సృష్టిలోని ఓ వైచిత్రిని కరోనా ఎత్తి చూపుతోంది.
ఈ చరాచర ప్రపంచంలో మానవులతో పాటు కోటానుకోట్ల ఇతర జీవరాశులు కూడా మనుగడ సాగిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే,  కరోనాకు కారణమైన ఒక అల్పక్రిమి ఈ సమస్త భూమండలంలో ఒక్క మనిషి జోలికి తప్ప ఏ జీవిని తాకడం లేదు. చెట్లూ చేమా, కుక్కలు, పిల్లులూ, పాములూ తేళ్ళూ, బల్లులూ, బొద్దింకలు ఈ సృష్టిలోని  ఏ ఇతర జీవీ కూడా కరోనా వైరస్ కు గురైన దాఖలా లేదు.  ఆ జీవులన్నీ తమతమ జీవన విధానాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. ఈ విషయాన్ని మనుషులు గమనంలోకి తీసుకోవాలి. దీనికి కారణం ఏమిటంటే,  ఇతర జీవరాశులు ఏవీ కూడా ప్రకృతి సమతుల్యానికి హాని చేసే పనికి పూనుకోలేదు. ఒక్క మనిషి మాత్రమే ఈ విషయంలో నాగరీకం, ఆధునికత  పేరుతొ  సొంత గొయ్యి తవ్వుకుంటూ వస్తున్నాడు. 
ఆ గొయ్యే ఈ కరోనా!    
1 కామెంట్:
ఇది చదవండి.
https://bonagiri.wordpress.com/2020/04/10/మనిషి-ఓటమి/
కామెంట్ను పోస్ట్ చేయండి