8, మే 2021, శనివారం

శాస్త్రం – శాస్త్రీయం

 

శివ పురాణంలో ఒక ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. లోకంలో పాపుల సంఖ్య పెరిగిపోవడం చూసి లయకారుడు అయిన మహా శివుడికి మహాకోపం కలిగింది. ఆయన వెంటనే తన జటాఝూటం నుంచి ఒక కేశాన్ని తీసి దానితో కృత్య అనే మహమ్మారిని సృష్టించి పాపులను సంహరింప చేస్తాడు. ఇది ఐతిహ్యం.

అలాగే, జనాభా గురించి మాల్తూసియన్ థియరీ అని ఒకటుంది. థామస్ రాబర్ట్ మాల్తూస్ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ప్రపంచంలో జనాభా, ఆహార ధాన్యాల ఉత్పత్తితో నిమిత్తం లేకుండా అపరిమితంగా పెరిగిపోయే సందర్భాలలో ప్రకృతి తనంతట తాను ఆ దామాషాను తగిన విధంగా సవరించుకుని, సమతూకం చేసుకుంటుందని (Checks and Balances) మాల్తూస్ మహాశయుల సిద్ధాంతం. ఈ క్రమంలోనే కరువులు, కాటకాలు, ఉప్పెనలు, తుపానులు, మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, అంటువ్యాధులు ప్రబలి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారని ఆ శాస్త్రవేత్త భాష్యం.
(08-05-2021)

కామెంట్‌లు లేవు: