పురాణాల్లో చక్కటి నీతి కధలు వున్నాయి. పురాణాలు కధలా అనే వాదన తేకండి. అవన్నీ మనిషి మనిషిలాగా ఎలా జీవించాలి అని చెప్పేవే.
చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నారు. అంటే ఏమిటి దైవాన్ని అర్చించడానికి మడులు దడులు అక్కరలేదు. ఈ విషయం మనకు కిరాతార్జునీయం గాధలో స్పష్టంగా కనబడుతుంది. శుచిగా వండిన ప్రసాదాల కంటే ఆ పరమేశ్వరుడికి భక్తితో తిన్నడు సమర్పించిన మాంస ఖండాలే ప్రీతికరం అంటూ పెద్దలు బోధించిన నీతి కధలు వింటూ పెరిగిన తరానికి కూడా మంచి వాక్యాలు రుచించడం లేదు. ఇదొక విషాదం.
1 కామెంట్:
మీ ఆలోచన సరికాదు. దైవాన్ని అర్చించడానికి శుచి మడి అవసరమే. Kannappa is an exception and not a norm. మాంసం దైవానికి నివేదించడం నిషిద్ధం. గురువులు శాస్త్రం చెప్పిన వైదిక ఆచారాలు పాటించాలి. తొందరపడి తప్పుగా అన్వయం చేయడం సరికాదు.
అసలైన విషాదం ఏమిటంటే మీ వంటి పెద్దలు కూడా దైవార్చన సంప్రదాయం అర్థం చేసుకోలేక పోవడం.
కామెంట్ను పోస్ట్ చేయండి