23, ఏప్రిల్ 2021, శుక్రవారం

“హీనంగా చూడకు దేన్నీ”


అన్నారు మహాకవి శ్రీశ్రీ
పాత కాలపు ప్లాంటు, ఈ కాలానికి పనికి రాదన్నారు. ఏటేటా నష్టాలు గుట్టల్లా పేరుకు పోతున్నాయన్నారు. అమ్మడం మినహా వేరు గత్యంతరం లేదన్నారు. అందులో నిజం లేకపోనూ లేదు.
బేరసారాలు జరిగాయి. బేరం కూడా కుదిరినట్టే వుంది.
నచ్చని వాళ్ళు రోడ్డెక్కారు. అంత కష్టం పడలేని వాళ్ళు మీడియాకెక్కారు.
ఏమైందో తెలవదు. కొంత విరామం వచ్చింది.
ఈలోగా కరోనా సెకండ్ వేవ్ ముంచుకు వచ్చింది. దానితో పాటే ఆక్సిజన్ కొరత వచ్చింది. దానితో పాటే ఆ పాత ప్లాంటుకు కళ వచ్చింది. ఒకరకంగా అదే ఇప్పుడు దేశానికి ప్రాణ వాయువు అందించే సంజీవని అయ్యింది.
శరత్ బాబు నవల భారతిలో ఒక పాత్రకు ఎవరో వాడిపారేసిన గంజాయి పీల్చే గొట్టం కనబడుతుంది. ‘ఏమో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో అని దాన్ని దాచిపెడతాడు.
అందుకే అన్నారు, హీనంగా చూడకు దేన్నీ!
(23-04-2021)

కామెంట్‌లు లేవు: