20, ఆగస్టు 2021, శుక్రవారం

తక్కువేమి మనకు ? – భండారు శ్రీనివాసరావు

 ‘పాజిటివ్ థింకింగ్ అంటుంటారు, ఏమిటి గురువు గారు ?’

‘మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి బయట పడి ప్రజాస్వామ్య విధానంలో గత ఏడు దశాబ్దాలకు పైగా ముందుకు సాగుతోంది.

‘ఆఫ్ఘనిస్థాన్  మనకంటే ఇరవై  ఎనిమిదేళ్లు ముందుగానే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. 1919లోనే  ఆ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంటే స్వతంత్రం వచ్చి వందేళ్ళు దాటిందన్నమాట. అయినా ఇప్పటికీ  అక్కడ రాజకీయంగా  గందరగోళ పరిస్థితులే. కొన్నేళ్ళు ప్రజాస్వామ్యం, మరి కొన్నేళ్ళు నియంతల రాజ్యం, లేదా సైనిక పాలన.  మనతో పాటే స్వాతంత్రం పొందిన పొరుగు దేశం పాకిస్తాన్ లో, ఇరుగు దేశం శ్రీలంకలో అదే పరిస్థితి.

‘అదే మన దేశంలో చూడు. ఏ పార్టీ పాలించినా, ఆ పాలన బాగున్నా లేకపోయినా, మనదేశంలో మాత్రం ప్రజాస్వామ్య ప్రభుత్వాలే మనల్ని పాలిస్తున్నాయి. ఓటు ద్వారానే ప్రజలు తమని పాలించే ప్రభుత్వాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇష్టం లేని పార్టీలను అధికారానికి దూరం చేస్తున్నారు. అంచేతే  ప్రపంచ దేశాల్లో మనం ఎవరికీ లోకువ కాలేదు. 

‘ఇలా ఆలోచించడాన్నే నేను పాజిటివ్ థింకింగ్ అంటాను అన్నారు గురువుగారు.

(!9-08-2021)

కామెంట్‌లు లేవు: