10, ఆగస్టు 2021, మంగళవారం

సమాంతర సంభాషణలు


పూర్వం జ్యోతి అనే మాసపత్రిక వచ్చేది. రాఘవయ్య గారు సారధి అయితే ముళ్ళపూడి, బాపు ఆ పత్రికకి అదనపు ఆకర్షణలు. ఓసారి ఆ పత్రికలో సంభాషణలు పలు తెరగులు అని వివరిస్తూ అనేక ఉదాహరణలు ఇచ్చారు ఆ జోడీ. ప్రస్తుతం చెప్పుకుంటున్న సమాంతర సంభాషణలు వాటిల్లో ఒకటి. సమాంతర రేఖలు ఎక్కడా కలవవు, రైలు పట్టాల మాదిరిగా. ఇద్దరు మాట్లడుకుంటూ వుంటారు. వారి అభిప్రాయాల మాదిరిగానే వారి సంభాషణలు ఓ పట్టాన కలవ్వు. ఫుల్ స్టాపులు, కామాలు లేకుండా అనంతంగా సాగిపోతుంటాయి, వినే వారితో నిమిత్తం లేకుండా. ప్రస్తుతం టీవీ చర్చల్లో ఈ రైలుపట్టాల ముచ్చట్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వినేవారికి విన్నంత వినోదం.

కామెంట్‌లు లేవు: