4, ఆగస్టు 2021, బుధవారం

జర సోచో! – భండారు శ్రీనివాసరావు

 ఓ మూడేళ్ల క్రితం మా ఇంటికి చందా కట్టి తెప్పించుంటున్న ఒక  హిందూ ఆధ్యాత్మిక మాస పత్రికలో ఒక స్వామి వారు ప్రవచించిన శ్లోకం ఇది.

“అశ్వోనైవ, గజోనైవ, సింహో నైవచ నైవచ, అజాపుత్రం బలింధత్తే

దేవో దుర్బల ఘాతకా:"

గుర్రాన్ని, ఏనుగును బలి ఇవ్వరు. సింహాన్ని బలిచ్చే ఆలోచన కూడా చేయరు. కానీ మేకపిల్లను మాత్రమే బలిస్తారు. దేవతలు సైతం దుర్బలుల్నే వేధిస్తారని తాత్పర్యం.

ఇందులో కొందరికి జగన్ కనబడ్డాడు. మరి కొందరికి రాజకీయం కనబడింది. ఇంకొందరికి ఏకంగా మతమే కానవచ్చింది.

ఇలా మనం సంకుచితంగా ఆలోచిస్తూ పోతుంటే కొన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పలేము. ఒక మంచి శ్లోకాన్ని వినలేము. ఒక సుభాషితాన్ని పలకలేము.  

నేను రాస్తున్న వాటిపై కొందరుపెడుతున్న వ్యాఖ్యలు చదువుతుంటే వారి విజ్ఞానానికి జోహార్లు చెప్పాలని అనిపిస్తుంది. నా అజ్ఞానానికి సిగ్గుపడాల్సివస్తోంది. ఏదిఏమైనా ఈ వయస్సులో మరికొన్ని కొత్త అక్షరాలు దిద్దుకోవడానికి ఇది సరికొత్త "పలకాబలపం" అనిపిస్తోంది. అందరికీ ధన్యవాదాలు.

(04-08-2021)

కామెంట్‌లు లేవు: