7, ఏప్రిల్ 2014, సోమవారం

మనవాడే అయ్యుంటాడు

అంజయ్య గారి భోలాతనం గురించి ఆ రోజుల్లో ఓ కధ చెప్పేవాళ్ళు. నిజంగా ఇది కధే. నిజంగా నిజం కాదు. ఆయన ఓ సారి మంత్రివర్గాన్ని భారిగా విస్తరించారు. జంబో క్యాబినెట్ అనేవాళ్ళు. ఇప్పుడంటే అవి మామూలయిపోయాయి. ఒకరోజు కొత్తమంత్రి ఒకరు ముఖ్యమంత్రి అంజయ్య గారిని కలవడానికి వచ్చారు. ఆయన్ని చూడగానే అంజయ్య గారు నొచ్చుకుంటూ - ఈ సారి నిన్ను తీసుకోవడం కుదరలేదు. మళ్ళీ ఎప్పుడయినా మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు నిన్ను తప్పకుండా చేర్చుకునే పూచీ నాది'అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు వున్నారో ఆయనకే తెలియదని ఆ రోజుల్లో హాస్యోక్తిగా అనుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అలాగే వుంది. ఎన్నికలముందు ఎవరు ఏ పార్టీలోకి వెడుతున్నారో తెలవదు. వెళ్ళిన వాళ్లు అక్కడ ఎన్నాళ్ళు వుంటారో తెలవదు. ఏ పార్టీనుంచి ఏ గుర్తుమీద పోటీ చేస్తున్నారో తెలవదు. ప్రచారానికి పోయినప్పుడు పాత పార్టీని తిట్టాలో తెలియదు. కొత్త పార్టీని పొగడాలో తెలియదు. ఫలితాలు వెల్లడయిన తరువాత కూడా గెలిచినవాడు మనవాడేనా కాదో తెలియదు. ఇన్ని అయోమయాల మధ్య జరుగుతున్న ఎన్నికల్ని మనం చూడబోతున్నాం.

కామెంట్‌లు లేవు: