20, జులై 2020, సోమవారం

మనిషి తవ్వుకున్న గొయ్యి కరోనా! – భండారు శ్రీనివాసరావు

సృష్టిలోని ఓ వైచిత్రిని కరోనా ఎత్తి చూపుతోంది.
ఈ చరాచర ప్రపంచంలో మానవులతో పాటు కోటానుకోట్ల ఇతర జీవరాశులు కూడా మనుగడ సాగిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే, కరోనాకు కారణమైన ఒక అల్పక్రిమి ఈ సమస్త భూమండలంలో ఒక్క మనిషి జోలికి తప్ప ఏ జీవిని తాకడం లేదు. చెట్లూ చేమా, కుక్కలు, పిల్లులూ, పాములూ తేళ్ళూ, బల్లులూ, బొద్దింకలు ఈ సృష్టిలోని ఏ ఇతర జీవీ కూడా కరోనా వైరస్ కు గురైన దాఖలా లేదు. ఆ జీవులన్నీ తమతమ జీవన విధానాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. ఈ విషయాన్ని మనుషులు గమనంలోకి తీసుకోవాలి. దీనికి కారణం ఏమిటంటే, ఇతర జీవరాశులు ఏవీ కూడా ప్రకృతి సమతుల్యానికి హాని చేసే పనికి పూనుకోలేదు. ఒక్క మనిషి మాత్రమే ఈ విషయంలో నాగరీకం, ఆధునికత పేరుతొ సొంత గొయ్యి తవ్వుకుంటూ వస్తున్నాడు.
ఆ గొయ్యే ఈ కరోనా!

1 కామెంట్‌:

bonagiri చెప్పారు...

ఇది చదవండి.
https://bonagiri.wordpress.com/2020/04/10/మనిషి-ఓటమి/