12, డిసెంబర్ 2015, శనివారం

గాలి బుడగ ఈ జీవితం


జాతస్య మరణం ధృవం అని తెలిసిన వాళ్ళు కూడా మరణం పలానా ఘడియలో  అని ముందుగా తెలిస్తే కుదేలయిపోవడం ఖాయం.


మార్గశిర మాసం మొదటి రోజున పొద్దున్నే ఒక టీవీ ఛానల్ కు వెళ్లి ఇంటికి తిరిగివచ్చేసరికి బయట గేటుకి కట్టేసివున్న రెండు మేకలు ‘మేమే’ అంటూ ఆప్యాయంగా పలకరించాయి. వాటి నుదుటిని ముట్టుకుని దువ్వుతుంటే మా వాచ్ మన్ కొండలరావు వచ్చాడు. ‘జత పన్నెండు వేలు’ అన్నాడు. అతడికిది అలవాటే. గతంలో ఎంతో డబ్బు పోసి పందెం కోళ్ళు కొనుక్కొచ్చి పెంచడం, సీజను కాగానే అవి మాయం కావడం  నేను చూస్తూనే వున్నాను. అల్లాగే మళ్ళీ పందెం మేక పోతులు కొనుక్కొచ్చాడని అనుకున్నాను.
‘మా చుట్టాలు వస్తారు, రేపు పెద్దమ్మ అమ్మవారికి నైవేద్యం పెడతాము’ చెప్పాడు కొండల రావు. అది వింటూనే,  మేక నుదుటిపై వున్న చేయి ఒణికింది. ‘మే మే’ అని పలకరించిన వీటి జీవితానికి రేపే ఆఖరి రోజు’ అని తెలియగానే ఎలాగో అనిపించింది.

‘మీ  జీవితం ఈ క్షణంతో సరి’ అని తెలిస్తే మనుషులు ఏమైపోతారో’     

కామెంట్‌లు లేవు: