28, ఏప్రిల్ 2021, బుధవారం

రాకూడని కష్టం

 

ఫేస్ బుక్ మిత్రురాలు శ్రీమతి షమీర్  జానకిదేవి, సంజీవరావు  దంపతులకు కరోనా గర్భశోకం  మిగుల్చింది. ముప్పయ్యేళ్లు  కూడా నిండని వారి చిన్న కుమార్తె ఈ తెల్లవారుఝాఅమున కన్ను మూసింది. ఆరేడు నెలల పసివాడిని  ఈ లోకంలో వదిలేసి.

బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉత్సాహం చూపే జానకి గారెకి ఈ దుర్ఘటన శరాఘాతం.

రెండేళ్ల క్రితం మా ఆవిడ చనిపోయినప్పుడు ఆ విషయం తెలుసుకున్న జానకి గారు, ఆవిడ భర్త సంజీవరావు గారు  అతికష్టం మీద అడ్రసు పట్టుకుని వచ్చి పరామర్శించి వెళ్ళారు.

కుమార్తె భౌతిక కాయాన్ని వారికే అప్పగించడానికి వీలులేని రోజుల్లో ఆ  దంపతులను ఓదార్చడానికి ఎవరు వెళ్ళాలి?

ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.

కింది ఫోటో: జానకి గారి అల్లుడు, చనిపోయిన కుమార్తె, ఆరేడు నెలల బాబు 




1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవునండి, రాకూడని కష్టమే.
ఒకప్పుడు నా క్లాస్-మేట్ చెల్లెలు అలాగే పోయింది, తల్లితండ్రులు బతికుండగానే. వివాహిత కూడానూ.

క్రితం వారమే నా రిటైర్డ్ కొలీగ్ యొక్క 40 యేళ్ళ కూతురు (వివాహిత) హాస్పిటల్లో పోయింది.

ఇవన్నీ కడుపుకోతలు.