మొట్టమొదటిది, మీడియా స్వేచ్ఛగా తన విధులు నిర్వహించుకునేందుకు వీలుగా ఎలాంటి నిర్బంధాలు లేకుండా చూడడం. అదే సమయంలో మీడియా సైతం తన బాధ్యతగా స్వీయ నియంత్రణ పాటించడం. అయితే దీనికి ప్రధానమైన అడ్డంకి స్వీయ ప్రయోజనాలు. వీటిని వదులుకోవడం నేటి పోటాపోటీ ప్రపంచంలో సాధ్యమా?
రెండు,
ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తి పారదర్సకత.
తీసుకుంటున్న నిర్ణయాలు, జారీ చేసిన జీవోలు ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్
లో వుంచడం. (దేశ భద్రత, మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలకు సంబంధించిన వాటిని మినహాయించి, మిగిలిన
అన్నింటినీ ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో వుంచడం)
ఇక
మూడవది, అతి ప్రధానమైనది
ఏమిటంటే, న్యాయస్థానాలు కూడా స్వీయ నియంత్రణ పాటించడం. రాజ్యాంగం ప్రసాదించిన
విశేష హక్కులు,
అధికారాలను సంయమనంతో ఉపయోగించుకోవడం. తాముకూడా రాజ్యాంగ వ్యవస్థల్లో ఒక
భాగమని ఎల్లప్పుడూ గుర్తెరిగి
వ్యవహరించడం. ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థపై ముసురుకుంటున్న అనుమానాలు, చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాల
దృష్ట్యా న్యాయ వ్యవస్థే తనకు తానుగా ముందుకు వచ్చి కోర్టు ధిక్కరణ వంటి అంశాల్లో
ప్రజల్లో పెరుగుతున్న సందేహాలను నివృత్తి చేయడానికి వీలుగా వాటిపై దేశవ్యాప్త బహిరంగ చర్చను ఆహ్వానించడం.
ఈ మూడు
వ్యవస్థలలో దాపరికం లేకుండా చేయగలిగితే అంతకంటే ఉత్తమ పరిష్కారం మరోటి వుండదు.