8, సెప్టెంబర్ 2021, బుధవారం

“నేను పురుళ్లు పోసే డాక్టర్ని, ఆ మాత్రం నెగ్గుకురాలేనా?”

 

ఈ మాట అన్నది తెలంగాణా గవర్నర్ డాక్టర్  తమిళిసై సౌందరరాజన్.

తెలంగాణా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు రాజ్ భవన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్కింగ్ జర్నలిస్టులతో పాటు కొందరు సీనియర్ పాత్రికేయులను కూడా ఆహ్వానించారు.

“రెండేళ్ల క్రితం నన్ను నవజాత రాష్ట్రం  తెలంగాణాకు  గవర్నర్ గా నియమించినప్పుడు కొందరు ఎలా నిభాయించుకు రాగలుగుతానని సందేహపడ్డారు. నేను వృత్తి  రీత్యా డాక్టర్ని. అందులోను గైనకాలజిస్ట్ ని. నవజాత శిశువులను కనిపెట్టి చూడడం నాకు కొత్తేమీ కాదు అనుకున్నాను. అదే ధీమాతో పనిచేస్తూ వచ్చాను. ఈ క్రమంలో సమాజ శ్రేయస్సుకి పనికివచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహించాను. మళ్ళీ నాకు పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరిగి అవే సందేహాలు. నా సమాధానం మళ్ళీ అదే. నేను గైనకాలజిస్ట్ ని. కవల పిల్లల్ని కూడా సాగగలను”   

గత రెండేళ్ల కాలంలో రాష్ట్ర గవర్నర్ గా తాను చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను సోదాహరణంగా వివరించే సచిత్ర మాలిక గ్రంధాన్ని (Coffee Table Book)  శ్రీమతి డాక్టర్ తమిళిసై ఆవిష్కరించారు.

ఆహూతుల్లో కొందరిని  నాలుగు ముక్కలు మాట్లాడమన్నారు. నేనూ ఓ మూడు ముక్కలు చెప్పాను.

విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారు. పత్రికల ఎడిటర్లను, సీనియర్ పాత్రికేయులతో విడిగా ఆత్మీయ సమావేశం జరిపారు.

చక్కటి విందు భోజనంతో ఈ సమావేశం ముగిసింది.








(08-09-2021)  

కామెంట్‌లు లేవు: