27, డిసెంబర్ 2012, గురువారం

ఆచార్య పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఇక లేరు




ఆచార్య పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఇక లేరు


వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపున శ్రీ వంగూరి చిట్టెన్ రాజు ఇలా తెలియచేస్తున్నారు.
మిత్రులారా, 
ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్యానికి భీష్మాచార్యుల వంటి సాహితీవేత్తకవితొలి అమెరికా తెలుగు పత్రిక సంస్థాపకులునాటక రంగ నిష్ణాతులునృత్య నాటక నిర్మాతదర్శకులుచిత్ర కారులుప్రపంచ ప్రసిధ్దిగాంచిన న్యూక్లియర్ శాస్త్రవేత్తవంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు ఆదినుంచీ గౌరవ సంపాదకులుడాపెమ్మరాజు వేణుగోపాల రావు గారు మొన్న అట్లాంటాలో పరమపదించారునేను ఎక్కడో దూరంగా ఇండియాలో ఉండగా ఆయన పోయిన కబురు రావడం మరింత బాధగా ఉందిఆయనతో మా అనుబంధంఆయన వ్యక్తిత్వంలో ఉన్న లోతులు అందరికీ తెలినది కొంతచాలామందికి తెలియనిది కొండొంత.విన్నకోట రవిశంకర్ వాసిన వ్యాసం పెమ్మరాజు గారి గురించి అన్ని అనేక అంశాలను స్పృసిస్తూ మనందరి భావాలనీ వ్యక్తపరిచింది వ్యాసం లంకె  క్రిందన ఇస్తున్నాను.

http://vaakili.com/patrika/?p=440

తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభలలో తొలి రోజు (డిశంబర్ 27, 2012) ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించే ఏర్పాట్లు చేస్తున్నాను….


భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

Acharya Pemmaraju Venugopala Rao is well known as Dr. P. V. Rao in the US in many ways. Dr. Rao is a multi faceted personality. He is one of the principle architects of Atlanta Indian Community. Dr. Rao is a generalist. He is a professor of Nuclear Physics in Emory University. He is also a poet, artist and a journalist. Quite often he deliver lectures on Indian culture and spirituality. He is a fatherly figure to many institutions and youngsters in US and they turn to him for guidance in times of crisis. Institutions and persons in around the USA frequently refer Dr. Rao as wise man of Atlanta and turn to him for his wisdom words and advise.

కామెంట్‌లు లేవు: