12, జూన్ 2018, మంగళవారం

రాజకీయ రంగస్థలం

మహానటి సావిత్రి ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒక సినిమాలో, చెల్లెలుగా మరో సినిమాలో వేస్తే ప్రేక్షక జనాలు ఆదరించిన మాట నిజమే కానీ, వేషాలు మార్చుకున్న రాజకీయ రంగస్థల నటులను మాత్రం ఇట్టే గుర్తు పట్టేయగలరన్న సంగతిని వాళ్ళు మరచిపోతున్నట్టున్నారు. అందుకే కాబోలు వేషం మార్చినా ప్రజలు పట్టుకోలేరన్న నమ్మకంతో వ్యవహరిస్తున్నారు.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూడండి. రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, చూస్తుండగానే పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు జనాలు పండిత, పామరులనే తేడా లేకుండా ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఎప్పటిదాకా!
వచ్చే ఎన్నికల దాకా.


ఆ తర్వాత నాటకాలు ఆడేవాళ్ళే ప్రేక్షకులుగా మారిపోతారు.

కామెంట్‌లు లేవు: