21, ఏప్రిల్ 2013, ఆదివారం

తెలుగులో పిల్లలకోసం కొత్త పత్రిక



శృతి ఫౌండేషన్ ప్రచురిస్తున్న ద్వైమాసిక పిల్లల పత్రిక తొలి ప్రతిని తమిళనాడు గవర్నర్ శ్రీ కె.రోశయ్య గారు ఈరోజు హైదరాబాదులో ఆవిష్కరించారు.



ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీ వీకే అగర్వాల్, ఐ.యే.ఎస్., డాక్టర్ ఊట్ల బాలాజీ, సీ.ఈ.ఓ. హెచ్.ఎం.ఆర్.ఐ., శ్రీ ఎర్రబల్లి రామమోహన రావు, శ్రీ జైపాల్ రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ అగర్వాల్, భండారు శ్రీనివాసరావు, శృతి ఫౌండేషన్ సీ.ఈ.ఓ. శ్రీ చలపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ రోశయ్యగారి చేతులమీదుగా చిన్నారి బాలబాలికలు శృతి సంచిక ప్రతులను స్వీకరించారు. వారితో కలసి అడిగిమరీ ఫోటో తీయించుకున్న ఔన్నత్యం శ్రీ రోశయ్య గారిది.


21-04-2013

కామెంట్‌లు లేవు: