28, మార్చి 2010, ఆదివారం

శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)



శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు  (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)


చాలా ఏళ్ళ క్రితం -
అటు పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇటు శాసనసభ సమావేశాలు కానీ ప్రారంభం అయ్యే తరుణంలో  రేడియో, దూరదర్శన్ లలో ఒక రోజుముందు - 'యిస్యూస్ బిఫోర్ ది హవుస్' (చట్టసభలో చర్చకు రానున్న అంశాలు) అనే  శీర్షికతో పేరెన్నికగన్న జర్నలిస్టులతో కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. దరిమిలా జరిగే చట్టసభల సమావేశాల్లోని చర్చల్లో - ఈ నిపుణుల అభిప్రాయాల ప్రభావం స్పష్టంగా కనబడేది. అలాగే సమావేశాలు జరిగినన్నాళ్ళు- ప్రతిరోజూ రాత్రి పదిహేను నిమిషాలపాటు జర్నలిస్టులతో రాయించిన సమీక్షలు రేడియోలో ప్రసారమయ్యేవి. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. జర్నలిస్టులు రాసుకొచ్చిన సమీక్షను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరవాతగానీ ప్రసారం చేసేవాళ్ళు  కాదు. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది. 
ఇక ప్రస్తుతానికి వస్తే-
టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు.అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం వుందని ఊహించలేకపోయారు. ఈ ప్రసారాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న ఒక జర్నలిష్టు మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య సమంజసమనిపించేదిగా వుంది. సభ సజావుగా జరుగుతోందన్న అభిప్రాయం లేశ మాత్రంగా కలిగినాసరే - ప్రత్యక్ష ప్రసారాన్ని తక్షణం నిలిపివేసి - టీవీ యాంకర్ మరో అంశానికి మారిపోతాడట. టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  ఒకే ఒక అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దే సించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని అవి అలవరచుకోవాలి. అదేసమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే భాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌద పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.(28-03-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                                                      


Y

25, మార్చి 2010, గురువారం

KCR doing ‘good’ than ‘harm’ to T-cause - Bhandaru srinivasrao (I.I.S.)


KCR doing ‘good’ than ‘harm’ to T-cause - Bhandaru srinivasrao (I.I.S.)



Of late, the founder president K Chandrasekhara Rao of Telangana Rashtra Samiti, formed to fight for separate statehood, appears to have indulging in unethical practices politicizing every government department and official, purely based on regional chauvinism.  To me, it appears a greatest threat to very foundations of these institutions, which were established to ensure some semblance of discipline in a civilized society.
Yes, I am very much perturbed, rather concerned, over his accusations against the Anti-Corruption Bureau, whose job is to check corruption among government servants.  If such an institution is dragged into meet one’s narrow political ends, I am scared, it bound to do more harm than good to the society as a whole.  He alleges the ACB, of late, targeting only Telangana officials framing false charges to weaken the separate statehood movement, for their active involvement.
In this context, one wishes to ask Rao whether a government servant is entitled to take active part in body politics.  Does Service Rules of government services entertain?  Should such relaxation is entertained will not there be chaos in administration?  How can a government servant hold such a grouse, especially on such contentious issues like separate statehood, while holding office and drawing salary?
Even during the independent struggle, Mahatma gave a call to all those who wanted to join the freedom struggle to quit their jobs employed by British rulers. If KCR too wanted to give such a call, he can do so.  And if those government employees belonging to the region wanted to paralyze the state machinery too had the right to choose that path.  None can object and in turn, such a major step may as well strengthen the demand for separate statehood.
Instead, while enjoying the fruits of the government, if the organizations formed on regional names just cannot take active part in a political movement like Telangana.  No such freedom is even enshrined to Indian citizen in our Constitution.  And, that’s what the ACB choose to adhere to the Government Servants Rule Book and trying to discipline those erring officials, who choose to bamboozle government funds.

  The ACB Chief, Mr Aravinda Rao, was quick to respond to the allegations of KCR and clear the air.
I, for one, wonder will such acts help strengthen the movement anyway? Will such act do more harm than good to such good cause? 
Ironically, neither he nor the Telangana Joint Action Committee could bring in unanimity among the people’s representatives of the region.  Though, they came together cutting across their party lines, they preferred to part ways when it came to resignations to their public offices like MP, MLAs and MLCs.  If unanimity cannot be achieved among the people’s representatives, how can either KCR or the T-JAC impose such diktat on poor employees who joined government services with great difficulties to eke out their livelihood?Hence, it would be wise on part of KCR and his T-JAC members to restrain from indulging in such cheap gimmicks dragging in government institutions like ACB or Police or Judiciary or any other, to meet their narrow political ends.(25-03-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.



19, మార్చి 2010, శుక్రవారం

Who’ll have the last laugh? Rosaiah or his critics?

Who’ll have the last laugh?
Rosaiah or his critics?                                                                        -Bhandaru Srinivas Rao(I.I.S.)


              
Perhaps, I haven’t come across a shrewd politician in Andhra politics like the Chief Minister K Rosaiah. Especially, in floor management! In my three-decade long career, I can confidently say, no contentious resolution was passed with so ease.

But, in case of the resolution that has passed in a ‘jiffy’ by the state assembly on Thursday, urging the Centre to bring in necessary amendment to the Constitution to retain Hyderabad in Zone VI to benefit locals, which was struck down by the apex Supreme Court, indeed commendable.

Well, there may be some dissent voices in both the treasury and Opposition benches. But, none were dare to come to the fore in the Assembly, except for the Praja Rajyam Party members demonstrating briefly near the Speaker’s podium for some time. But, the resolution was passed in no time with a brute voice vote. His ability to hold discussions with the coastal Andhra and Rayalaseema ministers and legislators in his chamber and convincing them to vote in favor of the resolution, is also appreciable.

The resolution, which favored deletion of Clause 14-F of the AP Public Employment Order 1975, popularly known as Presidential Order, may be a minor issue to coastal Andhra and Rayalaseema people as it deals only with the recruitment of police constables in city, but had it not been moved it would have given needed fodder for the Telangana Rashtra Samiti (TRS) members to spearhead the agitation yet again. And, Rosaiah would not like to take such a risk although there is no presence of TRS members in the state Assembly as they all en masse resigned protesting against the Srikrishna panel’s terms of reference. Reason behind Rosaiah shrewd move is the pending Appropriation Bill for getting the Assembly nod.

Thus far, one may have to accept that Rosaiah is not only shrewd, but also known for his better floor management characteristics. In fact, he held and played the role of Floor leader’s job in several his predecessor’s tenure, to perfection. Rosaiah is well aware that the main Opposition Telugu Desam can ill-afford to oppose the resolution which may as well boomerang on them in the wake of worked up tensions over the bifurcation of the state issue, which is pot-boiling. His calculated move to accept the demand from Opposition from moving a resolution urging the Centre’s intervention was grabbed well by shrewd Rosaiah and also executed it so well. (19-03-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

2, మార్చి 2010, మంగళవారం

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!


దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

"అయాం సోల్డ్" - అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.

ముఖ్యమంత్రి అమ్ముడుపోవడమా!అందులోను వైఎస్సార్? ఎవరికి అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు?



అది డిసెంబరు నెల. 2007 వ సంవత్సరం.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సుని అనుకరిస్తూ దాని ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే - సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.అదే ఎఫ్ డీ హెచ్ ఎస్. -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశిత దిన వైద్య సేవలు. ఇందుకు పూర్వ రంగం గురించి కొంత ప్రస్తావించాల్సివుంటుంది.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

ఈ నేపధ్యంలో -

అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది.ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

ఈ వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే, ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెహ్ ఎం ఆర్ ఐ నిర్వాహకులు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ తీసుకుని ఆనాడు సచివాలయానికి వెళ్ళారు.ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో- రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హటాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.

అంతే!

దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

___________________________________________________________________________________________

-భండారు శ్రీనివాసరావు (02-03-2010)

____________________________________________________________________________________________

--(హెలికాప్టర్ దుర్ఘటనలో రాజశేఖర రెడ్డి గారు కన్నుమూసి ఆరు మాసాలు గడిచిన సందర్భంలో 02-03-2010 తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

Waah Akbar… Wah wa Akbar…! - bhandaru srinivasrao (iis)

Waah Akbar… Wah wa Akbar…! - bhandaru srinivasrao (iis)











One should appreciate the ‘guts’ of the MIM floor leader in the state legislative Assembly to declare openly his ‘support’ to those who are branded as “settlers’ by the Telangana Rashtra Samiti, who are fighting for separate statehood. His ‘courage’ and ‘commitment’ to ‘secularism’ abundantly paraded when he went to the extent of suggesting to the government on the floors of the House that anyone who held out threats against these ‘settlers’ may be treated under non-bailable offence.



The young legislator obviously peeved by the TRS and its T-Joint Action Committee members holding out threats against the people belonging to the other two regions during their agitations programmes, especially Rayalaseema and coastal Andhra. They term those who belonging to these regions were staying in Hyderabad for some reason or the other as ‘settlers’. The TRS main accusation is that these two region people have exploited Telanganites by making properties in-and-around Hyderabad.



On the other hand, they (Rayalaseema and Andhras) claim that they too did contribute for overall growth of historic Hyderabad from time immemorial. They feel uncomfortable for being called ‘settlers’ as majority of them might have migrated more than 2 to 3 decades ago. Though, the antecedents of even the TRS founder President K Chandrasekhara Rao and the Congress leader K Keshava Rao are believed to have roots in north coastal Andhra and one of the costal district, respectively.



With the movement for separate statehood turning more and more volatile with tempers too running high and all walks of people vertically getting divided, the T-JAC call for boycotting Andhra-made products is what more disturbing trend emerged out of the ongoing agitation. Should tempers run such high, when the Centre had taken the initiative to constitute a Committee headed by a retired Supreme Court judge, Justice Srikrishna, to begin the process? Can Andhras be considered as foreigners in their own land?



Article 3 of the Constitution clearly enshrines that the states were formed in 1956 under linguistic basis. A case is also pending in the Supreme Court regarding this challenging the Centre’s move for bifurcation of Andhra Pradesh. People of the other two regions are chanting ‘integration’ song, while the people of Telangana of ‘separatist’. And, the Centre had to elicit views of all sections in the society of the entire Andhra, if not three regions, and take a decision. Hence, it constituted the Committee. Considerable consensus should emerge before taking such major decision. To arrive at this, considerable time is required.



Today, people in the region may appear united on the issue. But, the fact remains that when had the opportunity to show this unity in democratic process, they apparently not done reasons best known to them. Not once, but twice or thrice since TRS was formed and fight their first electoral battle in 2004. TRS performance in all the elections held since then proved disastrous. What does it mean? If that is not the yardstick to be used to gauge and understand the mood of the people, what else has to be?



Even TRS leaders’ effort to build consensus among national parties indeed failed when the CPI-M turned down any more divisions in the country. Though the TDP had given a letter of support, today that party too vertically split into two groups and the one which extending ‘support’ for separate statehood, however, unwilling to sacrifice their assembly seats to bring pressure on the Centre. They show Congress as an excuse, to fall in line with TRS. Incidentally, the people of the two other regions – Andhra and Rayalaseema – were looking at TDP for help and protection to their properties in Hyderabad. Though, the TDP had promised support just before the civic polls, today, it remains non-commital in the wake of split in opinion of their own party members on bifurcation.



In this confused and helpless atmosphere, the MIM leader’s assurance undoubtedly has come as moral boost to those Andhra and Rayalaseema people residing in the city. Now they feel more than ‘secure’ .



Restraint is the need of the hour and no two groups should get emotionally surcharge creating lawless in the society. Let both the warring groups achieve their goals in more peaceful and democratic manner, instead of taking the violent path.



Telangana or no telangana, united state or devided one, commonman should not be put to inconvenience. He should be allowed to lead his life peacefully.

Let the socalled leaders lay down the their lives for the genuine cause, rather than provoking the innocent and future citizens of the nation. (23-02-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

18, ఫిబ్రవరి 2010, గురువారం

ఎటు పోయాయ్‌ ఆ రోజులు? -భండారు శ్రీనివాసరావు



ఎటు పోయాయ్‌ ఆ రోజులు?  - భండారు శ్రీనివాసరావు


మా తాతగారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా కరెంట్‌ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి.


 కాకపోతే ఆ రేడియోలు మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో ఆరోజుల్లో యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప రైలుని చూసిన వాళ్లు కానీ, బస్సు ఎక్కిన వాళ్లు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వా ళ్లు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్లు  మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్లు.  ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వాళ్లు.   మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్లు  కుట్టేవారు.  రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈ పనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్లు  కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌ రాళ్లు  రోడ్లపై వెలిశాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు - నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.


ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తేవాళ్లు.  ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్లు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే -
తెలతెలవారుతూనే బావి గట్టున చేదతో తోడుకుని చేసే స్నానాలు-


జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పనివాళ్లు  వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?
(16 -7- 2008)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

17, ఫిబ్రవరి 2010, బుధవారం

TDP’s hypocrisy exposed! - Bhandaru Srinivasrao

TDP’s hypocrisy exposed!




Telugu Desam Party MPs and MLAs belonging to Telangana region’s decision to link their resignations with the ruling Congress members over ‘bifurcation’ of state issue not only sounds ‘funny’ and ‘ridiculous’ and exposes its dual policy and hypocrisy.



In fact, Telugu Desam party was born only to enhance the pride of Telugus world over. The man who fathered the party, N T Rama Rao, indeed accomplished his dream as the hitherto “Madrasi” tag to Telugus among north Indians was permanently detached. Yet, for political compulsion, the party might have voiced its concern to the bifurcation issue, but never willing to be sincere.

This is clearly evident from its recent decisions. After fighting the 2009 general elections under the banner of “Mahakutami” along with separatist Telangna Rashtra Samiti, later parted ways after benefiting winning 39 seats of its 50-odd contested. On the other hand, the TRS, which had won 27 in 2004 elections combining with Congress, could end up winning just 10 out of 40-odd it contested. These results clearly exhibits that there was no uniformity in the so called ‘Telangana sentiment” and had it been there, the people of their region could have voted enthusiastically to either TRS per se or to “Mahakutami.’

Here political analysts may argue that since the Congress had also promised to ‘look into’ the ‘bifurcation’ issue had made voters of the region to side with the ruling party and help them win 56 seats of the total 119. Yet, it holds no water, as the 2009 elections, I personally as a political analyst, feel was ‘positive vote’ in favor of the ruling Congress under Y S Rajasekhara Reddy’s stewardship, pushing other contentious issues, including separate Telangana to backdrop. That’s why the Telanganites voted enthusiastically in favor of Congress and never got attracted to the provocative statements of TRS leader K Chandrasekhara Rao. This pattern of voting was even witnessed after the party split, and the reduced 17-member KCR’s TRS forced by-elections and could retain just four or six.

Thus far, the so called ‘sentiment’ prevalence had not really reflected in the voting pattern. But, today, the scenario might have changed drastically for variety of reasons. People, cutting across their professions and practices, might have divided vertically and vociferously spearheading their agitations in favor of separate statehood. But, will they show same unity, in case of by elections, if they were forced? This is the million dollar question and none are willing to discuss.

As it is the Telangana JAC, which was formed by voluntary organizations and forums, besides roping in all major political parties of the region into it, today looks seized to exist. Fearing to face the wrath of party high command, the Congress MLAs walked out of JAC. The TRS, which in fact was born to fight for separate statehood and take the fight to its logical conclusion, had taken the decision to resign and they did precisely what they had been promising. So were others, one of the two BJP members and one of the two PRP members. Though two of the Congress legislators submitted their resignation, the Speaker is yet to accept hoping they may relent after following the party high command’s diktat.

Contrary to this, the Telugu Desam, which forms second largest party in T-JAC, decided to submit their resignations of 39 MLAs to JAC Convenor, Prof Kodandaram, rather than hand them over to the Assembly Speaker. Even their handing over of resignation was with a rider – i.e., provided 35-40 Congress MLAs too give their resignation letters. The TDP members argue that by resigning 40 or 50 MLAs from the region cannot create Constitutional crisis, as the government had the option to hold by-elections. It argues that unless majority of the 119 (at least 100) resign, then the Centre will have no other option, but to concede the separatists demand. Though their argument has some logic, yet their sincerity and earlier commitment got exposed.

Even the TRS leader finds fault with TDP for backing out as it feels, rightly so, if the entire Opposition resigns, the Congress members of the ruling party bound to get exposed. KCR is also confident Congress legislators facing the wrath of their constituents, if they relent. That the Congress members are being caught between ‘devil and deep sea’ kind situation is understandable. And the TRS strategy is to yet again prove the Congress as the ‘real Villain’ and solicit the other Opposition members’ support.

Contrary to this, the TDP member’s fear, if they too resign and the determined Congress which chose to order (read recommend) by-elections, then they may land in soup. Can they retain all their seats? Or face the same fate that of the TRS in the past, losing few even to the Congress?

I, for one, continue to ponder, whether the voting pattern too will be on ‘sentiment’, rather than other local and personalized issues like ‘caste’, ‘party’ and ‘individual’ factors?

In other words, the TDP too caught in identical situation like its arch-rivals Congress, though in a different format. Yet, what it failed to understand is that its ‘rigid’ stand linking with Cong got ‘exposed’. Its dual policy may as well do more harm than good to the party in coming days. (17-02-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.