28, జూన్ 2010, సోమవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు) - భండారు శ్రీనివాస రావు




                                                                                    


                                                      
  


                                      

                                                                                                             


జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు.గ్రంధ  ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం. అయినప్పటికీ, అనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకు జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే - ఇంచుమించు రెండు దశాబ్దాల క్రితం - మాస్కోలో గడిపివచ్చిన సుమారు ఐదేళ్ళ అనుభవాలను అక్షర బద్ధం చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఏకధ్రువ ప్రపంచ వ్యవస్తను ప్రశ్నిస్తూ- నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ - ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్ కమ్యూనిష్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా  చేసుకుని - 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన కాంక్షను ఎన్నో ఏళ్ళుగా అదిమిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి కారణాలు అనేకం. ఆనాడు నేను చూసింది మరో ప్రపంచం. అప్పటికీ ఇప్పటికీ యెంతో తేడా.  

ఆ రోజుల్లో 'అలా వుండేదియిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన  'స్వర్ణ యుగాలుచరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా.  నేను  కమ్యూనిష్టుని కాను.  వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ  ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు.  ఒక సామాన్యుడిగా  అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం'  నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం.  నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయినగౌరవ ప్రదమయినతృప్తికరమయిన  రోజులు గడిపింది ఆ రోజుల్లోనే.  వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా  గోరంతను 'కొండంతచేసి చెబుతున్నానేమో అని  అనిపించకత ప్పదు.   అందుకే  'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సి వచ్చింది.  



అంతేకాదు.  కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం.  తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది.  విషయానికి న్యాయం చేయలేక పోతున్నామేమో  అన్న సంశయం  మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా  జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.
(దస్వి దానియా అంటే రష్యన్ లో మళ్ళీ కలుద్దాం)
(ఇంగువ తెచ్చిన తంటా- గురించి మరోసారి).

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


27, జూన్ 2010, ఆదివారం

మహిళలపై టీవీ ప్రభావం - భండారు శ్రీనివాసరావు


మహిళలపై టీవీ ప్రభావం 


ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం.
'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు.
హింస ఎక్కడ లేదు? నగరాల్లో- గ్రామాల్లో- ఇళ్ళల్లో- వీధుల్లో- మాటల్లో- చర్చల్లో ఎక్కడ చూసినా హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు - సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా  డ్రాయింగ్ రూముల్లోకి  జొరబడుతోంది. అవునా? కాదా?
అయిదేళ్ళక్రితం  అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. 'మీ ఈ  అభివృద్దికి కారణం  ఏవిటన్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి ఈ చర్చకు సంబంధించినది  వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా  దూరదర్శన్ లో  క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ,  ఆ నాలడ్జే తరువాత జీవితంలో అక్కరకు వచ్చిందనీ  వాళ్ళు చెప్పారు. 
టీవీల వల్ల పాజిటివ్  ఎఫెక్ట్  ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 
లాహోర్ లో  ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్  లో చదువుకునే విద్యార్ధులు నిరుడు ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్ట్ ఆన్ చిల్ద్రెన్  అన్నది సబ్జెక్టు. వాళ్ళ లెక్క ప్రకారం-
అక్కడి పిల్లల్లో -
పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట. ఓ అరగంటపాటు హోం వర్క్ చేసుకుని -ఓ గంట టీవీ గేమ్స్  చూస్తారట. 

ఓ యిరవయి నిమిషాలు  రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీ, ఓ గంట ఆటలకీ, రెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ  ఖర్చు చేస్తారని తేలింది. 
మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే - చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల  ఇమాజినేటివ్ పవర్ పెరుగుతుందన్నారు. కొత్త భాషలు, కొత్త పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీ వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు - టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారని, దౌర్జన్యకారులుగా తయారవుతున్నారని, చదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు. ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను రెగ్యులేట్ చేయాలన్నారు. పిల్లలు చూసే ప్రోగ్రాములపై  పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు. 
రాజ్యాంగంలోని ఆర్టికిల్ యిరవై ఒకటి  మనందరికీ జీవించే హక్కు ఇచ్చింది. రయిట్ టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగా, గౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు ఇస్తోందని - హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసాయి. టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం ఈ  ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ ఏ టీవీ చానల్ కూడా దీన్ని పట్టించుకున్న దాఖలా  లేదు.
వంటలు-ఆరోగ్యం- ఎడ్యుకేషన్ - వీటి మీద చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో- ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి.  పిల్లలు ఆకర్షణీయమయిన టీవీ యాడ్స్ చూసి  పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. చూసి  కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి  ఈ డ్రాయింగ్ రూం  టీవీలే  కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని  ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలు, సంగీతం  అలా ఏదో ఒక   ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో-  సీరియళ్లు చూస్తూ  వాటిపై   చర్చోపచర్చలు చేసుకోవడంతోనే  సరిపోతోంది. పిల్లలని  చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే  వాటికి ఎంతగా ఎడిక్ట్  అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. 
ఒక సూర్యుండు సమస్త జీవులకు  తానొక్కొక్కడయి తోచు  చందాన -  ఈ నాడు  ప్రయివేటు  ఛానళ్ళు కుటుంబంలో అందరికీ కావాల్సిన ప్రోగ్రాములను నేత్రానందంగా తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు  కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీ'  దీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే  'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు- చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలే కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం  చెప్పేవారే కరువవుతున్నారు. 
ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 
అశ్లీలాన్ని అరికట్టే  సదాశయంతో  రూపొందించే  ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి. 
ఒక్క మాటలో చెప్పాలంటే- తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు  తీరిక లేకుండా  పనిచేస్తున్నాయి. 
-భండారు శ్రీనివాసరావు -  

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                
  

అమ్మ – మదర్స్ డే – భండారు శ్రీనివాసరావు





                                                                         అమ్మ        
  



అమ్మ అన్న దేవత లేకపోతే-
ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ వుండరు.
రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా  తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో రోజును ఇచ్చింది.
అదే,  మదర్స్ డే –  మాతృమూర్తి దినోత్సవం.
దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది.
అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే  అదీ రెండో ఆదివారం నాడే    ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు.
తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.
సంవత్సరంలో ఒక రోజుని మదర్స్ డే గా గుర్తింపు సాధించడానికి  దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే – తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
అన్నా జార్విస్

అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు – 1890  లోనే తాను నివసిస్తున్న   గ్రాఫ్టన్ నగరం వొదిలి  ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే  ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి – చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపురస్సరంగా ఏడాదిలో ఒక రోజుకి  మదర్స్ డే గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూనింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి – అన్నా రీవేస్ జార్విస్ మరణానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదులాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం - కూతురు అన్నా జార్విస్ కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా – ఆ తరవాత రోజుల్లో జార్విస్ సాగించిన పోరాటం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.

ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని  వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు  రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో మదర్స్ డే అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత 1914 లో  అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టుదిగివచ్చి  ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం – ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ మదర్స్ డే ఉత్తర్వులో ఒక విశేషం వుంది.  మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్  ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే – ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమె గౌరవించుకునే రోజుగా  కాకుండా – అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా మదర్స్ డే ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో మదర్స్ డే రాసేటప్పుడు  ఏకవచనంలో అంటే తల్లి దినోత్సవంగా పేర్కొంటారు.
మదర్స్ డే సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. మదర్స్ డే నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండన్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది. గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది  మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తి వేరనీ -  జార్విస్ చేసిన  విజ్ఞప్తులన్నీ – తల్లి పాలను సయితం లాభాలకు అమ్ముకోవాలనే మార్కెట్ శక్తుల ఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్ – పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే – 1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన  పరిస్తితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో – ఆ తల్లి సమాధి చెంతనే అన్నా  జార్విస్ ని    ఖననం చేయడం ఒక్కటే ఆమెకు దక్కింది.


అన్నా జార్విస్ కోరుకున్నట్టుగా – మదర్స్ డే జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.
మదర్స్ డే నాడు  తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా  ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి  ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే.     అలా కుదరని పక్షంలో – గ్రీటింగ్ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు  రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్తలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధ
పిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు.
మదర్స్ డే నాడు గుడికి వెళ్ళాల్సిన పనిలేదు. ఇంట్లో వెలిసివున్న మాతృదేవతకు నమస్కరించండి. ముక్కోటి దేవతలు మీ పూజలందుకుంటారు. ఇది సత్యం.

NOTE: All the images in this blog are copy righted to their respective owners. 


    
                                               

 




26, జూన్ 2010, శనివారం

ధరలు – వ్యధలు (వార్తావ్యాఖ్య – భండారు శ్రీనివాసరావు)



ధరలు – వ్యధలు (వార్తావ్యాఖ్య – భండారు శ్రీనివాసరావు)


పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. కాదు పెంచారు. వడ్డన కూడా కొంత భారీగానే వుంది.ఒక్క పెట్రోలుతో సరిపెట్టకుండా, పనిలో పనిగా డీసెలు, కిరోసిన్, గ్యాస్ ధరలను కూడా ఒకేసారి పెంచి అనేకసార్లు ఆందోళనలకు దిగే పని లేకుండా ప్రతిపక్షాలకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ ఛానల్లకే కొంత నిరాశ. పలుమార్లు చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ధరల పెరుగుదల ఈ నాలుగింటితో ఆగిపోదు, ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితం, అలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు. పొతే, ఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపిన వాళ్ళు, తమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసినవాళ్ళు యధావిధిగా టీవీ స్తుడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలు, రాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీ, ఇది ఎవరికీ పట్టదు.

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. దరిమిలా, పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయి, ఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీ, యెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఆనవాయితీగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదనని, ఎడ్ల బళ్ళు, రిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు, వెచ్చాలు కొనని ఆడంగులు కొందరు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు-ఏమీ కొనేట్టులేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ‘ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడం’ అన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండి, పెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.



ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు.

ఇదంతా ఎందుకు జరుగుతోంది ?

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల.

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమె కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాత తరం నుంచి, వున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరో తరం నుంచి, ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకో తరం నుంచి, అలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన దారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలి, కొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి. ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయి, ఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా అనే ఆటో డ్రైవర్ – సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటే, అవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది. ఇది సమాజం లోని అన్ని వర్గాలకు వర్తిస్తుంది, కానీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప. (25-06-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

24, జూన్ 2010, గురువారం

Kudos to Sonia, Singh - Bhandaru Srinivasrao (I.I.S)

Kudos to Sonia, Singh - Bhandaru Srinivasrao (I.I.S)



Last week, the Congress-led UPA government at the Centre has announced a 14-member National Advisory Council. Significantly, for the first time, the Prime Minister, Dr Manmohan Singh and the UPA Chairperson, Sonia Gandhi, seems to have taken utmost care to ensure nominating only apolitical personalities with excellent professional and academic track records.

Does the ‘realization’ have come among the political parties, especially the Indian National Congress, while choosing people for such an important panel? Has the ‘mind set’ of Congress leadership changed for good?

The members of the high-profile NAC include eminent scientists, academics, intellectuals and civil society activists. While four members of the previous NAC -- Aruna Roy, Jean Dreze, N.C. Saxena and A.K. Shiva Kumar - have been re-nominated to the panel, the rest are new faces.
The new names include agriculture scientist M.S. Swaminathan, technocrat V. Krishnamurthy, also a member of Planning Commission, economist Narendra Jadhav, Mirai Chatterjee, coordinator of social security at NGO SEWA, civil rights activist Farah Naqvi, vice-chancellor of North-Eastern Hill University, Shillong, Pramod Tandon, and former IAS officer and social activist Harsh Mander.

Ram Dayal Munda, MP, entrepreneur Anu Aga of Thermax Ltd and Madhav Gadgil of Agharkar Research Institute, Pune, have also been nominated to the new NAC that is expected to push for inclusive growth and social justice.

In its last incarnation during the first tenure of the United Progressive Alliance, the NAC became identified with signature social sector reforms such as introduction of the National Rural Employment Guarantee Scheme and the Right to Information Act.

It is no secret that it is a brainchild of Congress party president, Sonia Gandhi Sonia. It is also informally called as UPA's Planning Commission for social agenda. On 23 March 2006, Sonia Gandhi had resigned from the post of chairmanship of the NAC after Office of profit controversy. On 29 March 2010, she was back as the chairperson of NAC.

Though it was initially meant to guide and implement in the Common Minimum Programme of the UPA-I, now it was asked to play its role to foster the social agenda of UPA-II. The NAC serves as an interface between the government and the Congress party.

That the other members of this council are nominated by the Prime Minister in consultation with the Chairperson, give credence to my argument – that’s change in the ‘mind set of the party leadership.” The funds for the functioning of this council are provided from the budgetary allocation for the Prime Minister's Office.

I wish to join those millions, who wish to hail Sonia and Prime Minister Manmohan Singh, for overlooking claimants among political parties. Indeed, a good sign, as those who nominated not only high-profile and eminent personalities, but can guide the country impartially in designing and implementing the social agenda of the UPA-II to benefit those who need the help most.(22-06-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

18, జూన్ 2010, శుక్రవారం

సుందరం మనమందరం – భండారు శ్రీనివాసరావు

సుందరం మనమందరం   భండారు శ్రీనివాసరావు
జర్నలిస్టు వృత్తి జీవితం తొలినాళ్ళలో నేను కలిసి తిరిగిన అనేకమంది మిత్రులు-తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి వాళ్ళు పనిచేస్తున్న పత్రికలకే ఎడిటర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉచ్చస్తితిలో వున్నప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే మహామహులకే దుర్లభంగా వుండేది. విజిటింగ్ కార్డు పంపి అనేకమంది వెయిట్ చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళు- నాతో గతకాలంలో గడిపిన రోజులు మరచిపోకుండా -నన్ను తమ సన్నిహిత వర్గంలోని వాడిగానే పరిగణించి ఆదరించేవారు.
 విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించి విలేకరిగానే పదవీ విరమణ చేసినవాడిని నేను. నా బోటి వాళ్ళు ఈ వృత్తిలో ఎక్కువగా వుంటారు. అతికొద్దిమంది మాత్రమె తమ ప్రతిభతో పై మెట్టు ఎక్కగలుగుతారు. నాది ఒక రకంగా సర్కారు ఉద్యోగం కనుక ఎక్కవలసిన మెట్లు తక్కువే. ఎక్కగలిగిందీ తక్కువే. గోదావరిలో ఎన్ని నీళ్ళున్నా  మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు  మన ప్రాప్తాన్నిబట్టి తెచ్చుకోగలుగుతామని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు చెప్పిన విషయం గుర్తుంచుకోవడం వల్ల ఈ మెట్లెక్కే గొడవ నా మనసుకు ఎక్కలేదు. అయినా ఈనాటి లోకం పోకడ ఇందుకు విరుద్దం. పొజిషన్ ను బట్టి పలకరింపులు, స్తాయిని బట్టి సాన్నిహిత్యాలు, హోదాని బట్టి ఆహావోహోలు. కానీ నా అదృష్టం  నా మిత్రులెవ్వరు ఈ కోవలోకి రారు. అందుకే ఇన్నేళ్ళ తరవాత కూడా 
వారు నాతొ ప్రవర్తించే తీరులో ఇసుమంత తేడా లేదు.



ఈరోజుజూన్ 17 వ తేదీన హైదరాబాద్ ఎర్రగడ్డ హిందూ స్మశాన వాటికలో ఎక్స్ ప్రెస్  సుందరం అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు పూర్వపు మిత్రులందరూ కలిసారు. వారిలో చాలా మంది విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కొద్దిమంది ఇంకా వృత్తిలో కొనసాగుతున్నారు. మా మధ్య తిరిగిన సుందరాన్ని (సుందరం గారు అని మన్నింపుగా పేర్కొనకపోవడంపై ఎవరికయినా బాధ కలిగితే క్షంతవ్యుడిని ) విగత జీవుడిగా చితిపై చూస్తున్నప్పుడు మా అందరి మనస్సులు వికలమయ్యాయి. జర్నలిజంలో ఎంతో వున్నత స్తానానికి ఎదిగినా కూడా నాతో ఆయన ప్రవర్తన మునుపటిమాదిరిగానే వుండేది. ఎనభయ్యవ దశకానికి ముందు నేను రేడియోలోనూ, ఆయన ఆంద్ర పత్రికలోను పనిచేస్తూ వుండేవాళ్ళం.  శ్రీయుతులు జి కృష్ణ, ఆంధ్రపత్రిక ముక్కు శర్మ, ఈనాడు శాస్త్రి, పీటీఐ కృష్ణ, హిందూ రాజేంద్రప్రసాద్, లక్ష్మీపతి, పేట్రియాట్ ప్రభాకరరావు, క్రానికల్ సింహం,ఎక్స్ ప్రెస్ మురళీధర్, శ్రీకాంత్ విట్టల్, ప్రభ సలంద్ర (చావు గీతం), యుఎన్ఐ పార్థసారథి, పీటీఐ జమాల్ వంటి కీర్తిశేషులయిన వుద్దండులతో కలిసిమెలిసి తిరగగలిగే అదృష్టం నాకు దక్కింది. అలాగే, శ్రీయుతులు  సమాచార భారతి ఆదిరాజు వెంకటేశ్వర రావు, యుఎన్ఐ డి సీతారాం, ఈనాడు ఏబీకే ప్రసాద్, ఆంద్ర జ్యోతి వెంకట రావు, ఇన్నయ్య , హిందూ కేశవరావు, నగేష్, ఆంద్రప్రభ పొత్తూరి వెంకటేశ్వరరావు, జ్యోతి రామచంద్రమూర్తి, క్రానికల్ రబీంద్రనాధ్, పీ ఏ రామారావు, ,విశాలాంధ్ర శ్రీనివాసరెడ్డి, ప్రజాశక్తి వినయకుమార్, ఈనాడు శేఖర్, పాశం యాదగిరి, శ్రీధర్, కే వేణుగోపాల్, ఎన్ఐఎస్ కొండా లక్ష్మారెడ్డి,  ఒకరా ఇద్దరా జర్నలిజం లో కాకలు తీరిన అనేకమందితో చనువుగా మసలగలిగే అవకాశాన్ని నా రేడియో విలేకరిత్వం నాకు అందించింది. నిజానికి వీరిలో చాలామందితో నా సాన్నిహిత్యం  గారు వంటి గౌరవ పద ప్రయోగాలతో ముడిపడివుండలేదు. చాలా చనువుగా పలకరించుకోగల సంబంధ బాంధవ్యాలు వుండేవి.మాలో చాలామందిమి, సంపాదకులను మినహాయిస్తే,   దాదాపు ప్రతి రోజు సెక్రెటేరియేట్ లోని ప్రెస్ రూం లో కలుసుకునేవాళ్ళం. పత్రికా సమావేశాలు లేనప్పుడు కొన్ని గంటలపాటు మా నడుమ ముచ్చట్లు సాగేవి. పెద్దా చిన్నా తేడా లేకుండా ఒక కుటుంబంలోని సభ్యులమాదిరిగా గడిపేవాళ్ళం. సుందరం గారు కనపడగానే సుందరం మనమందరం అని ఏదో కవిత్వ ధోరణిలో పలకరించినా ఆయన  ఏమీ అనుకునేవాడుకాదు. పైగా నవ్వి వూరుకునేవాడు. మా ఇద్దరి నడుమా మరో బాదరాయణ సంబంధం వుండేది. గుజరాత్ గవర్నమెంటు వారిగిర్నార్ స్కూటర్ ను మన రాష్ట్రంలో తొలిసారి ప్రవేసపెట్టినప్పుడు, మేమిద్దరం ఒకేరోజు, ఒకే డీలర్ దగ్గర కొన్నాము.  హైదరాబాదులో అమ్ముడుపోయిన గిర్నార్ స్కూటర్లే బహు తక్కువ. వాటిల్లో రెండింటికి మేమిద్దరమే ఓనర్లం. ఆ రోజుల్లో వెస్పా స్కూట ర్లకు పెద్ద గిరాకీ వుండేది. కానీ, కొనుక్కోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సివచ్చేది. అందుకే మరో మాట లేకుండా మేమిద్దరం గిర్నార్ స్కూటర్లు కొనుక్కున్నాము. అదీ ఏదో బ్యాంకు అధికారి జర్నలిష్టులమని అప్పివ్వబట్టి.
అంత్యక్రియలు పూర్తయిన తరవాత సుందరం గారి పిల్లల్ని కలుసుకుని పరిచయం చేసుకున్నాను. వారి తండ్రి గారితో నా సాన్నిహిత్యం గురించి చెప్పాలనిపించినా అంత చనువు లేక మానుకున్నాను. జర్నలిస్టుల జీవితాలు ఇంతే. వారికి సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, సుందరం గారు చనిపోయిన విషయం వెంటనే తెలిసికూడా ఆయన ఇంటికి వెళ్ళ లేకపోవడానికి ఇదే కారణం. ఆ ఇంట్లో ఆయన తప్ప నాకెవరు తెలవదు.ఒకవేళ వెళ్ళివున్నా,నేను తెలిసిన ఆ ఒక్కరికి నేను వచ్చిన విషయం తెలియదు. ఇది మరో  విషాదం. (17-06-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                                 

సుందరం మనమందరం – భండారు శ్రీనివాసరావు

సుందరం మనమందరం   భండారు శ్రీనివాసరావు
జర్నలిస్టు వృత్తి జీవితం తొలినాళ్ళలో నేను కలిసి తిరిగిన అనేకమంది మిత్రులు-తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి వాళ్ళు పనిచేస్తున్న పత్రికలకే ఎడిటర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉచ్చస్తితిలో వున్నప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే మహామహులకే దుర్లభంగా వుండేది. విజిటింగ్ కార్డు పంపి అనేకమంది వెయిట్ చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళు- నాతో గతకాలంలో గడిపిన రోజులు మరచిపోకుండా -నన్ను తమ సన్నిహిత వర్గంలోని వాడిగానే పరిగణించి ఆదరించేవారు.
 విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించి విలేకరిగానే పదవీ విరమణ చేసినవాడిని నేను. నా బోటి వాళ్ళు ఈ వృత్తిలో ఎక్కువగా వుంటారు. అతికొద్దిమంది మాత్రమె తమ ప్రతిభతో పై మెట్టు ఎక్కగలుగుతారు. నాది ఒక రకంగా సర్కారు ఉద్యోగం కనుక ఎక్కవలసిన మెట్లు తక్కువే. ఎక్కగలిగిందీ తక్కువే. గోదావరిలో ఎన్ని నీళ్ళున్నా మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు మన ప్రాప్తాన్నిబట్టి తెచ్చుకోగలుగుతామని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు చెప్పిన విషయం గుర్తుంచుకోవడం వల్ల ఈ మెట్లెక్కే గొడవ నా మనసుకు ఎక్కలేదు. అయినా ఈనాటి లోకం పోకడ ఇందుకు విరుద్దం. పొజిషన్ ను బట్టి పలకరింపులు, స్తాయిని బట్టి సాన్నిహిత్యాలు, హోదాని బట్టి ఆహావోహోలు. కానీ నా అదృష్టం నా మిత్రులెవ్వరు ఈ కోవలోకి రారు. అందుకే ఇన్నేళ్ళ తరవాత కూడా వారు నాతొ ప్రవర్తించే తీరులో ఇసుమంత తేడా లేదు.

ఈరోజు- జూన్ 17 వ తేదీన హైదరాబాద్ ఎర్రగడ్డ హిందూ స్మశాన వాటికలో ఎక్స్ ప్రెస్  సుందరం అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు పూర్వపు మిత్రులందరూ కలిసారు. వారిలో చాలా మంది విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కొద్దిమంది ఇంకా వృత్తిలో కొనసాగుతున్నారు. మా మధ్య తిరిగిన సుందరాన్ని (సుందరం గారు అని మన్నింపుగా పేర్కొనకపోవడంపై ఎవరికయినా బాధ కలిగితే క్షంతవ్యుడిని ) విగత జీవుడిగా చితిపై చూస్తున్నప్పుడు మా అందరి మనస్సులు వికలమయ్యాయి. జర్నలిజంలో ఎంతో వున్నత స్తానానికి ఎదిగినా కూడా నాతో ఆయన ప్రవర్తన మునుపటిమాదిరిగానే వుండేది. ఎనభయ్యవ దశకానికి ముందు నేను రేడియోలోనూ, ఆయన ఆంద్ర పత్రికలోను పనిచేస్తూ వుండేవాళ్ళం. కీర్తి శేషులు, శ్రీయుతులు జి కృష్ణ, పీటీఐ కృష్ణ, హిందూ రాజేంద్రప్రసాద్, ఆంధ్రపత్రిక ముక్కు శర్మ, ఈనాడు శాస్త్రి, ఎక్స్ ప్రెస్ మురళీధర్, శ్రీకాంత్ విట్టల్ వంటి వుద్దండులతో కలిసిమెలిసి తిరగగలిగే అదృష్టం నాకు దక్కింది. అలాగే, శ్రీయుతులు - వెటరన్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు, యుఎన్ఐ డి సీతారాం, ఈనాడు ఏబీకే ప్రసాద్, ఆంద్ర జ్యోతి వెంకట రావు, హిందూ కేశవరావు, ప్రభ పొత్తూరి వెంకటేశ్వరరావు, జ్యోతి రామచంద్రమూర్తి, క్రానికల్ రబీంద్రనాధ్, విశాలాంధ్ర శ్రీనివాసరెడ్డి, ప్రజాశక్తి వినయకుమార్, ఎన్ఐఎస్ కొండా లక్ష్మారెడ్డి, ఒకరా ఇద్దరా జర్నలిజం లో కాకలు తీరిన అనేకమందితో చనువుగా మసలగలిగే అవకాశాన్ని నా రేడియో విలేకరిత్వం నాకు అందించింది. నిజానికి వీరిలో చాలామందితో నా సాన్నిహిత్యం గారు వంటి గౌరవ పద ప్రయోగాలతో ముడిపడివుండలేదు. చాలా చనువుగా పలకరించుకోగల సంబంధ బాంధవ్యాలు వుండేవి. దాదాపు ప్రతి రోజు సెక్రెటేరియేట్  లోని ప్రెస్ రూం లో కలుసుకునేవాళ్ళం. పత్రికా సమావేశాలు లేనప్పుడు కొన్ని గంటలపాటు మా నడుమ ముచ్చట్లు సాగేవి. పెద్దా చిన్నా తేడా లేకుండా ఒక కుటుంబంలోని సభ్యులమాదిరిగా గడిపేవాళ్ళం. సుందరం గారు కనపడగానే సుందరం మనమందరం అని ఏదో కవిత్వ ధోరణిలో పలకరించినా ఆయన  ఏమీ అనుకునేవాడుకాదు. పైగా నవ్వి వూరుకునేవాడు. మా ఇద్దరి నడుమా మరో బాదరాయణ సంబంధం వుండేది. గుజరాత్ గవర్నమెంటు వారి గిర్నార్ స్కూటర్ ను మేమిద్దరం ఒకేరోజు, ఒకే డీలర్ దగ్గర కొన్నాము.  హైదరాబాదులో అమ్ముడుపోయిన గిర్నార్ స్కూటర్లే బహు తక్కువ. వాటిల్లో రెండింటికి మేమిద్దరమే  ఓనర్లం. ఆ రోజుల్లో వెస్పా స్కూట ర్లకు పెద్ద గిరాకీ వుండేది. కొనుక్కోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వుండేవి. అందుకే మరో మాట లేకుండా మేమిద్దరం గిర్నార్ స్కూటర్లు కొనుక్కున్నాము. అదీ ఏదో బ్యాంకు అధికారి జర్నలిష్టులమని అప్పివ్వబట్టి.
అంత్యక్రియలు పూర్తయిన తరవాత సుందరం గారి పిల్లల్ని కలుసుకుని పరిచయం చేసుకున్నాను. వారి తండ్రి గారితో నా సాన్నిహిత్యం గురించి చెప్పాలనిపించినా అంత చనువు లేక మానుకున్నాను. జర్నలిస్టుల జీవితాలు ఇంతే. వారికి సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, సుందరం గారు చనిపోయిన విషయం వెంటనే తెలిసికూడా ఆయన ఇంటికి వెళ్ళ లేకపోవడానికి ఇదే కారణం. ఆ ఇంట్లో ఆయన తప్ప నాకెవరు తెలవదు. తెలిసిన ఒక్కరికి నేను వచ్చిన విషయం తెలియదు. ఇది మరో  విషాదం. (17-06-2010)                                 

16, జూన్ 2010, బుధవారం

Strategy? Or showdown? - Bhandaru Srinivas Rao (I.I.S.)

Strategy? Or showdown? - Bhandaru Srinivas Rao (I.I.S.)

The ongoing war-of-nerves among ruling Congress party members, indeed sending a wrong signal to people, that too on the eve of byelections to 12 assembly constituencies, which necessitated due to the resignation of 10 TRS and one each of TDP and BJP members protesting against the Centre’s refusal to carve out separate Telangana and instead constitute Justice BN Srikrishna Committee.

Today, people are perplexed with the behavior of the ruling Congress members, that too the so called seniors from the region, who are more vocal in digging their own party colleagues graves. Was it a clever strategy of anti-YSR group nail their pro-YSR counterparts? Or such ‘pressure’ tactics only meant to prevail upon the party high command not to consider accommodating the former CM’s scion and Kadapa MP Y S Jaganmohan Reddy with a plum post in future? (This is in the wake of rumors making rounds that he may as well be allowed to succeed D Srinivas as Pradesh Congress Committee chief, as the former's term is coming to an end next month)

Should one consider it as their ‘strategy’ to ‘finish’ pro-YSR group within the party? Or a show down with the party high command?

Whatever may be their ‘hidden’ agenda, it is not going do any good to the party – now or in future. Calling their own colleague ‘corrupt’ doesn’t augment anyway for their own ‘vote bank’ to sail with them in the coming polls. And, if the party high command, for some reason or the other, bow down to these pressure tactics, and direct Rosaiah to ‘drop’ allegedly corrupt Ponnala from the Cabinet, it proves more disastrous to the party and government.



Doesn’t the so called seniors of the region aware of these facts? How come they choose to don the role of “Bhasmasura” to wipe their own party from the state? Can they dare imagine of the party winning any future elections, leave alone bouncing back to power yet again in 2014?



What one fails to understand how come these seniors dare not raise their voice while YSR was alive and kicking? Weren’t they scared of his unassailable stature and his ‘hold’ with the party high command? Do they choose now as they find ‘chicken heart-type’ qualities in their own Chief Minister K Rosaiah as he has no control over them?



As far Rosaiah is concerned, he is proving beyond doubt of adopting ‘Chanakya’ neethi. Time and again he is reiterating that he is sitting in CM's gaddi at the behest of party high command. He admits that the ‘seat’ is too 'hot' and willing to vacate, if the party high command so directs. Thus far, Rosaiah ‘cleverly’ keeps his hands off on ongoing war-of-nerves among his own party colleagues. Not that he is ‘blind’ to the fact that such malicious campaign against his own Cabinet colleague only weaken his government, than serve any better. Yet, by leaving the decision on ‘disciplining members’ to the party high command, he establishes his ‘neutral stand’ amongst warring groups.

It is up to the party high command to decide whether such ‘neutral’ stand of Rosaiah will do any good to the party or not.
But for an average onlooker the ongoing ‘power struggle’ within the ruling clique reminds them of pre-1983 political scenario in the state. The ‘power struggle’ within the Congress appears to be making its main Opponent Telugu Desam party job much easier to win over the people. The Congress party could win 2004 and 2009 elections simply because of the ‘unity’ it displayed under the strong leadership of YSR. That YSR initiated welfare schemes to poor and needy might have further cemented the ‘faith’ of electorate in that party.

The TDP, which spearheaded the ‘corruption’ issue, especially attacking the envious ‘Jalayagnam’ project from the day it was unveiled, in fact failed to convince the electorate. Their ‘appeasing tactics’ of ‘direct money transfer’ scheme into beneficiaries accounts, if their party brought back to power, also failed to convince the electorate in 2009 elections.

But, if the ruling party members themselves admit that there are more skeletons in their cupboard and are willing to pull one after the other, then the electorate does't require any more proofs.

Now it’s up to the ruling party and its high command to take immediate ‘damage control’ measures to prevent further erosion of the party’s image in the eyes of Andhrites. It they do, and then the fears of pre-1983 may as well come true! (16-06-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

9, జూన్ 2010, బుధవారం

By-polls; TRS demand undemocratic! -Bhandaru Srinivasrao (I.I.S.)

By-polls; TRS demand undemocratic! -Bhandaru Srinivasrao (I.I.S.)




In a democratic society, any citizen can take part in any election any where.  That’s the right enshrined in our constitution.  Then, how come the separatist Telangana Rashtra Samiti and other students’ organizations like the Osmania University JAC and Kakatiya University JAC dare held out threats against those aspiring candidates who wanted to contest the bypolls which necessitated due to the resignation of 12 legislators protesting against the Centre’s decision to constitute Justice BN Srikrishna panel?
Such a demand is not only undemocratic and unlawful act and the government should not hesitate to book cases against those who indulge in holding out such threats. Instead, those who are demanding for bifurcation of the state can campaign in a peaceful manner to convince the electorate of the region to vote for those who toe the separate statehood line.  None can object to such a move. Yet, their campaign should not be provocative and attract legal action as such undemocratic moves only result in disturbing the peace in society.
With the announcement of the possible elections before August by none other than one of the Election Commissioners, the ruling Congress and its main rival, Telugu Desam Party, have already begun the process for candidates hunt.  Scores of aspiring candidates already forming queues before these two major party headquarters and engaged in hectic lobbying for ticket!  Contrary to this, the TRS and those who are fighting for separate statehood are only trying to scare the contestants.  They wanted all those who resigned en masse (10 of TRS and one each of TDP and BJP) on a directive from the T-JAC Chief Prof Kodandaram, only they should return to state Assembly uncontested.  Can such a demand be allowed in a democratic society like ours?

Prof Kodandaram is a respected teacher.  I feel, he is well versed with country’s democratic functioning and also of the contents of the Constitution.  He should discourage those militant elements who wanted to make such undemocratic demand and wants to pursue it further.  Otherwise, one bound to suspect that the TRS has no faith in Indian democracy and may attract the treatment that being meted out to other unlawful organizations and political parties.  Violence has no place in the society.  Every peace loving citizen should adhere to this.  As a citizen of this great nation, one enjoys the freedom to travel, live, breathe and enjoy life in which ever part of the country he chooses to.  None has the right to restrict movements of an individual based on regional chauvinism. 

What the TRS and those organizations which really wanted to accomplish their dream of separate statehood for Telangana should seriously concentrate and ensure return of all those who resigned for the cause in the forthcoming by-polls.  As far as the regional ‘sentiment’ is concerned, one has little faith in that argument.  This was based on the past experiences of TRS in elections.  Doubting Thomases  on Telangana ask; “if the sentiment is so strong, then why electorate are not supporting TRS at hustings?.  The TRS had only seen only erosion (numerically) in all elections it contested since 2004. 
Onus is on TRS now to change this belief among its baiters. It has a point or two to prove by retaining all the 10 seats  (remaining two belong to TDP and BJP) it had won in 2009.  It should put all its energies to impress upon the electorate in these constituencies to strengthen their hands to take the fight for separate statehood to its logical conclusion. If it retains all the 10 seats and also ensures victory for TDP and BJP candidates who also resigned along with other TRS MLAs and establish that the sentiment for separate statehood is strong, it shall send the right kind of message even to Srikrishna Panel make note of it and incorporate this fact while submission of its final report sometime during the year end. 
Time is ripe for polarization of electorate for the cause.  The ball is now back in TRS court and how it handles and sees all its nominees retain their seats is the look out of its most vocal leader K Chandrasekhara Rao.


 It’s his responsibility to best utilize this golden opportunity to disprove the argument of ‘Telangana is no more a myth, but set to become reality, sooner than later, if he ensures all electorate fall in line and help retain his nominees.”  
One only wish KCR and Prof Kodandaram control their tempers and show their maturity in understanding the democratic process and disprove their critics of what they are capable of.  Good luck to them! (( 09-06-2010 )

NOTE: All the images in this blog are copy righted to their respective owners.