శుక్రవారం ఉదయం ఏడుగంటలకు మహా న్యూస్ తో మొదలయి, @ న్యూస్
రిపబ్లిక్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 1, టీవీ 9,
ఏపీ 24
X 7 ఛానల్
డిబేట్ తో రాత్రి ఎనిమిదిన్నరకు నా టీవీ సంచారం ముగిసింది. పోలింగు నాడే ఫలితాలు
గురించీ, పోలింగు ముగిసిన తర్వాత సాయంత్రం నుంచి ఎక్జిట్ పోల్స్, ఇలా ఊహాగాన చర్చలు నిరంతరంగా సాగాయి.
మధ్యాహ్న భోజనం మిస్సయినా, మధ్యలో వీలు
చేసుకుని పోలింగు కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం మాత్రం మిస్సవలేదు. అదో ఊరట.
ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు అనే
సామెత నా లాంటి వారిని చూసి పుట్టిందేమో!