23, సెప్టెంబర్ 2013, సోమవారం

దోమ వరం కధ


ఒక దోమ దేవుడ్ని గూర్చి సుదీర్ఘంగా, అతిఘోరంగా కొన్ని వేల క్షణాలపాటు తపస్సు చేసిన మీదట దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తపస్సు ఫలించిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన దోమ, ‘మనిషిని నేను కుట్టగానే చనిపోవాలి’ అనే వరం ఇమ్మని అడిగింది.  దేవుడు ‘తధాస్తు’ అంటూ వరం ప్రసాదించి నాలుగు చేతులు విలాసంగా వూపుకుంటూ అదృశ్యం అయిపోయాడు.


వరప్రసాదిని  అయిన దోమగారు కూని రాగాలు తీస్తూ  అలా అలా  వెళ్ళి ఓచోట  హాయిగా నిద్రపోతున్న మనిషిని తటాలున కుట్టింది. అంతే! ప్రాణం పోయింది. ఎవరిది? కుట్టిన దోమది. దోమ కుట్టగానే నిద్రాభంగం అయిన ఆ మనిషి, కుట్టిన చోటనే కూర్చుని నెత్తురు పీలుస్తున్న దోమని అరచేత్తో ఓ చరుపు చరిచాడు. దేవుడ్ని  కోరుకుని సంపాదించుకున్న  వరం ప్రకారం ఆ దోమ కుట్టగానే చనిపోయింది.
నీతి: తపస్సుచేయడం, దేవుడి అనుగ్రహం సంపాదించుకోవడంతోనే సరిపోదు. వరం యెలా కోరుకోవాలో కూడా తెలిసివుండాలి. 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అన్ని దోమలు చావవుగా . కొన్ని గడసు దోమలు ఎగిరిపోతాయి

hari.S.babu చెప్పారు...

అతిఘోరంగా కొన్ని వేల క్షణాలపాటు
---vaav :-)