12, డిసెంబర్ 2016, సోమవారం

యునిసెఫ్ మీడియా అవార్డులు


యునిసెఫ్, సీఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాదులోని తాజ్  డెక్కన్ హోటల్లో జరిగింది. వివిధ మీడియా ఛానళ్ళు, పత్రికలలో వెలువడిన బాలల హక్కులకు సంబంధించిన కధనాలను పరిశీలించి అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ బృందంలో నాతో పాటు ప్రముఖ రచయిత్రి డాక్టర్ మృణాలిని, సీనియర్ జర్నలిష్టు కేబీ లక్ష్మి, జీ. వల్లీశ్వర్, ఎస్. నగేష్ కుమార్, గోవిందరాజు చక్రధర్ వున్నారు. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి రేచల్ ఛటర్జీ జ్యూరీ చైర్  పర్సన్ గా వ్యవహరించారు. ప్రసిద్ధ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ అవార్డులను ప్రదానం చేశారు. యునిసెఫ్ అధికారి కుట్టి జార్జ్, సీఎంఎస్ ప్రతినిధులు వాసంతి, అనిత పాల్గొన్నారు.




Photo Courtesy: UNICEF  


కామెంట్‌లు లేవు: