15, జులై 2011, శుక్రవారం

అమ్మా నాన్నా ఒక అమ్మాయి - భండారు శ్రీనివాసరావు

అమ్మా నాన్నా ఒక అమ్మాయి - భండారు శ్రీనివాసరావు

‘డియర్ నాన్నా!’

ఒక్క క్షణం ఆ తండ్రికి చేతులు వొణికాయి. మనసు కీడు శంకించింది. భార్యను పిలుద్దామనుకున్నాడు. లిప్తపాటు ఆలోచించి ఆ ఆలోచన మానుకున్నాడు. మనసు కుదుట పరచుకుని కుమార్తె రాసిన ఉత్తరాన్ని చదవడం ప్రారంభించాడు.

“డియర్ నాన్నా! ఇలా నిన్ను పిలిచే అదృష్టానికి నా అంతట నేనే దూరం జరుగుతున్నాను. అల్లారుముద్దుగా, ఏలోటూ తెలియకుండా నన్ను పెంచారు. దానికి ప్రతిఫలంగా నేనిస్తున్న కానుకే ఇది.

“కారణం తెలియదు కానీ, రామూని నేను మరచిపోలేకపోతున్నాను. అందుకే అతడితో వెళ్లి పోతున్నాను. నాన్నా! ఇంత నిస్సిగ్గుగా రాస్తున్నానన్న కోపంతో ఈ ఉత్తరాన్ని చించేయకండి. దయచేసి చివరదాకా చదవండి నాన్న. దగ్గరగా లేకపోయినా మీ కంటిలోని తడిని నేను దూరంనుంచే చూడగలుగుతున్నాను. ఈ క్షణంలో భూమి బద్దలయితే బాగుండని అనుకుంటూ మనసులో పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకోగలుగుతున్నాను. ఒక్క విషయాన్ని మీరూ పెద్దమనసుతో అర్ధం చేసుకోండి నాన్నా. ఇంతవరకు నా జీవితంలో అపరిమితమయిన ప్రేమను పంచి ఇచ్చింది మీరూ అమ్మా మీరిద్దరే. అలాగే నాకో నమ్మకం, మీకంటే, అమ్మకంటే నన్ను ఇంతగా ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో మరెవరూ వుండరని. కానీ రామూ పరిచయంతో ఆ నమ్మకం కాస్తా ఆవిరై పోయింది.

“రామూ లాంటి వ్యక్తులు మీకు నచ్చరని తెలుసు. అలాగే, అతడికున్న అలవాట్లను మీరు కలలో కూడా భరించలేరని, క్షమించలేరని కూడా నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసే సాహసం చేయలేకపోయాను. కానీ, మీరు తెలుసుకోవాల్సింది కూడా వుంది నాన్నా. రామూ అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ ముందు అతడి అలవాట్లు, అతడి మొరటుతనం ఏదీ నాకు ఆనడం లేదు. అతడిమీద ప్రేమతో నా కళ్ళు మూసుకుపోయాయి. అతడి చెడ్డ అలవాట్లన్నీ ఇప్పుడు నాకు మంచిగా కనబడుతున్నాయి. అతడి సమక్షంలో నేను వేరే వ్యక్తిని అన్న భావన కూడా రాదు. అతడికేది ఇష్టమయితే దాన్నే నా ఇష్టంగా మలుచుకోవడం నాకిష్టం. ఆ ఇష్టంతోనే అతడికిష్టమని నేనూ సిగరెట్లు తాగుతున్నాను. అతడి కోసమే మందు, భంగు అలవాటు చేసుకున్నాను. రామూ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నా నాకు మరో విధంగా అనిపించడం లేదు. అంటే అతడిపై నేను ఎంతగా ప్రేమను పెంచుకున్నానో, దాని తీవ్రత ఎంతగా వుందో దయచేసి అర్ధం చేసుకోండి నాన్నా.

“నిజమే! కాదనను. వయస్సులో మా ఇద్దరి మధ్యా ఎంతో వ్యత్యాసం. కొద్ది అటూ ఇటూగా మీ వయసు అతడిది. అయితేనేం! అతడి మీద నాకున్న ప్రేమ కూడా అంతే పెద్దది. అంతే గొప్పది. అది అర్ధం చేసుకోండి నాన్నా. అన్నీ అర్ధం అయిపోతాయి.

“అల్లరి చిల్లరగా తిరుగుతాడనే రామూ వాళ్ల అమ్మా నాన్నా అతడిని వొదిలేశారట. ఇంటి నుంచి తరిమేశారట. ఈ స్తితిలో నా తోడు కూడా అతడికి దూరం అయితే ఏమయిపోతాడో అని నా బెంగ. ఇంకో విషయం కూడా ఈ మధ్యనే తెలిసింది. దానితో అతడి పట్ల నా జాలి మరింత పెరిగిపోయింది. రామూకు ఎయిడ్స్ అని డాక్టర్లు చెప్పారట. ఇన్ని రోగాలకు మందులు కనుకున్న శాస్త్ర వేత్తలు ఏదో ఒకనాడు ఎయిడ్స్ కు చికిత్స కనుక్కోలేకపోతారా నేను బాగుచేయించలేకపోతానా చెప్పండి.

“బాధ పడకండి డాడ్! ఇప్పుడు నా వయసెంతని. నిండా పదిహేనేళ్ళు కూడా నిండనే లేదు. కాకపోతే నా బాగోగులు నేనే చూసుకోగల మనస్తయిర్యాన్ని మీ పెంపకంలో అలవర్చుకున్నాను. అదే పదివేలు. ఏదో ఒక రోజు మీ మనుమడిని తీసుకుని రామూని వెంటబెట్టుకుని మిమ్మల్నీ అమ్మనీ చూడడానికి వస్తాను. అంతదాకా సెలవ్ – మీ – ముద్దుల కూతురు”

పీ ఎస్: - "డాడ్! పైన రాసినదంతా శుద్ద అబద్ధం. నేను పక్కింట్లో సుధక్కతో కూర్చుని చెస్ ఆడుతున్నాను. రామూ లేడూ సోమూ లేడూ అంతా ఉత్తిదే. నా స్కూలు ప్రోగ్రెస్ కార్డు కంటే దారుణమయిన విషయాలు లోకంలో ఇంకా చాలా వుంటాయని చెప్పడానికే ఇదంతా రాశాను. కార్డు పక్కనే సొరుగులో వుంది. చూసీ చూడనట్టుగా చూసి సంతకం పెట్టండి. పెట్టి ఫోను చేయండి. ఇంటికి వస్తాను.”

(15-07-2011)

నమ్మకం – అపనమ్మకం – భండారు శ్రీనివాసరావు

నమ్మకం – అపనమ్మకం – భండారు శ్రీనివాసరావు

ఒక పోలీసు అధికారిని డిఫెన్స్ లాయరు కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాడు.

ఆ సంభాషణ ఇలా సాగింది.

“ఘటనా స్తలం నుంచి నా క్లయింట్ పారిపోవడం మీరు చూసారా?”

“లేదు. కానీ ఘటన జరిగిన ప్రదేశం నుంచి కొద్ది దూరంలో ముద్దాయిని పోలివున్న ఒక వ్యక్తి పారిపోతుండగా చూసాను.”

“ముద్దాయి పలానా విధంగా వుంటాడని మీకు చెప్పిందెవరు?”

“నా కంటే ముందు అక్కడికి వెళ్ళిన నా కింది అధికారి చెప్పాడు.”

“ముద్దాయి అని అనుకుంటున్న వ్యక్తి పలానా విధంగా వుంటాడని మీ తోటి అధికారి చెప్పాడని అంటున్నారు. అతగాడు చెప్పినదానిని ఎంతవరకు నమ్మవచ్చు?”

“ నావద్ద చాలాకాలంగా పనిచేస్తున్నాడు కాబట్టి నాకు బాగా తెలుసు. అతడిని నమ్మకపోవడం అంటే నన్ను నేను నమ్మకపోవడమే.”

“ ఇప్పుడు అడిగే ఈ ప్రశ్న మీకు అసంబద్ధంగా అనిపించవచ్చు కానీ దయచేసి సమాధానం చెప్పండి. మీరు పనిచేసే పోలీసు స్టేషనులో మీరు, మీ సిబ్బంది యూనిఫారం మార్చుకోవడానికి విడిగా ఏదయినా గది లాంటిది వుందా?”

“వుంది. ఎవరి దుస్తులు వారు భద్రపరచుకోవడానికి అందులో లాకర్ల సౌకర్యం కూడా వుంది”

“ ఆ లాకర్లకు తాళాలు వుంటాయా? వుంటే వాటి తాళం చేతులు మీ దగ్గర వుంటాయా లేక మీరు నమ్మదగ్గ వ్యక్తి అని బల్లగుద్ది చెబుతున్న మీ సహచరుడి దగ్గర వుంటాయా?”

“ఎవరివి వాళ్ల దగ్గరే వుంటాయి. అయినా ఇది అంత సందేహపడాల్సిన సంగతేమి కాదుకదా!”

“అయితే ఇప్పుడు నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి ఆఫీసర్! అంత నమ్మదగ్గ వాడు అని మీరు అంత గట్టిగా అనుకున్నప్పుడు మీరు మీ లాకర్ కు తాళం వేసుకోవాల్సిన అగత్యం ఏమిటి?”

“అయ్యా లాయరు గారు. మీ అనుమానం సహేతుకమయినదే. మా స్టేషను కూడా కోర్టు ఆవరణలోనే వుంది. అప్పుడప్పుడు మీలాటి లాయర్లు మా స్టేషనులో తిరుగాడుతూ వుంటారు. మరి అటువంటప్పుడు, మాకు తాళాల అవసరం వుండదని అంత ఖచ్చితంగా యెలా చెప్పగలం చెప్పండి.” (15—07-2011)

14, జులై 2011, గురువారం

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు


“ ఆ రోజులే వేరు. వొంట్లో యువ రక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహ లాడుతుండే వాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.

“ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.

“అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసిరావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.

“ఇక అప్పుడు కానీ నాకు నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.

“బోధి వృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!

“క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.

“మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.

“ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం లో నేను చేసిన ఈ పొరబాటు మరెవ్వరూ చేయకూడదని చెప్పడానికే ఈ నాలుగు ముక్కలు.” (పదకొండో శతాబ్దానికి చెందిన ఓ సన్యాసి చెప్పిన నీతి కధ ఆధారంగా)

(14-07-2011)

13, జులై 2011, బుధవారం

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!


(నెట్ లో చక్కర్లు కొడుతున్న జోక్)


ఇంకెవ్వరు?

 
మన కనిమొళి మొగుడు జి.అరవిందన్

ఎందుకంటారా?బాంకులోనేమో 214 కోట్లు –
భార్య మాత్రం భద్రంగా బందిఖానాలో
(అనుభవించు 'రాజా' అనుభవించు)

రేడియో తాతయ్య ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

రేడియో తాతయ్య ఇక లేరు – భండారు శ్రీనివాసరావు


1938 జూన్ 16 వ తేదీ

మద్రాసులో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన రేడియో కేంద్రాన్నిప్రారంభించిన రోజది. అప్పటికి ఆలిండియా రేడియో ‘ఆకాశవాణి’ గా రూపాంతరం చెందలేదు. మద్రాసు పేరు మార్చుకుని చెన్నైగా అవతరించనూ లేదు. ప్రారంభ కార్యక్రమంగా అనుకుంటా బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ కచ్చేరీ పెట్టారు. దాని గురించి అనౌన్స్ చేసే  బాధ్యత మల్లంపల్లి ఉమామహేశ్వర రావు గారిపై పడింది. మద్రాసు రేడియో కేంద్రం అధికారికంగా మొదలుకాక ముందు నుంచే ఆయన అక్కడ పనిచేస్తూ వచ్చారు. ప్రసారాలకు అవసరమయిన రచనలకు ప్రతులు రాయడం ఆయన ఉద్యోగం. రేడియో కేంద్రం పనిచేయడం మొదలు పెట్టేసరికి ఆయన్నే అనౌన్సర్ గా పనిచేయమన్నారు. ఆ విధంగా ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తొలి అనౌన్స్ మెంట్ చేసిన ఘనత మల్లంపల్లి వారి ఖాతాలో చేరిపోయింది.

తదనంతర కాలంలో రేడియో తాతయ్యగా సుప్రసిద్దులయిన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు రేడియోలో పనిచేసిన వారందరికీ ప్రాతః స్మరణీయులు. ఈ రోజు ఉదయం ఆయన్ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భం అత్యంత బాధాకరంగా మారింది. మల్లంపల్లి వారు తమ 99 వ ఏట చెన్నై లో ఈ తెల్లవారుఝామున కన్ను మూసిన సంగతిని హైదరాబాద్ రేడియో కేంద్రం డైరెక్టర్ గా పదవీ విరమణ చేసిన పీ ఎస్ గోపాల కృష్ణ గారు కన్నీళ్ళ పర్యంత మవుతూ నా చెవిన వేశారు. నిజానికి నేను ఆయన్ని గురించి వినడమే కాని చూసి ఎరుగను. 1975 లో నేను హైదరాబాదు రేడియో కేంద్రం లో చేరిన రెండు సంవత్సరాలకే మల్లంపల్లి వారు నలభై ఏళ్ళ సుదీర్ఘ రేడియో జీవితాన్ని విరమించి 1977 మే 31 వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు.

ఆకాశవాణి అనౌన్సర్లు, న్యూస్ రీడర్లు, డ్రామా వాయిస్ స్టాఫ్ ఆర్టిస్టుల సంక్షిప్త జీవన రేఖలను స్పృశిస్తూ ‘వాచస్పతి’ పేరుతొ అంబడిపూడి మురళీ కృష్ణ, మడిపల్లి దక్షిణామూర్తి కలసి సంకలనం చేసిన గ్రంధంలో మల్లంపల్లి వారు తన గురించి రాసుకున్న కొన్ని జ్ఞాపకాలు ఈ సందర్భంగా నలుగురి దృష్టికి తీసుకురావడం సముచితంగా వుంటుందని భావిస్తూ వాటిని పేర్కొంటున్నాను.

“అప్పట్లో మద్రాసు, ఆంధ్ర, తమిళ, కన్నడ ప్రాంతాలు కలగలిపి అవిభక్తంగా ఉండడం వల్ల సంగీత కార్యక్రమాలకు నేను తెలుగులోనే ప్రకటనలు చేసేవాడిని.”

“రేడియో మొదటి రోజుల్లో ఆచంట జానకిరామ్ గారు నాటకాలు రూపొందించేవారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర దాకా నాటకం ప్రసారమయితే ఆ తర్వాత నాటకంలో పాల్గొన్నవాళ్లు, తక్కిన ఉద్యోగులు అందరు ఆరుబయట ఆయన ఏర్పాటు చేసిన విందు భోజనం చేసికానీ కదిలే వీలు వుండేది కాదు. ఆ విందు ఖర్చులన్నీ ఆయనవే.”

“రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక రోజు ఉదయం సేట్ కాలనీలో వున్న మా ఇంటి నుంచి ఎగ్మూర్ మార్షల్స్ రోడ్ లోని రేడియో స్టేషన్ కు బయలుదేరి వస్తుంటే దారిలో పోలీసు ఒకాయన ఆపి ‘ఎక్కడికి’ అని అడిగాడు. చెప్పాను. ఆయన- ‘ఇట్లా వెడితే మునిగిపోతావు. పాంతియన్ రోడ్ వైపు వెళ్ళు’ అన్నాడు. తీరా వెడితే రేడియో స్టేషన్ గేటు దగ్గర గుండె లోతు నీళ్ళు పారుతున్నాయి. చెంగల్పట్ జిల్లా లోని చెరువుకట్ట తెగి ఆ నీళ్ళు నగర ప్రవేశం చేశాయన్నమాట. స్టేషన్ లోకి అడుగు పెడుతుండగానే అక్కడ డైరక్టర్ ఎస్. గోపాలన్ గారు గ్రామ ఫోన్ రికార్డులు తీసుకునిపోతూ కనిపించారు. ఆయన నన్ను చూసి చాలా సంతోషపడి వెళ్లి అనౌన్స్ చేయమన్నారు. ప్రసారానికి సంబంధించిన పరికరాలన్నీ బల్లలపైకి ఎక్కి కూచుని కనిపించాయి. రోజంతా నేనొక్కడినే అనౌన్సర్ని. నీళ్లలోనే నిల్చుని అలా అనౌన్స్ చేస్తుండగా సాయంకాలం అయ్యేసరికి కరెంట్ పోయింది. ఆ పోయిన కరెంట్ మర్నాడు పొద్దున్న కానీ సరిపడలేదు. ఈ లోగా రేడియో కార్యక్రమాలు వినబడక పోయేసరికి నగరంలో కొందరు ప్రజలు జపాన్ వాళ్లు రేడియో కేంద్రాన్ని కూల్చేసినట్టున్నారని భయపడ్డారు.”

“ఒక ప్రముఖ విద్వాంసుడు ఎప్పుడు తన గానం ప్రసారం చేయడానికి వచ్చినా సింహ స్వప్నంగా వుండేది. ఆయన పాడినంత సేపూ అందుకు తగ్గట్టు అనౌన్సర్ తల వూపకపోతే ప్రాణం మీదికి వచ్చేది.”

“బాలగురుమూర్తిగారు కార్యక్రమ నిర్వాహకులుగా వున్నప్పుడు పిల్లల కార్యక్రమానికి ఒక పాత్ర కావలసి వచ్చింది. ఆయన నన్ను గొంతు మార్చి ప్రయత్నించమని చెప్పారు. అట్లా నేను తాతయ్య అవతారం ఎత్తాను. తాతయ్యగా చాలా ప్రఖ్యాతి సంపాదించాను. రేడియో స్టేషన్ కు వచ్చిన వాళ్లు తాతయ్యను చూపమని నన్నే కోరేవాళ్ళు. మరికొందరు నేనే తాతయ్యను అంటే నమ్మలేక పోయేవాళ్ళు.”

“ఒకసారి ఒక తెలుగు పత్రికా సంపాదకులు ప్రసంగం చేయడానికి వచ్చారు. అప్పటికి రికార్డింగ్ సౌకర్యం లేదు. ఆయన ప్రసంగిస్తారని నేను అనౌన్స్ చేసి చూస్తే ఆయన చెమటలు కక్కుతూ,వణుకుతూ కనిపించారు. ఎంత ప్రయత్నించినా ఆయన నోరు విప్పక పోయేసరికి నెమ్మదిగా ఆయన చేతుల్లోనుంచి ప్రసంగం ప్రతి తీసుకుని నేనే చదివేశాను.”

నిండు జీవితం జీవించిన ఆ పూర్ణ పురుషుడికి ముకుళిత హస్తాలతో శ్రద్ధాంజలి ఘటిద్దాం. (13-07-2011)

11, జులై 2011, సోమవారం

Cong’s hide-and-seek game on T - Bhandaru Srinivas Rao (I.I.S.)

Cong’s hide-and-seek game on T  - Bhandaru Srinivas Rao (I.I.S.)


As I have written in these columns in the past, the people of


Telangana are yet again set to get betrayed by their own leaders. A

conspiracy has already been launched none other than at 10 Janpath in

New Delhi, the official residence of UPA Chairperson and Congress

President Sonia Gandhi, to dilute the issue. The ‘resignation drama’

script which was penned by the coterie of Sonia was enacted to

perfection by the region’s MPs and MLAs, to give an impression about

their commitment.



But, now their reluctance to carry forward their mounted pressure on

the Centre, is a clear indication of their real intentions. The

‘escape route’ they found expressing apprehensions on T-JAC leadership

not at all convincing. Simply because, the T-JAC bound to act in

accordance of TRS diktat as both were committed to take the fight for

separate statehood to its logical conclusion. Why then, find fault

with T-JAC for working as an arm of TRS? It will and it shall, as far

as an ‘honest’ Telanganite is concerned.



Attributing motives against T-JAC Convenor Prof Kodandaram and

demanding for his removal, uncalled for. To me he appears working in

accordance with the aspirations of people of the region and no where

deviated from the task entrusted to him. Absolutely, there is no

logic in Congress leaders demand to replace Prof Kodandaram with

either educationists' Chukka Ramaiah or Prof Haragopal. This doesn’t

mean I hold any grouse against the two, who enjoy equally greater

credibility as individuals.



Today, it appears, the Congress leadership in New Delhi yet again

determined to betray the people of Telangana. It has betrayed in 1969

and now. The only difference I find between 1969 movement for

separate statehood spearheaded then by Dr Marri Chenna Reddy of

Telangana Praja Samiti (TPS) and now by the Telangana Rashtra Samiti

(TRS) headed by K Chandrasekhara Rao, the sincerity and honesty of the

leadership. Unlike Chenna Reddy, Rao appears more honest and ‘shrewd’

not to fall a prey to the lures of Congress. Had Rao like Chenna been

a power-hungry leader, he too could have got trapped by Delhi

leadership.



His pre-condition laid to Cong for ‘merging his party’’ only after

declaration of separate statehood for Telangana is undoubtedly

appreciable. Congress ‘game plan’ is clear – assessing pros and cons

on bifurcation. That’s why the state political affairs in-charge

Gulam Nabi Azad as well senior Congress leader and party’s core

committee member Pranab Mukherjee wanted to know from those who

resigned to MP and MLA seats from the Telangana region whether they

can retain their seats if byelections thrust upon. Though, the TRS

assures Delhi of ensuring the party’s existence better in the past, if

separate state carved out, yet it appears ill-afford to lose their

base in other two regions of the state – Andhra and Rayalaseema.



The party had also apparently realized that the demand for separate

statehood took an ugly turn, if not slipped out of hands, only after

the death of a strong leader like Y S Rajasekhara Reddy. Today, the

party lacks such a strong leader in the state, who is acceptable to

all three region people. Had Sonia and her advisors been

‘accommodative’ at least to the young YSR scion YS Jaganmohan Reddy by

entrusting him the job of Pradesh Congress Chief, the situation

wouldn’t have precipitated to this far. That did not happen, reasons best known to the

Congress leadership. Thus far, what one can infer is that YSR

adversaries succeeded in poisoning the mind of Sonia. That she

developed animosity against the late leader is evident from the

revelation of YSR widow at her party’s first plenary at Idupulapaya in

native Kadapa district. As honorary President of the newly formed YSR

Congress party, she blurt out what transpired between her and Sonia,

when she met the latter along with her son and MP Y S Jaganmohan Reddy

at 10 Janpath. Instead of acknowledging the efforts of her husband

YSR for bringing back the party to power in 2004 after a decade long

isolation, apparently boasted of attributing that achievement to

herself. No wonder Sonia’s unsavoury remarks hurt the YSR widow and

endorsed son’s proposal to launch a new party to teach a lesson or two

to egoist Sonia and her Congress party.



Well, the YSR Congress has already inflicted enough humiliation when

YSR widow Vijayalakshmi and her son Jaganmohan Reddy registered

resounding victories in the by-elections from Pulivendula assembly and

Kadapa parliament constituencies, not so long ago. Even the first

plenary of YSR Congress party proved a grand success, though those

from Telangana region, who attended in big numbers, gave vent to their

feelings by reverberating the meeting place with ‘Jai Telangana’

slogans.



Congress or other opposition parties criticism for YSR Congress party

not announcing its stand on state bifurcation, sounds silly as well

funny. It’s the Congress leadership at the Centre, in particular

Sonia Gandhi, who has to take the call on Telangana and decide either

way. Today, it is clear the Congress headed by Sonia Gandhi lack

courage to take a decision on Telangana as it fears of irreparable

loss to party in other two regions of the state. This apart, it also

equally feared as the BSP leader and Uttar Pradesh Chief Minister

Mayawati’s request for division of her state

pending with the UPA government for action.



While one appreciate the commitment and dedication of TRS leader K

Chandrasekhara Rao for accomplishing his goal, his party’s next plan

of action should pressurize the Congress and TDP MPs and MLAs to force

them ensure their resignations are accepted by the Speakers of both

Lok Sabha as well Legislative Assembly. If necessary, they should not

hesitate to accept the demand for replacement of Prof Kodandaram with

either Chukka Ramaiah or Prof Haragopal, once they fulfil their

promise of ensuring their resignations acceptance. The TRS should put

continuous pressure, especially Congress MPs and MLAs and never allow

them drift away from the stand they have taken. It should also ensure peace in the region as in the past as the decision lies more in the political process than in the streets.



People of the region are emotively surcharged and appear willing for

any sacrifices. Now the onus is more on TRS as it could succeed in

pushing the issue to this far, and now with another ‘strong push”

(dakka) it can ensure Telangana becoming a reality.



Today, the Congress MLAs and MPs too have no escape route. Time has

come for them to decide whether they would like to be remembered as

‘villains of T’ in history, or the ‘real martyrs.’ It’s up to them

to decide as no ‘buyers’ for the ‘blame game’ either on the TDP or YSR

Congress! ( 11-07-2011)

10, జులై 2011, ఆదివారం

‘ఎన్నాళ్ళిలా ? ఎన్నేళ్ళిలా ?’ - భండారు శ్రీనివాసరావు

‘ఎన్నాళ్ళిలా ? ఎన్నేళ్ళిలా ?’ - భండారు శ్రీనివాసరావు


తెలంగాణా ఎంపీల రాజీనామాలపై వచ్చే నెల ఒకటో తేదీన నిర్ణయం తీసుకుంటానని లోకసభ స్పీకర్ మీరాకుమార్ వెల్లడించి ఈ వ్యవహారం పై ముసురుకున్న సస్పెన్స్ ను మరో మూడు వారాలు పొడిగించారు. బహుశా శాసన సభ సభ్యత్వానికి రాజీనామాలు చేసిన తెలంగాణ నేతల విషయంలో కూడా స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఇలాటి నిర్ణయమే తీసుకోవచ్చు. ఈ ఇద్దరు సభాపతులు రాజీనామాల ఆమోద ప్రక్రియ ప్రారంభించి దాని పూర్తి చేయడానికి మరి కొన్ని రోజులు అదనంగా వ్యవధి తీసుకునే అవకాశం వుంది. అంటే రాజీనామాల వల్ల రగిలిన వాడీ వేడీ ఎంతో కొంత చల్లారేలా చూడడమే ఇందులోని పరమార్ధం కావచ్చు. మరి రాజీనామాలు చేసిన మంత్రులు అన్ని రోజులు విధులకు దూరంగా వుంటే అసలే అంతంత మాత్రంగా వున్న పాలన మరింత గాడి తప్పే ప్రమాదం వుంది. ఇప్పటికే సచివాలయంలో వందలాది ఫైళ్ళు అతీగతీ లేకుండా పడివున్నట్టు మీడియాలో సమాచారం. ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం లోనే సుమారు పన్నెండు వందలకు పైగా ఫైళ్ళు ముఖ్యమంత్రి సంతకం కోసం పడిగాపులు పడుతున్నాయని, నలుగురయిదుగులు మంత్రులు మినహా రాజీనామాలు చేసిన వారు, చేయని వారు సచివాలయం వైపే రావడం లేదని భోగట్టా. రాష్ట్రంలో సాగుతున్న రాజకీయాల తీరుతెన్నుల ప్రభావం పరిపాలనపై, దానిని నడిపే యంత్రాంగం పై యెలా పడుతుందో తెలుసుకోవడానికి ఇదో ఉదాహరణ. రాజీనామాలు చేసిన మంత్రుల పేషీల్లో ఫైళ్ళు పేరుకుపోవడాన్ని కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఇదే పరిస్తితి వుండడాన్ని యెలా సమర్ధిస్తారు? అధిష్టానంతో చర్చలకోసం తరచుగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిరావడం వల్ల, రాష్ట్రానికి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ రాకతో పాటు ఆమె పాల్గొంటున్న కార్యక్రమాలు, పర్యటనల వల్ల సీయెం పేషీలో ఫైళ్ళ పరిష్కారంలో కొంత జాప్యం జరుగుతుండవచ్చు. సమర్ధన కోసం చెప్పే ఇలాటి సంజాయిషీలన్నీ రాష్ట్రంలో పాలన స్తంభించి పోయిందని వస్తున్న వార్తలను ఖరాకండిగా ఖండించడానికి ఎంతమాత్రం పనికిరావు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరవాత నిదానంగా పాలనా పగ్గాలను తన చేతిలోకి తీసుకోగలుగుతున్నారని, మెల్లగా పాలనపై తనదయిన పట్టు బిస్తున్నారని జనం అనుకోవడం మొదలయ్యీ కాకముందే మళ్ళీ పరిస్థితులు ఆయన చేజారిపోతున్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించడం దురదృష్టం.

పాలన కుంటుపడడం వల్ల కలిగే విపరీత పరిణామాల ప్రభావం పరిపాలించే వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై వెంటనే పడే అవకాశాలు లేని వ్యవస్థ మనది. ప్రభుత్వం అమలు చేయాల్సిన పధకాలు జాప్యం కావడంవల్ల వాటిల్లే ఇబ్బందులకు జనం ఇప్పటికే అలవాటు పడిపోయారు. కానీ వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పడిపోతే దానివల్ల వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే, రాజకీయ సంక్షోభ పరిష్కారం పట్ల ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చిందనే సాకులను ప్రజలు జీర్ణించుకుని అర్ధం చేసుకోవడం కష్టం. దీనికి తోడు రాజకీయ ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా కదులుతున్న ఉద్యోగ సంఘాలు మరో సారి సహాయ నిరాకరణకు పూనుకోబోతున్నట్టు వస్తున్న వార్తలు కూడా సామాన్య జనానికి ఆందోళన కలిగిస్తున్నాయి. బహుశా ఇవ్వాళో రేపో తెలంగాణా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఈ మేరకు సమ్మె సైరన్ మోగించవచ్చు. గతంలో పద్దెనిమిది రోజులపాటు జరిపిన సహాయనిరాకరణ, లక్ష్య సాధనలో ఎంత ఉపకరించిందన్న విషయాన్ని పక్కన పెడితే ప్రజలు మాత్రం తాముపడ్డ ఇబ్బందులు మాత్రం మరచిపోలేదు. అప్పట్లో విద్యార్ధుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాటి ఇబ్బంది కలిగించకూడదన్న సదుద్దేశ్యంతో తెలంగాణా ఉద్యోగ సంఘాల జే.యే.సీ. సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించారు. పరిపాలనను స్తంభింప చేయడం, రాస్తారోఖోలు చేయడం, నడి రోడ్లపై ధర్నాలకు పూనుకోవడం వంటి చర్యలు ప్రజాస్వామిక హక్కుల్లో భాగం కావచ్చు కానీ, ఈ రకమయిన ఆందోళనలను ఒక కాల పరిమితి లేకుండా నిరవధికంగా నిర్వహిస్తూ పోవడంవల్ల, ఎవరి బాగుకోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ప్రజలే వాటివల్ల నష్టపోతున్నారని, లేనిపోని ఇబ్బందులకు గురవుతున్నారని అర్ధం చేసుకుని వ్యవహరించడం వల్ల సాధారణ ప్రజలనుంచి లభించే సానుభూతి, సహకారం ఉద్యమకారుల లక్ష్య సాధనకు దోహదపడే అవకాశం వుంటుంది. రెండు రోజులపాటు నిర్వహించాలని తలపెట్టిన రైల్ రోఖో, వంటావార్పూ కార్యక్రమాలను వాయిదా వేసినట్టు తెలంగాణా జేయేసీ చైర్మన్ కోదండరాం ప్రకటించిన వెంటనే జనం అమ్మయ్య అని నిట్టూర్పు వొదలడం ఇందుకు ఉదాహరణ.

రాష్ట్ర విభజన అనేది సున్నితమైన, సంక్లిష్టమయిన సమస్య అని అంగీకరించే వారు కూడా ఈ సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నారని భావించడం సత్య దూరం కాదు. ఎందుకంటె, ఈ సమస్యను ఏళ్లతరబడి నానుస్తూ పోవడం వల్ల మరింత జటిలం కావడం మినహా మరే ప్రయోజనం వుండదని అందరూ అర్ధం చేసుకునే రోజులు దగ్గరపడ్డాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలన్న అభిలాష ఆ ప్రాంతపు ప్రజల్లో నాలుగు దశాబ్దాలకుపైగా పాతుకుపోయి వేళ్ళూనుకున్న కోరిక. అప్పటినుంచి ఇప్పటివరకు వారి ఆకాంక్షలో ఎటువంటి మార్పు వచ్చివుండక పోవచ్చు. కానీ, పరిణామక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల పవనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై కూడా పడడంలో ఆశ్చర్యం లేదు. ప్రాంతాలను దాటుకుని పెట్టుబడులు ప్రవహించాయి. సంస్కరణల వల్ల సంస్కృతి బీటలు వారింది. సంపాదనే లక్ష్యంగా మారి విలువలు వెనక్కు పోయాయి. మానవ సంబంధాలు మరుగున పడి ఆర్ధిక సంబంధాలు అవనిక పైకి వచ్చాయి. చదువుల విలువ తెలిసిన వారు అప్పట్లో ఉన్నతవర్గాల్లో మాత్రమే వుండేవారు. ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారి బడుగు బలహీన వర్గాలు సైతం విద్యవల్ల లభించే సాంఘిక గౌరవంలోని రుచిని ఆస్వాదించడం మొదలయింది. విద్యకు తగిన ఉద్యోగాలు, ఉద్యోగాలకు తగిన ఆర్జన - గౌరవప్రదమయిన జీవితాలకు పునాదులు వేయడంతో సమాజ స్వరూప స్వభావాల్లోనే సమూల మార్పులకు బీజాలు పడ్డాయి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న తపన తలితండ్రుల్లో పెరిగిపోయింది. బీదా గొప్పా తారతమ్యం లేకుండా వానయినా వంగడయినా పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపడం అలవాటుగా మారిపోయింది. నలభయ్ ఏళ్ళ క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చెలరేగిన ఉద్యమంలో చాలాకాలం విద్యాసంస్తలు పనిచేయలేదు. కలిగిన వాళ్లు బయటి ప్రదేశాలకు పిల్లలను పంపి చదివించుకున్నారు. లేనివాళ్ళు బడులు నడవకపోవడమే అవకాశంగా తీసుకుని తమ పిల్లలను కూలీ పనుల్లో పెట్టి వారి చదువుకు స్వస్తి చెప్పారు. ఇందుకు వారిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటె వారి ఆర్ధిక నేపధ్యం అలాటిది మరి.

మరి ఇప్పుడో. ఒక్క పూట కూడా బడికి ఎగనామం పెట్టే వీలు లేదు. పరీక్షల సీజను మొదలయిందంటే చాలు తలితండ్రులే ఆఫీసులకు సెలవు పెట్టి చదివించాల్సిన రోజులివి. పెళ్ళిళ్ళు పేరంటాల జోలికి పోకుండా పిల్లల్ని చదివించే తలితండ్రులు లెక్కకు మిక్కిలి కానవస్తారు. అలాగే, ప్రయివేటు ఉద్యోగులు. వాళ్లు ఆఫీసులకు రావడం ఒక్క నిమిషం ఆలశ్యం అయినా అందువల్ల వాటిల్లే నష్టాన్ని రూపాయల్లో లెక్కలు వేసుకుని, వారిని వాహనాల్లో ఆఫీసులకు తరలించే కొత్త యజమానులు తయారయ్యారు. ఉరుకులు పరుగులతో జీవితాలు పరుగులు తీస్తున్నాయి. వేగమయ జీవితాలతో కొత్త సమాజం ఆవిష్కృత మవుతోంది.

ఈ వాస్తవాలను ఉదహరిస్తున్నది ఉద్యమకారుల ఉద్దేశ్యాలను శంకించడానికో, ప్రజాస్వామ్య హక్కులను హేళన చేయడానికో కాదు. మారిన పరిస్తితులకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవడం అన్నది అనాదిగా వస్తోంది. స్వాతంత్రోద్యమ సమయంలో అనుసరించిన పద్దతులు ఆనాటి స్తితిగతులకు తగినట్టుగా వుండవచ్చు. ఈ నాటి పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా ఆందోళనల స్వరూపాలు మారితీరాలనే వాదన సర్వత్రా ప్రబలుతోంది. ఈ వాస్తవాన్ని గమనించి నడుచుకుంటే ప్రజల మన్నన, మద్దతు మరింత ఎక్కువగా లభిస్తాయి.

తెలంగాణా రావాలని మనసా వాచా కర్మణా కోరుకునే వాళ్లు ఎందరో వున్నారు. కానీ వారిలో చాలా మందికి నోరూ వాయీ లేదు. తెలంగాణా కోసం పార్టీలు , సంఘాలు పెట్టి పోరాడుతున్న వారూ వున్నారు. మీడియా ద్వారా మాట్లాడే అవకాశం వీరికున్నట్టుగా నోరు లేని మూగ జీవులకు లేదు. ఆయా పార్టీలు, సంఘాలు చేసే ప్రతిదానినీ సమర్ధించని వారిని తెలంగాణా వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదు. చిన్న విషయాన్ని కూడా గోరంతను కొండంత చేసి యాగీ చెయ్యడం సభ్యత అనిపించుకోదు. తెలంగాణాను మనమెంత గట్టిగా కోరుకుంటున్నామో వద్దని అనుకునేవారు కూడా అంత గట్టిగానే కోరుకుంటూ వుండవచ్చు. మనలాగానే అది వారికున్న ప్రజాస్వామిక హక్కు. లక్ష్య శుద్ధి వున్నంతకాలం ఫలితంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీరిని వారూ వారిని వీరూ

ఆడిపోసుకుంటూ మీడియాలో మాటల యుద్ధాలు చేసుకుంటూ పోవడం వల్ల ఉద్యమ స్పూర్తి పలచబడే అవకాశం వుంటుంది. గమ్యం చేరుకునే క్రమంలో ఎవరో అడ్డం పడుతున్నారని అనుకుంటే మాత్రం మనలో పోరాట శక్తి తగ్గుతోందనే అనుకోవాలి. ఇన్నాళ్ళు ఆగినవాళ్ళం మరికొన్నాళ్ళు ఆగలేమా? – ఆలోచించండి! (08-07-2011)