6, డిసెంబర్ 2014, శనివారం

నడిచి వచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు


జడి జడిగా పడుతున్న వాన చినుకుల్ని కారు వైపర్లు తుడుస్తుంటే ఎదట రోడ్డు స్పష్టాస్పష్టంగా కానవచ్చినట్టు గతంలోని చిన్నతనం. గుర్తుకు వస్తున్న చిన్ననాటి జ్ఞాపకాలు.





"......నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా|......
".......అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్
దుష్టునిఁ గంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా!......."
పల్లె మేలుకుంటున్న వేళ దూరంగా వుండి వుండి గాలిలో  తేలుతూ  వినవచ్చే కృష్ణ శతకంలోని పద్యాలు. అప్పయ్య మాస్టారి నాన్నగారు శివరాజు నాగభూషణ రావు గారు మంచి కృష్ణ భక్తులు. పొద్దున్నే లేచి స్నానాదులు ముగించుకుని సూర్యోదయానికి పూర్వమే సుస్వరంతో ఆ పద్యాలను గొంతెత్తి పాడేవారు.  మా వూరికి అదే  సుప్రభాతం.
పట్నంలో ఉంటూ సెలవులకు వూరికి వచ్చినప్పుడు చేసే ఒకే ఒక్క పని కరువుతీరా నిద్రపోవడం. ఇంటి ముందు ఆరుబయట మంచం వేసుకుని పడుకుంటే ప్రాణం గాలిలో తేలిపోయేది. దుప్పటి ముసుగు కప్పుకుని పడుకుంటే మెళకువ వచ్చినా లేవకుండా మరి కాసేపు పడుకుంటే బాగుంటుందని అనిపించేది. కల్లాపు జల్లడానికి వచ్చిన జీతగాళ్ళకు నా మంచం అడ్డు. 'పోనీలే సీనాయి (అంటే నేను)ని కాసేపు పడుకోనివ్వండి'. ఎక్కడినుంచో మా బామ్మ గొంతు. ఇంట్లో ఆవిడది సుగ్రీవాజ్ఞ. వెంటనే ఇద్దరు జీతగాళ్ళు నేను పడుకున్న నవారు  మంచాన్ని అలాగే పట్టి లేపి పక్కకు పెట్టి తమ పని కానిచ్చుకునేవారు. ఇదంతా ఎంతో సరదాగా వుండేది.
(సారీ! మరికొన్ని ముచ్చట్లు మరో సారి)
NOTE: Courtesy Image Owner       
  


1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

మంచమే పల్లకీ?!