16, ఆగస్టు 2016, మంగళవారం

అమ్మకు వందనం


శ్రావణ మాసం అనగానే  మా  అందరికీ  నువ్వే  గుర్తుకు వస్తావు.  జరిగి ఇరవై రెండేళ్ళు  దాటిపోతున్నా ఆ రోజు మా అందరికీ ఇంకా  బాగా జ్ఞాపకం వుంది. శుక్రవారం నోముకు  అంతా సిద్ధం చేసుకున్న నలుగురు కోడళ్ళు, ఏ నిమిషాన ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో నీ పిల్లలం నలుగురం.
కోడళ్ళని  కన్న కూతుళ్ళుగా చూసుకున్న నువ్వు  వారి నోముకు అడ్డం ఎలా వస్తావు. పూజలు పూర్తయి, ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వడం అయిపోయిన తరువాత కానీ నువ్వు దాటిపోలేదంటే అది నీ అవ్యాజ ప్రేమకు నిదర్శనం. ఆ  రుణంతీర్చుకోలేనిది.
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యావత్  కుటుంబం  కాశీ వెళ్లి అంతిమ సంస్కారాల క్రతువు ముగించడం అన్నది నీ ఒక్క విషయంలోనే జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు నీ ఆబ్దీకం అనేది చుట్టపక్కాలు అందరికీ  ఒకచోట కలుసుకునే సందర్భంగా మారిపోయింది. మన ఇంట నలుగురూ కలిసి జరుపుకునే పర్వదినంగా పవిత్రతను సంతరించుకుంది.

నువ్వు ధన్యజీవివి. నీ  కడుపునపుట్టి మేము కూడా ధన్యులమయ్యాం.        

కామెంట్‌లు లేవు: