23, నవంబర్ 2021, మంగళవారం

ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి – భండారు శ్రీనివాసరావు


సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు హైదరాబాదులో మా చుట్ట పక్కాల్లో చాలా మంది ఫోన్ రిసీవ్ చేసుకోరు. కారణం వారే చెప్పారు. ఆ సమయంలో ఎస్వీ బీసీ (టీటీడీ) టీవీ ఛానల్ లో భగవద్గీత మీద కుప్పా విశ్వనాధ శర్మ గారు అనే పెద్దాయన ప్రవచనం చెబుతారని, దాన్ని క్రమం తప్పకుండా ఆసక్తిగా వింటామని, అంచేత ఫోన్లు మాట్లాడమని.
ఈరోజు ఎందుకో ఛానల్స్ మారుస్తుంటే ఈ ఛానల్ తగిలింది. మా వాళ్ళు చెప్పినట్టు ఓ స్పురద్రూపి, కంచుకంఠంతో భగవద్గీతసారం గురించి చెబుతున్నారు. చ్యవనుడు, కౌశికుడి వృత్తాంతం ఆసాంతం వింటూ పోయాను. ఆసక్తికరంగా అనిపించింది. శర్మగారి ప్రవచనం తర్వాత నారాయణతీర్ధుల వారి కీర్తనలు శ్రవణానందకరంగా అనిపించాయి.
ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అలవాటుగా రిమోట్ టీవీ చర్చల వైపు మొగ్గింది.
అంతే!......... ఇక చెప్పడానికి ఏముంది?
23-11-2021

కామెంట్‌లు లేవు: