14, జనవరి 2022, శుక్రవారం

వివాహత్పూర్వం

 నలుగురిలో వున్నప్పుడు ఉన్న రెండు చెవుల్లో ఓ చెవి అటు పడేస్తే కొత్త విషయాలు తెలుస్తాయి.

దేవరకొండ నరసింహశాస్త్రి గారు అనే పౌరోహితుడు  మా బంధువుల ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టడానికి వచ్చి ఓ శ్లోకం చదివారు.

“కన్యా వరయతే రూపం

మాతా విత్తం, పితా శ్రుతం

బాంధవాః కులమిచ్చంతి

మృష్టాన్న హితవే జనాః”

శాస్త్రిగారి మాటల్లో దీని భావం ఏమిటంటే పెళ్లి కావాల్సిన వధువు, కాబోయే  వరుడిలో అందచందాలను, అతడి రూపలావణ్యాలను చూస్తుంది. వధువు తల్లి విత్తం అంటే వరుడి కుటుంబం తాలూకు ఆర్ధిక స్థితిగతులను, ఆ ఇంట్లో తన కూతురు సుఖపడగలుగుతుందా అనే విషయాలను  పరిశీలిస్తుంది. వరుడి తండ్రి శ్రుతం అంటే వరుడి చదువు సంధ్యలు, విద్యార్హతలు, ఉద్యోగం మంచి చెడులు గురించి ఊళ్ళో నలుగురు ఏమనుకుంటున్నారు అనే విషయాలను జాగ్రత్తగా గమనిస్తాడు. వధువు తరపు బంధువులు ఈ సంబంధం గురించి చెప్పగానే కులం (అంటే ఇక్కడ సాంప్రదాయం అని అర్ధం, కులం కాదు) ఆచారవ్యవహారాలు (స్వశాఖీయం, పరశాఖీయం) మొదలైనవి చూస్తారు. పొతే, ఇక ఇరుగుపొరుగు  జనాలు మాత్రం  ఆ పెళ్ళిలో భోజనం ఏర్పాట్లు ఎలా వున్నాయి, పదార్ధాలు ఎలా వున్నాయి  అనే అంశం గురించి మాట్లాడుకుంటారు.

శాస్త్రి గారు చెప్పేది ఏమిటంటే చివరివి రెండూ అంత ప్రధానమైనవి కావు కాబట్టి  ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలని.

నాదీ, మా పిల్లలవీ పెళ్లి చూపులు, పెళ్లి మాటలు లేని పెళ్ళిళ్ళు కనుక నాకీ విషయాలు కొత్తగానే అనిపించాయి.


NOTE: COURTESY IMAGE OWNER


 

కామెంట్‌లు లేవు: