7, అక్టోబర్ 2014, మంగళవారం

టచప్  

పొద్దున్న 10 టీవీ 'న్యూస్ మార్నింగ్' ప్రోగ్రాం కి  వెడుతుంటే మాదాపూర్ రోడ్లు మహ ముచ్చటగా కనిపించాయి. నిగనిగలాడే నల్లటి రోడ్లు, తళతళలాడే తెల్లటి గీతలు, ఓహ్ యెంత బాగున్నాయో అనిపించింది. అయితే ఈ ముచ్చట కాసేపే. ఆర్టీసీ క్రాస్ రోడ్   దగ్గర అంతా షరా మామూలే. మామూలు అలవాటయిన పాత ఇంకుడు గుంతల రోడ్లే.  ఓహో! ఇదంతా  మేయర్ల సదస్సు పుణ్యం కాబోలు. చిన్నప్పుడు ఊళ్ళోకి మంత్రిగారు వస్తే బాటకు (రోడ్లు వుంటే కదా!) ఇరుపక్కలా సున్నం ఒక వరుసగా పోసేవారు. అది చూసి ఎవరో పెద్దాయన వస్తున్నారని అనుకునే వాళ్ళు. పద్దతుల్లో కాస్త తేడా వచ్చింది కానీ మనస్తత్వాలు మాత్రం మారలేదు. వున్నరోడ్డుకే కొంత షోకు చేస్తారు. అన్నట్టు రోడ్డంటే గుర్తుకు వచ్చింది. ఆ మధ్య ఒక అధికారి ఎవరో, మూన్నెళ్ళ తరువాత హైదరాబాదులో   రోడ్లమీద గుంత చూపిస్తే పదివేలు పందెం అన్నట్టు గుర్తు. ఆ అధికారికి గుర్తుందో లేదో! 


(NOTE: COURTESY IMAGE OWNER)
    

కామెంట్‌లు లేవు: