21, జూన్ 2024, శుక్రవారం

పృచ్ఛకుడిగా ప్రధాన మంత్రి



హైదరాబాద్ లో జరిగిన శ్రీ నాగఫణిశర్మ మహా శతావధానంలో ఒక పృచ్ఛకుడిగా నాటి ప్రధానమంత్రి శ్రీ పీ.వీ. నరసింహారావు అడిగీ అడగని ప్రశ్న:

శ్రీ పీవీ: 
“ఎటు చూసినా ప్రశ్నలే. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే కనపడుతున్న నాకు, ఇన్ని ప్రశ్నల నుంచి ఏ ఒక్క ప్రశ్ననో వేరు చేసి అడగడం అంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడమే. అందుకని, కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో తన మనః స్తితికి తట్టిన విధంగా అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్పురిస్తుందో దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాను”

శ్రీనాగఫణి శర్మ :

”సకల భారతమును శాసింపగల రేడు 
ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసె
ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన
ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను”

కామెంట్‌లు లేవు: