ఏ రాజకీయ నాయకుడికీ మినహాయింపు లేని
వాస్తవం ఇది.
నాయకులను అధికార పీఠం మీద
కూర్చోబెట్టేది ప్రజలు. అధికారానికి దగ్గర చేసేది ప్రజలు.
ఆ అధికారమే వారిని మళ్ళీ ప్రజలకు దూరం చేయడం ఓ చిత్రం!
వారువీరని కాదు ఏ రాజకీయ నాయకుడయినా
అధికారంలో లేనప్పుడు ప్రజలకు దగ్గరగా తిరిగిన రోజులు గుర్తు చేసుకోండి.
అదే వ్యక్తులు అధికారంలోకి
రాగానే వారికీ, ప్రజలకు నడుమ సెక్యూరిటీ పేరుతొ అడ్డం నిలిచిన బారికేడ్లను
గమనించండి.
ఈ నిజం అర్ధం అవుతుంది.
అధికారానికి కారకులయిన వారే, వారి
ప్రాణాలకు ముప్పుగా మారుతారా!
ఏమో!