8, నవంబర్ 2020, ఆదివారం

రోటీ పచ్చళ్ళ వేణుగోపాల్ ఇక లేరు

 


అందరికీ తనదైన శైలిలో రోటీ పచ్చడి రుచి చూపించిన వాసిరెడ్డి వేణుగోపాల్ ఇక లేరు.



అంశం ఎలాటిదైనా సరే నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పి పాఠకులను అభిమానులుగా చేసుకున్న వేణుగోపాల్  ఇక లేరు.

స్నేహానికి ప్రాణం ఇస్తూ  చక్కని చిక్కని నైంటీ ఎమ్మెల్ మాటలతో మిత్ర బృందాన్ని అలరించిన వేణుగోపాల్ ఇక లేరు.

నమ్మలేని ఈ నిజాన్ని యాంకర్ మిత్రుడు చంద్ర పొద్దున్నే తెలియచేస్తే, వేణుగోపాల్ గారి సోదరి వాసిరెడ్డి పద్మ గారు ధ్రువ పరిచారు.

వేణుగోపాల్ గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటూ ఒంటరి అయిపోయిన రోలూ రోకళ్ళకు, ఆయన ప్రేమతో పెంచిన అనేక మొగ జీవాలకు సానుభూతి తెలియచేసుకుంటున్నాను.  

కామెంట్‌లు లేవు: