22, జూన్ 2020, సోమవారం

పృచ్చకుడిగా ప్రధానమంత్రి


(శ్రీ పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకుని)

శ్రీ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాదులో నాగఫణి శర్మ గారి మహా శతావధానం జరిగింది. అందులో శ్రీ పీవీ పృచ్చకుడిగా ఒక ప్రశ్న వేయాల్సి వచ్చింది. అప్పుడాయన చెప్పిన మాటలు:

“కొందరు తుపాను బాధితులు, మరికొందరు వర్షాభావ బాధితులు. నేను సమయాభావ బాధితుడిని. ఎటు చూసినా ప్రశ్నలే. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే కనపడుతున్ననాకు, ఇన్ని ప్రశ్నల నుంచి ఏ ఒక్క ప్రశ్ననో వేరు చేసి అడగడం అంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడమే. అందుకని, కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో తన మనః స్తితికి తట్టిన విధంగా అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్పురిస్తుందో దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాను”

దానికి నాగఫణి శర్మ గారి సమాధానం :

”సకల భారతమును శాసింపగల రేడు

ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసె

ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన

ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను”      పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాదులో నాగఫణి శర్మ గారి మహా శతావధానం జరిగింది. అందులో శ్రీ పీవీ పృచ్చకుడిగా ఒక ప్రశ్న వేయాల్సి వచ్చింది. అప్పుడాయన చెప్పిన మాటలు:

“కొందరు తుపాను బాధితులు, మరికొందరు వర్షాభావ బాధితులు. నేను సమయాభావ బాధితుడిని. ఎటు చూసినా ప్రశ్నలే. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే కనపడుతున్ననాకు, ఇన్ని ప్రశ్నల నుంచి ఏ ఒక్క ప్రశ్ననో వేరు చేసి అడగడం అంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడమే. అందుకని, కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో తన మనః స్తితికి తట్టిన విధంగా అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్పురిస్తుందో దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాను”

దానికి నాగఫణి శర్మ గారి సమాధానం :

”సకల భారతమును శాసింపగల రేడు

ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసె

ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన

ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను”     


కామెంట్‌లు లేవు: