8, నవంబర్ 2016, మంగళవారం

నేను సైతం.....

నేను సైతం ఈరోజు నా దేశ ఋణం కొద్దిగా తీర్చుకున్నాను
ఈరోజు ఊబెర్ అద్దె వాహనంలో ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన మెయిల్ లో ఇలా వుంది:
Before Taxes
112.26

Service tax (4.2%)
4.71

Swachh Bharat Cess (0.15%)
0.17

Krishi Kalyan Cess (0.15%)
0.17
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEj2xvmyRz4n7U92_ulsVgfeEe-7sD20GewQaPtLOLB7AGFahrIp0mf-e5LdYf2Sq7HHWWGqehJqjPdVkfuzGii0KpjUfcK-fPNX_TKgrEpb6oteLLhMKGP6PRc-ys202znBWoRlzuf0swzTtvoTpieBs-NSwEUpjZweiJpDw3mu=s0-d-e1-ft

COLLECTED
₹ 117.31



అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2 శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు  0.15 శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు 0.15  శాతం  మరో పదిహేడు పైసలు  చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా నా ధర్మం. ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో   సర్కారుకు చెల్లించే పన్ను, సెస్సు  వివరాలు ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!     

కామెంట్‌లు లేవు: