14, ఆగస్టు 2016, ఆదివారం

సలాం సలీం


ప్రముఖ రచయిత ఏ.ఎన్. జగన్నాధశర్మ సంపాదకత్వంలో, ఆంధ్రజ్యోతి ప్రచురించే ‘నవ్య’ వారపత్రిక తాజా  సంచిక (17=08-2016) లో ఒక అద్భుతమైన  కధ చదివాను. తెలుగు కధకు నోబెల్ బహుమతి వస్తుందన్న ఆశ ఏ కోశానా లేదు కానీ, సలీం రాసిన ‘నరకకూపం’ అనే ఈ కధ అంతకుమించిన పురస్కారానికి అర్హమైనది అనే అభిప్రాయం నాకు ఈ కధ చదివిన తరువాత కలిగింది.
ఈ కధలో అంత విషయం ఏముందోతెలుసుకోవాలంటే  అంటే ఈ కధ చదివి తీరాలి.
రచయిత సలీం గారికి నోబెల్ ఎలాగూ రాదు. ఎందుకంటే ఆయన తెలుగులో రాస్తారు. అందుకే సలీం గారికి  ఓ ‘సలాం!’పెట్టి ఊరుకుంటున్నాను.


పాఠకులకు చట్టబద్ధ హెచ్చరిక: ఈ కధలో ఇతివృత్తం ఎలాటిదంటే, మొదలు పెట్టి ఎందుకు మొదలు పెట్టామా అని చీదరించుకుంటాం. చదువుతూ పొతే, ఇలాటి జీవితాలు కూడా మన నడుమే సాగుతున్నాయా అని ఆశ్చర్య పోతాము. కధలో ప్రధాన పాత్ర వృత్తి అలాటిది. అతడి జీవితం మనకే కాదు అతడికే నచ్చదు. అయినా జీవిక కోసం దానితోనే అతగాడి సహజీవనం. అది తెలుసుకుని, అర్ధం చేసుకుని రాయడానికి రచయిత పడ్డ శ్రమకు ఇవ్వవచ్చేమో రెండు నోబెల్ పురస్కారాలు.
ఆయనకి ఇటువంటి గుర్తింపు వస్తే ఆయన యెంత సంతోషపడతారో నాకు తెలియదు. కానీ  నేను మాత్రం ఇంతటి గొప్ప రచయిత జీవిస్తున్న కాలానికి చెందినవాడిగా చాలా గర్వపడతాను.

(కాకతాళీయం కావచ్చు, రాత్రే ఈ కధ చదివాను, పొద్దున్న పత్రికల్లో మొదటి పుటలోనే ‘నలుగుర్ని  మింగిన మ్యాన్ హోల్’ అంటూ విషాద వార్త.)     

కామెంట్‌లు లేవు: