2, ఏప్రిల్ 2015, గురువారం

పోయినోళ్ళు అందరు మంచోళ్ళు

శశిశ్రీ - కడప జిల్లాకు మా రేడియో విలేకరి.


వార్త ఇవ్వడానికి అప్పుడప్పుడు ఫోను చేసేవాడు. వార్తకు ముందు అందర్నీ పేరు పేరునా అడిగేవాడు. చాలా ఏళ్ళ వరకు అతడో మంచి రచయిత అనీ, ముస్లిం అనీ తెలియదు. పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారి ప్రియ శిష్యుడు. ఒకసారి హైదరాబాదు వచ్చి తను ఎడిట్ చేసే ఓ పత్రిక ఇచ్చాడు. అప్పుడు తెలిసింది శశిశ్రీ ఓ రచయిత అని. మంచివాడు కాబట్టే  ముందుగా తప్పుకున్నాడు. ఎవరికి సంతాపం తెలపాలో తెలియని దుస్తితి నాది. అతడు తప్ప అతడి కుటుంబంలో ఎవ్వరూ తెలవదు. జర్నలిస్టులకు ఇలాటి శాపం ఏదో వున్నట్టు వుంది. వాళ్ళు అందరికీ తేలుస్తారు. వారి కుటుంబం వాళ్ళు ఎవ్వరో ఎవ్వరికీ తెలియదు. -  

కామెంట్‌లు లేవు: