31, ఆగస్టు 2020, సోమవారం

Who is Behind YS Jagan Decisions? Sr Journalist Bhandaru Srinivas Rao Ex...

ఏపీ సీఎం జగన్ కి కోర్టుల్లో వరుస దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? Sr Journ...

ఆంధ్ర ప్రదేశ్ 3 రాజధానులు అవుతాయా? ఆగుతాయా? Bhandaru Srinivas Rao Analy...

21, ఆగస్టు 2020, శుక్రవారం

ఏడాది క్రితం ఉష ఓదార్పు మాటలు

ఉష నాకు రేడియోలో సహోద్యోగి మాత్రమే కాదు. కుటుంబ స్నేహితురాలు. గురుతుల్యులైన తురగా జానకీరాణిగారి ముద్దులపట్టి. పిన్న వయసులోనే పెద్ద పెద్ద కష్టాలను భరిస్తున్న మనిషి. పిన్నతనంలోనే తండ్రి కృష్ణమోహనరావుగారు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అండగా వుంటాడు అనుకున్న జీవనసహచరుడు అర్ధాంతరంగా జీవితం నుంచి అదృశ్యమైపోయాడు. తండ్రి పోయినప్పటినుంచి కనురెప్పలా కనిపెట్టుకుని చూస్తూ వచ్చిన కన్నతల్లి కనుమరుగైంది.

పుట్టెడు కష్టాలను పంటిబిగువన సహిస్తూ పెద్ద ఆరిందాలా నన్ను ఓదారుస్తోంది చూడండి.
ఉషా! నీ పెద్ద మనసుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు మాటలు రావడం లేదమ్మా!

"నేను మహా దుఃఖంలో ఉన్న రోజుల్లో నన్ను చూసి చాలా మంది ఆందోళన పడేవారు. నీ కళ్ళు ఖాళీగా ఉన్నాయి...నాకు భయమేస్తోంది నిన్ను చూస్తుంటే అనేవాడు ఒక ఫ్రెండ్. మనసులో వ్యాకులత physicalగా కనిపిస్తుంది అని ఎవరు చెప్పినా నాకు అప్పుడు తెలీలేదు.
.
"నిన్న అలాంటి ఒక మహా దుఃఖాన్ని మళ్ళీ చూశా. అది కూడా ఎప్పుడూ చిరునవ్వు చెదరకుండా, చీకు చింతా లేకుండా...కాదు, కనిపించకుండా ... ఉండే ఒక మనిషిలో.
.
"భండారు నిర్మలగారు మొన్న వెళ్లిపోయారు. వెళ్ళిపోతూ భండారు శ్రీనివాసరావు గారిని చాలా ఒంటరిని చేశారు. అసలు ఆవిడ వెళ్లిపోవాల్సిన వయసు కాదు. టైం కాదు. పధ్ధతి కాదు. కానీ, లాజిక్ అనేది లేని విషయం మృత్యువు ఒకటే అని స్వానుభవం మీద తెలుసు కనుక, బాధపడ్డా 'ఇంతే కదా జీవితం' అనుకున్నా.
.
"శ్రీనివాసరావుగారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మా అమ్మకి కొలీగ్. మా నాన్నగారి పేరు మీద ఆయనకీ అవార్డు ఇచ్చే గౌరవం మాకు దక్కింది. నేను కూడా ఆయనతో కలిసి పని చేశాను.
.
"ఆయన అంటే నాకు గౌరవం అన్నది మామూలుగా చూపించినా, నాకు ఎంత admiration అన్న విషయం ఎప్పుడూ చెప్పలేదు. కులాసాగా పని చేసుకోవడం, efficientగా టైం manage చేసుకోవడం, ఇంకోళ్ళ నెత్తిన pressure పెట్టకుండా సరదాగా కబుర్లు చెప్తూ పని పూర్తి చేయడం...ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవే. రేడియో ఒక్కటే breaking news ఉన్న రోజుల్లో ఆయన చేసిన రిపోర్టింగ్ ఈరోజు జర్నలిజం schoolsలో ఒక కోర్సు కావాలి. సరసంగా మాట్లాడడం, సరళంగా విషయం చక్కబెట్టడం, ఆత్మీయంగా అందరితో కలిసిపోతూనే తనదైన unique వ్యక్తిత్వం...శ్రీనివాసరావు గారు నిజంగా కోటిమందిలో ఒకరు.
.
"Smart appearance, హాయిగా నిదానంగా నడుస్తూ, కళగా కనిపించే ఆయన నిన్న కలిసినప్పుడు వివర్ణంగా ఉన్నారు. భుజాలు వొంగిపొయాయి. ఏంటో దిక్కుతోచని చిన్నపిల్లాడిలా, అదే సమయంలో సడన్ గా తన వయసు గుర్తొచ్చినట్లుగా ఉన్నారు.
.
"నిర్మలకి వేరే పుట్టిల్లు లేదు, నేనే అన్నీ... అన్నారు ఆయన. దాదాపు 50 ఏళ్ళ సాంగత్యం. అసలు వాళ్లిద్దరూ వేరే ఇద్దరు వ్యక్తులంటే ఎలా నమ్మడం? ఆయనకి ఆవిడ మీద ఉన్న ప్రేమ, వారి స్నేహం, సంసారంలో సరిగమలు... జగద్విదితమే. ఒక రకంగా చెప్పాలంటే, అలా ప్రేమ పొందుతూ, ఒంటరితనం తెలీకుండా ఆవిడ వెళ్లిపోవడం ఆవిడకి అదృష్టమే. నాకు తెలుసు.
.
"ఇవాళ నేను నీ స్థానంలో ఉన్నా, ఉషా! అన్నారు ఆయన. స్వరం గద్గదం అయిపోయి, కళ్ళల్లో తడితో మాట్లాడుతున్న ఆయనని చూస్తే సీతావియోగ దుఃఖం అనుభవిస్తున్న శ్రీరాముడు గుర్తొచ్చాడు.
.
"శ్రీనివాసరావుగారు నాకు అన్ని విధాలా గురుతుల్యులు. మా అమ్మా నాన్న మీద అభిమానంతో పాటు నేనంటే ఎంతో ఆత్మీయంగా నాకు ఎన్నో సార్లు life advice ఇచ్చారు.
.
"కానీ, జీవితంలో మన సర్వస్వం అనుకున్న వ్యక్తి హఠాత్తుగా విడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అన్న ఎరుకలో నేను సీనియర్ ని కనుక, ఆయనని చూస్తూ ఎంతో దుఃఖపడుతూనే, 'అయ్యో...ఇంకా జీవితం ముందుంది.. ఈయన ఎలా ఉంటారు ఆవిడ లేకుండా?' అని కళవెళపడ్డాను.

"జీవితమే నేర్పిస్తుందిలే ఆ పాఠం కూడా. రోజుకో చాప్టర్ చొప్పున"

నిజమే ఉషా! జీవితం నేర్పుతోంది. నెమ్మది నెమ్మదిగా ఒక్కో పాఠం నేర్చుకుంటూనే వున్నాను.
.

ఫణి అంటేనే పని

 

మా మేనకోడలు ఫణికి (చిత్రకారుడు రాంపా భార్య) మా ఆవిడకి జన్మజన్మల సంబంధం ఏమో తెలవదు. ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు  ఒక్కటే. మొన్న శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం నాడు మా కోడలు నోముకు ముత్తయిదువుగా ఎంతో దూరం నుంచి వచ్చింది. మా ఆవిడ వుండగా ప్రతి శ్రావణ శుక్రవారానికి ఫణి ముత్తయిదువుగా వచ్చేది. అత్తయ్య పెట్టిన ఇరవై ఎనిమిది చీరెలు ఇప్పటికీ  తన వద్ద భద్రంగా వున్నాయని చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

మా లాగే వాళ్ళదీ ప్రేమ వివాహం. ప్రేమ పెళ్ళిళ్ళలో ఏమి వున్నా ఏమి లేకపోయినా కష్టాలు కామన్. కష్టాలు అంటే ఆర్ధిక ఇబ్బందులు కాదు,  రెండు వైపులా వారికీ సర్దిచెప్పడం, కొత్త కాపురాన్ని సొంతంగా నిభాయించుకు రావడం, ఈ సంబడం ఎన్నాళ్ళో చూద్దాం అనే వారి చూపుల్ని తట్టుకోవడం ఒకటా రెండా! అదొక భారతం.

అన్నీ తట్టుకున్నారు. ఇందులో ప్రధాన భూమిక నా మేనకోడలిదే. మాస్కో వెడుతూ మా ఆవిడ వదిలిన 'అమ్మవొడి'ని ఫణి తన భుజాల మీదకు ఎత్తుకుంది.

అదృష్టం పిల్లలు ఎదిగి వచ్చారు. కొడుకు, కుమార్తె బాగా చదువుకున్నారు. మంచి కోడలు, అంతకంటే మంచి అల్లుడు లభించారు. హాయిగా అందరూ సెటిల్ అయ్యారు.

ఇప్పుడే బుంటీ (జర్నలిస్ట్  ప్రేమ, మరో మేనకోడలు విజయలక్ష్మి కుమార్తె) పోస్ట్ చూశాను. కరోనా కాలక్షేపానికి తనకు చేతయిన కాలక్షేపాన్ని ఫణి ఎంచుకుంది అని. కారా స్నాక్స్ పిండి వంటలు చేయడం. ఇందులో ఫణిని కొట్టేవాళ్ళు అరుదు. అసలు మా మేనకోడళ్ళు అందరికీ వంటలు రుచికరంగా చేయడం వెన్నతో పెట్టిన విద్య.

పనిలో పనిగా ఫణి విదేశాలకు కూడా తన వంటల అంటే పిండి వంటల రుచి చూపించాలని అనుకుంటున్నట్టు బుంటీ  

పోస్టు వల్ల తెలిసింది.

ఇంకేం! శుభం భూయాత్!    

10, ఆగస్టు 2020, సోమవారం

వైఎస్ ఆఖరి ఘడియలు

 వైఎస్ ఆఖరి ఘడియల్ని విజయమ్మ  తను రాసిన "నాలో...నాతొ...YSR"  అనే పుస్తకంలో  చాలా వివరంగా, ఒక డైరీ లాగా రాసుకొచ్చారు, ఈ పుస్తకంలో.

ఆవిడ మాటల్లోనే :

“సెప్టెంబరు -2.  ఉదయం 7.15 కల్లా రెడీ అయిపోయారు. బ్రేక్ ఫాస్ట్ దగ్గరకూర్చున్నప్పుడు జగన్ వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఫోను వచ్చింది. ‘సార్!  వర్షాలు బాగా పడుతునాయి. ఇప్పుడు పోవద్దు సార్!’ అంటున్నారు ఎవరో అవతల నుంచి. నేనూ అదే మాట చెప్పాను.

‘పైలట్ వద్దంటే చేసేదేముంటుంది. ఇంటికి వస్తాను. వేరే అప్పాయింట్ మెంట్లు లేవు కాబట్టి అందరం కూర్చుందాములే’ అన్నారు నాతో.

“ఎప్పుడూ నవ్వుతూ వుండే ఈయన ఆరోజు మాత్రం హెలికాప్టర్ ఎక్కేటప్పుడు కొంచెం సీరియస్ గా వున్నారని చాలామంది నాతో చెప్పారు. తర్వాత టీవీల్లో చూసినప్పుడు నాక్కూడా అలాగే అనిపించింది.

“ఉదయం 8.34 కి  హెలికాప్టర్ టేకాఫ్ అయింది. 9.34 నుంచి హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయట.

“విషయం తెలిసి భారతి, షర్మి పిల్లలు బెంగుళూరు నుంచి హైదరాబాదు వచ్చారు.

“సెప్టెంబరు - 3

“హెలికాప్టర్ కూలిపోయిన సంగతి జగన్ కు ముందే తెలిసినా మాతో చెప్పలేదు. రూములోకి వెళ్లి చాలాసేపటివరకూ బయటకు రాలేదు.

“తర్వాత జగన్ మమ్మల్ని దగ్గరకు తీసుకుని భోరున ఏడ్చాడు. మాకు ఆ వార్త నమ్మశక్యంగా అనిపించలేదు.

“మధ్యాన్నం 12.30 నుంచి  గవర్నర్, చంద్రబాబునాయుడు ఇంకా చాలామంది నాయకులు పరామర్సకు రావడం మొదలయింది.  కానీ ఈయన జీవించే ఉన్నారన్న నమ్మకం నాలో చావలేదు. అందుకే గవర్నర్ పలకరించగానే నేను, ‘ఆయనకేం కాదు, హి ఈజ్ ఎలైవ్’ అన్నాను. ఆ పెద్దాయన షాకయ్యి, ఇంకేం మాట్లాడాలో అర్ధం కాక కాసేపు మౌనంగా వుండి వెళ్ళిపోయారు.

“సాయంత్రం 5.30

“కర్నూలు నుంచి ఈయన్నిఇంటికి తీసుకువచ్చారు. రూము మధ్యలో పెద్ద బాక్సు. తెల్లని బట్టల్లో చుట్టి ఉంచారు. ఒక్కసారి చూపించమని అడిగాను. ‘వద్దు వద్దు చూస్తే మీరు తట్టుకోలేరు. మీ మనస్సులో వుండే ఇమేజ్ ని అలాగే ఉంచుకోండి’ అన్నారెవరో.

“షర్మికి ఎక్కడలేని కోపం వచ్చింది.

‘ఎందుకు అలా కవర్ చేసారు. అసలు ఇందులో వున్నది నాన్నేనా! వుంటే, ముఖం ఎక్కడ? కాళ్ళు ఎక్కడ? అదయినా మాకు తెలియాలి కదా’ అంటూ అరిచేసింది.

సెప్టెంబరు - 4

ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సోనియా గాంధి, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధి వచ్చారు.

రెండు హెలికాప్టర్లలో ఈయన్ని తీసుకుని అందరం సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకున్నాం. 5. 20 ప్రాంతంలో లక్షలాది జనాలమధ్య, తోపులాటల నడుమ ఈయన్ని సమాధి చేసారు. అదే సమయంలో ఆకాశంలో హరివిల్లు కనబడింది. ఆ రాత్రి చుట్టూ ఒక వలయంతో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాడు. పక్కనే మరో కాంతివంతమైన నక్షత్రం కూడా కనబడింది. బ్రదర్ బిల్లిగ్రాహమ్ చనిపోయినప్పుడు కూడా ఈ దృశ్యం కనబడిందట”

రాజశేఖరరెడ్డి మరణానంతరం మారిన రాజకీయ పరిస్తితుల్లో తమ కుటుంబం పడిన మానసిక వేదనలను విజయమ్మ విశదంగా రాశారు.

“పార్టీ అధిష్టానం ఆరళ్ళు భరించలేక జగన్ ఎంపీ పదవికీ, నేను ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసాము.  జగన్ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. అతడికి మద్దతుగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా  చేసారు. జగన్ ని కట్టడి చేస్తే కొత్త పార్టీకి  పుట్టగతులు లేకుండా పోతాయని అనుకుందో ఏమో ఉపఎన్నికలకు పదిహేను రోజుల ముందు జగన్ ని విచారణ పేరుతొ పిలిచి నాడు అరెస్ట్ చేసారు. జైలుకు పోతూ జగన్ నాతొ చెప్పాడు.

‘వాళ్ళు మనల్ని నమ్ముకుని బయటకు వచ్చారు. వాళ్ళని గెలిపించుకోవాలి.  నువ్వూ, షర్మీ క్యాంపెయిన్ కి వెళ్ళాలమ్మా’ అని. బస్సులో పదివేల కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేసాం. తొంభయి  రోజులకు రావాల్సిన బెయిలు రాకుండా ఆపారు. కోడలు భారతి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగి నలిగిపోయింది. మరో పక్క సాక్షి నిర్వహణ బాధ్యతలు. ఆస్తుల జప్తులు. మానసిక వేధింపులు. దుష్ప్రచారాలు.

“జగన్ కు బెయిల్ రాకపోవడంతో, షర్మిల అన్న విడిచిన బాణంలా పది మాసాలపాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. తండ్రి పోయిన తర్వాత పిల్లలు పడుతున్న బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది. పదహారు నెలల తర్వాత జగన్ జైలు నుంచి బయటకు వచ్చాడు.

“ఎన్నికల తర్వాత వై.ఎస్.ఆర్.  పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాం కానీ రాలేదు. జగన్ మాత్రం నిరాశ పడకుండా మళ్ళీ జనం మధ్యకు వెళ్ళాడు. పద్నాలుగు నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. ఒక కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేయడం ఒక రికార్డు.  పడిన ఈ కష్టాలకు 2019 ఎన్నికల్లో  ప్రజలు చక్కని  ఫలితం చూపించారు. బ్రహ్మాండమైన  మెజారిటీతో గెలిపించారు.

“జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ, ‘వై.ఎస్’ అనగానే నేను ఒక్కకసారిగా ఉద్వేగానికి గురయ్యా. తొమ్మిది సంవత్సరాల పాటు అనుభవించిన కష్టాలు, మోసిన నిందలు, అనలేని, వినలేని మాటలు, కేసులు, జగన్ జైలు ..అన్నీ ఒక్కసారి గుర్తుకువచ్చాయి.

“పేదవాడి కోసం నాన్న ఒక్క అడుగు వేస్తే  నేను రెండు అడుగులు వేస్తాను’ అంటున్న జగన్ ని చూస్తే,పేదలకోసం ఈయన ప్రారంభించిన ప్రతి పధకాన్ని జగన్ అమలుచేసి తీరతాడనే  నమ్మకం కలుగుతోంది.

“అప్పుఅడప్పుడు అనిపిస్తుంది. ఈయన  వున్నప్పుడు ఇంట్లో పదిమందిమి ఎంత బాగావుండేవాళ్ళం. జీవితం ఎంత పర్ఫెక్ట్ గా సాగేది’ అని.  షర్మి వెంటనే అంటుంది.

‘అమ్మా రోజులు గడుస్తున్న కొద్దీ మనం స్వర్గంలో వున్న నాన్నని కలవడానికి ఒక్కోరోజు దగ్గరవుతున్నాం అని మరచిపోకు. మనం ఆయనతో కొన్నేళ్ళే గడిపామని బాధపడే  అవసరం లేదు. స్వర్గానికి చేరిన తర్వాత అక్కడ ఫ్యామిలీ అంతా ఎప్పటికీ కలిసి జీవిస్తాం’

“ఇక జగన్ వాళ్ళ నాన్న ఎక్కడికీ వెళ్ళలేదని భావిస్తున్నాడు. తను వేసే ప్రతి అడుగూ ఈయన దగ్గర వుండి  చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని విశ్వసిస్తున్నాడు. ప్రజల ప్రేమలో ఈయన  కనబడుతూనే ఉన్నాడని జగన్ నమ్ముతున్నాడు.

పిల్లలు ఇలా వుంటే ఇక ఆ తల్లికి ఏం కావాలి!      

నేను చదివిన పుస్తకం ‘నాలో...నాతో... YSR’

 

సమాజంలో ఏ వ్యక్తి గురించి అయినా ఆయన భార్యకు తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియదు. అంచేత భార్యలు తమ భర్తల గురించి రాసే రచనల్లో అసమగ్రతకు అవకాశం తక్కువ. సాధికారతకు అవకాశం ఎక్కువ. ఆ రీత్యా చూస్తే శ్రీమతి వై.ఎస్. విజయమ్మ(వాస్తవానికి పుస్తకం ముఖచిత్రం మీద రచయిత్రి పేరు వైయస్ విజయ రాజశేఖరరెడ్డి అని ముద్రించారు. వారి వివాహ శుభలేఖలో విజయమ్మ పేరు రాజేశ్వరి అని వేశారు. జాతకాల్లో గణాలేవో సరిపోలేదని తమ పేరును రాజేశ్వరిగా మార్చారని, అందుకే వెడ్డింగ్ కార్డులో విజయలక్ష్మి అని ఉండదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ ఆ పేరుతొ నన్నెవ్వరూ, ఎప్పుడూ పిలవలేదని కూడా వెల్లడించారు) భర్త  వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురించి రాసిన ‘నాలో...నాతో... YSR’ అనే గ్రంధం అత్యంత సమగ్రంగా, వాస్తవాలకు అతి దగ్గరగా  వుంది.  రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాన్ని అతి దగ్గరగా గమనించగలిగిన జీవన సహచరిగా శ్రీమతి విజయమ్మ ఆయన గురించి తన మనసులోని భావాలకు అందంగా, హృద్యంగా, ఒక్కోచోట హృదయం ద్రవించే విధంగా అక్షరరూపం ఇవ్వడంలో సఫలీకృతం అయ్యారు. దీనికి తగ్గట్టు ప్రచురించింది ఎమెస్కో కావడం మూలాన పుస్తక స్వరూపం కూడా వైభవంగా రూపుదిద్దుకుంది.  

ముఖ్యంగా వై.ఎస్.ఆర్. తో తన పెళ్లి గురించీ, తమ కుటుంబ సభ్యుల నడుమ బలంగా పెనవేసుకుని పోయిన అనుబంధాలను గురించీ, షర్మిల వివాహం గురించీ, ఆయన షష్టిపూర్తి విశేషాలు గురించీ ఆవిడ అనేక విషయాలను దాపరికం లేకుండా వ్యక్త పరచిన విధానం ఈ పుస్తకానికి మంచి విశ్వసనీయతను సమకూర్చిపెట్టింది.

‘పెళ్లి కాకముందు నా ప్రపంచం చాలా చిన్నది. పెళ్ళయ్యాక ఈయనే నా ప్రపంచమయ్యారు. ఈయనతో పాటు  విస్తారంగా నా ప్రపంచం  పెరిగింది. అందుకే ఇవాళ నేను మీకు తెలుసు’ అని మొదటి పేజీలోనే రాసిన వినమ్రపూరిత వాక్యాలు చదువరులని క్షణం ఆలస్యం చేయకుండా ఈ పుస్తక ప్రపంచంలోకి తీసుకువెడతాయి.

వై.ఎస్.ఆర్. మరణించడానికి కొద్ది రోజులముందు ఆయన  షష్టిపూర్తి జరిగింది. పెద్ద హడావిడి లేదు, కేవలం కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆడంబరంగా జరక్కపోయినా పిల్లల బలవంతం మీద సాంప్రదాయంగా, వేడుకగా నిర్వహించారు. దంపతుల చేత పట్టుబట్టలు కట్టించారు. పక్కపక్కన కూర్చోబెట్టారు. తాళి కట్టించారు. వై.ఎస్. చేత విజయమ్మ కాళ్ళకు మెట్టెలు తొడిగించారు. నల్లపూసల గొలుసు భార్య మెడలో వేయించారు. ఉంగరాలు, దండలు మార్పించారు. బిందెలో ఉంగరం వేసి వధూవరుల చేత తీయించారు. తలంబ్రాల వేడుక కనుల పండుగగా చేసారు. ఇదంతా ఎప్పుడు? 2009 ఆగస్టు ఇరవై రెండున. అంతకు ముందు రోజు మెహిందీ జరిపి ఆడవారి చేతులకు గోరింటాకు పెట్టారు.

“బాధాకరమైన విషయం ఏమిటంటే ...ఆరోజు పెట్టుకున్న  గోరింటాకు సెప్టెంబర్ రెండుకి పూర్తిగా చెరగను కూడాలేదు” అంటారు విజయమ్మ హృదయం ద్రవించేలా. (ఆ రోజే వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు)

నిజానికి వై.ఎస్.ఆర్. జీవితం ఒక తెరిచిన పుస్తకం. కానీ ఆ తెరిచిన పుస్తకంలో కూడా చాలామందికి తెలియని కొన్ని అధ్యాయాలు వున్నాయి. వాటిని తెరిచి చూపించారు విజయమ్మ ఈ పుస్తకంలో ఎంతో మార్దవంగా. ఎవరినీ నొప్పించని రీతిలో, భాషలో.     

“వైఎస్సార్ ను ప్రత్యర్ధులు ఎప్పుడూ ఫ్యాక్షనిస్ట్ అని, హైదరాబాదు మత కల్లోలాల్లో వందలమందిని చంపాడని గోబెల్స్ ప్రచారం చేస్తుంటారు. అలాంటివి వినే అనుకుంటా ఈయన సీఎం అయినప్పుడు ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త శ్రీ స్వామినాధన్ అయ్యర్, ఆ గోబెల్స్ ప్రచారాలు నిజమనుకుని ‘ఇటువంటివారు ముఖ్యమంత్రులు అయితే ఈ దేశం ఏమైపోతుంద’ని అన్నారట. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో  శాంతి భద్రతలు వుండాలని నక్సలైట్లతో చర్చలు జరిపారు.  ఈయన చనిపోయిన తర్వాత ఒసారి చత్తీస్ ఘడ్ లో నక్సలైట్లు కాల్పులు జరుగుతున్నప్పుడు, ఇదే స్వామినాధన్ గారు ‘ తుపాకీ గుండు పేల్చకుండా,  రక్తం బొట్టు చిందించకుండా పల్లెల్ని పచ్చగా సంతోషాలతో నింపిన మహోన్నతుడు రాజశేఖరరెడ్డి గారు, అటువంటి వ్యక్తిని ఈ దేశం మళ్ళీ పుట్టిస్తుందా’ అని ప్రశంసించారు. (బహుశా అప్పటికి వై.ఎస్. ఆర్. గురించి విన్నవన్నీ గోబెల్స్ ప్రచారాలు అని బోధపడి వుంటుంది)

వై.ఎస్. సతీమణిగా రచయిత్రి విజయమ్మ ఈ పుస్తకంలో వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు.

“ఒక సైనికుడి భార్యలా జీవించాను. ఈయనకి ప్రతిరోజూ ప్రజాజీవితంలో ఏదో ఒక యుద్ధం తారసపడేది. ఈయనకు తిలకం దిద్ది విజయ కీర్తిని ప్రసాదించమని ప్రార్ధించడమే నా జీవితం”

“ఈయనకు మీసాలు బాగా ఉంటేనే రాజసంగా కనిపిస్తారు. ఎంపీ అయినప్పుడు మీసాలు తగ్గించారని కొట్లాడాను. సి ఎం అయిన తర్వాత ఇంకా తగ్గించారు. ఒకటి రెండు సార్లు చెప్పిచూశాను. ఎలాగూ మాట వినరని ఓసారి బార్బరుకు కూడా చెప్పి చూశాను. అయినా లాభం లేకపోయింది.”

“మొదటిసారి సి ఎం అయినప్పుడు ఆనవాయితీని గౌరవిస్తూ ఈయన తిరుపతి వెళ్ళారు. తర్వాత కొన్నాళ్ళకు ఒక బిలీవర్ ఈయన దగ్గరకొచ్చి ‘ఒక క్రిష్టియన్ అయివుండి మీరు దేవాలయాలకు వెళ్ళడం తప్పు అనిపించలేదా అని అడిగారు. అప్పుడు ఈయన ఒకే మాట అన్నారు, ‘మతానికి సంబంధంలేదు, అది వ్యక్తిగతం. ఎవరి నమ్మకం వారిది. అన్నిటినీ, అందరినీ గౌరవించుకోవాలి. ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరి అభిమతాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై వుంది”      

“షర్మి(షర్మిల) కి చిన్నప్పటి నుంచీ గోళ్ళు కొరకడం ఓ అలవాటు. దాన్ని మాన్పించడానికి ఓ తండ్రిగా, ఓ డాక్టరుగా ఈయన విశ్వప్రయత్నం చేసేవారు. చివరికి ఓ కండిషన్ మీద ఒప్పుకుంది. “ముందు మీరు సిగరెట్ మానేయండి పా (తండ్రిని అలాగే పిలుస్తుంది, ఈయన షర్మీని పాప్స్అని పాపా అని పిలిచేవారు) నేను గోళ్ళు కొరకడం మానేస్తాను” అంది. మాటకి కట్టుబడి ఇద్దరూ తమ అలవాట్లు వదిలిపెట్టారు”

“రోజూ రాత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ పై సంతకాలు పెట్టికానీ పడుకునేవారు కాదు. ‘ఒక్క రోజు లేటైనా పేషెంటుకు ఉపయోగపడకపోవచ్చు. ఇక మోసాలు అంటావా. ఒక మనిషి ప్రాణం నిలబడ్డం ముఖ్యం. ఏదైనా జరిగితే ఎంక్వైరీ లో బయట పడతాయి”  

నాలో... నాతో అనే పేరు పెట్టడం వల్ల ఇదేదో రాజకీయాలకు అతీతమైన పుస్తకం అనుకోనక్కర లేదు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం యావత్తూ ఇందులో వుంది.

వైఎస్ ఆఖరి ఘడియల్ని విజయమ్మ చాలా వివరంగా, ఒక డైరీ లాగా రాసుకొచ్చారు, ఈ పుస్తకంలో.

ఆవిడ మాటల్లోనే :

“సెప్టెంబరు -2.  ఉదయం 7.15 కల్లా రెడీ అయిపోయారు. బ్రేక్ ఫాస్ట్ దగ్గరకూర్చున్నప్పుడు జగన్ వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఫోను వచ్చింది. ‘సార్!  వర్షాలు బాగా పడుతునాయి. ఇప్పుడు పోవద్దు సార్!’ అంటున్నారు ఎవరో అవతల నుంచి. నేనూ అదే మాట చెప్పాను.

‘పైలట్ వద్దంటే చేసేదేముంటుంది. ఇంటికి వస్తాను. వేరే అప్పాయింట్ మెంట్లు లేవు కాబట్టి అందరం కూర్చుందాములే’ అన్నారు నాతో.

“ఎప్పుడూ నవ్వుతూ వుండే ఈయన ఆరోజు మాత్రం హెలికాప్టర్ ఎక్కేటప్పుడు కొంచెం సీరియస్ గా వున్నారని చాలామంది నాతో చెప్పారు. తర్వాత టీవీల్లో చూసినప్పుడు నాక్కూడా అలాగే అనిపించింది.

“ఉదయం 8.34 కి  హెలికాప్టర్ టేకాఫ్ అయింది. 9.34 నుంచి హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయట.

“విషయం తెలిసి భారతి, షర్మి పిల్లలు బెంగుళూరు నుంచి హైదరాబాదు వచ్చారు.

“సెప్టెంబరు - 3

“హెలికాప్టర్ కూలిపోయిన సంగతి జగన్ కు ముందే తెలిసినా మాతో చెప్పలేదు. రూములోకి వెళ్లి చాలాసేపటివరకూ బయటకు రాలేదు.

“తర్వాత జగన్ మమ్మల్ని దగ్గరకు తీసుకుని భోరున ఏడ్చాడు. మాకు ఆ వార్త నమ్మశక్యంగా అనిపించలేదు.

“మధ్యాన్నం 12.30 నుంచి  గవర్నర్, చంద్రబాబునాయుడు ఇంకా చాలామంది నాయకులు పరామర్శకు రావడం మొదలయింది.  కానీ ఈయన జీవించే ఉన్నారన్న నమ్మకం నాలో చావలేదు. అందుకే గవర్నర్ పలకరించగానే నేను, ‘ఆయనకేం కాదు, హి ఈజ్ ఎలైవ్’ అన్నాను. ఆ పెద్దాయన షాకయ్యి, ఇంకేం మాట్లాడాలో అర్ధం కాక కాసేపు మౌనంగా వుండి వెళ్ళిపోయారు.

“సాయంత్రం 5.30

“కర్నూలు నుంచి ఈయన్నిఇంటికి తీసుకువచ్చారు. రూము మధ్యలో పెద్ద బాక్సు. తెల్లని బట్టల్లో చుట్టి ఉంచారు. ఒక్కసారి చూపించమని అడిగాను. ‘వద్దు వద్దు చూస్తే మీరు తట్టుకోలేరు. మీ మనస్సులో వుండే ఇమేజ్ ని అలాగే ఉంచుకోండి’ అన్నారెవరో.

“షర్మికి ఎక్కడలేని కోపం వచ్చింది.

‘ఎందుకు అలా కవర్ చేసారు. అసలు ఇందులో వున్నది నాన్నేనా! వుంటే, ముఖం ఎక్కడ? కాళ్ళు ఎక్కడ? అదయినా మాకు తెలియాలి కదా’ అంటూ అరిచేసింది.

సెప్టెంబరు - 4

ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సోనియా గాంధి, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధి వచ్చారు.

రెండు హెలికాప్టర్లలో ఈయన్ని తీసుకుని అందరం సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకున్నాం. 5. 20 ప్రాంతంలో లక్షలాది జనాలమధ్య, తోపులాటల నడుమ ఈయన్ని సమాధి చేసారు. అదే సమయంలో ఆకాశంలో హరివిల్లు కనబడింది. ఆ రాత్రి చుట్టూ ఒక వలయంతో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాడు. పక్కనే మరో కాంతివంతమైన నక్షత్రం కూడా కనబడింది. బ్రదర్ బిల్లిగ్రాహమ్ చనిపోయినప్పుడు కూడా ఈ దృశ్యం కనబడిందట”

రాజశేఖరరెడ్డి మరణానంతరం మారిన రాజకీయ పరిస్తితుల్లో తమ కుటుంబం పడిన మానసిక వేదనలను విజయమ్మ విశదంగా రాశారు.

“పార్టీ అధిష్టానం ఆరళ్ళు భరించలేక జగన్ ఎంపీ పదవికీ, నేను ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసాము.  జగన్ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. అతడికి మద్దతుగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా  చేసారు. జగన్ ని కట్టడి చేస్తే కొత్త పార్టీకి  పుట్టగతులు లేకుండా పోతాయని అనుకున్నారో ఏమో ఉపఎన్నికలకు పదిహేను రోజుల ముందు జగన్ ని విచారణ పేరుతొ పిలిచి నాడు అరెస్ట్ చేసారు. జైలుకు పోతూ జగన్ నాతొ చెప్పాడు.

‘వాళ్ళు మనల్ని నమ్ముకుని బయటకు వచ్చారు. వాళ్ళని గెలిపించుకోవాలి.  నువ్వూ, షర్మీ క్యాంపెయిన్ కి వెళ్ళాలమ్మా’ అని. బస్సులో పదివేల కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేసాం. తొంభయి  రోజులకు రావాల్సిన బెయిలు రాకుండా ఆపారు. కోడలు భారతి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగి నలిగిపోయింది. మరో పక్క సాక్షి నిర్వహణ బాధ్యతలు. ఆస్తుల జప్తులు. మానసిక వేధింపులు. దుష్ప్రచారాలు.

“జగన్ కు బెయిల్ రాకపోవడంతో, షర్మిల అన్న విడిచిన బాణంలా పది మాసాలపాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. తండ్రి పోయిన తర్వాత పిల్లలు పడుతున్న బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది. పదహారు నెలల తర్వాత జగన్ జైలు నుంచి బయటకు వచ్చాడు.

2014 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.  పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాం కానీ రాలేదు. జగన్ మాత్రం నిరాశ పడకుండా మళ్ళీ జనం మధ్యకు వెళ్ళాడు. పద్నాలుగు నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. ఒక కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేయడం ఒక రికార్డు.  పడిన ఈ కష్టాలకు 2019 ఎన్నికల్లో  ప్రజలు చక్కని  ఫలితం చూపించారు. బ్రహ్మాండమైన  మెజారిటీతో గెలిపించారు.

“జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ, ‘వై.ఎస్’ అనగానే నేను ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యా. తొమ్మిది సంవత్సరాల పాటు అనుభవించిన కష్టాలు, మోసిన నిందలు, అనలేని, వినలేని మాటలు, కేసులు, జగన్ జైలు ..అన్నీ ఒక్కసారి గుర్తుకువచ్చాయి.

“పేదవాడి కోసం నాన్న ఒక్క అడుగు వేస్తే  నేను రెండు అడుగులు వేస్తాను’ అంటున్న జగన్ ని చూస్తుంటే, పేదలకోసం ఈయన ప్రారంభించిన ప్రతి పధకాన్ని జగన్ అమలుచేసి తీరతాడనే  నమ్మకం కలుగుతోంది.

“అప్పుఅడప్పుడు అనిపిస్తుంది. ఈయన  వున్నప్పుడు ఇంట్లో పదిమందిమి ఎంత బాగావుండేవాళ్ళం. జీవితం ఎంత పర్ఫెక్ట్ గా సాగేది’ అని.  షర్మి వెంటనే అంటుంది.

‘అమ్మా రోజులు గడుస్తున్న కొద్దీ మనం స్వర్గంలో వున్న నాన్నని కలవడానికి ఒక్కోరోజు దగ్గరవుతున్నాం అని మరచిపోకు. మనం ఆయనతో కొన్నేళ్ళే గడిపామని బాధపడే  అవసరం లేదు. స్వర్గానికి చేరిన తర్వాత అక్కడ ఫ్యామిలీ అంతా ఎప్పటికీ కలిసి జీవిస్తాం’

“ఇక జగన్, వాళ్ళ నాన్న ఎక్కడికీ వెళ్ళలేదని భావిస్తున్నాడు. తను వేసే ప్రతి అడుగూ ఈయన దగ్గర వుండి  చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని విశ్వసిస్తున్నాడు. ప్రజల ప్రేమలో ఈయన  కనబడుతూనే ఉన్నాడని జగన్ నమ్ముతున్నాడు”

పిల్లలు ఇలా అంటూ వుంటే ఇక ఆ తల్లికి ఏం కావాలి!

ఈయన జీవితంలో ఎన్నో సంతకాలు పెట్టారు. ప్రతి సంతకం ఎందరికో జీవితం అయిందిఅని ముగించారు విజయమ్మ ఈ పుస్తకాన్ని. (EOM)

6, ఆగస్టు 2020, గురువారం

ఈ జీవితానికి పని పూర్తయింది

పెద్దల ఆశీశ్శులతో, ఆత్మీయుల ఆదరణతో, పిల్లల ప్రేమాభిమానాలతో కరోనా నేపథ్యంలో సైతం మా ఆవిడ ఏడూడి ,(సంవత్సరీకాలు) భగవంతుని దయతో నిర్విఘ్నంగా నేటితో పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల క్రతువులో నేను నిమిత్తమాతృడిని. కొడుకులు, కోడళ్ళు యావత్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు.

మొత్తం కార్యక్రమంలో అందరికీ కళ్ళ నీళ్ళు తెప్పించింది మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి వ్యాఖ్య:

"మాకన్నా ఎంతో చిన్నదైన మా తమ్ముడి భార్యకు దండాలు పెట్టడం ఎంతో బాధ కలుగుతున్నది . ఏటా అమ్మ నాన్నల తద్దినాలకు వెళ్లి, అదే ఇంట్లో ఎన్ని సంవత్సరాలనుంచో దండాలు పెడుతూ ఉన్నాము .అదే ఇంట్లో ఈరోజు ఇలా చిన్న మనిషికి నమస్కరించి రావడం
మనసును కలచి వేసింది .
అమ్మ నాన్నల తద్దినాలు పెట్టినప్పుడు , తమ్ముడి భార్య నిర్మల సర్వం తానుగా అన్ని ఏర్పాట్లు చేసి , పురో హితునితో మాట్లాడటం, వంటమనిషితో మాట్లాడటం ,
ధోవతులు తేవడం ,అందరికీ ఫోన్లు చేయడం , మడి కట్టుకొని అన్నీ ఏర్పాట్లు స్వయంగా, శ్రద్ధగా, నిష్ఠగా చూసుకొనేది .
అటువంటిది ఆ ఇంట్లోనే ఆమె పిండాలకు దణ్ణం పెట్టడం మా దురదృష్టం .మనం దేనినన్న జయించవచ్చు కానీ ,
విధిని మాత్రం జయించలేము .విధికి తలవంచి రాజీ పడటం మాత్రమే మనం చేయకలిగే కర్తవ్యం .
ఆమె పవిత్ర ఆత్మకు
శ్రద్దాంజలి . ఓం శాంతి శాంతి" (05-08-2020)