ఫర్ సపోజ్ గుర్రం ఎగరావచ్చు అనే థియరీ ప్రకారం, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మితృలు వుండరు అనే రాజకీయుల పాచిపోయిన మరో సిద్ధాంతం ప్రకారం, రెండేళ్ల తర్వాత ఏపీలో జరగబోయే ఎన్నికల సమయానికి రాజకీయ ముఖచిత్రం ఈ కింది విధంగా మారింది అనుకోండి.
బీజేపీ
కూటమిలో వైసీపీ చేరడం, లేదా
వైసీపీకి  బీజేపీ అగ్రనాయకత్వం బేషరతు
మద్దతు తెలపడం,
బీజేపీ  టీడీపీ, జనసేన ఒక జట్టుగా, లేదా టీడీపీ
జనసేన ఒక  కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాలని
ఆయా పార్టీల అధిష్టానాలు  నిర్ణయించాయి
అనుకుందాం. (ఊహాగానమే కదా! ఏమైనా అనుకోవచ్చు) ఇప్పుడు బుల్లి తెరలపై చొక్కాలు
చించుకుంటున్న అధికార ప్రతినిధులు అందరూ   అప్పుడు మంత్రం వేసినట్టు నాలుకలు మడతేసి
మాట్లాడుతారా! 
అయ్యోరామా!
మరిచేపోయా! నరంలేని నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది కదా! అనుమానం ఎందుకు! మడత తథ్యం.
పెద్ద నాయకులకి లేని శషభిషలు కిందివారికి ఎందుకు? 
గతంలో
చూసిన సినిమాలే కదా!  
(26-05-2022) 
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి