KCR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
KCR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, అక్టోబర్ 2017, శుక్రవారం

ముఖ్యమంత్రిని కలవడం ఎలా! – భండారు శ్రీనివాసరావు


యాక్టివ్ జర్నలిజంలో ఉన్న కాలంలో   రాజకీయాల్లో తలపండిన అనేకమంది తరచుగా అడిగే ప్రశ్న ‘ముఖ్యమంత్రిని కలవడం ఎలా?’  ఆ రోజుల్లో నాకు ఆశ్చర్యం కలిగించే ప్రశ్న అది.
ముఖ్యమంత్రులను కలవడం ఆషామాషీ కాదు అన్న వాస్తవం ‘విలేకరిత్వం’ ఒదిలిన తర్వాత కానీ నాకూ అర్ధం కాలేదు.  అప్పటిదాకా తలుపు తోసుకుని వెళ్ళిన తమను, ఆ  ‘తలుపు’ దగ్గరే అడ్డగించే ద్వారపాలకులకి తమ  ‘ప్రవర’ చెప్పుకోవడం చిన్నతనం అనిపించి అసలు అటు ఛాయలకు పోవడమే మానుకున్న సీనియర్ జర్నలిష్టులు నాకు మార్గదర్సులు. వార్తలు రాసే ఉద్యోగం  ఒదిలేసిన తర్వాత నేను కూడా గత పదేళ్లుగా ముఖ్యమంత్రులను కలిసింది లేదు. అంచేత సీఎం లను కలవాలనే కోరికకు మనసులోనే  మంగళం పాడుకున్నాను.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసేఆర్ ఆ పదవిలోకి రావడానికి కొద్ది కాలం ముందు ఆయన్ని  కలుసుకునే అవకాశం నాకు లభించింది. అంతే కాదు ఆయనతో కూర్చుని ఒకే టేబుల్ మీద భోజనం చేస్తూ ముచ్చటించుకునే అపూర్వ అవకాశం కూడా నాకు అప్పుడే దొరికింది. ఆ తర్వాత ఆయన కొత్త తెలంగాణా రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అంతే!  అక్కడి నుంచి ఆయన్ని టీవీల్లో చూడడమే ఎక్కువ.
కేసీఆర్ విలేకరుల సమావేశాలు నిర్వహించడమే తక్కువ. అయినా ఆయనకూ, ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు మీడియాలో లభించే విస్తృత ప్రచారం గమనించినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లోనే ఆయన మీడియాను అదుపుచేసి, తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారనే ప్రచారం కూడా తక్కువ జరగలేదు. మరి మూడున్నర ఏళ్ళ తర్వాత కూడా సానుకూల ప్రచారం ఆవగింజంత కూడా తగ్గినట్టులేదు. మరి దీనికి ఏమి చెప్పాలి?
ఇంకో విషయం చాలామంది గమనించే వుంటారు. రాజధానిలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల్లో చాలామందికి ఇప్పుడాయన ఒక ఆరాధ్య నాయకుడిగా కనబడుతున్నాడు. ఈ సంగతి  ఈ మధ్యాన్నం వెళ్ళిన ఒక పెళ్ళిలో తెలిసింది. దానికి హాజరయిన వారిలో అనేకమంది హైదరాబాదులో స్థిర పడ్డ ఆంధ్రులు, నూతన ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు. అందరిదీ ఒకే మాట. మూడేళ్ళ క్రితం వరకు వారికి కేసేఆర్ లో ఒక విలన్ కనబడ్డాడు. ఇప్పుడు ఒక హీరో కనబడుతున్నాడు.
ఈ ముచ్చట్లు అలా సాగుతున్నప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది. ‘మధ్యాన్నం మూడు గంటలకు కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్. రెండున్నర కల్లా వచ్చేయండి’ అని పిలుపు.
కానీ,  జరుగుతోంది  మా (అన్నయ్య) మనుమడి పెళ్లి.  కాకపొతే తప్పకుండా వెళ్ళే వాడినేమో!
వెడితే పాత మిత్రులు కొందరు కలిసే అవకాశం కూడా దొరికేది. అలాగే కాస్త దూరం నుంచి అయినా కేసీఆర్ ని చూసే సావకాశం కూడా.
అయినా ఇప్పుడు రాయడానికి ఒక చిన్నదో పెద్దదో పేపరు, వార్త చెప్పడానికి రేడియో నా వెనుక లేవు, ఏదో ఫేస్  బుక్ లో నా ఇష్టం వచ్చింది రాసుకునే వీలుతప్ప.       

వెళ్లేందుకు సంక్షేపించడానికి బహుశా ఇదీ ఒక కారణం కావచ్చు.   

30, డిసెంబర్ 2016, శుక్రవారం

2017 లో ప్రతిపక్షాలను కాదు ప్రజలను చూడండి ప్రభువులూ!


(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 01-01-16,SUNDAY)

అనాదిగా అలుపులేకుండా తిరుగుతున్న కాలచక్రం, తిరిగి తిరిగి, తిరిగొచ్చిన చోటికే తిరిగిరావడం  మామూలే.
అనేక అనుభవాలను, అనుభూతులను మన మదిలో, ఒడిలో  ఒదిలిపెట్టి  గత  ఏడాది సెలవు తీసుకుంది. సరికొత్త ఆశలతో కొత్త ఏడాది గడప దాటి అడుగు పెట్టింది.
చివరాఖర్లో కొంత హడావిడి చేసి 2016  తప్పుకుంటోంది. ఆ ప్రకంపనలను వారసత్వంగా అందిపుచ్చుకుని  2017 ప్రవేశిస్తోంది.

కొంచెం అటూ ఇటూగా కేంద్రంలోను, రెండు కొత్త తెలుగు రాష్ట్రాలలో నూతన ప్రభుత్వాలు కొలువుతీరి  రెండున్నర సంవత్సరాలు దాటుతోంది. ‘ఎన్నికలకు ముందు చెప్పినవేవీ చేయకుండా చేతులు ముడుచుకు కూర్చున్నారని’ ప్రతిపక్షాల వాదన. ‘కాదు, ఈ కొద్ది కాలంలో మేము చేసినన్ని మంచి పనులు గతంలో చాలాకాలం పాలించిన పార్టీలు ఏవీ చేయలేదని’ ఈ కొత్త పాలకుల సమర్ధన.  2016 లోనే కాదు, గత రెండున్నరేళ్లలో ఏం జరిగిందో సింహావలోకనం చేసుకుందాం.
ముందు ఢిల్లీ నుంచి మొదలుపెడదాం. చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయాన్ని సాధించి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. మొదటి రెండేళ్లలో రాజకీయంగా కొన్ని ఆటుపోట్లు ఎదురయినా వ్యక్తిగతమైన ప్రజాదరణ ఇసుమంత కూడా కోల్పోలేదు. అన్నింటికీ మించి అధికారంలోకి రాగానే సహజంగా అంటుకునే అవినీతి మరకలు ఆయన్ని అంటుకోలేదు. బ్రహ్మాండమయిన పనులేవీ చేసి చూపించిన దాఖాలాలు పెద్దగా లేకపోయినా ప్రజలకు ఆయన పట్ల నమ్మకం తగ్గిపోలేదు.  పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకున్నప్పటికీ, అందువల్ల ముందుగా  చీకాకులు పడుతున్నది తామే అయినప్పటికీ సామాన్య ప్రజలు పంటి బిగువన ఆ కష్టాన్ని భరిస్తూ వచ్చిన విషయం అంత చిన్నవిషయమేమీ  కాదు. కారణం ఏదైనా, కారకులు ఎవరయినా, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి  మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గత ఏడాది చివరి రెండు మాసాల్లో యావత్ జాతిని ప్రభావితం చేసింది. దేశానికి పట్టిన నల్ల ధనం రోగాన్ని మటుమాయం చేయడానికి మోడీ తలపెట్టిన కాయకల్ప చికిత్స తొలి ప్రభావం సామాన్య జనజీవనంపైనే పడింది. ఈ ఆకస్మిక నిర్ణయం తమ జీవితాల్లో తీసుకొచ్చిన అనూహ్య పరిణామాలను వారు అతి సహజంగా తీసుకుంటున్నారనే చెప్పాలి. వెనిజులా దేశంలో ఇటువంటి నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు ఎంత కోపోద్రిక్తులయింది గమనిస్తే, భారతీయులు ప్రదర్శిస్తున్న సహనం మోడీ అదృష్టమనే అనుకోవాలి.  అయితే దాన్ని ప్రజలు తమకిస్తున్న సహకారంగా ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందులో కొంత నిజం లేక పోలేదు,  కానీ అది పూర్తిగా నిజం కాదన్న ఎరుక సర్కారు వారికి వున్నట్టు అనిపించడం లేదు.        
 ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న యాగీ పట్ల పాలక పక్షానికి కొంత అసహనం వుండవచ్చు. అలాగని వస్తున్న ప్రతి విమర్శను రాజకీయ కోణం నుంచి చూస్తూ తప్పుపట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రతిపక్షాలు సరే! ప్రజలు ఏమనుకుంటున్నారో చారుల ద్వారా సమాచారం తెప్పించుకుని వారి ఇబ్బందులను కొంతవరకయినా తగ్గించి  ఒకింత ఉపశమనం కలిగించండం మోడీ ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పుకోవాల్సిన సంకల్పం ఇదే!
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.
దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చేజారిన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం   తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి.  ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకదాని చిక్కుముడి విప్పేలోగా మరోటి సిద్ధం. కొన్ని వచ్చి పడ్డవి అయితే మరి కొన్ని తెచ్చి పెట్టుకున్నవి.
సమస్యను అవకాశంగా మలచుకోవడం తనకలవాటని చెప్పుకునే చంద్రబాబు, ఎదురయిన ప్రతి సమస్యను పార్టీకి, రాష్ట్రానికి పనికి వచ్చే అవకాశంగా మార్చుకునే పనిలో అహరహం కష్టపడుతుంటారు. కనీసం కష్టపడుతున్నట్టు కానవస్తారు. 'పని చేయడంతో సరిపోదు పనిచేసినట్టు కనబడాలి కూడా' అనే ఈ కాలపు రాజకీయానికి నిజానికి ఆయనే ఆద్యులు.
ఎన్ని చేస్తున్నా, ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్నా ఇంకా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే వున్నాయి. రాజ్యం వుంది రాజధాని లేదు. ఖజానా వుంది. నిధులు లేవు. కేంద్రంలో మిత్ర ప్రభుత్వం వుంది. అయినా ఆశించిన విధంగా అక్కరకు రావడం లేదు. ఇటువంటి వ్యతిరేక పరిస్తితులను కూడా ఆయన అనుకూలంగా మార్చుకునే పనికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందులో కూడా రాజకీయంగా బలపడే ప్రయత్నం స్పష్టంగా కానవస్తుంది. ప్రతిపక్షాన్ని బలహీన పరిచే వ్యూహం దాగుంటుంది.
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ రాని అపూర్వ అవకాశం చంద్రబాబు నాయుడుకి కొత్త రాజధాని నిర్మాణం  విషయంలో లభించింది. కొంత వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఈ విషయంలో కూడా చంద్రబాబు తన పంధాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం కనుక ఆయన ప్రయత్నాలకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కానరాని మాట నిజమే. కాకపోతే కొత్త రాష్ట్రానికి వుండే ఇబ్బందులను ప్రజలు అర్ధం చేసుకుని సహకరిస్తున్నారు కానీ  ఇష్టపూర్తిగా కాదన్న వాస్తవాన్ని తెలుగు దేశం అధినేత గుర్తుపెట్టుకోవాలి.
ఇక చంద్రబాబుకు మరో సువర్ణావకాశం పోలవరం రూపంలో వచ్చింది.  
దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941 జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.  ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్ మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది.  ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న భద్రాచలం సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు, పోలవరం కుడి గట్టు కాల్వని, కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం వేల కోట్లకు పెరిగిపోయింది. 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న పోలవరం ప్రాజక్టుకు,  వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కూడా  చంద్రబాబుకు రాజకీయంగా చాలా కీలకం. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.  అయినా ప్రతి సోమవారం ఆ ప్రాజెక్టు పురోగతి గురించిన సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. సమీక్షలతో ప్రాజెక్టు పూర్తి కాదు కదా! అది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఢిల్లీ మీద ఒత్తిడి పెంచారు.
ఏడాది చివర్లో చంద్రబాబు ప్రభుత్వానికి చిన్న తీపి కబురు అందింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర నిధుల్లో కొంత భాగం చెక్కు రూపంలో చేతికి వచ్చింది. అంతే! క్షణం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీటు పనులకు స్వయంగా ఆయనే శంకుస్థాపన చేశారు. చెక్కు చేతికి అందిన నాలుగు రోజుల్లోనే మెరుపు వేగంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన  తీరు గమనించిన వారికి సకాలంలోనే దాన్ని పూర్తి చేయగలరన్న నమ్మకం కలిగి వుంటుంది. అయితే కేంద్రం ఎంతో అబ్బురంగా అందించిన డబ్బు, ప్రాజెక్టు అంచనా వ్యయం  ఈ రెంటినీ పోల్చి చూసుకుంటే రెండేళ్లలో పని పూర్తి కావడం సాధ్యమా అనే సందేహం కలుగుతుంది.              
ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వరంగా మారుతుంది. పూర్తి చేయకుండా ఒదిలేస్తే రాజకీయంగా తెలుగు దేశం పార్టీకి శాపంగా మారుతుంది. అంచేతనే 2018 కల్లా పోలవరం పూర్తి చేసితీరుతామనే ప్రకటనలు ఆ పార్టీ  నాయకులు తరచూ చేస్తూ వస్తున్నారు. ప్రాజెక్ట్ అనుకున్న విధంగా, అనుకున్న వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే.  ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం మాత్రం అంచనాలకు మించి పెరిగిపోవడం ఖాయం.
ఎన్ని సంక్షేమ పధకాలు మొదలు పెట్టినా చంద్ర బాబు ఎన్నికల వైతరణి దాటాలంటే అటు రాజధాని నిర్మాణం కొంతయినా చేసి చూపించాలి. ఇటు పోలవరం ప్రాజక్టును కొంతయినా కట్టి చూపించాలి. ఇది ఎరిగిన రాజకీయ నాయకుడు కావడం వల్లనే ఈ రెండిటి పట్లా ఆయన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు చెప్పుకోవాల్సిన నూతన సంవత్సర సంకల్పం.
ప్రతి విషయానికీ ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోకుండా, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని నెపం మోపకుండా  తన దీక్షాదక్షతలపై  ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా చూసుకోవాలి.
పొతే తెలంగాణా.   
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం నల్లేరు మీది బండి నడకలా సాగిపోతోంది. కేసీఆర్ మాట అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సుగ్రీవాజ్ఞగా చెల్లుబడి అవుతోంది. ఎదురులేదన్న నమ్మకంతో వేస్తున్న కొన్ని అడుగులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న సంగతిని ఆ పార్టీ అధినేత గమనించడం లేదేమో అనిపిస్తోంది. అనేక మంచి పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో తెలియదు.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీతెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, నియామకాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నవారు అనుకున్నారు. అయితేవారనుకున్నట్టూ ఏమీ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోలేదు.
అయినా కేసీఆర్ పైన ప్రజల అభిమానం చెక్కు చెదరలేదు. రాష్ట్రం ఏర్పాటయిన తరువాత జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లో టీఆర్ఎస్  నే గెలిపిస్తూ వచ్చారు. కేసీఆర్ తమ కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న బంగారు తెలంగాణా స్వప్నం పట్ల వాళ్ళ నమ్మకం చెక్కుచెదరలేదు. మొన్నీ మధ్య ఆయన ప్రారంభించిన రెండు పడక గదుల ఇల్లు అనే పధకంతో ఆయన పట్ల నమ్మకం మరింత పెరిగి వుంటుంది కూడా.    
అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అసలు ఇంతకాలంగా చేసింది ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసేఆర్ నేతృత్వం వహిస్తున్న పార్టీలోను, ప్రభుత్వంలోను ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ప్రచార కోశంలో వీటన్నిటికీ జవాబులు సిద్ధంగా వుండొచ్చు. ప్రచారమే ప్రధానం అనుకుంటే, వాస్తవానికి చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికీ దొరకనంతగా విస్తృత, సానుకూల  ప్రచారం కేసీఆర్ కు లభిస్తోంది. పత్రికలవారితో పన్నెత్తి మాట్లాడడమే అపురూపం. అయినా మీడియాలో ఆయనకు వస్తున్న ప్రచారం అపూర్వం.   
అయితే ఇంతటితో సరా! సరే అని  ఇవ్వాళ ప్రజలు సరిపుచ్చుకోవచ్చు.  రేపూ ఇలాగే వుంటుందనే గ్యారంటీ వుందా?
ఈ కొత్త సంవత్సరం శుభ సందర్భంలో కేసీఆర్ ఒక సంకల్పం చెప్పుకోవాలి. ప్రజలు అప్పగించిన పుణ్య కాలంలో మిగిలిన రెండేళ్ళు, ( చివరి ఆరునెలలు ఎన్నికల హడావిడే సరిపోతుంది) రాజకీయ భేషజాలకు స్వస్తి చెప్పి తనను నమ్ముకున్న ప్రజలను ఓ కంట కనిపెట్టి చూడాలి. ఏ విషయంలో ఎవరయినా ఏదైనా   ప్రశ్నిస్తే అందులోని నిజాయితీని కనిపెట్టగలగాలి. రాజహంస పాలనూ, నీళ్ళనూ వేరు చేసినట్టు, రాజకీయ ఆరోపణలను, నిజాయితీగా చేసే విమర్శలను వేర్వేరుగా చూడగలగాలి.
ఇది కేసీఆర్ చెప్పుకోవాల్సిన సంకల్పం.
ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ముగ్గురినీ కేవలం అనుభవం, సమర్ధత  కారణంగానే ప్రజలు వారు కోరుకున్న గద్దెలు ఎక్కించారు. అనుభవంలో కాని, రాజకీయ చాణక్యంలో కాని ఈ మువ్వురు  ఒకరికొకరు ఏమాత్రం  తీసిపోరు. వీరికి వున్న ఈ సానుకూల లక్షణాలన్నీ జనరంజకమైన పాలనకు దోహదం చేసి తీరాలి. మరి అయిదేళ్ళ విలువైన కాలంలో ఇంత కాలం గడచిపోయింది కానీ జనాలు కోరుకున్నది ఏమన్నా జరిగిందా?
వీరిలో పోలిక కలిగిన లక్షణం కూడా  ఒకటుంది.
ఏదైనా  మంచిపని  చేసినప్పుడు ఆ విషయాన్ని వారంతట వారే బయటకు చెప్పుకుంటున్నట్టే, చేయలేని విషయాన్ని ఎవరయినా ప్రస్తావిస్తే చాలు అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. ‘అభివృద్ధికి అడ్డు తగులుతున్నారనే’ అభాండం వేస్తున్నారు. లేదా తమ వైఫల్యాలకు మునుపటి  పరిపాలకుల నిర్వాకం కారణం అని  కొట్టి పారేస్తున్నారు. గతంలో  జరిగిన పొరబాట్లను లేదా తప్పులను  చక్కదిద్దే దక్షత వుందన్న కారణంతోనే ప్రజలుతమకు  పట్టం కట్టారన్న సంగతి మరిచి పోతున్నారు.
“మీ సమర్ధతకు మెచ్చి ప్రజలు  ఇచ్చిన నజరానా మీ పదవులు. అందుకు బదులుగా వారికి ఏదైనా చేయండి. సమయం తగ్గిపోతోంది. ప్రతిపక్షాలను పక్కన పెట్టి ప్రజలను అక్కున చేర్చుకోండి.”
నూతన సంవత్సరం సందర్భంగా జనశ్రేయోభిలాషులు వారిని కోరుకునేది ఇదొక్కటే.
ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుల గాటన కట్టి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు. ఎన్నికలకు  ముందు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ, చేసిన పనులను మననం చేసుకుంటూ, అడగాలని అనుకుని అడగలేని బడుగులు కూడా తమను ఎన్నుకున్న జనాల్లో  ఉంటారని ఏలికలు గుర్తు పెట్టుకోవాలి. వీరికి జవాబు చెప్పనక్కరలేదు. గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తే మాత్రం  కుదరదు. ఎందుకంటే అయిదేళ్ళు కాగానే అన్నీ గుర్తు పెట్టుకునే గొప్ప ప్రజాస్వామిక లక్షణం ప్రజల్లో  నిండుగా  వుంది.
చరిత్ర రుజువు చేసిన సత్యం ఇది.
సర్వజన హితాన్ని గమనంలో వుంచుకుని రాస్తున్న ఆప్తవాక్యం ఇది.  
(31-12-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595 

22, సెప్టెంబర్ 2014, సోమవారం

హే కృష్ణా.......!


(Published by 'SURYA' telugu daily dated 24 -09-2014, Wednesday)
ఒక సందర్భాన్ని మననం చేసుకుందాం. మరో సన్నివేశాన్ని వూహించుకుందాం.



కౌరవసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం. దుశ్శాసనుడు పాంచాలి వలువలు లాగి అవమానించే సందర్భంలో సభ యావత్తు మౌనంగా మిన్నకుండి పోతుంది. దృపదరాజ పుత్రి వేడుకోలు వినిపించుకున్న శ్రీ కృష్ణ పరమాత్మ హఠాత్తుగా ప్రత్యక్షమై ఆదుకుంటాడు.
ఇక సినిమాల్లో ఇలా హీరోలు వచ్చి ఆపదలో వున్న హీరోయిన్లను అలా ఆదుకునే సన్నివేశాలు కోకొల్లలు. వీటి ఆధారంగా ఊహించుకుంటే-
నగరంలో ఏదో ఒక కాలేజీలో ఆడపిల్లల్ని ఆకతాయి పిల్లలు వేధిస్తుంటారు. వారిలో ఒకమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు  మొబైల్ ఫోను ద్వారా  సమాచారం అందిస్తుంది.  నిమిషాల్లో పోలీసులు అక్కడ వాలిపోతారు. యువతుల్ని వేధిస్తున్న అల్లరి పిల్లలపై రబ్బరు లాఠీలు ఝలిపిస్తారు. వెడుతూ వెడుతూ 'పోలీసులున్నారు జాగ్రత్త!' అంటూ హెచ్చరిక జారీచేసి వెడతారు.
ఇలా చేస్తే  కాని నగరంలో ఆకతాయి మూకల్ని అరికట్టడం సాధ్యం కాదన్న వూహ మెదిలినట్టుంది  సాక్షాత్తు తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మస్తిష్కంలో. రాజు తలచుకుంటే కొదవేముంది. కమిటీ వేసారు. ఆ కమిటీ సభ్యులు కాలయాపన చేయకుండా  నానారకాలుగా సమాచారాన్ని సేకరించి  ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించారు. ఈ కమిటీలో నలుగురు సీనియర్ ఐ.ఏ.యస్., ముగ్గురు ఐ.పీ.యస్.  అధికారులు వున్నారు. ఈ ఏడుగురిలో  ఆరుగురు మహిళా అధికారులే కావడం ఒక విశేషం.   ఈ  నెల పదో తేదీనుంచి కమిటీ తన పని మొదలుపెట్టింది.  ఇరవయ్యో తేదీకల్లా  ముఖ్యమంత్రికి నివేదిక అందచేసింది. ఈ మధ్యలో  కమిటీ హైదరాబాదు  ఐ టీ కారిడారులో వున్న వివిధ కంప్యూటర్ కంపెనీల్లో పనిచేస్తున్న  మహిళా ఉద్యోగులను కలుసుకుంది. స్వచ్చంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంది. స్వయం సహాయక బృందాల సభ్యులతో  సమావేశాలు జరిపింది. మహిళా కళాశాలలకు వెళ్లి విద్యార్ధినుల మనోభావాలు తెలుసుకుంది. ఉద్యోగాలు గట్రా చేయకుండా ఇంటిపట్టున వుండే గృహిణులను సయితం కలుసుకుంది. మీడియా ప్రతినిధులతో, మహిళా జర్నలిష్టులతో ముచ్చటించింది. ఇక ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశాలు సరేసరి. అంతే కాకుండా గుజరాత్, కేరళ రాష్ట్రాలకు బృందాలను పంపి  ఈ విషయంలో అక్కడ మంచి ఫలితాలను ఇస్తున్న విధానాలను  అధ్యయనం చేసింది.
ఈ సమావేశాల్లో, ఈ సమాలోచనల్లో, ఈ సంప్రదింపుల్లో, ఈ అభిప్రాయ  సేకరణ క్రమంలో  బాలికలు, మహిళల భద్రతకు సంబంధించిన అనేక అంశాలు వెలుగు చూశాయి.  ఆవిషయాలను అన్నింటినీ  సాకల్యంగా పరిశీలించినమీదట,  సత్వర ఫలితాలు సాధించేందుకు  కొన్ని స్వల్పకాలిక చర్యలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫారసు చేసింది. ఈ  ఆర్ధిక సంవత్సరంలోనే కమిటీ సిఫార్సుల అమలుకు వీలైన నిధులను ఆయా ప్రభుత్వ శాఖలకు విడుదల చేయాలని కూడా  ఈ కమిటీ సూచించింది.
'హెల్ప్ లైన్' (ఆపన్న హస్తం) ఏర్పాటు చేయడం అనేది కమిటీ సిఫారసుల్లో మొట్టమొదటిది.
అలాగే, జిల్లా స్థాయిలోను, నగరపాలక  సంస్థ పరిధిలోను  ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా పనిచేసే  కేంద్రాలను నెలకొల్పాలని సూచించింది.
కమిటీ చేసిన ఇతర సిఫారసులు ఇలా వున్నాయి.
"పోలీసు శాఖలో మహిళా సిబ్బంది సంఖ్యను ఇతోధికంగా పెంచాలి. అత్యాచార సంఘటనలు గురించిన పిర్యాదులపై  సత్వరంగా విచారణ పూర్తిచేసి నేరం రుజువైన పక్షంలో ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేలాచూడడానికి జిల్లా స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. లైంగిక అత్యాచారాలకు గురైన బాధితులను బహిరంగంగా కాకుండా  వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించేందుకు వీలుగా విధానాలను నిర్బంధం చేయాలి.ఢిల్లీ పోలీసు తరహాలో మహిళా రక్షక్ లను పోలీసు కమీషనరేట్లలో, జిల్లా స్థాయి పోలీసు అధికారుల కార్యాలయాల్లో నియమించాలి. ఇంటర్ నెట్ లో అసభ్య చిత్రాలను చూపే సైట్లను పూర్తిగా నిరోధించాలి. మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల విచారణలో ఖచ్చితమైన, ప్రామాణికమైన విధానాలను రూపొందించి అవి సరిగా అమలయ్యేలా చూడాలి. కార్యాలయాలలో,  విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగినులు, చదువుకునే విద్యార్ధినుల   భద్రతకు సంబంధించిన ఎలాటి సమాచారం వచ్చినా రాకున్నా  సకాలంలో స్పందించడానికి ఆయా  ప్రాంతాలలో  పోలీసు గస్తీ  వ్యవస్థను పటిష్టం చేయాలి. మహిళా ఉద్యోగులు ప్రయాణించే టాక్సీలలో  మహిళా డ్రైవర్లు మాత్రమె ఉండేలా చూడాలి.
"ఆటో రిక్షాలు, టాక్సీల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేసి వాటి రాకపోకలపై నిరంతర నిఘా పెట్టాలి. ఆర్టీసీ బస్సులు, లోకల్ రైళ్ళ వంటి ప్రజా రవాణా వ్యవస్థలను పటిష్టం చేయాలి. వివాహాలను నిర్బంధంగా నమోదు చేసేలా చట్టాలను సవరించాలి. మద్యం వాడకం పెరగడం వల్ల మహిళలపై నేరాలు పెరిగిపోయే అవకాశాలు వుండే కోణం నుంచి కూడా ఆలోచించి  ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాలి. అసంఘటిత రంగాల్లో, ఇళ్ళల్లో పనిచేసే బాలికలు, మహిళల భద్రత పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి.  కడుపులో వున్న శిశువు ఆడపిల్ల అని తెలుసుకుని గర్భవిచ్చేధం  చేసే వికృత పోకడలను  గట్టిగా అరికట్టాలి. అవసరంలో వున్న మహిళలకు  న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించాలి. పడుపువృత్తిని అరికట్టే చర్యలకు మరింత పదును పెట్టాలి.
"గ్రామ స్థాయిలో స్త్రీ శక్తి సంఘాలను ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల స్థాయిలో మహిళా వనరుల కేంద్రాలను నెలకొల్పాలి. తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక మహిళా కమీషన్ ఏర్పాటుచేయాలి. విడిగా స్త్రీలకోసం తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పాలి."
ఈ నివేదిక చేతికి అందగానే ముఖ్యమంత్రి, కే.చంద్రశేఖర రావు సీనియర్ అధికారులతో  సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. లండన్ తరహా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి, హైదరాబాదు నగరాన్ని నేర రహిత నగరంగా చేయాలనే లక్ష్యం ప్రకటించిన ముఖ్యమంత్రి, తదనుగుణంగా చర్యలు కూడా తీసుకునే అవకాశాలు వున్నాయి. కమిటీలు ఏర్పాటుచేయడం, నివేదికలు తెప్పించుకోవడం, వాటికి తగిన ప్రచారం కల్పించడం దరిమిలా వాటి సంగతి సమయానుకూలంగా మరచిపోవడం ప్రభుత్వాల్లో పరిపాటే. కానీ ఈ విషయంలో తాను  'విభిన్నంగా వ్యవహరిస్తాను' అనే పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తె  తెలంగాణా ముఖ్యమంత్రికీ  మంచిదే. తెలంగాణా ఆడపడుచులకూ  మంచిదే.
చూడాలి ఏం చేస్తారో! ఏం జరుగుతుందో! 

NOTE: COURTESY IMAGE OWNER

26, సెప్టెంబర్ 2013, గురువారం

ఏమి సేతురా లింగా !


ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నేకోరగనేల? కోరితినిబో యాతండు రానేల?
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల?
ట్టెనుబో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్


కరుణశ్రీ పద్య రూపంలో పలికించిన ` కుంతీ విలాపం' మాదిరిగా ఉంది నేడు రాష్ట్రంలో వివిధ పార్టీల పరిస్థితి. 
గెలిచి తీరతాం! అన్న ధీమా కాస్తా
గెలవకపోతామా! అన్న ఆశగా మారి 
గెలుస్తామా! అన్న సంశయ రూపం ధరిస్తే - 
మిగిలేది కుంతీ విలాపమే!

కోరిన వరాలిచ్చు కొండంత దేవుళ్ళలాంటి వాళ్ళు  కాదు ఓటర్లు.  వాళ్ళ నాడి కనిపెట్టడం రాజకీయ పార్టీలను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. వాళ్ళ మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగని గాలి వాటం కాదు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టడంలో వారికి వారే సాటి. ఈ పాటి వాస్తవం ఎరగబట్టే పార్టీ నేతల్లో ఇంత గుబులు.


పైకి ఎంత ధీమాగా ఉన్నా -  బింకంగా కనబడ్డా - 
లోలోపల ఏదో తెలియని గుబులు వారి మనసులను ఏదో మూల తొలుస్తూనే వుండాలి! 
ఇది ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న  ఎంత స్వాభావికమైనదో -
అలా జరిగి వుంటే - ఇలా జరిగేది కాదేమో అన్న భావన కూడా అంత స్వాభావికమైనదే! 
ఆ నాడు సర్కారు ఎక్స్ ప్రెస్ కాస్త  లేటుగా వచ్చి – నా  పెళ్ళి చూపులకు మీరు మరికాస్త ఆలస్యంగా వచ్చివుంటే - మా నాన్న ఎంచక్కా నాకు ఆ భీమవరం సంబంధమే ఖాయం చేసివుండేవాడు' అన్నదట ఓ ఇల్లాలు శోభనం రోజున కట్టుకున్న మొగుడితో. 
అలాగే - భవనం వెంట్రామ్‌ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, తన స్నేహితుడు, సహాధ్యాయి అయిన   ఎన్‌. టీ. రామారావు గారిని  రాజభవన్‌కు ఆహ్వానించకపోయి వున్నా, లేదా వెంకట్రామ్‌ గారి సలహా మేరకు రామారావుగారికి  కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వున్నా  - అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదే కాదన్నాడొక రాజకీయ పండితుడు. 
మరో విశ్లేషకుడు మరో అడుగుముందుకువేసి - డిప్యూటీ స్పీకర్‌కు బదులుగా - చంద్రశేఖరరావుకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భవించి  వుండేదే కాదు పొమ్మన్నాడు.
రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత జగన్ మోహన రెడ్డి కోరుకున్న ముఖ్యమంత్రి పీఠం కాకపోయినా ఏదో ఒక ఈశాన్య రాష్ట్రానికి పార్టీ ఇంచార్జ్ గా వేసివున్నా  రాష్ట్రంలో రాజకీయ పరిస్తితి మరో రకంగా వుండేదని ఇంకో పరిశీలకుడు అభిప్రాయపడ్డాడు.
కుంతి పడ్డ మధనం కూడా ఇలాటిదే.
అందుకే మన జనం వేదాంతాన్ని నమ్ముకున్నది 
ఆదీ అంతం అంటూ లేని ఆ వేదాంతం చెప్పేదేమిటంటే -  
‘కానున్నది కాకమానదు. కానిది కానే కాదు’
రోట్లో తలదూర్చిన తరువాత రోకటి పోటుకు వెరవకూడదు.

ఈ సూత్రం పార్టీలకే కాదు ప్రజలకు కూడా వర్తిస్తుంది.

(26-09-2013)

4, ఆగస్టు 2013, ఆదివారం

కేసీఆర్ చెప్పిన భద్రాచలం కధ


కేసీఆర్ ని దగ్గరగా చూసి తొమ్మిదేళ్ళు అయిందేమో. 2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు సరిగా గుర్తులేదు కాని కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గురించి చెప్పడానికి అనుకుంటా బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసిన గుర్తు. మధ్యలో కొంత ఎడం వచ్చింది కాని నేను మాస్కో వెళ్ళాక మునుపు కేసీఆర్ ఎన్టీయార్ క్యాబినెట్ లో రవాణా శాఖ  మంత్రిగా వున్నప్పుడు తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి  పేషీ వుండే ‘సమత’ బ్లాక్ పక్కనే మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్  కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు.  ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఏమీ వున్నట్టు లేదు.  సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసివచ్చిన రాజకీయ ప్రముఖులు విలేకరులతో నిలబడి మాట్లాడే మీడియా పాయింటు ఆ ప్రదేశంలో వుంది.
ఈరోజు మధ్యాన్నం వీ సిక్స్ టీవీ నుంచి ఫోను వచ్చింది. ఏదయినా అంశం మీద ‘బైట్’ కోసమేమో అనుకున్నా. తీరా చూస్తే క్రాంతి గారు. ఇలాటి వాటికి ఆయన ఫోను చేయాల్సిన అవసరం లేదు. వేరేవాళ్ళు ఇందుకోసం వున్నారు.
క్రాంతి చెప్పారు. ‘కేసీఆర్ కాసేపట్లో తాజ్ డెక్కన్ హోటల్ కు వస్తారు. మీట్ ది ప్రెస్ ప్రోగ్రాం. తప్పకుండా రండి. అదయిన తరువాత కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి’
రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మీట్ ది ప్రెస్ కాబట్టి బయలుదేరి వెళ్లాను
.

(కేసీఆర్ మీట్ ది ప్రెస్ లో జ్వాలా, నేనూ, హెచ్.ఎం.టీ.వీ. శ్రీ ధర్ బాబు - ఫోటో భరత్ భూషణ్ సౌజన్యం)    

హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ ఆర్ ఎస్ నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతొ కూడా కరచాలనం చేసారు. ఓ క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను.
సరే! ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. సభికులు అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశం లా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని ‘మాటల మాంత్రికుడు’ అంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్నదీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు – ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో చెప్పినవే అయినా – వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు ‘ప్రత్యక్షప్రసారం’లో చూస్తున్న మిత్రుడు ఒకరు ఎస్ ఎం ఎస్ పంపారు. ఆయన ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెప్పినంతగా యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ గొడవలే ఉండేవి కావన్నది దాని తాత్పర్యం. అన్నీ ఇక్కడ ప్రస్తుతం కాని భద్రాచలం సంగతేమిటి అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని వివరించారు. వెనుక అది తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రటిష్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు  ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం – ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.
సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఎవేవో పదార్ధాలు ఆయనకు వడ్డించబోతే, వద్దు ఇంత అన్నం, పప్పూ పట్టుకు రమ్మన్నారు. సింపుల్ భోజనం. ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు.

మొత్తానికి చాలా రోజుల తరువాత జీవితం విభిన్నంగా గడిచినట్టనిపించింది. పోనీలే మంచిదే అనుకున్నాను. (04-0802013)                                     

9, జూన్ 2010, బుధవారం

By-polls; TRS demand undemocratic! -Bhandaru Srinivasrao (I.I.S.)

By-polls; TRS demand undemocratic! -Bhandaru Srinivasrao (I.I.S.)




In a democratic society, any citizen can take part in any election any where.  That’s the right enshrined in our constitution.  Then, how come the separatist Telangana Rashtra Samiti and other students’ organizations like the Osmania University JAC and Kakatiya University JAC dare held out threats against those aspiring candidates who wanted to contest the bypolls which necessitated due to the resignation of 12 legislators protesting against the Centre’s decision to constitute Justice BN Srikrishna panel?
Such a demand is not only undemocratic and unlawful act and the government should not hesitate to book cases against those who indulge in holding out such threats. Instead, those who are demanding for bifurcation of the state can campaign in a peaceful manner to convince the electorate of the region to vote for those who toe the separate statehood line.  None can object to such a move. Yet, their campaign should not be provocative and attract legal action as such undemocratic moves only result in disturbing the peace in society.
With the announcement of the possible elections before August by none other than one of the Election Commissioners, the ruling Congress and its main rival, Telugu Desam Party, have already begun the process for candidates hunt.  Scores of aspiring candidates already forming queues before these two major party headquarters and engaged in hectic lobbying for ticket!  Contrary to this, the TRS and those who are fighting for separate statehood are only trying to scare the contestants.  They wanted all those who resigned en masse (10 of TRS and one each of TDP and BJP) on a directive from the T-JAC Chief Prof Kodandaram, only they should return to state Assembly uncontested.  Can such a demand be allowed in a democratic society like ours?

Prof Kodandaram is a respected teacher.  I feel, he is well versed with country’s democratic functioning and also of the contents of the Constitution.  He should discourage those militant elements who wanted to make such undemocratic demand and wants to pursue it further.  Otherwise, one bound to suspect that the TRS has no faith in Indian democracy and may attract the treatment that being meted out to other unlawful organizations and political parties.  Violence has no place in the society.  Every peace loving citizen should adhere to this.  As a citizen of this great nation, one enjoys the freedom to travel, live, breathe and enjoy life in which ever part of the country he chooses to.  None has the right to restrict movements of an individual based on regional chauvinism. 

What the TRS and those organizations which really wanted to accomplish their dream of separate statehood for Telangana should seriously concentrate and ensure return of all those who resigned for the cause in the forthcoming by-polls.  As far as the regional ‘sentiment’ is concerned, one has little faith in that argument.  This was based on the past experiences of TRS in elections.  Doubting Thomases  on Telangana ask; “if the sentiment is so strong, then why electorate are not supporting TRS at hustings?.  The TRS had only seen only erosion (numerically) in all elections it contested since 2004. 
Onus is on TRS now to change this belief among its baiters. It has a point or two to prove by retaining all the 10 seats  (remaining two belong to TDP and BJP) it had won in 2009.  It should put all its energies to impress upon the electorate in these constituencies to strengthen their hands to take the fight for separate statehood to its logical conclusion. If it retains all the 10 seats and also ensures victory for TDP and BJP candidates who also resigned along with other TRS MLAs and establish that the sentiment for separate statehood is strong, it shall send the right kind of message even to Srikrishna Panel make note of it and incorporate this fact while submission of its final report sometime during the year end. 
Time is ripe for polarization of electorate for the cause.  The ball is now back in TRS court and how it handles and sees all its nominees retain their seats is the look out of its most vocal leader K Chandrasekhara Rao.


 It’s his responsibility to best utilize this golden opportunity to disprove the argument of ‘Telangana is no more a myth, but set to become reality, sooner than later, if he ensures all electorate fall in line and help retain his nominees.”  
One only wish KCR and Prof Kodandaram control their tempers and show their maturity in understanding the democratic process and disprove their critics of what they are capable of.  Good luck to them! (( 09-06-2010 )

NOTE: All the images in this blog are copy righted to their respective owners.



25, మార్చి 2010, గురువారం

KCR doing ‘good’ than ‘harm’ to T-cause - Bhandaru srinivasrao (I.I.S.)


KCR doing ‘good’ than ‘harm’ to T-cause - Bhandaru srinivasrao (I.I.S.)



Of late, the founder president K Chandrasekhara Rao of Telangana Rashtra Samiti, formed to fight for separate statehood, appears to have indulging in unethical practices politicizing every government department and official, purely based on regional chauvinism.  To me, it appears a greatest threat to very foundations of these institutions, which were established to ensure some semblance of discipline in a civilized society.
Yes, I am very much perturbed, rather concerned, over his accusations against the Anti-Corruption Bureau, whose job is to check corruption among government servants.  If such an institution is dragged into meet one’s narrow political ends, I am scared, it bound to do more harm than good to the society as a whole.  He alleges the ACB, of late, targeting only Telangana officials framing false charges to weaken the separate statehood movement, for their active involvement.
In this context, one wishes to ask Rao whether a government servant is entitled to take active part in body politics.  Does Service Rules of government services entertain?  Should such relaxation is entertained will not there be chaos in administration?  How can a government servant hold such a grouse, especially on such contentious issues like separate statehood, while holding office and drawing salary?
Even during the independent struggle, Mahatma gave a call to all those who wanted to join the freedom struggle to quit their jobs employed by British rulers. If KCR too wanted to give such a call, he can do so.  And if those government employees belonging to the region wanted to paralyze the state machinery too had the right to choose that path.  None can object and in turn, such a major step may as well strengthen the demand for separate statehood.
Instead, while enjoying the fruits of the government, if the organizations formed on regional names just cannot take active part in a political movement like Telangana.  No such freedom is even enshrined to Indian citizen in our Constitution.  And, that’s what the ACB choose to adhere to the Government Servants Rule Book and trying to discipline those erring officials, who choose to bamboozle government funds.

  The ACB Chief, Mr Aravinda Rao, was quick to respond to the allegations of KCR and clear the air.
I, for one, wonder will such acts help strengthen the movement anyway? Will such act do more harm than good to such good cause? 
Ironically, neither he nor the Telangana Joint Action Committee could bring in unanimity among the people’s representatives of the region.  Though, they came together cutting across their party lines, they preferred to part ways when it came to resignations to their public offices like MP, MLAs and MLCs.  If unanimity cannot be achieved among the people’s representatives, how can either KCR or the T-JAC impose such diktat on poor employees who joined government services with great difficulties to eke out their livelihood?Hence, it would be wise on part of KCR and his T-JAC members to restrain from indulging in such cheap gimmicks dragging in government institutions like ACB or Police or Judiciary or any other, to meet their narrow political ends.(25-03-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.