1, నవంబర్ 2013, శుక్రవారం

గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈగడ్డ


మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు మరణించినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షిక ఇది. ‘ఏ పత్రికలో ఇలా వచ్చింది – ఈ హెడ్డింగు పెట్టింది ఎవరు’ అంటూ చాలామంది అడిగారు. అంజయ్య గారు చనిపోయినప్పుడు అప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న శ్రీ  వర్దెల్లి మురళి ఈ శీర్షిక పెట్టారు. ప్రస్తుతం శ్రీ మురళి సాక్షి పత్రిక ఎడిటర్ గా వున్నారు.
ఎలాగూ హెడ్డింగుల ప్రసక్తి వచ్చింది కాబట్టి మరో విషయం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాష్ట్రంలో మొదటిసారి నల్గొండకు రైలు మార్గం ఏర్పాటు అయింది. అప్పుడు ఆంధ్ర ప్రభ ఎడిటర్ గా వున్న శ్రీ ఏబీకే ప్రసాద్ పెట్టిన పతాక శీర్షిక – “ నల్గొండకు రైలొచ్చింది”
ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన హెడ్డింగు - " పేదోని అన్నం గిన్నె తొణికింది". (రెండు రూపాయల కిలో బియ్యం పధకం నేపధ్యంలో అనుకుంటాను.) ఈ శీర్షిక పెట్టింది కూడా  ఏబీకే గారే.    

పాశం యాదగిరిని తెలవని జర్నలిష్టులు హైదరాబాదులో వుండరు. చాలామందికి తెలవని సంగతి ఏమిటంటే - ఆయన ‘యాదు’ లో చాలా చక్కని చిక్కని సంగతులు ఎన్నో వున్నాయి. కదిలించి చూడాలే కాని ఇలాటి కదిలించే కబుర్లు ఎన్నో. 

కామెంట్‌లు లేవు: