24, ఏప్రిల్ 2021, శనివారం

మంచి నిర్ణయం, భేషైన నిర్ణయం

 కరోనా వాక్సిన్ ని రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. చాలా సముచితమైన నిర్ణయం. ఇది ఎప్పుడో చేయాల్సింది అనే చర్చలు ఇక అనవసరం.

అయితే ఒక మాట! ఇటువంటి సూచనే గతంలో చేయడం జరిగింది.  మసూచికి, పోలియోకు ప్రభుత్వాలే ముందుకు వచ్చి టీకాలు, పోలియో డ్రాప్స్ వేసిన సంగతి ప్రస్తావిస్తే, ప్రతిదీ ప్రభుత్వాలే ఉచితంగా ఇవ్వాలా! ఆ మాత్రం ఖర్చు భరించలేరా అని కొందరు దీర్ఘాలు తీశారు. ప్రజల్లో కొంతమందికి ఆ కొనుగోలు శక్తి ఉన్నమాట నిజమే. కానీ ప్రభుత్వమే పూనుకుని ఒక ఉద్యమంలా వేయడం వల్ల మశూచి వ్యాధి దేశంలో లేకుండా పోయింది. పోలియోకి అడ్డుకట్ట పడింది.

అదికాకుండా, ఇలాగే సెకండ్ వేవ్ కొనసాగి, మరోసారి లాక్ డౌన్ పరిస్థితి ఎదురయితే!

దాన్ని తట్టుకోగల స్థితి ఉందా! మొదటి సారి లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయింది. సామాన్యుల నడ్డి విరిగింది. వలస కూలీలు వందల కొద్దీ మైళ్ళు నడిచి స్వస్థలాలకు చేరుకోవాల్సి వచ్చింది. ఈ నష్టంతో పోలిస్తే, లేదా భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాన్ని అంచనా వేసుకున్నా దేశ జనాభాకు ఉచితంగా కోవిడ్ టీకాలు వేయడమే సముచితం అనిపిస్తుంది.

అందుకే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించేది. 

(24-04-2021)

కామెంట్‌లు లేవు: