చంద్రబాబు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చంద్రబాబు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మార్చి 2022, సోమవారం

చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

 చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.

హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి, అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం ’ అన్నారు.

నేను మళ్ళీ ఇక్బాల్ దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.

సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా, ఇందరు ముఖ్యమంత్రులు మారినా  అది పట్టించుకున్నట్టు దాఖలా నాకయితే కనిపించడం లేదు.

ట్రాఫిక్ కు సంబంధించి వై ఎస్ తో మరో జ్ఞాపకం వుంది.

హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే ఒక రోజున ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి    ఫోటోగ్రాఫర్ల సంఘం నాయకులు, అప్పుడు  క్లబ్ కార్యదర్శిగా ఉన్న నేను,  మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. (అప్పటికి  మెట్రో రైలు నిర్మాణం జరగలేదు)  కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే, ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ మొబైల్ కి ఫోను చేశాను. ఆయన ‘అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు




(14-03-2017)

14, మార్చి 2021, ఆదివారం

చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

 చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.

హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్  (ఇప్పుడు  వైసీపీ  ఎమ్మెల్సీ) నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి, అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం ’ అన్నారు.

నేను మళ్ళీ ఇక్బాల్ దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.

సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు దాఖలా నాకయితే కనిపించడం లేదు.

ట్రాఫిక్ కు సంబంధించి వై ఎస్ తో మరో జ్ఞాపకం వుంది.

హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. (అప్పుడు మెట్రో లేదు, డివైడర్ మాత్రమే వుంది)

కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే, ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ మొబైల్ కి ఫోను చేశాను. ఆయన ‘అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.

 

8, మే 2020, శుక్రవారం

ఇద్దరు ముఖ్యమంత్రులు - ఒక సీఎస్



రాజకీయాల్లో, ప్రత్యేకించి ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ విశ్లేషణలు చేయగలగడం నిజంగా కత్తిమీద సామే. ఇంగ్లీషులో న్యూట్రాలిటి అని పిలుచుకుంటున్న ఈ పదానికి ఎవరి అర్ధం వారు చెప్పుకుంటున్నారు.  ఏపీ రాజకీయ యవనికపై ఎన్ని పాత్రలు కనిపిస్తున్నా ప్రస్పుటంగా కనిపించేది చంద్రబాబు, జగన్ మోహన రెడ్డి ఇద్దరు మాత్రమే. టీడీపీ, వైసీపీ పార్టీలు  కూడా కాదు, బాబు, జగన్ ఇద్దరు మాత్రమే. వారి చుట్టూనే మొత్తం రాజకీయం పరిభ్రమిస్తోంది. గతంలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇలాంటి పోటీ చంద్రబాబునాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి నడుమ నడిచేది. పొతే,
ఐఏఎస్ కాకపోయినా జీవితంలో గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు కొందరు వుంటారు. కాకుంటే, వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో వుంటారు. వారిలో ఒకరు మోహన్ కందా. ఐఏఎస్ అయిన తర్వాత కూడా తనలో  నిగూఢంగా పెంచుకున్న రచనా దాహాన్ని రిటైర్ అయిన తర్వాత తీర్చుకున్నారు.  అందుకే గొప్పవాడు అన్నది.
రాజకీయాలు, న్యూట్రాలిటీ అనే మొదలు పెట్టి మధ్యలో ఈ కందా గారి ప్రసక్తి ఏమిటంటారా!  ఒక అధికారిగా ఉంటూ, అదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ  ఉత్తర దక్షిణ ధృవాల వంటి ఇద్దరు రాజకీయ నేతలతో నెగ్గుకు రావడం అనేది మామూలు వ్యవహారం కాదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సందర్భాలలో కూడా ఆయన తామరాకు మీది నీటిబొట్టువలే తన కర్తవ్యాన్ని నిర్వహించిన తీరు ఈ న్యూట్రాలిటీకి అద్దం పడుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  మోహన్ కందా ప్రధాన కార్యదర్శి. నిజానికి సీఎస్ గా కందాగారిని ఆయనే ఏరికోరి తెచ్చుకున్నారు. అదే సమయంలో రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేత. కొంతకాలం తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఎన్నికల అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. కందాగారు మాత్రం యధావిధిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాలని భావించేవారు. తనది వర్కింగ్ గవర్నమెంట్ అని చెప్పుకునేవారు. ఈ క్రమంలో ఆయన అధికారగణంపై అసహనాన్ని దాచుకునేవారు కాదు. ముఖ్యమంత్రి అలా కటువుగా మాట్లాడుతుంటే మోహన్ కందా ఒకసారి కలగచేసుకుని, “ఛీఫ్ సెక్రెటరీ అని నన్నిక్కడ కూర్చోబెట్టాక నేను చెప్పింది వినిపించుకోకపోతే ఎలా” అనేశారు. చంద్రబాబుకు కోపం వచ్చి, “నేను ఏ సిఎస్ ను మిమ్మల్ని చూసినట్టు చూసుకోలేదు” అన్నారు. కందా కూడా గట్టిగానే జవాబు ఇచ్చారు. “నాకు ఎటువంటి ట్రీట్ మెంట్ కావాలో నాకో అంచనా వుంది. మీరు మిగతా వాళ్ళ కంటే నన్ను బాగా ట్రీట్ చేస్తున్నారన్న ఫీలింగుతో నేనెలా సర్దిపెట్టుకుంటాను చెప్పండి”
“మీరు చెప్పేవి సబబుగానే అనిపిస్తున్నాయి.  నాక్కూడా ఏడేళ్ళ నుంచి అలా అలవాటయిపోయింది. ఎలెక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పటికిలా కానివ్వండి. వచ్చేసారికి ఇవన్నీ సర్దుకునే ప్రయత్నం చేద్దాం” అన్నారు చంద్రబాబు నవ్వుతూ.
ఇలాంటిదే వై.ఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా జరిగింది.
ఓసారి పెద్ద మీటింగు జరుగుతోంది. వై.ఎస్. కిందిస్థాయి  అధికారులను ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు నోరు తెరిచేలోగానే మోహన్ కందా జవాబు చెబుతున్నారు. వై.ఎస్ కాసేపు  చూసి ‘ఏమండీ నన్ను  అధికారులతో నేరుగా మాట్లాడనివ్వరా” అని మోహన్ కందాను అడిగారు.
“లేదండీ” అనేశారు కందా. ఎదురుచూడని ఆ జవాబుతో వైఎస్. నిర్ఘాంతపోయారు.
“చీఫ్ సెక్రెటరీగా ఇక్కడ కూర్చున్నంతసేపు వాళ్ళ తరపున జవాబు చెప్పాల్సిన బాధ్యత నాదే. మీకు వాళ్ళే డైరెక్టుగా సమాధానం చెబితే ఇక నేనెందుకు. లీడర్ షిప్ అంటే ఇదే”
“బలేవారే మీరు” అన్నారు వై.ఎస్. కాసింత చిరాగ్గా, కాస్త నవ్వుకుంటూను.                      
చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు లోకసభతో పాటు అసెంబ్లీకి కూడా కలిపి ఎన్నికలు జరపాలని కోరుతూ ప్రభుత్వం తరపున మోహన్ కందా కేంద్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ రాసారు. అప్పటి రాజకీయ పరిస్తితుల్లో అలా లేఖ రాయడం వై ఎస్ కి నచ్చలేదు. ఆయన మనసులో మాట దాచుకునే బాపతు కాదు.
రెండు ఎన్నికలు కలిపి నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ సిఫారసు చేయడం తప్పని ఆయన పత్రికా ప్రకటన చేసారు.
అది చూడగానే కందా గారు వై.ఎస్. కి ఫోను చేసారు.
“ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు. మీకేమిటి సంబంధం” అన్నారు వై.ఎస్. గట్టిగా.
కందా ఇలా చెప్పారు. “ఇది క్యాబినెట్ నిర్ణయం. సీఎస్ గా సమర్ధించాను. ఎందుకంటారా. మీరు నా చోట్లోకి వచ్చి చూడండి. మీరు చీఫ్ సెక్రెటరీగా వున్నా ఇదే నిర్ణయం తీసుకుంటారు”   
ఈ నేపధ్యంలో ఎన్నికలు జరిగాయి.
వై.ఎస్. ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులు మారినప్పుడు చీఫ్ సెక్రెటరీ మారడం ఒక నిబంధన కాకపోయినా మారుతున్న రాజకీయ పరిస్తితుల్లో ఆనవాయితీగా మారింది.
మోహన్ కందా వెళ్లి వై.ఎస్. ని కలిసి చెప్పారు. ‘ప్రభుత్వం మారింది. కొనసాగడానికీ, అలాగే  తప్పుకోవడానికీ అభ్యంతరం లేదు అని. రెండ్రోజుల్లో చెబుతా అన్నారు వై.ఎస్.
రెండ్రోజుల్లో ఆయనే పిలిచి చెప్పారు, “ఐ హావ్ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యు టు కంటిన్యూ”
మొదట్లోనే వై.ఎస్. సీ.ఎస్. తో మరోమాట కూడా చెప్పారు “ యూ విల్ ఫైండ్ మీ ఎ వెరీ ఈజీ మాన్ టు గెట్ ఆన్ విత్”  
పదవీవిరమణ తరువాత శ్రీ మోహన్ కందా ‘అనుభవాలూ – జ్ఞాపకాలూ’ అనే పేరుతొ ‘మోహన మకరందం’ రాశారు. అందులో ఇటువంటి ఆసక్తికరమైన అంశాలు ఎన్నో వున్నాయి. అవి చదువుతుంటే మోహన్ కందా గారిలో మనకు మరో ముళ్ళపూడి కనిపిస్తారు.
పైన పేర్కొన్న అంశానికి ఆయన ఇచ్చిన కొసమెరుపు ఆయన మాటల్లోనే:
“వై.ఎస్. అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతిపాదనల  ఎస్టిమేట్స్, ప్రొజెక్షన్స్ చూసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే కమిటీ వేసారు. దాని నాయకత్వం  చీఫ్  సెక్రెటరీకి అప్పగించారు.
ప్రతిపక్షంలోకి వచ్చిన టీడీపీ నాయకులు విమర్శలు మొదలు పెట్టారు. చీఫ్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు.
రాజశేఖరరెడ్డిగారి దగ్గరకు వెళ్లి “సీజర్స్ వైఫ్ షుడ్ బి ఎబౌవ్ సస్పిషన్. నేను లీవులో వెళ్ళిపోతా” అని రాసిచ్చాను.
అది చదివి పక్కన పడేస్తూ, ‘మీకేమిటి సంబంధం. నిర్ణయం నాదే కదా!” అన్నారు వై.ఎస్.
“మొన్నటిదాకా టీడీపీకి పక్షపాతం చూపించానని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కు వలపక్షం చూపిస్తున్నానని టీడీపీ వారు నిందలు వేస్తున్నారు” అన్నాను కారణం వివరిస్తూ.
“మీరే చెప్పారు కదా! చోటుమారి చూడమని” అని వై.ఎస్. గట్టిగా నవ్వేశారు.
(మోహన మకరందం, అనుభవాలూ – జ్ఞాపకాలూ  రచన: మోహన్ కందా, ప్రతులకు : నవోదయా బుక్ హౌస్, వెల: రెండు వందల రూపాయలు)               


28, ఏప్రిల్ 2020, మంగళవారం

నచ్చడు! నచ్చడంతే!!



అదేదో సినిమాలో ఓ క్యారక్టర్ అంటుంది ‘నాకు నీ ఫేస్ నచ్చలేదు’ అని.
అంటే అతడి మొహం నచ్చకపోతే ఆ వ్యక్తిలో నచ్చదగిన ఏ లక్షణాలు లేనట్టేనా!
ఈ మానసిక వ్యాధికి ఏదన్నా పేరు ఉందేమో తెలియదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి సాంఘిక మాధ్యమాల్లో వస్తున్న విపరీత వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒకటి మాత్రం సత్యం అనిపిస్తోంది. చంద్రబాబును నచ్చని వారు ఈ జన్మలో అతడ్ని మెచ్చరు. అలాగే జగన్ మోహన రెడ్డి. ఇతడ్ని ద్వేషించేవారికి అందుకు ప్రత్యేకమైన కారణం అక్కరలేదు. ఆ సినిమాలో చెప్పినట్టు జస్ట్ జగన్ మాకు నచ్చడు, నచ్చడంతే! అంతే కాదు, అతడేమి చేసినా మంచయినా సరే మాకు నచ్చదు, నచ్చదు నచ్చదంతే. చంద్రబాబును నరనరాన ద్వేషించేవారిది కూడా ఇదే తరహా! ఆయన ఏ పని చేసినా మాకు నచ్చదు, నచ్చదు గాక నచ్చదు. మరో మాట లేదు.
మరో విషయం ఏమిటంటే వీరెవ్వరూ వాళ్ళపార్టీల కార్యకర్తలు కాదు, వారి అనుచరులు కాదు. వాళ్ళు గెలిచినా, ఓడినా వీళ్ళకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఏదో ప్రయోజనం ఆశించి పెంచుకున్న అభిమానం కాదు వీరిది.
అయినా సరే! మేమింతే మేము మారం అనేది వీరి నినాదం. నాకో డౌటనుమానం. అదేమిటంటే వీరిలో ఎవరికయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు వుందా!


(ఎవరి ఫోటో ముందు పెట్టాలి అనేదానిపై వాదులాట మొదలయినా ఆశ్చర్యం లేదు)

14, మార్చి 2017, మంగళవారం

చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు

చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు. 
హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి, అని. చంద్రబాబు నన్ను చూస్తూనే వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండిఅంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం అన్నారు.
నేను మళ్ళీ ఇక్బాల్ దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు దాఖలా నాకయితే కనిపించడం లేదు.

ట్రాఫిక్ కు సంబంధించి వై ఎస్ తో మరో జ్ఞాపకం వుంది.
హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే, ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ మొబైల్ కి ఫోను చేశాను. ఆయన అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాముఅని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.

6, ఆగస్టు 2016, శనివారం

ప్రమాదో ధీమతామపి


ప్రతిభావంతులు కూడా పొరబాట్లు చేస్తారు, ధీమంతులకు కూడా ప్రమాదాలు తప్పవు అనే అర్ధంలో సంస్కృతంలో వాడే ప్రయోగం ఇది.

2001  లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  యంపీటీసీ, జెడ్ పీ టీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల వాళ్ళు విసుగూ విరామంలేకుండా ప్రచార పర్వంలో మునిగితేలుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర లో ప్రచారానికి వెళ్ళారు. సాక్షాత్తు రాములవారే అశ్వమేధ యాగాశ్వ పరిరక్షణకు వెళ్లినట్టు ముఖ్యమంత్రి సయితం ఆ స్థానిక ఎన్నికల్లో అలుపు ఎరుగని రీతిలో అనేక సభల్లో ప్రసంగిస్తూ వెడుతున్న సమయంలో ఒకచోట ప్రసంగం ముగిస్తూ ‘తెలుగు దేశం పార్టీ అభ్యర్ధుల్ని చిత్తుగా ఓడించండి’ అని పిలుపు ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు విస్తుపోయారు. జరిగిన పొరబాటు వెంటనే గుర్తించిన చంద్రబాబు దాన్ని వెంటనే సవరించుకున్నారు. ఇప్పట్లా అప్పట్లో ప్రత్యక్ష ప్రసారాల హడావిడి లేకపోబట్టి  ఈ ఉదంతం వెలుగు చూడలేదు. అయినా స్థానిక పత్రిక ఒకటి ప్రచురించింది. ఇంతటి పొరబాటు మాట ఆయన  నోటంట జారిపడడానికి  కారణం ఆయనలో ఏమూలనో దాగున్న కాంగ్రెస్ నేపధ్యం కారణం కాదుకదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. 

2, జూన్ 2016, గురువారం

ఓ జ్ఞాపకం



హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు  ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగిన రోజుల్లో ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగానో, పీసీసీ అధ్యక్షుడిగానో వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వచ్చి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని  పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో  వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. కాసేపట్లో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు ప్రెస్ క్లబ్ దగ్గర ఆగకుండా  గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే ముందుకు వెళ్ళిపోయింది. నేను వెంటనే కేవీపీ కి ఫోన్ చేశాను. ఆయన ‘అర్రెర్రే బషీర్ బాగ్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ  వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.         

2, డిసెంబర్ 2014, మంగళవారం

ఆరు మాసాలు - అరవై వివాదాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 04-12-2014, THURSDAY)

'ఎంతో చేద్దామనుకున్నాను. కొంతే  చేయగలిగాను. ఏదయినా మంచి పని చేయాలని అనుకున్నప్పుడు ఇన్నిన్ని అవాంతరాలు, అడ్డంకులు ఉంటాయని అప్పుడు వూహించలేకపోయాను'
పదవి దిగిపోయేముందు  ప్రతి రాజకీయ నాయకుడూ చెప్పే మాట ఇది.
'ఈసారి మరో అవకాశం ఇచ్చి చూడండి. ఏం చేద్దామని అనుకున్నానో, ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను'
ఆ ప్రతి రాజకీయ నాయకుడు  మళ్ళీ మళ్ళీ చెప్పే మాటలు కూడా ఇవే.  
కొత్త రాష్ట్రం ఏర్పడీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటయి అక్షరాలా ఆరు మాసాలు. మరో కొత్త రాష్ట్రంలో మరో కొత్త ప్రభుత్వం ఏర్పడి మరో వారంలో ఆరు నెలలు పూర్తవుతాయి. తప్పదనుకున్నా, తప్పే అయినా తప్పనిసరిగా పోల్చి చూసుకోవాల్సిన పరిస్తితి ఈ రెండు తెలుగు రాష్ట్రాలదీ. బహుశా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలలో వేటిల్లో కూడా ఈ ఆంద్ర,  తెలంగాణాల్లో వున్న విచిత్ర, వింత  పరిస్తితి వుందనుకోలేము.
కోరి కోరి, పోరి పోరి కోరిన రాష్ట్రం తెచ్చుకుని ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీ ఆర్ ఎస్ పార్టీకి విభజన తలనొప్పులు తప్పలేదు.
అవిభాజ్య ఆంద్ర ప్రదేశ్ గా వున్నప్పుడు, 'కలసివుంటే పండగ, వేరు కుంపటి దండగ' అంటూ పల్లవులు పాడి, చివరకు గత్యంతరం లేని స్తితిలో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి, విభజనానంతర అవశేష ఆంద్ర ప్రదేశ్ లో అధికార పగ్గాలు దక్కించుకున్న తెలుగు దేశం పార్టీకి అవే తలనొప్పులు. వచ్చిపడ్డవి కొన్నయితే, కొని తెచ్చుకున్నవి మరి కొన్ని. ఈ నొప్పులు వారివరకు పరిమితమయితే కధ వేరుగా వుండేది. అవి ప్రజల వరకు బదిలీ అవుతుండడమే ఇందులోని విషాదం.
కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కొత్త ఇబ్బందులు సహజం. అవి ఎలా ఉంటాయో, వాటి పర్యవసానాలు ఎలా వుండబోతాయో అన్నది అందరికీ ముందే తెలుసు. అయినా అందరి సమ్మతితోనే రాష్ట్ర విభజన జరిగి పోయింది. విభజన నిర్ణయం జరిగీ జరగగానే, ఉమ్మడి రాష్ట్రంలో అటు లోక సభకు ఎన్నికలు జరిగాయి. మరో విడ్డూరం ఏమిటంటే, రాష్ట్ర విభజన జరగక ముందే రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికల తంతు ముగించారు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరువాతనే, జూన్ రెండో తేదీన రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిచేశారు. ఎన్నికయిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ వారం రోజుల తేడాతో కొలువు తీరాయి. ఇక అప్పుడు మొదలయింది అసలు కధ. 
    
మొదటి అధ్యాయం చంద్రబాబు నాయుడు సర్కారు ఎక్కుబెట్టిన  పీపీయే అస్త్రంతో  శ్రీకారం చుట్టుకుంది. అది పెరిగి పెరిగి  రగిలి రగిలి మంటలుగా మారుతూ ఉన్నప్పుడే, తెలంగాణా సర్కారు తన అంబుల పొదిలోని ఫీజు రీ ఇంబర్స్ మెంటు అంశాన్ని తీసి అంకుశంలా ప్రయోగించింది. దానితో, పిల్లల చదువులతో పాటు  కాలేజీ యాజమాన్యాలు కూడా గందరగోళంలో పడ్డాయి. స్థానికత వివాదం సుడులు రేపుతుండగానే మరో పక్క  కరెంటు సెగ రాజుకుంది. అటూ ఇటూ అందరూ కలిసి  దాన్ని మరింత ఎగదోశారు. రెండు పార్టీల నడుమ సహజంగా వున్న వైరుధ్యాలు ఆధ్యం పోశాయి. ఇరువైపులా మాటల తూటాలు పేలాయి. అనేక సందర్భాలలో అవి సభ్యతాసంస్కారాలకు కొంత  దూరం జరిగాయి. వీటికి తోడు శ్రీశైలం జలవివాదం కమ్ముకుంది. వీధి కొళాయిల దగ్గర తగాదాలను మరిపించింది. చివరికి సేద్యపు నీటి  ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్ చేసేవరకు కధ ముదిరింది. కాదేదీ వివాదానికి అతీతం అన్నట్టుగా, వాహనాల రిజిస్ట్రేషన్, ఇంటర్ బోర్డు, ఉమ్మడి పరీక్షలు  ఇలా ఏది తీసుకున్నా ప్రతి చిన్న అంశం రెండు రాష్ట్రాల నడుమ పెద్ద వివాదాలకు కారణమవుతోంది.  ఇక ఉన్నతాధికారుల విభజన పూర్తిగా తేలకుండానే  మిగిలిపోయింది. తమ నిష్క్రియాయపరత్వానికి ఓ సాకుగా ఈ అంశం ఉభయ ప్రభుత్వాలకు ఉపయోగపడుతోంది. అది వేరే విషయం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే,     
గత ఆరుమాసాలుగా ఈ రెండు నవజాత రాష్ట్రాలలోని  రెండు ప్రభుత్వాల నడుమ సయోధ్య అన్నది కలికానికి  కూడా కనబడకుండా పోయింది. ఇద్దరు  ముఖ్యమంత్రుల నడుమ మాటా  మంతీ లేదు. కలుసుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. దానికి కూడా గవర్నర్ స్వయంగా పూనుకోవాల్సివచ్చింది.
ఇదీ, ఈ ఆరు నెలలుగా అవిశ్రాంతంగా సాగిపోతున్న కధ.
'ఆరు నెలలు.
'అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయా! ఇంకెంత? మరో నాలుగున్నర ఏళ్ళు. ఎంతలో గడిచిపోతాయి'
కాచుకు కూర్చున్న ప్రతిపక్షాల ఆశ.
'ఆరునెలలు.
'ఆరునెలలు చాలా స్వల్ప కాలం. ఎంతో చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఇది మరీ తక్కువ సమయం. అయినా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు అలాగే మిగిలున్నాయి. మిగులు తరుగులన్నీ పూర్తిచేసుకోవడానికి అది చాలు'
అధికార పక్షం ఆకాంక్ష.
అటయినా, ఇటయినా ఇదే ఆట. ఆడేవారు వేరు కాని పాత్రల స్వభావం ఒకటే.
ఇక ఇంతేనా అంటే ఇంతే అని చెబితే అది 'అర్ధ సత్య' అవుతుంది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రశేఖర రావు, అటు చంద్ర బాబు నాయుడు ఇరువురికీ తమ తమ రాష్ట్రాల గురించి ఎన్నో  కలలు వున్నాయి. వాటిని సాకారం చేసుకోవడంకోసం ఎన్నో పధకాలు తయారు చేస్తున్నారు. ఒకరు బంగారు తెలంగాణా సాధన అంటుంటే, మరొకరు స్వర్ణాంధ్ర సాధన అంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తమ స్వప్నాలు యెంత సుందరంగా వున్నాయో ప్రజలకు విడమరచి చెబుతున్నారు. వాటిని నిజం చేయడం ఎలాగో తమకు తెలుసని అంటున్నారు కానీ ఎలా అన్నది చెప్పడం లేదు. వారి ప్రత్యర్ధులు సయితం వొప్పుకునే మంచి గుణం వారికి వున్న సమర్ధత. ఆ సమర్ధత పట్ల వారి వారి రాష్ట్రాల్లో అధిక సంఖ్యాకులకు వున్న అపార  నమ్మకం. ఇదే ప్రస్తుతానికి వారికి శ్రీరామ రక్ష.
ఏ రాజకీయ నాయకుడికీ ఇంతవరకూ లభించని అపూర్వ అవకాశం వీరిద్దరికీ లభించింది. ఒకరికి కొత్త రాష్ట్రాన్ని నిర్మించే అవకాశం. మరొకరికి కొంగొత్త రాజధాని నగరాన్ని నిర్మించే  అవకాశం.
ఇద్దరూ ఈ విషయంలో ఎవరికీ తీసిపోకూడదనే పావులు కదుపుతున్నారు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. తమ కృషి పట్ల, తమ సామర్ధ్యం పట్ల ప్రజల్లో  విశ్వాసం పాదుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు.   
ఎంతటి నమ్మకమైనా కాలం కలిసి రాకుంటే సడలిపోతుంది.  ఎంతటి కవచమైనా పరిస్తితులను బట్టి శిధిలమవుతుంది.
ప్రజల్లో నమ్మకం కలిగించేవాడు నాయకుడవుతాడు. ఆ నమ్మకాన్ని పది కాలాలపాటు నిలబెట్టుకోగలిగినవాడు ప్రజా నాయకుడు అవుతాడు.  
లేకుంటే, గతంలో ఓ వెలుగు వెలిగి మలిగిపోయిన అనేకానేక మంది రాజకీయుల్లో ఒకడిగా మిగిలిపోతాడు.
ఇది చరిత్ర చెప్పే సత్యం.         

(02-12-2014)