15, సెప్టెంబర్ 2026, మంగళవారం

రాజకీయాల్లో తిట్లు, శాపనార్ధాలు – భండారు శ్రీనివాసరావు

 

ముక్కోటి దేవతలు పరమేష్టి వద్దకు కట్టగట్టుకుని వెళ్లి మొరబెట్టుకున్నారు.

“రాజకీయాల్లో హుందాతనం అనేది కలికానికి కూడా కానరావడం లేదు. అతల, సుతల, పాతాల లోకాల దిగువకు జారిపోయింది. ఇక దాన్ని కనుగొనడం బ్రహ్మతరం కాదు”

“నాకు చేతకాదని తెలిసీ నా వద్దకు ఎందుకు వచ్చారు?” అని ఘీంకరించబోయి, ప్రస్తుతాంశం హుందాతనం అన్నది గుర్తుకు వచ్చి తమాయించుకుని వినసాగాడు విధాత.

“మీరు సృష్టించిన మానవులే అలా హుందాతనం కోల్పోయి ప్రవర్తిస్తుంటే ఆ నామర్దా తమరికే కదా” అని అందుకున్నారు సురులు.

“తక్షణ కర్తవ్యమ్” అడిగాడు వాణీపతి.

“తిరిగి మరికొంత హుందాతనాన్ని సృష్టించి, అలనాడువిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని మాకు పంపిణీ చేసినట్టు దాన్ని రాజకీయ రంగంలోని వారికి ప్రసాదించడమే” అన్నారు దేవతలు ఒక్క మాటగా.

“అది సాధ్యం కాని పని. హుందాతనం అనేది అంగడి సరుకు కాదు, అయిపోయినప్పుడల్లా కొనుగోలు చేయడానికి. వారు మానవులు. మీకంటే తెలివిపరులు. వారి సంగతి వాళ్ళు చూసుకుంటారు. మీకు రంభాదికాంతలు అందించే అమర సుఖాలను వాళ్ళు హుందాతనాన్ని కోల్పోవడం ద్వారా వెతుక్కుంటున్నారు. వాళ్ళ పాట్లు వాళ్ళని పడనివ్వండి. ఎటూ వాళ్ళు పోయేది రౌరవాది నరకాలకే కనుక, మీకొచ్చిన నష్టం ఏమీ లేదు.”

బ్రహ్మదేవుడితో ఇక పనికాదనుకుని వాళ్ళు వీణావాణి వైపు తిరిగారు. జరుగుతున్నదంతా క్రీగంట గమనిస్తున్న హాటకగర్భురాణి వారితో ఇలా అన్నది.

“భయం లేదు, వెళ్లి రండి. అందుకే నేను అనేక భాషలు సృష్టించాను. ఒక భాషలో కటువుగా, కర్ణకఠోరంగా వినిపించే పదాలు, మరో భాషలో కర్ణపేయంగా వుంటాయి. సొంత భాషలో మాదిరిగా పరాయి భాషా పదాలు సులభంగా అర్ధం కావు కనుక, ఆ పదాలలోని కరకుతనంతో కూడిన బూతును వెంటనే ఆకళింపు చేసుకోవడం కష్టం. అదే మాతృభాష అయితే భావం ఇట్టే బోధపడుతుంది. ప్రస్తుతం భూలోకంలో జరుగుతోంది అదే” అంటూ వారి చేతిలో ఓ కాగితం పెట్టింది.

అది ఆదివారం నాటి ఒక ఆంగ్ల పత్రిక. అందులో కొన్ని తెలుగు పదాలు, ఇంగ్లీష్ లో వాటికి సమానార్ధకాలు వున్నాయి.

“సన్నాసి” (Block Head, Dunce)

“పిచ్చవాగుడు” ( Stupid Rants)

“చెత్త నాకొడకా” ( Good for nothing yokel)

“దుర్మార్గుడు” ( Nefarious, Mendacious person)

"కాబట్టి, కావున తిట్లు శాపనార్ధాలు పెట్టేటప్పుడు తెలుగు కంటే, ఇంగ్లీషే మేలు అని వాటిని విన్నవాళ్ళు అనుకుంటారు. తెలుగులో తిడితే తిట్టినట్టు, అదే తిట్టు ఇంగ్లీష్ లో తిడితే తిట్టనట్టు అనిపిస్తుందని చెప్పి సాగనంపింది సరస్వతీ దేవి.

(నోట్ : ఆ పత్రిక ఆ వార్తను ఇలా మొదలు పెట్టింది. దాన్నే దేవతలు కాపీ కొట్టి కొద్దిగా మార్చి చతుర్ముఖ బ్రహ్మతో చెప్పినట్టున్నారు)

“No low in Indian politics remains the lowest for long)

12, సెప్టెంబర్ 2026, శనివారం

Really, SIR? – Bhandaru Srinivasa Rao

“Fearing that what we have, we may lose,

And trembling at the thought that what we are hoping will never materialize,

Fighting and quarrelling,

We climb the hill,

And seek your support.”

 

This, someone aptly summed up as the condition of today’s ordinary voter who possesses all the necessary qualifications to exercise to vote.

 

Here, by “ordinary voter,” I do not mean me. I do not mean people who are proficient in computers. I do not mean the educated, nor do I mean the uneducated.

What I mean to say is these are the people who have no basic knowledge of the constituency, polling station, or booth number where they cast their vote in 2002, twenty-four years ago. Many have even forgotten that they voted there. They do not know how to find out these details. Yet, ever since they reached voting age, they have treated voting as their duty. They are not people who vote for money or for liquor and biryani. They regard voting as their civic duty and have exercised this right, granted to them by the Constitution, for many years.

Over the past twenty-four years, the geographical landscape has changed completely. Technologically, the country has progressed beyond imagination. States have been divided. Constituencies have changed. The names of polling stations and the numbers of polling booths have changed. Even their names also changed in some cases after marriage.  Many people may not even remember the number of the polling booth where they voted in the elections held just two years ago. If that is the case, how many can be expected to remember what happened twenty- four years ago?

 

Among the total electorate, the voters of various political parties account for twenty to forty percent. Another ten percent are supporters or admirers. Another ten percent are indifferent people who do not bother about voting at all. Then there is another thirty percent who have no political colour, taste, or scent. For them, the right to vote carries immense emotional value. They feel that without it, they are as good as dead, as though they do not exist in the population records, or as though they have lost their citizenship.

 

These are the very people described earlier:

“Fearing that what we have, we may lose,

And trembling at the thought that what we are hoping will never materialize,

Fighting and quarrelling,

We climb the hill,

And seek your support.”

 

Do you understand now, my lords?

Whatever reform you introduce, you must design it after considering it from the perspective of ordinary people.

Only then will such reforms receive broad public acceptance.

 

Instead of removing the stones from the rice, the process now seems to involve picking out the rice itself.

 

This is what ordinary people are calling “SIR”, Sir.

Whether you agree or not, this is the truth.

12-09-2026

 

 

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

తలకెక్కని చరిత్ర పాఠాలు – భండారు శ్రీనివాసరావు

 

నేను పుట్టిన 26 రోజులకు, అంటే 1945 సెప్టెంబరు రెండో తేదీన రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. 1939 సెప్టెంబరు ఒకటిన మొదలైన ఈ మహా సంగ్రామంలో ఒక వైపున గ్రేట్ బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, చైనాలు, మరో వైపు జర్మనీ, ఇటలీ, జపాన్ తమ సర్వశక్తి యుక్తులు ఒడ్డి పోరాడాయి. సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్లమంది ప్రాణాలు బలి తీసుకున్న ఆఖరి ప్రపంచ యుద్ధం ఇదే.
అప్పటి నుంచీ ఇప్పటి వరకూ అనేక చిన్నా పెద్దా యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి, కానీ మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసే పరిణామాలు చోటుచేసుకోలేదు. అలా అని ఇవి సృష్టించిన మారణ హోమం తక్కువేమీ కాదు.
‘అప్పుడే పుట్టిన బిడ్డవు, ఈ సంగతులన్నీ నీకెలా తెలుసు’ అంటే, తాము పుట్టకముందు చాలా కాలం క్రితం జరిగిన వాటికి తమదైన భాష్యం తాము కళ్ళతో చూసినట్టు కొందరు చెబుతున్నట్టే ఇదీ అనుకోండి. కనీసం నేను అప్పటికి పుట్టాను.
ఈరోజు సెప్టెంబరు 11. సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఇదే రోజున అగ్రరాజ్యం అమెరికాకు కళ్ళు తెరిపిళ్ళు పడే దుర్ఘటన జరిగింది.
ఆ రోజు సాయంత్రం రేడియో స్టేషన్ లో వున్నాము. 6.15 కు మొదలయ్యే ప్రాంతీయ వార్తలు ముగిశాయి. మేము తట్టాబుట్టా సర్దుకుని ప్రెస్ క్లబ్ కు బయలుదేరుదాము అనుకునే సమయంలో, ఆస్ట్రేలియా నుంచి ఒక తెలిసిన మనిషి ఫోన్ చేసి ‘మీకు తెలుసా వైట్ హౌస్ మీద ఉగ్రదాడి జరిగిందట’ అన్నాడు.
నేను టెలిప్రింటర్ రూమ్ లోకి పరిగెత్తి PTI, UNI కాపీలు చూశాను. అలాంటి వార్త ఏమీ కనిపించలేదు. మళ్ళీ ఆ పెద్ద మనిషే ఫోన్ చేసి, ‘వైట్ హౌస్ కాదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని విమానం డీకొట్టింది, ఆ దృశ్యాలు టీవీలో చూపిస్తున్నారు’ అని పెట్టేశాడు. తరువాత నెమ్మది నెమ్మదిగా విషయాలు తెలుస్తూ వచ్చాయి. తెల్లారి అన్ని పత్రికల్లో అవే ఫోటోలు, అవే వార్తలు. ఇక టీవీలో జంట హర్మ్యాలు కూలిపోతున్న దృశ్యాలు.
ప్రపంచంలో తన పెద్దన్న పాత్రకు, పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి, తననే కబళించడానికి వచ్చిన తరువాత కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది.
సెప్టెంబర్ దాడి గురించి మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.
2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని, అదే విమానంతో డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.
అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలో, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, బహుశా 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు.
అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.
కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.
అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.
1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు.
చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.
దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కి చెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఇన్నేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.
ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.
చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.



(11-09-2026)

I Am a Big Zero: Bhandaru Srinivasa Rao

 


SIR

 

30-06-2026, Midday

 

“How Do I Get to Your House?”

The call I had been waiting for since nine in the morning yesterday finally came at noon.

 

“You said you were near the NTR statue, right? Look in the direction the NTR statue is pointing. You will see the RBI quarters. It will take four minutes on foot, and less than a minute on a motorcycle. There is a Hanuman temple next to our house. That is the landmark.”

 

Even after I gave him such detailed directions, he arrived half an hour later, carrying a bag in each hand.

 

He had come in the scorching  heat. When I placed a can of Coke in front of him and asked him to have a cold drink, he politely declined, saying he had a sore throat.

 

As soon as I gave him my EPIC (Electors Photo Identity Card) number, he switched on his mobile and was about to check it when a call came in. As soon as he answered that call, another one came. For the next fifteen minutes, he was busy answering a stream of calls.

 

“You saw that, right? All these calls are from voters like you. I have been going from one doorstep to another all morning. I left early, and I haven't even covered three houses yet.”

As he said this, his phone rang again.

 

“I am somewhere nearby,” he said, giving the name of our apartment complex. “It is my superior. He is checking whether I am actually working.”

 

Before my own voting status could even be sorted out, his superior arrived at our house with another person. The person accompanying him took photographs of all of us with a camera. He probably uploaded them too, as proof that they are on their job.

The superior handed the junior a list and sternly said, “This many households are still pending. When are you going to finish all of them?”

Meanwhile, the superior received a call from his superior, who told him to come immediately for a review meeting.

 

As soon as they left, the junior who had come first also placed two papers in my hands. While packing his bags, he said, “Fill these out and keep them ready. I will come back after three days and collect them.”

 

When I asked, “What about the photograph?” he hurriedly picked up his bags and said, “The black-and-white photograph is fine, isn't it? You need a new one only if the photograph isn't clear.”

 When I asked, “What about my daughter-in-law?” he replied, “Next time,” and hurried out.

 

He works as a supervisor overseeing municipal sanitation staff. Yet, thanks to this unexpected additional duty for SIR (Special Intensive Revision of Voters), he has to go door to door from Ameerpet to Krishna Nagar.

 

They had been there for more than forty minutes. Answering phone calls alone seemed to keep them occupied. At this rate, who knows when this whole exercise will ever be completed! The cups of green tea that I had asked our watchman to bring and prepare for them, and they are lying on the table, in a completely cold state.

 

After they left, I calmly took out the papers and looked at them.

 

Both belonged to me. At the top, they carried my black-and-white photograph, the same one on my voter card, along with some details, my address, the name of my constituency, my part number, and so on.

 

I thought it would all be over after one round, but apparently there is another round.

 

Still, watching the difficulties they were going through, I felt sorry for them. If their hard work produces the results it deserves, what more could one ask for? Instead of complaining that this was not their job, they were doing the work. That deserves appreciation.

 

I had thought I would sit and talk with them for a while, draw out some details, and write something that might prove useful to others. I even took photographs with the people who came to my house, hoping to write a few worthwhile lines. But I myself do not know whether my own work has actually been completed.

 

Now, however, I feel it would be better to keep their names and photographs confidential.

 

He said he would come back after three days to collect the completed form. Looking at the workload they are carrying, I wonder how long these papers will have to take rest in our house.

 

Postscript:

I thought they would remain here for at least three nights. In fact, the bundle of papers stayed in our house for many  more days, even after the draft electoral roll was published, like the weapons of the Pandavas hidden in a jammi tree.

 

While they remained there, one day the junior officer came to our house and said, “You have to submit another form. For that, you have to come to such-and-such place at such-and-such time.”

Seeing my exhausted condition and noticing that I was eighty plus  years old, he took pity on me.

He spoke to his superior, took my signature on a form, photographed himself receiving it from me, and left happily.

 

So, it seems this serial is still continuing. But I did understand one thing, at least vaguely. Ever since I became eligible to vote, I have voted in every election up to the last one, except for the five years I spent in Moscow. I may not have that opportunity in the elections to come. I may not get the great opportunity to take a selfie with the black mark the polling officer puts on my fingernail and post it on Facebook. Looking at the slow pace of this SIR process, it seems increasingly likely that my prediction may come true.




(To be continued)

10, సెప్టెంబర్ 2026, గురువారం

విశ్వనాధ జయంతి

విశ్వనాధవారి పాండిత్య  వైభవం  - భండారు శ్రీనివాసరావు 

(సెప్టెంబరు 10,  విశ్వనాధవారి  జయంతి)

తెలుగు సాహిత్యాన్ని తనదైన రీతిలో ఓ మలుపు తిప్పిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన  రామాయణ కల్పవృక్షం అనే గ్రంధం అనేక విశిష్టతల సమాహారం. రాసింది వాల్మీకి రామాయణం ఆధారంగానే అయినా, విశ్వనాధవారు అనేక సందర్భాలలో తనదయిన కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించి చూపారు. ఇందుకు ఉదాహరణ రామాయణ కల్పవృక్షంలోని ‘అహల్యా శాప విమోచన ఘట్టం.

సాధారణంగా రామాయణాలు చదివేవారికి భర్త గౌతముడి శాపంతో అహల్య శిలగా మారిపోవడం, చాలా కాలం గడిచిన తరువాత రామపాద స్పర్శతో శాపము తీరి తిరిగి అహల్య రూపం ధరించడం తెలిసిన విషయమే. ఈ దృశ్యానికి  విశ్వనాధవారు తన కవి దృష్టితో ఒక చక్కని రూపం కల్పించారు.

భర్త శాపంతో ధూళి దూసరితమైన  అదృశ్య రూపంలో అహల్య రాముని రాకకోసం ఎదురు చూస్తుంటుంది. 

“వాయు భక్షా! నిరాహారా! తప్యంతీ భస్మశాయినీ!” (బాల కాండ, 48 సర్గ, 30,31 శ్లోకాలు, శ్రీభాష్యం అప్పలాచార్యులు, శ్రీ మద్రామాయణము, తత్వ దీపిక) అంటూ గౌతముడు, ‘ఈ  ఆశ్రమంలోనే  వుండిపోయి, నిన్ను ఎవ్వరు చూడకుండా, నీవు ఎవ్వరిని చూడకుండా, రామపాద స్పర్శ తగిలే వరకు కంటికి కనబడని ధూళి రూపంలో  తపస్సు చేసుకోమని’ అహల్యకు  ఆనతి ఇచ్చి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అహల్యను శిలగా మారిపొమ్మని శాపం ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు అనేది కూడా అప్పలాచార్యుల వారి భాష్యం.

రామాయణం బాలకాండలో యాగరక్షణ కోసం తన వెంట తెచ్చుకున్న దశరధ తనయులు రామలక్ష్మణులతో, వచ్చిన కార్యం జయప్రదంగా పూర్తిచేసుకుని, ఆ అన్నదమ్ములను వెంటనిడుకుని విశ్వామిత్ర మహర్షి మిధిలానగరం దిశగా వెడుతూ, మార్గమధ్యంలో గౌతమముని ఆశ్రమం పరిసరాలకు చేరుకుంటాడు.

గౌతముడు హిమాలయాలకు వెళ్ళిపోవడం, అహల్య భర్తశాపానికి గురవడం వంటి కారణాలతో ఆ ఆశ్రమం ఎండిపోయిన తరుల్లతలతో, మోడువారిన వృక్షాలతో కళాకాంతులు కోల్పోయివుంటుంది. ఈ నేపధ్యాన్ని విశ్వనాధవారు ఒక సీస పద్యాన్ని తన చాతుర్యానికి ఆలంబనగా తీసుకుని కావ్యరచన చేశారు.

ప్రకృతిని స్త్రీతో పోల్చడం ఎరిగిన సంగతే. దాన్నే ఆయన ఇక్కడ చక్కగా వాడుకున్నట్టు అనిపిస్తుంది.
రాముడు గౌతముడి ఆశ్రమం సమీపిస్తుండగానే, ఆయన మేను తాకి ప్రసరించిన మలయమారుతం కారణంగా ధూళి రూపంలో వున్న అహల్యకు ముందు ఘ్రాణే౦ద్రియం (నాసిక) మేల్కొంటుంది. అదే సమయంలో గౌతమ ఆశ్రమంలో వడిలిపోయివున్న పుష్పలతలు వికసించి తమ స్వభావసిద్ధమైన  సువాసనలను విరజిమ్మడం మొదలుపెడతాయి. ఆ తరువాత తనను సమీపిస్తున్న శ్రీరాముడి అడుగుల చప్పుడుతో అహల్య శరీరంలోని శ్రవణే౦ద్రియాలు (చెవులు) మేల్కొంటాయి.  అందుకు మరో సూచనగా అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న గౌతమాశ్రమం నుంచి  పక్షుల కిలకిలారావాలు వినవస్తాయి. రాముడు మరికొంచెం దాపులోకి రాగానే అహల్య శరీరంలో చక్షువులు (నేత్రాలు) మేల్కొని ఆమె కళ్ళకు శ్రీరాముడి ఆకృతి కనబడుతుంది. అ పిదప రాముడి  పవిత్రపాదం సోకి ఆమెలోని స్పర్శే౦ద్రియం మేల్కొనగానే, అహల్యకు శాపవిమోచనం కలిగి పూర్వ రూపం వస్తుంది.
అదే సమయానికి హిమాలయాల నుంచి గౌతముడు అక్కడికి చేరుకుంటాడు. ఈ ఘట్టం పూర్తి కాగానే అహల్యా గౌతముల పునస్సమాగమం జరుగుతుంది. తదుపరి మిధిలలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి  ఇదో సూచనగా  భావించవచ్చు.

విశ్వనాధవారు ఇంద్రియాలు మేల్కొనే వరుసను వర్ణించిన రీతికి మరో అన్వయం కూడా చెబుతారు.
మనిషి సుషుప్తావస్థ నుంచి జాగృతావస్థకు వచ్చే క్రమంలో కూడా  శరీరంలోని ఒక్కొక్క ఇంద్రియం క్రమక్రమంగా మేల్కొంటుందని అంటారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కాని  విశ్వనాధవారు మాత్రం అహల్యా శాప విమోచన ఘట్టానికి ఒక కొత్త రూపం ఇవ్వడంలో కృతకృత్యులు అయ్యారు.

పిలవకుండానే పలికే డాక్టరు లేకుండా పోయాడు : భండారు శ్రీనివాసరావు

 

ఆగస్టు 17 న చక్రం అడ్డంవేసి బతికింది ఈరోజు పొద్దున్నే ఈ విషాద వార్త వినడం కోసమేనేమో!
'డాక్టర్ మనోహర్ గారు మీ మేనల్లుడా? ఆయన సాక్షాత్తు దేవుడండీ ' అని తెలిసిన వాళ్ళు అంటుంటే వొళ్ళు పులకరించేది. నాకంటే ఒకటి రెండేళ్లు వయసులో చిన్న. అయినా ' ఏరా మామా! ఎలా వున్నావ్ ' అని ఫోన్ చేసి పలకరించేవాడు.
లండన్ లో చదువుకుని హైదరాబాద్ లో డాక్టర్ ప్రాక్టీసు. అదీ పిల్లల డాక్టరుగా.
విదేశంలో వున్నప్పుడు అలవాటయిన స్మోకింగ్ ని అరక్షణంలో వదిలేసాడు, చంటి పాప తల్లి ఒకరు మొహం తిప్పుకోవడం గమనించి.
మా కుటుంబంలోనే కాదు, తెలిసిన వాళ్ళ కుటుంబాల్లో ఎవరికి ఏ సుస్తీ చేసినా, ముందు మనోహర్ ని సంప్రదించేవారు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా, విసుక్కోకుండా వాళ్ళు చెప్పేది వినేవాడు. అవసరం అనుకుంటే బయలుదేరి వెళ్ళేవాడు.
అలాంటి మనోహర్ ఇకలేడు.
పిలవకుండానే పలికే డాక్టర్ ఇక పిలిచినా రాడు.
ఇలాంటి వారికి పుణ్య లోకాలు సిద్ధించాలని ప్రత్యేకంగా ప్రార్ధనలు అక్కర్లేదు. అవే వీరికోసం ఎదురు చూస్తుంటాయి.


https://www.facebook.com/share/p/18ZRWSSv8Q/


7-9-2026

5, సెప్టెంబర్ 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో: (357) : భండారు శ్రీనివాసరావు

 

నాలుగేళ్ల నాటి సంకల్పం
కిందటి నెల ఆగస్టు పదిహేడున మొదటి గంట మోగింది.
నేను కూడా గమనించలేదు. ఏడేళ్ల క్రితం ఆగస్టు మూడో వారంలోనే మా ఆవిడ నిర్మల, నా వడిలోనే, నా కళ్ళ ఎదుటే కన్ను మూసింది.
మళ్ళీ అదే ఆగస్టులో అదే రోజుల్లో నేను బాత్ రూమ్ లో జారిపడ్డాను. కోడలు నిషా ఇంట్లో వుండడం వల్ల బతికి బయట పడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే పదిహేడు రోజులపాటు కంప్యూటర్ ముందు కూర్చోలేదు. కొత్తగా నాలుగు అక్షరాలు కూడా రాయలేదు.
గతంలో ఎన్నోసార్లు రాసినట్టు, ఆగస్టు అంటే ఓ నిర్లిప్తత. ఓ నిస్తేజం. తలుచుకున్నా, తలచుకోకపోయినా మనసును క్లేశపరిచే అనేక జ్ఞాపకాలు. అన్నింటికంటే నేను ఎక్కువ బాధ పడింది, ఆమె చనిపోయిన తేదీని ఎలా మరచిపోయాను అనేది.
బాత్ రూమ్ ఘటన కాకతాళీయం అయినా, నాకెందుకో పై వాడు మొదటి గంట కొట్టాడు అనిపించింది. సరే! జరగాల్సిన కార్యక్రమం, జరగాల్సిన రీతిలో కాకపోయినా తరువాత, తెలుగు తిథుల ప్రకారం సరైన రోజునే జరిపి మమ అనిపించాను. మనసుకు సర్ది చెప్పుకోవడానికి ఆ ఘటన ఒక గుడ్డి కారణం.
దరిమిలా శరీరం బాగానే వున్నా, మనసు మాత్రం ఘనీభవించింది. చాలా మంది మితృలు నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది ఫోన్లు చేశారు. మెసేజ్ లు పెట్టారు. నేను బాగానే వున్నాను అని నలుగురికీ తెలియడానికి అవే రోజుల్లో హైదరాబాదు ప్రెస్ క్లబ్ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు కొద్ది నిమిషాల పాటే అయినా హాజరై, మితృలకు నా మొహం చూపించాను. అయినా చాలా మందికి నా ఆరోగ్యం పట్ల అనుమానాలు అలాగే వున్నాయని నా అనుమానం.
ఇక చీకట్లో చిరుదీపంలా నాలుగేళ్ల నాటి ఓ సంకల్పం ఇదే కాలంలో నెరవేరింది. కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. కానీ చెప్పక తప్పడం లేదు.
మా స్వగ్రామం కంభంపాడులో మండే ఎండల్లో, కాలిపోతున్న రేకుల షెడ్డులో, కనీస దూరంలో విద్యుత్ వెలుగులు కనిపించని ఊరి బయట పొలాల్లో నివసిస్తున్న ఓ వృద్ధుడి కధ అది.
కదల కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే అనేక కధలు. అలాంటిదే ఇది.
మా స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ వాటి ఆజాపజా మా అన్నదమ్ములు నలుగురికి కానీ, అన్నదమ్ముల మగ సంతానం పదిమందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా మూడో అన్నయ్య అకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం మిగిలాము. చిన్నవాడినైన నాకే డెబ్బయి ఆరు. (నాలుగేళ్ల నాటి మాట) మా రెండో అన్నయ్య ఎనభయ్ కి దగ్గరలో వున్నాడు. ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో ఉంటుందని అనుకోను.
ఈ నేపధ్యంలో మా మూడో అన్నయ్య కొడుకు భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం కట్టాడు.
అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ పుట్టల్ని తొలగించి పొలాలని కొత్తగా సర్వే చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఆ ఏడాది మండే వేసవి ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ దృశ్యానికి అక్షర రూపం ఇచ్చాడు. అదే ఇది:
“ ఆ వృద్ధుడి పేరు పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఎదిగిన ఆ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ వుండడంతో తమ ఇళ్ళ మధ్య వాళ్ళు ఉండటానికి గ్రామస్తులు ఇష్టపడ లేదు.
ఈ నేపధ్యంలో వారి మకాము ఊరి బయటకు మారింది. మండుటెండల్లో , చెట్టు నీడ కూడా లేకుండా, ఒక రేకుల షెడ్డు లోనే ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపు మేరలో విద్యుత్ వెలుగులు కనిపించవు. పిలిచినా పలికే నాధుడు లేకుండా కటిక చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు. తల్లి కూతుర్లు ఆ రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు’
25-04-2022 న ఇదంతా వివరంగా ఒక పోస్టులో రాశాను.
ఈ కధ సాంఘిక మాధ్యమంలో కనిపించిన తర్వాత కదలిక మొదలయింది. మా మూడో అన్నయ్య కుమారుడు భండారు రాఘవరావు రెవెన్యూ శాఖలో ఉద్యోగం కనుక, ఊరి పెద్దలను సంప్రదించడం, కొందరు పూనుకుని మా పొలం పక్కనే వున్న ప్రభుత్వ పోరంబోకు (బంజరు) స్థలంలో చిన్న రేకుల షెడ్డు వేసుకునే ఏర్పాటు చేశారు.
ఇది నాలుగేళ్ల నాటి సంగతి. ఆ రోజుల్లో ఒకసారి మా ఊరు వెళ్ళినప్పుడు ఆ కుటుంబం పరిస్థితి కళ్ళారా చూసాను. ఎలాగైనా ఆ ఇంటికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్న సంకల్పం కలిగింది.
కానీ ఎలా! నేను హైదరాబాదులో వుంటాను. పైగా వాళ్ళు ఉంటున్న షెడ్డు ఊరికి దూరంగా ఎక్కడో పొలాల నడుమ వుంది. దానికి సమీపంలో ఎక్కడా డొమెస్టిక్ కరెంటు లైన్ లేదు. ఇవేవీ ఆలోచించకుండా చేసుకున్న సంకల్పం.
ఈ లోగా ఇటువంటి ఛారిటీ కార్యక్రమాలకు ముందుండే మా రెండో కుమారుడు సంతోష్ 2024 లో హఠాత్తుగా గుండె పోటుతో మరణించాడు.
ఈ నేపధ్యంలో, నాలుగేళ్ల క్రితం పిచ్చయ్య ఇంటికి వెళ్లి, ‘మీ ఇంటికి కరెంటు తెప్పించే బాధ్యత మా కుటుంబానిది’ అని చెప్పివచ్చిన మాట, నోటిమాటగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.
మూడో అన్నయ్య కుమారుడు భండారు రమేశ్ ఒక మార్గం సూచించాడు. అదే సోలార్ పవర్. విద్యుత్ స్తంభాలు, లైన్ల అవసరం లేకుండా సోలార్ లైట్ బిగిస్తే ఆ కుటుంబానికి అదనపు భారం వుండదు అనే సలహా నాకు నచ్చింది. మా రమేశ్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. కేవలం డబ్బుతో ఏ సంకల్పం నెరవేరదు. పూనుకుని చేసే మనిషి కావాలి. ఆ కష్టం అంతా వాడు పడ్డాడు. మొన్న ఫోన్ చేసి ఆ ఇంట్లో సోలార్ లాంప్ బిగించాము అని రమేశ్ చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇందులో నా పాత్ర నామ మాత్రం. కాకపొతే, ‘రేపు చేద్దామని అనుకున్నది ఈ రోజే చెయ్యి’ అనేది నేను నేర్చుకున్న సూత్రం.





(ఇంకావుంది)






(03-09-2026)