20, ఏప్రిల్ 2021, మంగళవారం

కాలనాగు కరోనా

 

ఈ పోస్టు భయపెట్టడానికో, ఆందోళనకు గురిచేయడానికో ఎంతమాత్రం కాదు. కొన్ని విషాదాలు కళ్ళు తెరిపించాలి. ఎలాంటి కాలనాగుతో మనం కాలక్షేపం చేస్తున్నామో తెలుసుకోవడానికే ఈ పోస్టు.

విజయవాడలో ఆయనో లాయరు. మూడు రోజుల క్రితమే తల్లి, బాబాయి ఇద్దరూ చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఈరోజు తెల్లవారుఝామున తండ్రి మరణించారు. కాసేపటికే ఆ లాయరు గారు కూడా కన్ను మూశారు.
కొద్ది రోజుల వ్యవధిలోనే సంభవించిన ఈ వరస చావులకు కారణం కరోనా. కేవలం కరోనా!
కరోనా కాటుకు ఓ కుటుంబం బలయిపోయింది.

కామెంట్‌లు లేవు: