23, ఆగస్టు 2021, సోమవారం

వర్షం రాకడ కరెంటు పోకడ


చెట్ల కొమ్మలు అంటూ ఏదో కారణం చెబుతారు కానీ, వర్షానికి కరెంటుకు ఎక్కడో జ్ఞాతి వైరం ఉన్నట్టుంది.

వర్షం మొదలయింది కదా భాగ్యనగరంలో, దానితోపాటే కరెంటు ఇబ్బందులు. అన్ని చోట్లా ఎలా ఉన్నదో తెలియదు కానీ ఎల్లారెడ్డి గూడాలో ఓ రెండు గంటల నుంచి కరెంటు రాకపోకలు ముమ్మరం అయ్యాయి. ఓ నిమిషం పోవడం, ఓ క్షణం రావడం. కూర్చుని చూస్తుంటే ఆ క్రమం ఇలా వుంది.

కరెంటు రాగానే ముందు ఫ్యాను తిరుగుతుంది. తర్వాత కళ్ళార్పుకుంటూ ట్యూబు లైటు వెలుగుతుంది. ఆ తర్వాత నింపాదిగా టీవీ హాత్ వే లైటు ఎర్రబడుతుంది. తెరమీద ‘సిగ్నల్ నాట్ ఫౌండ్’ అని కనబడుతుంది. ఆహా అనుకునే లోగా మళ్ళీ సీను రివర్స్. అదే క్రమంలో కరెంటు పోతుంది. కాకపొతే ఈసారి ట్యూబ్ లైట్ కళ్ళార్పకుండానే తాత్కాలికంగా కన్ను మూస్తుంది. ఇన్వర్టర్ వుంది కాబట్టి కంప్యూటర్ తోడు వుంటుంది.

కరెంట్ మళ్ళీ వచ్చేదాకా పక్కవాళ్లకు వినబడకుండా ‘వస్తావు పోతావు నాకోసం’ అని పాడుకుంటూ కూర్చోవడమే.
23-08-2021

కామెంట్‌లు లేవు: