3, మే 2021, సోమవారం

సీనియర్ జర్నలిస్టు ఆజాద్ చిస్తీ

 మరణవార్తలు రాయడానికి మనసు శరీరము సహకరించడం లేదు. సీనియర్ జర్నలిస్టు ఆజాద్ చిస్తీ చనిపోయినట్టు ఇప్పుడే తెలిసింది. సచివాలయం బీట్ చూసేవారందరికీ చిరపరిచితుడు.



నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాదు జర్నలిస్టులు ఎవరితో ఆయనకు పరిచయం లేదు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడల్లా ఆజాద్ చిస్తీ, సోఫాలో ఆయన పక్కనే కూర్చొనేవాడు. ఆ రోజుల్లో విలేకరులు సరదాగా చెప్పుకునేవారు. హైదరాబాదు జర్నలిస్టుల్లో ఎన్టీఆర్ ముఖం చూసి గుర్తు పట్టేది ఇద్దరినే అని. ఒకరు ఆజాద్ చిస్తీ. మరొకరు హిందూ రెసిడెంట్ ఎడిటర్, ప్రముఖ పాత్రికేయులు, కీర్తిశేషులు శ్రీ హెచ్. జే, రాజేంద్ర ప్రసాద్.
శ్రీ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వున్నప్పుడు ఒకసారి హైదరాబాదు వచ్చారు. ఆ సందర్భంలో ఏదో కార్యక్రమానికి వెడుతూ ట్రాఫిక్ లో చిక్కుకు పోయారు. సాధారణంగా అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆ రోజు ఓ గేదెల గుంపు హఠాత్తుగా రోడ్డు పైకి రావడంతో ముందుగా ఊహించని పోలీసులు బిత్తర పోయారు. అప్పుడు ఈ సంఘటనని మొట్టమొదట రిపోర్ట్ చేసింది ఆజాద్ చిస్తీ.
(03-05-2021)

కామెంట్‌లు లేవు: