3, నవంబర్ 2018, శనివారం
Discussion | CM Chandrababu Speech at Prakasam District and PawanKalyan ...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ ఛానల్ పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతో పాటు యాంకర్ శ్రీనివాస్
Discussion | CM Chandrababu Speech at Prakasam District and PawanKalyan ...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ ఛానల్ పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతో పాటు యాంకర్ శ్రీనివాస్
2, నవంబర్ 2018, శుక్రవారం
మార్చుకునేదే అభిప్రాయం – భండారు శ్రీనివాసరావు
మార్చుకునేవాటిని అభిప్రాయాలు అంటారా
గుండెల్లో దాచుకున్న అభిమానాలు అంటారా!
“నాకు బాబు అంటే పడదు, కానీ మోడీ
రాష్ట్రానికి చేసిన అన్యాయం అస్సలు బాగాలేదు, కాబట్టి నేను బాబు అభిమానిగా మారాను”
“నాకు జగన్ అంటే సరిపడదు, కానీ బాబు
నాటకాలు చూసి విసుగెత్తి జగన్ సరయినవాడని ఇప్పుడు అనుకుంటున్నాను”
“నాకు పవన్ మీద మంచి అభిప్రాయం లేదు,
అతనో మంచి సినిమా నటుడు అంతే. రాజకీయాలకు పనికిరాడు అనేది ఇప్పటివరకు నా
ఉద్దేశ్యం. కానీ మారుతున్న పరిస్తితులను గమనించిన తర్వాత నా అభిప్రాయాన్ని
మార్చుకుంటున్నాను”
జనమే ఇలా మారిపోతుంటే వాళ్ళని స్కాచి
వడబోసిన రాజకీయులు సామాన్యులు కాదు కదా! వాళ్ళూ అవసరాలకు అనుగుణంగా అభిప్రాయాలూ,
సిద్ధాంతాలు సూత్రాలు అన్నీ మార్చుకుంటూనే వుంటారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా!
The Fourth Estate | TDP Alliance with Congress - 1st November 2018
ప్రతి గురువారం మాదిరిగానే రాత్రి సాక్షి టీవీ 'అమర్స్ ఫోర్త్ ఎస్టేట్ ' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ పెంటపాటి పుల్లారావు (ఎనలిస్ట్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పార్ధసారధి (వైసీపీ), శ్రీ ఆంజనేయ రెడ్డి ( బీజేపీ)
1, నవంబర్ 2018, గురువారం
31, అక్టోబర్ 2018, బుధవారం
రెండు వార్తలు, పర్యవసానాలు – భండారు శ్రీనివాసరావు
1984 అక్టోబరు 31
ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి తన అంగరక్షకుల తుపాకీ గుళ్ళకు బలయిన రోజు.
సంఘటన ఆరోజు మధ్యాన్నమే జరిగినా ముందు జాగ్రత్త కోసం చాలాసేపు మరణ వార్తను అధికారికంగా ప్రకటించలేదు. సాయంత్రం రేడియో వార్తల్లో ఆ వార్త ప్రసారం అయ్యేవరకు శ్రీమతి గాంధి చావుబతుకుల మధ్య పోరాడుతున్నారనే సమాచారంతో జాతి యావత్తూ తీవ్రంగా మధన పడుతోంది. వార్తల అనంతరం దేశవ్యాప్తంగా పరిస్తితి పూర్తిగా మారిపోయింది. కాల్పులు జరిపిన వారిలో బియాంత్ సింగ్ ఒకరన్న సమాచారంతో అట్టుడికిపోయిన ఆందోళనకారులు విచక్షణారహితంగా సిక్కులపై ఊచకోతకు తలపడ్డారు. ఈ నరమేధం నాలుగు రోజులు సాగింది. సంఘటనతో ఏమాత్రం సంబంధం లేని అమాయకులయిన సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారులపై ట్రక్కులు నడిపే సిక్కు డ్రైవర్లలో చాలామంది అనేక అరాచకాలకు, దౌర్జన్యాలకు గురయ్యారు.
వార్తా ప్రసారంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయనడానికి ఇదో ఉదాహరణ.
1948 జనవరి 30
మహాత్మాగాంధీని ప్రార్ధనా స్థలంలో ఒక వ్యక్తి దగ్గరగా నిలబడి తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన ఆక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని హోదాలో హోం శాఖను చూస్తున్నారు.
పటేల్ రాగల పర్యవసానాలను చప్పున ఊహించారు. తక్షణం స్పందించారు. ఆకాశవాణి ఉన్నతాధికారులతో మాట్లాడి మహాత్ముడిపై కాల్పులు జరిపింది ఒక హిందువు అని ప్రసారం చేయించారు.
అంతకు కొన్ని రోజుల ముందు నుంచే దేశం యావత్తూ హిందూ, ముస్లిం ఘర్షణలతో అట్టుడికిపోతోంది. మహాత్మా గాంధీపై కాల్పులు జరిపింది, ఆయన్ని హత్య చేసిందీ ఒక హిందువు అని తెలియడంతో, అప్పటివరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న ముస్లిములు ఊపిరి పీల్చుకున్నారు.
పటేల్ ముందు చూపు కారణంగా ఆనాడు దేశం ఆవిధంగా ఒక పెద్ద మారణహోమం నుంచి బయట పడింది.
లేబుళ్లు:
సర్దార్ వల్లభాయ్ పటేల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)