12, మార్చి 2020, గురువారం

షేర్ ఖాన్ లు – సింద్ బాదు


చిన్నప్పుడు చందమామ పత్రికలో ‘సింద్ బాద్ సాహస యాత్రలు’ అనే పేరుతో సీరియల్ కధలు వచ్చేవి.
సింద్ బాద్ అనే వర్తకుడు పడవల్లో సరుకులు నింపుకుని వేరే దేశాల్లో విక్రయించి అపార ధన రాశులతో తిరిగివస్తుంటే ప్రచండమైన తుపాను గాలులు చుట్టుముట్టడం, నడిసముద్రంలో నౌకలు మునిగిపోయి, సర్వస్వం కోల్పోయి ఈదుకుంటూ ఏదో వడ్డుకు చేరి భయంకరమైన దీవుల్లో నరరూప రాక్షసుల మధ్య రోజులు గడుపుతూ ఎన్నో సాహస కార్యాలు చేసి తిరిగి తన ఊరు చేరుకోవడం ఈ సీరియల్ కధల్లోని ప్రధాన ఇతివృత్తం.
ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కుదేలై, లక్షల కోట్ల రూపాయల మేరకు మదుపరుల పెట్టుబడులు ఆవిరై పోతున్నాయనని అనుదినం పత్రికల్లో చదువుతున్నప్పుడు ఈ సింద్ బాద్ గుర్తుకువచ్చాడు. తుపాను వచ్చి సింద్ బాద్ సర్వస్వం కోల్పోతే, ఇప్పుడు కరోనా దెబ్బకు షేర్ల ధరలు దారుణంగా పడిపోతున్నాయట.
ఎక్కడో కొడితే, మరెక్కడో తగలడం అంటే ఇదేనేమో!
గమనిక: ఈ షేర్ మార్కెట్లకు సంబంధించి ఇసుమంత అవగాహన కూడా నాకు లేదు.

కామెంట్‌లు లేవు: