24, ఏప్రిల్ 2021, శనివారం

'నేనే!

 


'నేనే! నేను తప్ప వేరు లేదు’ అనుకునే ‘అహం బ్రహ్మాస్మి’ల కోసం, మహాకవి, సంస్కృత పండితుడు భవభూతి ఈకింది సూక్తిని ప్రవచించారు.



'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'.

విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'



(నిజానికి వ్యావహారికంలో అహం బ్రహ్మాస్మి అర్ధం వేరే విధంగా మారింది. నేనే బ్రహ్మం, జీవుడూ, దేవుడూ ఒక్కరే అనేది దీని మూలార్ధం. ఇక్కడ అహం అంటే అహంకారం కాదు)

 

కామెంట్‌లు లేవు: