న తీరే ఇందుకు నిదర్శనం. ఇంతవరకు తెలుగు మిడియా నిర్వహించిన పాత్రను కొనియాడితిరవలసిందే.అయితే, క్రమేపీ రాజశేఖరరెడ్డి గారు జివించి ఉన్నప్పటి - అంటే గత రెండు మూడేళ్ళ కాలంగా జనం గమనిస్తూ వచ్చిన అంశాలే మళ్ళీ మీడియాలో చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఇది దురదృష్టకర పరిణామం.

పదవిలో ఉంటూ ఒక ముఖ్యమంత్రి చనిపోవడం అన్నది మన రాష్టానికి సంబంధించినంతవరకు ఇదే ప్రథమం. గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులను మార్చిన సందర్భాలకు, ప్రస్తుత సన్నివేశానికి హస్తి మశకాంతరం తేడా ఉంది. చనిపోయిన వ్యక్తి సాక్షాత్తూ ముఖ్యమంత్రి. అందునా రాజశేఖర రెడ్డి. వ్యక్తిత్వ శోభతో, నాయకత్వ పటిమతో, దీక్షా దక్షతలతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి పార్టీ అధిష్టానాన్ని సైతం ప్రభావితం చేసిన ప్రతిభాశాలి. ఆయన లేని లోటును ఊహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వై.ఎస్సార్ మృతితో రాష్ట్రం యావత్తూ దిగ్భ్రాంతికి గురయ్యింది. జనం చేష్టలుడిగి పోయారు. సొంత మనిషి మరణించినట్టుగా తెలుగు నాట ప్రతి ఇంటా విషాద చాయలు అలముకున్నాయి. ’వై.ఎస్సార్ ఇక లేరు’ అన్న దారుణ వార్త జీర్ణించుకోలేక దాదాపు మూడు వందలపై చిలుకు అభిమానులు, ఆపన్నులు గుండె పగిలి చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందంటే - ఈ దుర్ఘటన ప్రజలను ఏ స్థాయిలో ఏరకంగా కలచివేసిందో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగా తేరుకుని తక్షణ కర్తవ్యానికి నడుం బిగించింది. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వయసు రీత్యా అనుభవం రీత్యా అత్యంత సీనియర్ అయిన రోశయ్య గారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది.

వై.ఎస్సార్ మంత్రి మండలిలోని ఇతర మంత్రుల చేత కూడా మరోసారి ప్రమాణ స్వీకారం చేయించి అవే శాఖలు అప్పగించి ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణ సజావుగా సాగిపోయేందుకు ఏర్పాటు చేసింది.

రోశయ్య గారికి సంబంధించినంతవరకు ఇది అయాచిత పదవి. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తరువాత కూడా పలుకులో, నడవడికలో ఏ మాత్రం మార్పు లేదు.ఆయన తొలిసారి మంత్రి అయినపుడు ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్ ప్రొఫెషనర్లుగా రాష్ట్ర సర్వీసులో ప్రవేశించిన అధికారులు - ఆయన కళ్ళముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా డీ.జీ.పీగా ఎదిగారు. రాష్ట్రస్థాయిలోను, జిల్లా స్థాయిలోనూ అధికారులను పేరుతో పిలిచి గుర్తుపట్టగల సుదీర్ఘ అనుభవం ఆయనది. పోతే ఫైళ్ళూ,ప్రోజెక్టులు, నిధులు, జమాఖర్చులు కొట్టిన పిండి. అసాధారణ శక్తితో, ప్రసంగాలతోనే ప్రత్యర్ధుల గుండెల్ని పీల్చి పిప్పిచేయగల ప్రతిభా సామర్ధ్యాలు ఆయన సొంతం.

రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా - వై.ఎస్సార్ చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల గురించి రోశయ్య గారికి సంపూర్ణమైన సదవగాహన ఉంది. పైపెచ్చు వైఎస్సార్ కి అత్యంత ఆత్మీయుడు. అందుకే ముఖ్యమంత్రిగా ఆయనని ఎంపిక చేస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం. కాంగ్రెస్ వర్గాలను అంతగా కలవరపరచలేదు.అలాగే మంత్రుల సహాయ నిరాకరణ గురించి మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్న కథనాలను చూసి రోశయ్యగారు కూడా కలవర పడిన దాఖలాలు లేవు.కాబట్టే అప్పగించిన బాధ్యతలను శక్తి మేరకు నిర్వహించేందుకే ఆయన కృషి చేస్తున్నారు.
 కాగా, రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన రాజకీయ వారసుడు ఆయన కుమారుడైన జగన్ మోహన్ రెడ్డే కావాలనివై.ఎస్సార్ ని అభిమానించే వారు కోరుకోవడం అత్యంత సహజం. వై.ఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది పేద ప్రజలు కూడా అందుకు మద్దతు పలకడం అంతే సహజం. అయితే జగన్ కు ఆశించిన రీతిలో అధిష్టానం మద్దతు దొరకడం లేదన్న విషయాన్ని గోరంతను కొండంతలుగా చేసి జనంలోకి తీసుకువెళ్లాడంలో మీడియా నిర్వహించిన పాత్రను కొందరు తప్పుపడుతున్నారు. జగన్ కు అనుకూలంగా మీడియాలోని ఒక వర్గం ఎంత గట్టిగా పనిచేస్తున్నదో, జగన్ కు వ్యతిరెకంగా మరొక వర్గం అంతే పట్టుదలతో పనిచేస్తున్నదని కాంగ్రెస్ రాజకీయాలను ఔపోసన పట్టిన సీనియర్ పాత్రికేయులు ప్రైవేటు సంభాషణల్లో పేర్కొంటున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో అధిష్టానం బూచిని చూపించి ప్రత్యర్ధులను బెదిరించే సంస్కృతికి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నూకలు చెల్లిపోయాయి.ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీకి సాధించి పెట్టిన విజయం దరిమిలా ఆయన్ని వేలెత్తి చూపగల చేవ, పన్నెత్తి ప్రశ్నించగల సత్తా పార్టీలో కొరవడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుసరిస్తూవస్తున్ననూతన దిశానిర్దేశనం కూడా దీనికి దొహదం చేస్తోంది.

మొదటి అయిదు సంవత్సరాల పదవీ కాలంలో అధిష్టానం వద్ద వై.ఎస్సార్ మాటే చెల్లుబడి అవుతూ వచ్చింది. దానితో రాష్ట్ర స్థాయిలో పార్టీలోని ఆయన ప్రత్యర్dహుల విమర్శలు, ఆరోపణలు ఒక స్థాయికి పరిమితం కావడం మాత్రమే కాకుండా క్రమేపీ వారి ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తరువాత అసమ్మతి శక్తులు మళ్ళీ పుంజుకుంటాయని చాలామంది భావించారు. కానీ ఆయన ఆకస్మిక మృతి వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబుకిన భావోద్వేగాల నేపథ్యంలో అసమ్మతి స్వరాలు అంతరంగాలకే పరిమితం అయ్యాయి. దాంతో జగన్ ని ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ తప్ప జగన్ కి వ్యతిరేకంగా చేతులు కలిపి, బహిరంగంగా ముఠా కట్టి వాదం వినిపించగల వాళ్ళు లేకుండా పోయారు.

రాజశేఖర రెడ్డి మరణానంతర పరిణామాలను శ్రద్ధగా గమనిస్తున్న ప్రతి పక్షాలు కూడా పైకి పెదవి విప్పడం లేదు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలని వాటితో తమకు సంబంధం లేదని పేర్కొంటున్నాయి. కానీ రాజశేఖర రెడ్డి మృతికి కొన్ని వారాల ముందు తమ పార్టీలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్హ్ ని వై.ఎస్సార్ అమలు చేస్తున్నారని

ఆయా పార్టీలు చేసిన ఆరోపణలను స్ఫురణకు తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీలోపరిణామాల పట్ల అవి నిర్లిప్తంగా ఉంటాయనుకోలేము. అలాగని బహిరంగ వ్యాఖ్యానలకు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలను తమ రాజకియ అవసరాలకి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తాయని కూడా భావించడం పొరపాటే అవుతుంది. కాకపొతే వై.ఎస్సార్ స్థానంలో ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కావడం ప్రతిపక్షాలకు ప్రధానంగా తెలుగు దేశం పార్టీకి మింగుడు పడకపోవచ్చు. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ కూడ తన తండ్రి బాటలోనే అదే విధమైన రాజకీయ ఎత్తుగడలను కొనసాగించే అవకాశం ఉంటుందని ఆ పార్టీ అంతర్లీనంగా
సందేహపడే వీలుంది.జగన్ కాకపోతే చాలు అన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్నట్టు భోగట్టా.

అయితే రాజశేఖర రెడ్డి వంటి మహోన్నత వ్యక్తి మరణించిన వెంటనే ఆయన రాజకీయ వారసత్వానికి సంబంధించి రకరకాల కథనాలు, విశ్లెషణలు మీడియాలో తామర తంపరలుగా వెలువడుతూ ఉండటాన్ని సామాన్య జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ పన్నెత్తి మాట్లాడని కె.వి.పి.సైతం గాంధిభవన్ సమావేశంలో చెలరేగిన ఆవేశకావేశాలను సద్దుమణిగెలా చేసేందు ఉద్వేగంగానే కాకుండా సుదీర్ఘ్హ పోరాటం చేయడం ఒక కొసమెరుపు.

ఈ పరిణామాలను జగన్ వర్గానికి వ్యతిరేకంగా మార్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నించడం సహజం. ఈ ప్రయత్నాలకు మీడియాలోని ఒక వర్గం సహకరిస్తోందన్నది తాజాగా వినిపిస్తున్న ఆరోపణ. కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు ఇందుకు ఉదాహరణలుగా ఇ ఆరోపణలు చేస్తున్నవారు పేర్కొంటున్నారు. జగన్ కు అనుకూలంగా పార్టీ అధిష్టానానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఉత్తరాది పత్రిక ఒక దానికిచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలను యథాతథంగా తర్జుమా చేసి ప్రచురించిన ఒక తెలుగు దినపత్రిక - అలా మాట్లాడినందుకు ఆ నాయకుడిపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందంటూ ఆ కథనాన్ని ప్రారంభించిన వైనాన్నివారు ఉదహరిస్తున్నారు. కె.వి.పి. ఢిల్లీయాత్రల గురించీ, అధిష్టానం తీరు తెన్నుల గురించి ఊహాగానాలు చేస్తూ మీడియాలోవెలువడుతున్న కథనాలలోని నిబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు.జగన్ కాకపోతే కాంగ్రెస్ లో ఎవరైనా పర్వాలేదన్న పద్ధతిలో మీడియాలో ఒక వర్గం పనికట్టుకుని ప్రచారం చేస్తోందన్నది ఆ ఆరోపణలోని సారాంశం.రాజశేఖర రెడ్డి పత్రికలలోని విశ్వసనీయతని పదే పదే ప్రశ్నిస్తూ ప్రజల్లో తమ పత్రికల పట్ల గౌరవాదరాలు తగ్గిపోయేలా చేశాయన్న కినుకతో ఉన్నపత్రికాధిపతులే ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని ఇలా వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వారి మాటల్లో తొంగిచూస్తోంది.పత్రికల విశ్వసనీయత పట్ల రాజశేఖర్ రెడ్డి హయాంలో తలెత్తిన నీలినీడలు ఆయన అస్తమయం తర్వాత కారుమబ్బులుగా పరిణమించిడం విషాదం.

గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేని సాహసాన్ని - మీడియాలో ఒక వర్గంపై విమర్శలు గుప్పించడం ద్వారా రాజశేఖర రెడ్డి ప్ర్దదర్శించారు.అక్షరంపై ప్రారంభమైన దాడిగా కొందరు విశ్లేషకులు అభివర్ణించారు. అయినా వై.ఎస్సార్ తన సహజ స్వభావానికి తగ్గట్టుగానే ఏ మాత్రం వెనుకంజవేయలేదు.పైపెచ్చు తన విమర్శలకు మరింత పదును జోడించారు. పత్రికల్లో పనిచేసేవారిని, పత్రికలు నడిపే వారిని విడదీసి చూపిస్తూ పత్రికా స్వేచ్చకి తనదైన భాష్యం చెప్పారు.
ఆయన ఇప్పుడు లేరు. తిరిగి రారు. ఇది కఠోర సత్యం.

పత్రికలకు, మీడియాకి విమర్శించే హక్కు ఉంది. నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన ధర్మం ఉంది.ఎవరికో కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు లేశ మాత్రం కూడా తలెత్తకుండా పత్రికలను నడపాల్సిన పవిత్ర భాద్యత కూడా వారి భుజస్కంథాలపై ఉంది. ఈ బాధ్యతని సమర్ధంగా, విశ్వసనీయంగా,నిరూపిస్తున్నామని నిరూపించుకోడానికి ఇదే సరైన తరుణం.
ఒక వ్యక్తి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కావడం వలన సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రయోజనం కలగవచ్చు. లేదా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
 కానీ -
ఈ సూత్రం మీడియాకి వర్తించదు అన్న వాస్తవాన్ని అర్ధం చేసుకోవాలి.

(సెప్టెంబర్- 2009)

వార్త - వ్యాఖ్య - స్వయంకృతాపరాధాలు

వార్త - వ్యాఖ్య - స్వయంకృతాపరాధాలు
- భండారు శ్రీనివాసరావు

‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు వేమన. అలాగే - ‘విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తి’ తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ‘ఒసే’ అనడం - తండ్రిని ‘ఒరే’ అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా ‘గురూ-గురూ’ అని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.

ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానమ్గా చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు.
కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా!జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత ‘వేగవంతం’ చేయడంలో ఈనాటి ‘ఎ టూ జెడ్’ చానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతోంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వెఐరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ఒసే అనడం, నాన్నను ఒరే అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే, ఈనాటి ఛానళ్ళే ఈనాటి పత్రికలే, ఈనాతి పుస్తకాలే ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు.
 పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

(సెప్టెంబర్- 2009)

వార్త - వ్యాఖ్య - ఇంకానా! ఇకపై సాగదు!

ఇంకానా! ఇకపై సాగదు!
- భండారు శ్రీనివాసరావు
రాను రాను - సామాన్యుడనే వాడికి - ఓటు వెయ్యడం మినహా ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ - హక్కుభుక్తమై పోతున్నాయి.
నిజానికి, పార్టీలూ,పర్టీల నాయకులూ, అమాత్యులూ, అధికారులు,ఉద్యోగులు, పోలీసులూ, అందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. ఎదిగో - ఎన్నికయ్యో, హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా,సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.
సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి.
ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటికి అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి.భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాదారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మరింత దుర్బరంగా మారుస్తూ - పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.
కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది అంతే నిజం.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మికసంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ విధానాలు మరింత చికాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపబ్రంశపువిధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.
ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్త్గలు - పట్టుమని పదిమంది కూడా లేరు. - జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డు పై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలనిగద్దిస్తే ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు. అని వాళ్ళనాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని చానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కన నిలబడితే, నవ్యత్వం కోసం పటుపడే ఛానెళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే , ఇంకోసారి ఏపార్టీ, ఏయూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలక్ సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.
కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.
అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ - తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

(ఆగష్టు -2009)
వార్త - వ్యాఖ్య
ఎన్నికల ముందు - ఎన్నికల తర్వాత
- భండారు శ్రీనివాసరావు

నలభై ఏళ్ళ క్రితం పత్రికల్లో జీవన్ టోన్ ప్రకటనలు విరివిగా దర్శనమిచ్చేవి. ఆ టానిక్ తీసుకోకముందూ - తీసుకున్న తర్వాత దేహ సౌష్టవం ఎలా మారిపోతుందన్న విషయాన్ని ఫోటోలతో సహా వివరించేవి. ఇప్పుడు ఎన్నికల ముందూ - తర్వాత రాజకీయ పార్టీల్లో కానవస్తున్న గుణాత్మక మార్పు వాటిని గుర్తుకు తెస్తోంది.
ఎన్నికల ప్రక్రియ ముగిసి, రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత రాజశేఖరరెడ్డి వ్యవహార శైలి పుర్తిగా మారిపోయిందన్న భావం వచ్చే వార్తా కథనాలు గత కొద్ది రోజులుగా వెలువడుతున్నాయి. శాసన సభ స్పీకర్ ఎంపిక నుంచి మొదలు పెట్తి, బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లులో మారిన ముఖ్యమంత్రి స్వరం - ఇత్యాది ఉదాహరణలతో, ఓడమల్లయ్య - బోడిమల్లయ్య వంటి సామెతలను ఉటంకిస్తూ అనేక విమర్శలు, ప్రతిపక్షాల నోటి నుంచే కాకుండా, పత్రికా వ్యాసాల ద్వారా వెలువడుతూ ఉండటం చూస్తే- ’ఎవ్వరూ మారలేదు’ అన్న సత్యం బోధపడుతుంది.
ఎన్నికల ముందు ఏ పార్టికయినా ప్రధమలక్ష్యం గెలుపు సాధించడం. దానికోసం అనేకరకాల వ్యూహాలను రచిస్తారు. ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. ప్రలోభపెట్టే ప్రసంగాలు చేస్తారు. ఊరించే హామీలు గుప్పిస్తారు ఇందుకు ఎవరూ మినహాయింపు కాదన్నది అందరికీ తెలిసిందే.
అంతవరకూ, ఇదంతా ‘రాజకీయం’ అన్నది పార్టీల ప్రగాఢ విశ్వాసం. ఇక ఆ తర్వాత - ఓడిపోయిన వారికి పోయేదేమీలేదు. గెలవలేక పోయామే అన్న చింత తప్ప చిక్కులూ, ఇక్కట్లూ గెలిచి కూర్చున్న వారికే. ఇక అప్పుడు రాజకీయం తప్పుకుంటుంది. రాజనీతిజ్ఠత తెరపైకి వస్తుంది. ఇప్పుడు రాజశేఖరరెడ్డిలో పత్రికలకు కానవస్తున్న ‘మార్పు’లోని పరమార్ధం ఇదే.
మొన్న మొన్నటి వరకూ - ఎన్నికల సమరంలో వై.ఎస్. - తన పార్టీని ముందునుండి నడిపించారు. సామ, దాన్, బేధ, దండోపాయాల వంటి సమస్త అవకశాలను, ఏ ఒక్క దానిని వదిలిపెట్టకుండా విజయాన్ని సాధించాలన్న ఏకైక ధ్యేయంతో పనిచేసి, ప్రచారం చేసి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించే గురుతర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. ఖజానా ఖాళీ అయ్యిందనీ, నిధులలేమి నిజ స్వరూపం ప్రదర్శిస్తోందని మళ్ళీ అవే పత్రికలు రాస్తున్న రాతల్నే ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్ర రధసారధి బాధ్యత ఇంకా ఎంత పెరిగిందో అవగతమవుతుంది. అదృష్టవశాత్తూ మిగిలిన పార్టీలతో పోటీపడి అనవసర ఎన్నికల వాగ్దానాలు శ్రుతిమించి చేయకపోవడం గుడ్దిలో మెల్ల. తొలివిజయం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మలి విజయం అహంకారాన్ని అందిస్తుందంటారు..పరిమితులను మించిన అధికారం పెడత్రోవల వైపు నడిపిస్తుందని కూడా అంటారు. వ్యక్తిత్వానికి అసలు సిసలు పరీక్ష ఈ స్థితిలోనే ఎదురవుతుంది. ఎదురొడ్డి నెగ్గినవారు నేతగా నిలబడతారు. జనం గుండెల్లో కలకాలం నిలిచిపోతారు.
ముఖ్హ్యమంత్రిగా తొలి ఐదేళ్ళలో రాజశేఖర రెడ్డి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్నో పథకాలు తలపెట్టారు. సాధ్యాసాధ్యాలను లెక్కించకుండా ప్రాజెక్టులు ప్రారంభించారు. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా అందరికీ అన్ని మేళ్ళు చేయాలన్న ఉదార సదాశయంతో పనిచేశారు. వాటిల్లో కొన్ని జరిగాయి, మరికొన్ని అసంపూర్తిగా మిగిలాయి, మరికొన్నింటిని అమలులో చిత్త శుద్ధి లోపించింది. ఇవన్నీ సాకల్యంగా ఎరిగున్న మనిషి కనుకనే కలెక్టర్లతో మాట్లాడిన మాటల్లో - ఆయన మనసులోని మాటలు బయటకు వచ్చాయి.
‘రాజకీయాలన్నవి ఎన్నికల వరకే, ఆ తరువాత ఆలోచన అంతా అభివృధిపైనే’ అనే ఉవాచ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిదే కాబట్టి, కొత్త ప్రభుత్వం తన పాత పథకాలను పటిష్టంగా అమలుచేయడానికి వీలుగా కొంత వ్యవధి ఇచ్చి చూడడం ఆయన విధి.
టీడీపీ ఆలోచనా ధోరణి కూడా ఇదే విధంగా ఉందన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం ఉంటే అంతకంటే కావల్సింది ఏమీ లేదు. గెలుపోటములను ఒకే రీతిన జీర్ణించుకోగల స్థిత ప్రజ్ణత రాజకీయాల్లో కొరవడినప్పుడే ఇబ్బందులు తలెత్తుతాయి.
పదమూడవ శాసనసభ సమావేశాల తొలి రోజుల తీరుతెన్నులను గమనించిన వారికి ‘కొత్త సీసాలో పాత సారా’ సామెత గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు. స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్ది ఎన్నిక తదనంతర పర్యవసానాలు చూస్తే, భవిష్యత్తు పట్ల నిరాశే కలుగుతుంది. టీడీపీ ఉపనాయకుడు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ‘ఈ అయిదేళ్ళూ ఇంతేనా’ అని నిర్వేదం ప్రకటించారు. కానీ, తమ వైఖరి కూడా చూసేవారికి అదే నిర్వేదం కలిగించిందన్న వాస్తవాన్ని అర్ధంచేసుకున్న దాఖలా కానరాలేదు. మారామని చెప్పుకోవడం వేరు, మారినట్లు కానరావాలి కూడా అప్పుడే రాజకీయం సమూలంగా మారిపోతుంది.

25, డిసెంబర్ 2009, శుక్రవారం

వార్త - వ్యాఖ్య



ఎన్నికల ముందు - ఎన్నికల తర్వాత



- భండారు శ్రీనివాసరావు









నలభై ఏళ్ళ క్రితం పత్రికల్లో జీవన్ టోన్ ప్రకటనలు విరివిగా దర్శనమిచ్చేవి. ఆ టానిక్ తీసుకోకముందూ - తీసుకున్న తర్వాత దేహ సౌష్టవం ఎలా మారిపోతుందన్న విషయాన్ని ఫోటోలతో సహా వివరించేవి. ఇప్పుడు ఎన్నికల ముందూ - తర్వాత రాజకీయ పార్టీల్లో కానవస్తున్న గుణాత్మక మార్పు వాటిని గుర్తుకు తెస్తోంది.



ఎన్నికల ప్రక్రియ ముగిసి, రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత రాజశేఖరరెడ్డి వ్యవహార శైలి పుర్తిగా మారిపోయిందన్న భావం వచ్చే వార్తా కథనాలు గత కొద్ది రోజులుగా వెలువడుతున్నాయి. శాసన సభ స్పీకర్ ఎంపిక నుంచి మొదలు పెట్తి, బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లులో మారిన ముఖ్యమంత్రి స్వరం - ఇత్యాది ఉదాహరణలతో, ఓడమల్లయ్య - బోడిమల్లయ్య వంటి సామెతలను ఉటంకిస్తూ అనేక విమర్శలు, ప్రతిపక్షాల నోటి నుంచే కాకుండా, పత్రికా వ్యాసాల ద్వారా వెలువడుతూ ఉండటం చూస్తే- ’ఎవ్వరూ మారలేదు’ అన్న సత్యం బోధపడుతుంది.



ఎన్నికల ముందు ఏ పార్టికయినా ప్రధమలక్ష్యం గెలుపు సాధించడం. దానికోసం అనేకరకాల వ్యూహాలను రచిస్తారు. ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. ప్రలోభపెట్టే ప్రసంగాలు చేస్తారు. ఊరించే హామీలు గుప్పిస్తారు ఇందుకు ఎవరూ మినహాయింపు కాదన్నది అందరికీ తెలిసిందే.



అంతవరకూ, ఇదంతా ‘రాజకీయం’ అన్నది పార్టీల ప్రగాఢ విశ్వాసం. ఇక ఆ తర్వాత - ఓడిపోయిన వారికి పోయేదేమీలేదు. గెలవలేక పోయామే అన్న చింత తప్ప చిక్కులూ, ఇక్కట్లూ గెలిచి కూర్చున్న వారికే. ఇక అప్పుడు రాజకీయం తప్పుకుంటుంది. రాజనీతిజ్ఠత తెరపైకి వస్తుంది. ఇప్పుడు రాజశేఖరరెడ్డిలో పత్రికలకు కానవస్తున్న ‘మార్పు’లోని పరమార్ధం ఇదే.



మొన్న మొన్నటి వరకూ - ఎన్నికల సమరంలో వై.ఎస్. - తన పార్టీని ముందునుండి నడిపించారు. సామ, దాన్, బేధ, దండోపాయాల వంటి సమస్త అవకశాలను, ఏ ఒక్క దానిని వదిలిపెట్టకుండా విజయాన్ని సాధించాలన్న ఏకైక ధ్యేయంతో పనిచేసి, ప్రచారం చేసి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించే గురుతర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. ఖజానా ఖాళీ అయ్యిందనీ, నిధులలేమి నిజ స్వరూపం ప్రదర్శిస్తోందని మళ్ళీ అవే పత్రికలు రాస్తున్న రాతల్నే ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్ర రధసారధి బాధ్యత ఇంకా ఎంత పెరిగిందో అవగతమవుతుంది. అదృష్టవశాత్తూ మిగిలిన పార్టీలతో పోటీపడి అనవసర ఎన్నికల వాగ్దానాలు శ్రుతిమించి చేయకపోవడం గుడ్దిలో మెల్ల.



తొలివిజయం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మలి విజయం అహంకారాన్ని అందిస్తుందంటారు..పరిమితులను మించిన అధికారం పెడత్రోవల వైపు నడిపిస్తుందని కూడా అంటారు. వ్యక్తిత్వానికి అసలు సిసలు పరీక్ష ఈ స్థితిలోనే ఎదురవుతుంది. ఎదురొడ్డి నెగ్గినవారు నేతగా నిలబడతారు. జనం గుండెల్లో కలకాలం నిలిచిపోతారు.



ముఖ్హ్యమంత్రిగా తొలి ఐదేళ్ళలో రాజశేఖర రెడ్డి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్నో పథకాలు తలపెట్టారు. సాధ్యాసాధ్యాలను లెక్కించకుండా ప్రాజెక్టులు ప్రారంభించారు. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా అందరికీ అన్ని మేళ్ళు చేయాలన్న ఉదార సదాశయంతో పనిచేశారు. వాటిల్లో కొన్ని జరిగాయి, మరికొన్ని అసంపూర్తిగా మిగిలాయి, మరికొన్నింటిని అమలులో చిత్త శుద్ధి లోపించింది. ఇవన్నీ సాకల్యంగా ఎరిగున్న మనిషి కనుకనే కలెక్టర్లతో మాట్లాడిన మాటల్లో - ఆయన మనసులోని మాటలు బయటకు వచ్చాయి.



‘రాజకీయాలన్నవి ఎన్నికల వరకే, ఆ తరువాత ఆలోచన అంతా అభివృధిపైనే’ అనే ఉవాచ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిదే కాబట్టి, కొత్త ప్రభుత్వం తన పాత పథకాలను పటిష్టంగా అమలుచేయడానికి వీలుగా కొంత వ్యవధి ఇచ్చి చూడడం ఆయన విధి.



టీడీపీ ఆలోచనా ధోరణి కూడా ఇదే విధంగా ఉందన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం ఉంటే అంతకంటే కావల్సింది ఏమీ లేదు. గెలుపోటములను ఒకే రీతిన జీర్ణించుకోగల స్థిత ప్రజ్ణత రాజకీయాల్లో కొరవడినప్పుడే ఇబ్బందులు తలెత్తుతాయి.



పదమూడవ శాసనసభ సమావేశాల తొలి రోజుల తీరుతెన్నులను గమనించిన వారికి ‘కొత్త సీసాలో పాత సారా’ సామెత గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు. స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్ది ఎన్నిక తదనంతర పర్యవసానాలు చూస్తే, భవిష్యత్తు పట్ల నిరాశే కలుగుతుంది. టీడీపీ ఉపనాయకుడు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ‘ఈ అయిదేళ్ళూ ఇంతేనా’ అని నిర్వేదం ప్రకటించారు. కానీ, తమ వైఖరి కూడా చూసేవారికి అదే నిర్వేదం కలిగించిందన్న వాస్తవాన్ని అర్ధంచేసుకున్న దాఖలా కానరాలేదు.



మారామని చెప్పుకోవడం వేరు, మారినట్లు కానరావాలి కూడా అప్పుడే రాజకీయం సమూలంగా మారిపోతుంది.

యిద్దరు మిత్రులు -వైఎస్సార్ - చంద్రబాబు

  సరిగ్గా   ముప్పయేళ్ళ క్రితం, మార్చి 15వ తేదిన - 'ఇద్దరు మిత్రులు ' రాష్ట్ర శాసనసభలలో కొత్త సభ్యులుగా అడుగుపెట్టారు. ఆ ఇద్దరు - భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులు కాగలరని ఆనాడు ఎవ్వరూ వూహించి ఉండరు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తొలి అడుగులు కలిసి వేసిన ఆ ఇద్దరి దారులు వేరైపోతారని కానీ, ఆ ఇరువురి మధ్య వెల్లి విరిసిన స్నేహం ఆవిరి కాగలదని కానీ ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. ఆ ఇద్దరూ ఎవరన్నది పెద్ద ప్రశ్నా కాదు - సమాధానం చెప్పలేనంత క్లిష్టమైనది కాదు. కాకపోతే, ఒకప్పటి ప్రాణస్నేహితులయిన రాజశేఖరరెడ్డి - చంద్రబాబు కొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులయిన రాజకీయ నాయకులనే చెప్పాలి.

1978 లో వైఎస్సార్ తో రచయిత

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టికి ఆయనే అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా ఈ వైభోగం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే. ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటీకి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని ఆ పార్టి అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది.



ముఖ్యమంత్రి వైఎస్సార్ తో రచయిత


స్వపక్షంలోనే విపక్ష రాజకీయాలు - చెపట్టిన ప్రతి అబివృద్ధి కార్యక్రమానికి ఏవో ఒక రకమైన ఆరోపణలు మరకలు - మీడియాలో ఒక వర్గంపై ప్రత్యక్ష యుద్ధాలు - దూరమైన మిత్ర పక్షాలు - దగ్గరవుతున్న శత్రుగుడారాలు ఇవన్నీ సహజంగా పాలకపక్షానికి చికాకు కలిగించే అంశాలే. అయినా కాని - మందహాసం చిందిస్తూ మీడియాలో కనపడే రాజశేఖరెడ్డిని చూసే వారికి కలత చెందాల్సిన ఈ అంశాలేవీ ఆయనని కలవర పరుస్తున్న దాఖలాలు కనపడటలేదు. మంత్రివర్గం ఏర్పాటులో - పార్టిలో అసమ్మతిని ఏదో ఒక రూపంలో రెచ్చగొట్టే విషయాల్లో అధిష్టానానికి ఇంకా ఎంతో కొంత పట్టువున్నట్టూ కానవచ్చినా - ముఖ్యమంత్రిని మార్చేసాహసానికి పునుకోలేని స్థితిలో ఉండడం రాజశేఖరరెడ్డి కి శ్రీరామరక్షగా మారింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ధీమంతంగా ఎదుర్కోగలిగిన రాజకీయ జవసత్వాలు ఉన్న ప్రత్యామ్నాయ నాయకత్వం రాష్ట్ర కంగ్రెస్‌లో లోపించడం రాజశేఖరేడ్డికి మరో కవచం. జనాకర్షణ శక్తి ఆయనలో తగ్గిపోయినట్టు - స్వపక్షంలో విపక్షం ఎంత గగ్గోలు పెట్టినా - అందులో వాస్తవం ఉందని నమ్మడానికి ఆధారాలు లేవు. అందుకే - చంద్రబాబు - రాజశేఖరరెడ్డి అదృష్టవంతులయిన రాజకీయ నేతల కోవలోకి చేరిపోయారని చెప్పడం. పార్టీలో - ప్రభుత్వంలో ఎదురులేని స్థితికి చేరుకోవడం - అస్తిత్వానికి ముప్పులేకపోవడం - సహజంగానే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవి అతిగా పెరిగిపోయి - అహంకారానికి మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీయనంతకాలం - ఎలాంటి అనర్థాలకు అవకాశం ఉండదు. రెండోతరం చివరాఖరి దశలని మినహాయిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుది మరింత కలిసివచ్చిన కాలం. ఇంటా - బయటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. ఎన్నారైలకి  రాష్ట్రంలో ఓటు హక్కు ఇస్తే - ఆయన మరికొన్ని దశాబ్దాలవరుకు ముఖ్యమంత్రిగా కొనసాగగలరన్న వూహాగానలకు ఈ ఎన్నారైల అభిమానం ఊపిరి పోసింది. ఆకాశానికి నిచ్చెనలు వేసి - అంధ్ర ప్రదేశ్‌ని పైక్కించే పధకాల రచనకు కంప్యుటర్ వేగంతో శ్రీకారం చుట్టింది.

కాలు విరిగి ఆసుపత్రిలోవున్న రచయితను ముఖ్యమంత్రి హోదాలో పరామర్సిస్తున్న చంద్రబాబు


ఆ తర్వాత జరిగింది చరిత్ర - మిత్రపక్షాలు వైరి పక్షాలుగా మారి వీధులకెక్కారు. ప్రకృతి కన్నేర్ర చేయడంతో - వరుస కరువులతో రైతాంగం వెన్ను విరిగింది. విధ్యుత్ కొరత కడగండ్లని మరింత పెంచిమిది. సంస్కరణలు ధరలు పెంపుకు దోహదంచేసి - పరిస్థితులు మరింత దిగజారేలా చేశాయి. జరుగుతాయనుకున్న ఎన్నికలు మరింత దూరం జరగడం - తాత్కాలిక సర్కారు పాలాధికారులకు ఎన్నికల కమీషన్ ముక్కుతాడు విధించడం - చంద్రబాబుని మరింత వుక్కిరి బిక్కిరి వేశాయి. ముందరి కాళ్ళకు బంధాలు వేశాయి. ప్రత్యేక తెలెంగాణా పేరుతో వుద్యమం ప్రారంభించి - ఎన్నికల్లో పోటిచేసిన ట్. ఆర్. స్. నేత చంద్రశేఖర రావుతో - కాంగ్రెస్ వ్యుహాత్మాకంగా చేతలు కలపడంతో - రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనకు చరమగీతం పాడినట్టయింది.
కణకణమండే ఎండాకా కాలంలో రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో జరిపిన సూదీర్ఘ పాదయాత్రతో సాధించిన కాంగ్రెస్ విజయంతో - చంద్రబాబు పాలన - రెండో టరం వ్యవధి పూర్తికాకుండానే ముగిసిపోయింది.

ఇక రాజశేఖరెడ్డి విషయానికి వస్తే - ఆయన సరైన సమయంలో ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి. 2004లో కాంగ్రెస్ గెలిచి వుండని పక్షంలో - భవిష్యత్తులో ఆయనకి   ఈ అవకాశం లభించే పరిస్థితి వుండేదికాదు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన లేకపోలేదు. అప్పుడే ఈ పదవి ఆయనికి లభించి ఉంటే - రెండేళ్ళో - మూడేళ్ళో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాంగ్రెస్ మాజీల జాబితాలో ఆయన చేరిపుండేవారేమో. ఈ సారి సరైన తరుణంలో ముఖ్యమంత్రి కాగలిగారు. కనుక - మూడేళ్ళ పదవీకాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకుని పూర్తి టర్మ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నారు.

రాజశేఖరరెడ్డిది  ఆశ్రిత పక్షపాత బుద్ది. అందుచేతనే,  అందరిని కలుపుకుపోవడం లేదన్న  విమర్శలు సొంత పార్టి వారే చేస్తున్నారు. కాకపోతే ఈ విషయంలో ఆయన కారణాలు ఆయనకు వుండవచ్చు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అధికార పర్వంలో నిర్వహింఛిన కాలం బహు తక్కువ. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు సయితం ఆయన్నీ ,  ఆయన అనుచరులనీ  ఆదరించి అందలం ఎక్కించింది లేదు. అందుకే ఎంతో కాలం వేచి చూసిన తర్వాత లభించిన అధికార  తాయిలాన్ని పంచే విషయంలో ఆయన తన అనుచర గణానికి పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యపోవల్సింది లేదు. అందుకే నమ్ముకున్నవారికి వైఎస్సార్ కొమ్ముకాస్తారని అన్నా కూడా ఆయన  అభ్యంతరపెడుతున్నదీ లేదు.

దటీజ్ రాజశేఖరరెడ్డి.

ఆయన్ని బాగా తెలిసుకున్నవాళ్ళందరికి ఇది బాగా తెలిసిన సంగతే.

                                                                      

ముగ్గురు మిత్రులు

నలభయి ఏళ్ళ తర్వాత కలుసుకున్న ముగ్గురు మిత్రులు గురించిన ఆంద్ర జ్యోతి కధనం  
 




వార్తకు ప్రాణం విశ్వాసం - వార్త వ్యాఖ్య - భండారు శ్రీనివాస రావు

(November 16- National Press Day)



వార్తకు ప్రాణం విశ్వాసం 
- వార్త వ్యాఖ్య - భండారు శ్రీనివాస రావు (ఆకాశవాణి - హైదరాబాద్ - ప్రాంతీయ వార్తా విభాగం సౌజన్యంతో )
చాలా ఏళ్ళనాటి సంగతి.
కేంద్రంలో ఆనాడు సహాయ మంత్రిగావున్న డాక్టర్ కే ఎల్ రావు గారు మా వూరు రావాల్సివుంది. గంటలు గడిచిపోతున్నా మంత్రిగారి జాడ లేదు. చీకటి పడింది. ఇంతలొ దూరంగా వూరి పొలిమేరల్లో మోటార్ కార్ల హెడ్ లైట్ ల కాంతి కనబడింది. అమ్మయ్య వచ్చేసారులే అనుకున్నాం. కానీ, కాసేపటి తరవాత ఆ లైట్ ల వెలుతురు కూడా కానరాలేదు. మంత్రిగారి పర్యటన మొదలుకాకుండానే ముగిసిపోయింది.
మర్నాడు ఉదయం రేడియో లో ప్రాంతీయ వార్తలు విన్నప్పుడు అసలు విషయం తెలిసింది. సరయిన రహదారి లేకపోవడంవల్ల దారి తప్పిన మంత్రిగారి పరివారం- మా వూరికి వచ్చే దారి కనుక్కోలేక - విధి లేని పరిస్థితిలో ప్రోగ్రాం రద్దుచేసుకుని యెకాయెకిన విజయవాడ తిరిగి వెళ్ళిపోయిందట. ఆ సాయంత్రం వచ్చిన పత్రిక ద్వారా మరికొన్ని విశేషాలు తెలిసాయి. మునేటికి అవతల - దారీ తెన్నూ లేకుండావున్న అనేక గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయాలని కే ఎల్ రావు గారు నిర్ణయించారట. మంత్రి గారు రాకపోయినా- రోడ్డు వస్తున్నందుకు గ్రామస్తులు సంతోషించారు.
పొతే- ఆరోజు సాయంత్రం వచ్చిందని చెప్పానే ఆ ఆంద్ర పత్రిక ఒక్కటే మా వూరు మొత్తానికి దిక్కు. ఉదయం ముద్రించిన పేపర్ సాయంకాలానికి కానీ మా వూరు చేరేది కాదు. బస్సు సదుపాయాలు అంతంత మాత్రం. రోడ్ల సంగతి సరేసరి. చెప్పాల్సిన పని లేదు.
ఆంద్ర పత్రిక - కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి పత్రిక. పందొమ్మిదివందల ఎనిమిది లోనే ఆనాటి బొంబాయి లో దాన్ని ప్రారంభించారు. అప్పటికే కొన్ని పత్రికలూ వస్తున్నప్పటికీ - తెలుగు పత్రికా రంగంలో ఆ పత్రిక స్థానం ఎవరూ కాదనలేనిది. పంతులు గారు కూడా పత్రికను వాణిజ్య ప్రాతిపదిక పై నడపలేదు. పైపెచ్చు- బొంబాయి నుంచి ప్రతి రోజూ తన స్వంత ఖర్చులపై పత్రికను ఆంద్ర ప్రాంతంలోని గ్రంధాలయాలకూ , రీడింగ్ రూంలకూ పంపేవారు. తెలుగునాట పత్రికలూ చదివే ఆసక్తి పెరగడానికి పంతులుగారి ఈ ప్రయత్నం దోహదం చేసింది కూడా.
ఇక మళ్ళీ మా వూరికి వెడితే-
గూడా సత్యనారాయణ సిద్దాంతి గారనే వయో వృద్దుడు - తనకొచ్చే కొద్దిపాటి ఆదాయంలో - మూడు రూపాయలు నెలసరి చందా కట్టి - పోస్ట్ లో పత్రికను తెప్పించుకునేవారు. పేపర్ రాగానే- వూళ్ళో చడువుకున్న వాళ్ళూ- చదువుకోని వాళ్ళూ - ఒక చోట చేరిపోయేవాళ్ళు. అప్పయ్య మాస్టారు - తన కంచు కంఠంతో వార్తలను ఆమూలాగ్రం చదివి వినిపించేవారు.
"అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఫిట్జరాల్ద్ కెన్నడీ ఎన్నిక- వోటమి అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన-
" కాంగోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐరాస సెక్రెటరీ జనరల్ దాగ్ హామర్ షెల్డ్ దుర్మరణం - దుర్ఘటనపై నీలినీడలు-
" మన సారధి- మన సచివుడు- మన జవహర్ - మనకిక లేడు-"
ఇలా సాగిపోయేవి ఆ వార్తలు.
వాటిని వినేవాళ్ళలో చాలామందికి అమెరికా అనే మరో దేశం వుందని తెలియదు. కాంగో ఎక్కడ వుందో- లియోపాల్డ్ విల్లీ అనేది వూరు పేరో - పూవు పేరో తెలియదు. తెలిసిందల్లా - తెలియనిది తెలుసుకుంటున్నామన్న తృప్తి . కొత్త సంగతులు తెలుసుకోవాలన్న ఆసక్తి. యిదే పత్రికలకు వున్న శక్తి.
అందుకనే- సమాచార మార్పిడికి వున్న ఈ బలాన్ని ఆవాహన చేసుకున్న పత్రికలు ప్రజలమీద పట్టుపెంచుకుంటూ వస్తున్నాయి.
అంతటి శక్తి స్తోమతలను ఇముడ్చుకున్న పత్రికా రంగం చరిత్ర గురించి- ఈ రోజు జాతీయ పత్రికా దినం పాటిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముచ్చటించుకుందాం.
అనేక శతాబ్దాల క్రితం ప్రభుత్వ ప్రభుత్వ ప్రకటనలే - అంటే రాజ శాసనాలే- సమాచార పత్రాలుగా వెలువడేవి. ప్రాచీన రోము సామ్రాజ్యంలో - జూలియస్ సీజర్ - లోహ, శిలా ఫలకాలపై శాసనాలను చెక్కించి - బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించే వారట .చైనాలో- పదహారో శతాబ్దంలోనే - మింగ్ ప్రభువుల కాలంలో వార్తా పత్రికలను ప్రచురించిన దాఖలాలు వున్నాయి. పదహారు వందల యాభయ్ ఆరులో మొదలై ఇప్పటిదాకా వెలువడుతున్న పత్రిక ఒకటి వుంది. ఈ స్వీడన్ పత్రికను - ఆ తరవాత మరో పత్రికతో విలీనం చేసిన పిదప కూడా - పాత పేరుని దానికి జోడించి ప్రచురిస్తూ వుండడం ఒక విశేషం. అంటే మూడు వందల నలభయ్ మూడు సంవత్సరాలుగా ఏకబిగిన నడుస్తున్న అతి ప్రాచీన పత్రిక ఇదే అన్న మాట.
పోతే - పన్దొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో పారిశ్రామిక విప్లవం పుణ్యమా అని - వార్తా పత్రికల తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. పద్దెనిమిది వందల పదునాలుగులోనే - లండన్ టైమ్స్ పత్రిక- నిమిషానికి పదకొండు వందల కాపీలు ముద్రించగల అచ్చు యంత్రాన్ని సమకూర్చుకుంది. క్రమంగా ఈ రంగంలో పోటీ పెరిగిపోయి- చవక పత్రికలు రంగ ప్రవేశం చేసాయి. పెన్నీ ప్రెస్ అనే వార్తా పత్రిక - తన ధరను సాటి పత్రికల ధరలో ఆరో వంతుకు తగ్గించి అమ్మడం మొదలుపెట్టి- అమ్మకాలను గణనీయంగా పెంచుకుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న అవకాశాలను- సాధన సంపత్తులనూ అందిపుచ్చుకున్న ఈ నాటి పత్రికలూ సర్వాంగ సుందరంగా ముస్తాబై పాఠకులను ఆకర్షిస్తున్నాయి.
ఈరోజు జాతీయ పత్రికా దినం కాబట్టి- కనీసం ఈ రోజయినా పత్రికా విలువలను గురించి కొంత నిష్కర్షగా చర్చ జరగాల్సిన అవసరం వుంది. కాలానుగుణమైన మార్పుల మూలంగా- మిగిలిన రంగాల్లో కానవస్తున్న వికృత ధోరణుల నీలినీడలు పత్రికా రంగంపై కూడా ప్రసరిస్తున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ చర్చ అవసరం మరింత పెరిగింది.
ఒక పెద్ద పత్రికలో వార్త పడినప్పుడు జనం దాని గురించి మాట్లాడుకోవడం సహజం. చదువుకున్న వాళ్ళు దాన్ని గురించి మరింత చర్చించుకుంటారు కూడా. నిరక్షరాస్యులయితే విని అవునా అని అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలుని బట్టి ఖండిస్తారు. లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే వ్యవహారం ఇది.
నిజాయితీ, నిబద్దతా, విశ్వసనీయతా - వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ- ఈనాటి పత్రికల్లో - ఆ మాటకి వస్తే - మీడియాలో - ఈ మూడింటికీ ఎంత విలువ ఇస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే.
విశ్వసనీయత కంటే మనుగడే ప్రధానమనుకున్నప్పుడు - పత్రికల ద్వారా సాధించాలనుకున్నదీ - సంపాదించాలని అనుకున్నదీ 'ఇంకేదో' వుందనుకున్నప్పుడు - పత్రికా స్వేచ్ఛకి అర్ధమే మారిపోతుంది.
జాతీయ పత్రికా దినం సందర్బంగా ఏర్పాటు చేసే సభలు సమావేశాల్లో ఈ అంశానికి తగిన ప్రాధాన్యం లభించగలదని ఆశిద్దాం.
(భండారు శ్రీనివాస రావు - పదమూడు నవంబర్ )