20, నవంబర్ 2014, గురువారం

ఇదే తేలిక

  
చిదంబర స్వామి  చెన్నై సముద్ర తీరంలో ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ వుండగా హఠాత్తుగా దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని విలాసంగా అన్నాడు.
చిదంబరస్వామికి ముందు నోట మాట రాలేదు. తరువాత తెలివి తెచ్చుకుని  'స్వామీ! ఇక్కడ నుంచి నేరుగా సముద్రం మీద శ్రీలంకకు వంతెన నిర్మిస్తే ప్రజలకు ఎంతో సదుపాయంగా వుంటుంది. దయచేసి నలుగురికీ ఉపయోగపడే ఆ వరం ప్రసాదించు' అన్నాడు.
దేవుడు మరింత విలాసంగా నవ్వుతూ అన్నాడు.
'నేనేదో నీ భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే నువ్వేమో జనాలు వాళ్ళ  అవసరాలు అంటూ ఏవేవో సాధ్యం కాని కోరిక కోరుతున్నావు. మళ్ళీ అడుగుతున్నాను. నీకేదయినా పనికొచ్చే విషయం వుంటే అడుగు. తీర్చేసి వెడతాను'
'అలా అయితే అల్లాగే అడుగుతాను. నాకు పెళ్ళయి పదేళ్ళవుతోంది. నా భార్య మనసు ఇంతవరకు అర్ధం కాలేదు. ఆడవారి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా?'
దేవుడి మోహంలో నవ్వు మాయమయింది.
'ఇందాక ఏదో శ్రీ లంకా, వంతెన అంటున్నావు. ఉత్త రోడ్డు వంతెన చాలా లేక దానికి రైలు వంతెన కూడా వుంటే బాగుంటుందా చప్పున చెప్పు'



(సురేష్ బాబు కొల్లూరు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner)

1 కామెంట్‌:

పల్లా కొండల రావు చెప్పారు...

:)) కోపం వస్తాది ఆడువారికి మీరిలా వ్రాస్తుంటేనూ...